మేరునగ తప్పిదం- 9.గీత దాటాడు


సెప్టెంబరు మొదటివారం- జనరల్ నిరంజన్ ప్రసాద్  తొవాంగ్ రక్షణకు అహర్నిశలు శ్రమించినందుకుగాను బెటాలియన్ను అభినందిస్తూ ప్రాసంగించాడు. గూర్ఖాలను ఉద్దేశిస్తూ సరిహద్దుకు ఉన్నపళంగా ముప్పేమీలేదు కాబట్టి హాయిగా దసరాను జరుపుకోమన్నాడు. గతమూడేళ్ళుగా గూర్ఖాలు వాళ్ళకుటుంబాలకు దూరంగా గడుపుతున్నారు. విపరీతమైన పని ఒత్తిడి కారణంగా అలసిపోయున్నారు. వారిని కొంతకాలం సైనిక కార్యకలాపాలకు దూరంగా ఉంచుతామని, స్వస్థలమైన యోల్కు వెళ్ళి కుటుంబసభ్యులతో దసరా జరుపుకోవత్సని హామీ ఇచ్చారు. ఆరోజు మద్యాహ్నం బ్రిగేడియర్ దాల్వి మండల ప్రధాన కార్యాలయమైన తేజ్పూర్కు బయలుదేరివెళ్ళాడు.

తరువాత రోజు సాయంత్రం దాల్వీకి తొవాంగ్ నుంచి ఫోన్ వచ్చింది. మేజర్ పెరీరా మాట్లాడుతూ " ధోలా పోస్టు నుంచి అక్కడీ కమాండర్ ప్రమాద సంకేతాల్ని పంపుతున్నాడు. సుమారు 600మంది చైనీయులు గీతదాటి లోపలికి వచ్చారు. అక్కడి ఒక వంతెనను కూల్చివేశారు. నీటిసరఫరాను కూడా నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. వెంటనే సహాయం కావాలని కమాండర్ అర్థిస్తున్నాడు." అని చెప్పాడు. వెంటనే లుమ్లా, లుంపులలోని అస్సాంరైఫిల్సును అప్రమత్తం చెయ్యమని పెరీరాను ఆదేశించాడు.ఉదయం 8గంటలకు దాడి జరిగితే సాయంత్రం 6:30 వరకు మండలకేంద్రానికి సమాచారం రాలేదు. ఇంతకుమించి అటువైపునుంచి మరే సమాచారంలేదు. వెంటనే పై అధికారికి విషయం తెలియజేయడానికి ప్రయత్నించగా ఆయన దొరకలేదు. రహస్య మ్యాపులు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. రాత్రి ఆయన, ఎయిర్ ఫోర్స్ లైసనింగ్ ఆఫీసర్ దొరికారు. అది వారాంతం కావడంతో సమాచారం చేరడం మరింత ఆలశ్యమైంది. ఆర్మీ ప్రధాన కార్యాలయంలో సోమవారం వరకు ఎవరైనా ఉంటారా? అన్నది అనుమానాస్పదమే. ప్రభుత్వం ముంచి ఆదేశాలు పొందకుండా భారతసిపాయీ ఏమీ చెయ్యలేడని చైనీయులకు తెలుసు. బహుశా అందుకే వారాంతాన్ని ఎంచుకుని ఉంటాడన్నది దాల్వీ అభిప్రాయం. రెండవ ప్రపంచ యుద్ధంలో ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి.

చైనీయులు దాడిచేసిన థాగ్ల ప్రాంతం నుంచి తొవాంగ్లోని బ్రిగేడ్ ప్రధాన కార్యాలయం చేరడానికి 5రోజులు పడుతుంది. అక్కడి నుంచి మండలకేంద్రం 200మైళ్ళ దూరంలో ఉంది. కార్ప్స్ ప్రధానకార్యాలయం ఇంకొక 200మైళ్ళ దూరంలోని షిల్లాంగ్లో ఉంది. అక్కడి నుంచి కమాంద్ ప్రధాన కార్యాలయం లక్నోలో ఉంది. ఇక అన్నింటికీ అగ్రభాగాన మేరునగమంత తప్పిదాన్ని ఎలాంటి ఇబ్బందీలేకుండా చెయ్యడానికి డిల్లీ ఉంది. అక్కడ సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించేంత తీరిక ఎవ్వరికీ ఉండదు. ఎవరి రాజకీయ అవసరాలు వారివి. కేంద్రకార్యాలయాల్లో పనంటే- గంటకొట్టినప్పుడు రావడం. ఇంకో గంట కొడితే ఇంటికెళ్ళిపోవడం. కొంతకాలం బయట పనిచేశాం అనిపించుకున్నాక కొందరు ఆరోగ్య కారణాలతోనూ, ఇంకొందరు కుటుంబ కారణాలమీద, మరికొందరు పలుకుబడిని ఉపయోగించీ ఇక్కడకు చేరుకుని రిటైర్మెంట్ ముందు జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. యుద్ధం వచ్చినప్పుడు సరిహద్దులోని దళాలకు దిశానిర్ధేశం చెయ్యల్సిన బాద్యత వీరిది. కానీ యుద్ధభూమిలో ఏమి జరుగుతుందో? అసలు యుద్దమెలా చేస్తారో? తెలియని వాళ్ళు ఏమిదారి చూపుతారు?

షిల్లాంగ్లోని XXXIII CORPS బ్రిగేడియర్ జనరల్ స్టాఫ్ కొన్ని ఆదేశాలు ఇచ్చాడు. అవి 


  1. ధోలా పోస్టు కామాండర్ అక్కడే ఉండాలి. వెంటనే అక్కడికి మరిన్ని దళాలను పంపాలి. అక్కడి సమాచార బాద్యతలు అస్సాం రైఫిల్స్ చూసుకోవాలి. 
  2. శక్తి, లుంపు ప్రాంతాల్లోని 9 పంజాబ్ బృందాలు ధోలాకు పంపి అక్కడి దారులను ఆధీనంలో ఉంచుకోవాలి. తొవాంగులోని మిగిలిన బలగాలను లుంపుకి వెళ్ళేందుకు సిద్ధం చెయ్యాలి.
  3. సెలవు మీద వెళ్ళిన వారెవరూ రానవసరంలేదు. కానీ మార్గమద్యంలో ఉన్నవారు తదుపరి ఉత్తర్వులు అందేవరకూ ఎక్కడివారు అక్కడే ఉండాలి.
ఇదే సమయంలో దాల్వి తొవాంగ్ ఎంతకీలకప్రాంతమో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాడు. దానిని రక్షించుకునేందుకు సేలా కనుమ రక్షణ బాద్యతలను తమనుంచి మరొకరికి బదిలీ చెయ్యమని కోరాడు. ఆపోస్టు వివాదాస్పద స్థలంలో సైన్యం అభిప్రాయాన్ని తీసుకోకుండానే నెలకొల్పారని, ఆప్రాంతంలో పోరడటానికి చైనీయులకు గల అనుకూలాంశాలను వివరించాడు.

మరుసటి రోజు తొవాంగ్ చేరుకోగానే అక్కడి అధికారులకు పైవాళ్ల ఆదేశాలను వివరించాడు. సిక్కుల దళానికి నాయకత్వం వహిస్తున్న లెఫ్టినంట్ కల్నల్  మాస్టర్ శిక్షణను ఇచ్చేందుకు పదాతిదళ శిక్షణా కేంద్రానికి వెళ్ళడంతో ఆయన స్థానంలో మిశ్రా కొద్దిరోజులముందే బాద్యతలు స్వీకరించాడు. ఆయన ముందురోజే థాగ్లా ప్రాంతమంతా కలియ తిరిగి అన్ని విషయాలనూ సేకరించి ఉంచుకున్నాడు. సైన్యం యుద్దానికి ముందు లాంచనంగా తయారు చెయ్యాల్సిన స్టాఫ్ పేపరును తయారు చేశారు. అందులోని ముఖ్యమైన అంశాలు


  1. భౌగోళిక అంశాలు
  1. థాగ్లాకు వెళ్ళాల్సిన ప్రధాన మార్గం న్యాంగాంగ్చు లోయ- లుంపు- హథూంగ్లా కనుమ( 13400 అడుగులు)- నంకాచు నది మీదుగా వెళ్తుంది. మొత్తం దూరం 60మైళ్ళు. సైన్యం ఐదు విడతల్లో మార్చ్ చేసుకుంటూ వెళ్ళగలరు.
  1. ప్రత్యామ్నాయ మార్గం లుంపు నుంచి కర్పోలా 1 కనుమ ( 16500 అడుగులు) మీదుగా వెళ్ళొచ్చు. ఈమార్గంలో వెళ్ళటం చాలాకష్టం. కానీ ఇలా వెళ్తే చైనీయుల కంటపడే అవకాశం తక్కువ.

కీలక ప్రాంతాలు
  1. త్సాంగధర్ మరియు హథూంగ్లా ముఖ్యమైన ప్రాంతం. ధోలా ప్రాంతం వృధా. ఇక్కడ వనరులు ఉపయోగించడం అనవసరం.
లుంపు - చుక్సెన్ మార్గం అనుకూలమైనది. వాయుసరఫారాకు కీలకమైన లుంపును రక్షించుకోవడానికి ఇది చాలా ముఖ్యం. శక్తి ఇరుకైన కనుమ. కాబట్టి దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలకూడదు.

  1. మార్గాల పరిస్థితులు
  1. తొవాంగ్ నుంచి థాగ్లాకు వెళ్ళేదారిలో మనుషులు కాలినడకన మాత్రమే రాగలరు. కోతల సమయం కావడంతో పోర్టర్ల కొరత తీవ్రంగా ఉంది.

  1. బలాబలాలు
  1. చైనీయుల బలం గురించి ఖచ్చితమైన సమాచారం లేకపోయినా వాళ్ళు మనకన్నా ఎక్కువే ఉంటారు. 
  2.  
  1. మనదగ్గర రెండు బెటాలియన్లు ఉన్నా వాటి సామర్థ్యం ఒక్కబెటాలియన్కు సమానం. ఎలాంటి సాధనాలు మనవద్ద లేవు.
  1. తొవాంగ్ రక్షణ ప్రధమ కర్తవ్యం. 
  1. పర్వత పాదాల నుంచి తొవాంగుకు రాను 10-12 రోజులు పడుతుంది. దారి పూర్తిగా దెబ్బతి ఉంది. కాబట్టి సత్వరం మరమ్మతులు చెయ్యాలి. 
  1. అక్కడినుంచి థాగ్ల చేఉకోను 4-5 రోజులు పడుతుంది. వారు అలసట తీర్చుకోను కనీస సమయమివ్వాలి.
  1. సమాచార వ్యవస్థ, యుద్ధ సామాగ్రి మనకన్నా చెనా దగ్గర మెరుగ్గా ఉంది.


  1. పరిపాలన
  1. అదనపు బలగాలు చేరుకొనేసరికే వారికవసరమైన దుస్తులు, యుద్దసామాగ్రి, వైర్లెస్ పరికరాలు, ఇతర సామాగ్రి చేరవెయ్యాలి. గిడ్డంగులు పధిలపరచుకోవాలి.
  2.  
  1. లుంపు ఒక్కటే వాయుసరఫరాకు ఆధారం.
  2.  
  1. పోర్టర్ల కొరత తీవ్రంగా ఉంది.
  2.  
  1. గతకొంతకాలంగా వాయురవాణా కుదరకపోవటంతో థాగ్లాకు వెళుతున్న బలగాలకు సరిపడినంత యుద్ధసామాగ్రి లేదు. తొవాంగులోని బలగాలకేగాక మార్గమద్యంలో ఉన్నవారికి, అంటే పర్వతపాదం నుంచి తొవాంగ వచ్కేవారు, తొవాంగ్ నుంచి థాగ్లా వెళ్ళేవాళ్ళు, అవసరమైన సామాగ్రి సరఫరా చెయ్యాలి.
  2.  
  1. పర్వతపాదం నుంచి థాగ్లా వరకుగల 220మైళ్ల దారిలో గిడ్డంగులు ఏర్పాటు చెయ్యాలి.
  2.  

  1. వాతావరణం
  2.  
  1. ఋతుపవనాల కారణంగా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. విపరీతమైన వాలు మీద ప్రయాణం బృందాలకు చాలా కష్టం.
  1. బృందాలకు మార్గమద్యంలో ఎక్కడా షెల్టర్లు లేవు. సరైన దుస్తులులేక సైనికుల ఆరోగ్యం క్షీణించే ప్రమాదముంది.

చైనీయుల బలాన్ని, వాళ్ళప్రాంతాలను అంచనావేసేందుకు 9పంజాబ్ బృందాన్ని హథూంగ్లా కనుమ మీదుగా ధోలాకు పంపారు. వీరు ఆమార్గాన్ని తమ ఆధీనంలో ఉంచుకుంటారు. ఒక అస్సాంరైఫిల్స్ బృందాన్ని కర్పొలా కనుమ గుండా ధోలాకు పంపారు. మిగిలిన పంజాబీలను సమాచారం అందిన 4గంటల్లో గమ్యానికి చేరుకోవాలని ఆదేశించారు.. మద్యాహ్నానికల్లా వాళ్ళు సిద్దమయ్యారు. తరువాత రోజు జనరల్ ప్రసాద్ చేరుకుని పరిస్థితిని సమీక్షించాడు. ఆయన కొన్ని ఆదేశాలను ఇచ్చాడు. 
  1. 7 Infantfy Brigade 48గంటల్లోగా ధోలా ప్రాంతానికి చేరుకోవాలి.
  1. XXXIII Corps 1/9 గూర్ఖాల సేవలను ఉపయోగించుకోను పైవాళ్ళని అభ్యర్థించింది. 2Rajputsను ఇక్కడికి పంపుతున్నారు.
  1. తొవాంగులో కనీస సైన్యం ఎట్టిపరిస్థితుల్లో ఉండాలి.
  1. 9పంజాబ్ వెంటనే లుంపుకు చేరుకోవాలి
  1. సెలవుమీద వెళ్ళేందుకు మిసమారిలో ఉన్న బృందాలు తిరిగి వారి బాద్యతలు స్వీకరించాలి. 
  1. చైనీయులు ఎదురైతే
  1. వాళ్ళని వెనుదిరిగి వెళ్ళమని చెప్పండి.
  1. వాళ్ళు వెళ్ళకపోతే ముందుకు రానియ్యకుండా నిరోధించండి.
  1. ఆత్మరక్షణార్థం మాత్రమే కాల్పులు జరపాలి.
ఈఆదేశాలతో భారత ఆర్మీకి నిర్ధిష్టమైన లక్ష్యాలుగానీ, జాతీయ విధానంగానీ లేవని తేటతెల్లమయ్యింది. రాజకీయ నాయకులను నిందిస్తూ దీర్ఘకాలిక రక్షణాచర్యలపైన కనీస అవగాహన లేకుండా ఉండటం ఆమోదనీయం కాదు.

సైన్యంలో పదాతి దళం తప్ప మరేబలగమూ లేదు. వాళ్ళు ఒక స్థానంనుంచి మరొక స్థానం చేరుకునేంతవరకూ మద్యలో ఎలాంటి సమాచారమూ లభించదు. కనీసం కొనిగంటలపాటు అలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చెయ్యాల్సి వస్తుంది. ఒకేసారి దళమూ, దాని వెనకే అధికారులూ ప్రయాణిస్తే ఇద్దరిమద్యనా సమాచారం చాలా ఇబ్బందౌతుంది. ఇది పర్వతప్రాంతాల్లో చాలాకీలకమైన విషయం. అలా రోజుల తరబడి ప్రయణించాలి. ఈకారణాలవల్ల దళం గమ్యానికి చేరుకునేదాకా తను తొవాంగులోనే ఉంటానని దాల్వీ తన పైఅధికారికి తెలియజేశాడు. గైడుల సహాయం లేకపోవడంతో హథూంగ్లా కనుమకు వెళ్ళాల్సిన పంజాబ్ బృందం దారితప్పింది. ఆరాత్రి జనరల్తో మాట్లాడుతూ కొన్ని వాస్తవాలను తెలియపరిచాడు. మనకున్న పరిమితుల దృశ్ట్యా ఎన్ని రాజకీయ ఒత్తిడులు వచ్చినా తలొగ్గొద్దని మనవి చేసుకున్నాడు.

పైనుంచి వచ్చిన ఆదేశాల్లోని డొల్లతనం దాల్వీని మరింత అసహనానికి గురిచేసింది. తూర్పుదళ ప్రధాన కార్యాలయం ఇచ్చిన ఆదేశాల్లో 7Infantry Brigadeను థాగ్లాకు వెళ్ళమంది. ఇది అక్కడివారి సమర్థతపై ఎన్నో సందేహాలను రేకెత్తించింది. వాస్తవ పరిస్థితులు, మన బలాబలాలు, పరిమితుల గురించి కనీస అవగాహన ఉందా? అనిపించింది. ఎదురుగా చైనా సైన్యం అంతా నిలబడి ఉంటే ఇటువైపు ఒకదళాన్ని ఉంచి పోరాడమని చెప్పడం ఎంతవరకు సబబు? సైనిక ఆదేశాలన్నీ ఒక నిర్ధిష్టమైన పద్దతిలో ఒక్కొక్క విషయాన్ని వివరిస్తూ వెలువడతాయి. అలాగాక కేవలం ఒకద్ళాన్ని థాగ్లాకు పంపండి. అని చెప్పడం కేవలం రాజకీయ నినాదంకన్నా పెద్దగా పనికిరాలేదు. మనకు అనుకూలమైన, వివాదరహితమైన తొవాంగ్ ప్రాంతాన్ని వదలి ముందుకెళ్ళినందుకు తగిన మూల్యం చెల్లించుకుంది.

3 comments:

  1. హ్మ్ ! చాలా బాగా రాస్తున్నారండి, చదువుతుంటే నిజానికి భయమేస్తుంది . నిర్లక్ష్యం అనేది మన రక్తం లోనే ఉందేమో అనిపిస్తుంది .

    ReplyDelete
  2. ఇక్కడ కూడా ప్లస్ లోలా లైక్ ఆప్షన్ ఉంటే, శ్రావ్య గారి కామెంట్కి +1 :-)

    ReplyDelete