సుడికొద్దీ

రోజూలాగానే ఆవులిస్తూ ఫైలు తిరగేస్తున్నా. పక్కకి తిరిగి సూత్తే రవన్న కూడా సేం సీన్.
అబ్బా ఈజీవితం శానా బోర్ గురూ అనుకొంటూ ఉంటే ట్రింగ్.. ట్రింగ్ .. ఇంటర్‌కాం మోగింది.
ఇటైపు చైతన్య అటైపు ఎవురూ.
నేను చైతుగాడి బాసు గాడిని.దెబ్బకి వదిలింది నిద్ర
"ఆర్యులకు సుప్రభాతం మీకు ఏరకంగా సేవలు "అందించగలను ( అంటె నెను ఉండెది సాకేతిక సేవల విభాగం)
"ఎంటనే ఉన్నఫళంగా నారూంకి వొచ్చేయ్."
"వాకే సారు" అంటూ మూడో ఫ్లోరునుంచి ఉరికా.
లిఫ్ట్ వేరేకాడ ఉంది దీన్ని నమ్ముకుంటే కుదరదు అని ఒక 50 కెలోరీలు ఉపయోగించి రెండతస్తులు దిగా. నడుస్తున్నానే గానీ మనసులో కొంచెం టెన్షన్. మామూలేకదా. అసలే ఆ మృతికా పరీక్షల వాడు లేటు చేస్తున్నాడు అడిగితే ఆకశం పక్క దిగ్గులు చూస్తాడు. ఇంకో రెండు పనులు మొదలవబోతున్నై. వేటి గురించి అడుగుతాడొ. మనదగ్గర సమాచారం ఉందో లేదో?
బాసు కేబిన్ ముందు కొంచెం చొక్కా సర్దుకొని లోపలికి వెళ్ళా.
లోన ఫాక్స్ మిషనుకాడ మూర్తి, ముందు కుర్చీలో బిపిన్, పక్కన శ్రీవాస్తవ అందరిపక్కా చూశా ఏమైనా హింటు ఇస్తారేమోనని. ప్చ్ లభంలేదు.
నేను ఒకకుర్చీలో కూర్చోబోతుండగా "ఆగు" అన్నాడు.
గుండెఝల్లుమంది. ముందు ఆయన చెబితేతప్ప కూర్చునే వాడిని కాదు. కానీ ఆయన నువ్వురావటంతోనే కూర్చో ఆతరువాతే ఏవిషయం ఐనా మాట్లాడు అన్నాడు చాలాసార్లు. పూటకి పదిసార్లు తిరిగేవాళ్లు మీరు వచ్చిన ప్రతిసారీ లాంచనాలంటే కుదరదు అన్నాడు. ఇప్పుడేమో ఇలా. ఏవిటొ ఈబాసులు. ఎప్పటికీ అర్ధంకారు. కవులంతా ఆడవాళ్లను గూర్చి అంటారు కానీ ఎవరైనా ఆఫీసులో పనిసేత్తెగా తెలిసేది వీళ్లని అర్ధం చేస్కోవటం ఎంతకష్టమో?
లేచి వెనక ఆబీరువామీద ఉండే కవరుతీస్కో అన్నాడు.
దానిదగ్గరకు పోతుంటే కొంచేం శుభశకునాలే కలిగాయి.
కవరుతీసి సూతే అందులోలడ్డు, జిలేబీ, మిక్సరుపొట్లాం, మైసూరుపాకు మొదలైనవి.
నా ఆత్రంగమనించాడొ ఏమో.. అన్నీకాదు కొంచేం పక్కవాళ్లకుకూడా ఉంచు అన్నాడు.
సరే అందాం అంటే అప్పటికే నోరు బిజీ.తలని అడ్డానికి రెండుసార్లు ఆడించి అది తప్పుడు సంకేతమని నాలుగుసార్లు నిలువుకు ఆడించా.అబ్బా ఎంతమంచిబాసో.
పుణ్యంకొద్దీ పురుషుడు.. దానంకొద్దీ బిడ్డలు
సుడికొద్దీ బాసులు.
దీన్ని సదివినోల్లు ఓసారి మీబాసులసేతకూడా సదివించండి. భూమ్మీద ఇంకా ఇలాంటోళ్లు ఈకలికాలం ఉన్నారని తెలుస్తాది. మీబాసుకు తెలుగురాక పొతే తెంగ్లీష్లోనో హింగ్లీషులోనో అనువదించండి.

నమోహిందు మాతా



నమోహిందు మాతా సుజాత నమో జగన్మాత
మాతా నమోహిందుమాత సుజాత నమో జగన్మాత

విపుల హిమాదృలే వేణీభరముగ
గంగాయమునలే కంఠ హారముగ
ఘనగోదావరి కఠిసూత్రముగా
కనులకు పండువ ఘటించుమాతా

నమోహిందుమాతా సుజాత నమోజగన్మాత

గోలుకొండనీ రత్నకోశమట
కోహినూరు నీజడలో పువ్వట
తాజమహలు నీ దివ్యభవనమట
ఆహాహా నీభాగ్యమే మాతా

నమోహిందుమాతా సుజాత నమోజగన్మాత


ఈగేయం మాచిన్నప్పుడు పాడేవాళ్లం. రాసిన మహానుభావుడి పేరు తెలీదుగానీ పాడేసమయంలో ఆయన భావావేశం మమ్మల్నితాకేది. ఇందులో తమాషా ఏమిటంటే గతంలో ప్రార్థనా సమయంలో ఆలపించేవాళ్లు. ఎవరైతే హిందూత్వం అనేది మతంకాదు, దానికి మూలాలులేవు అంటూ వాదించారో వాళ్లే ఇందులోని 'హిందుమాత ' అనేపదం మతతత్వం అంటూ వాదన లేవనెత్తారు. తమ్ముళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయి పాడటం ఆపండి అని ఆజ్ఞ. కొంతకాలానికి ఆతమ్ముళ్ల మనోభావాలు వందేమాతరంతో కూడా దెబ్బతిన్నాయి.

రాష్ట్ర పర్యటన

శ్రీ శ్రీ శ్రీ సుబ్రహ్మణ్య చైతన్య గారి రాష్ట్ర పర్యటన విజయవంతంగా పూర్తయ్యింది. గతనెల 25న వారణాసి నుంచి రైలుమార్గం ద్వారా రాష్ట్రంలోకి సిర్పూరు-కాగజ్‌నగర్ వద్ద ప్రవేశించారు. పర్యటనలో భాగంగా పలువురు అధికారులు, నాయకులు కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రొటోకాల్ సమస్యల కారణంగా వీలుపడలేదు. భద్రతా కారణాల దృష్ట్యా మీడియాను అనుమతించలేదు. 27న స్వగ్రామానికి చెరుకొన్న ఆయన మొదటిమూడు మూడు రోజులు వ్యక్తిగత పనులతో బిజీగా గడిపారు. ఆపనుల వత్తిడి కారణంగా మూడురోజుల్లో 5కిలోలు పెరిగారు( అంటె అన్నంలో తల్లిప్రేమ కొంచెం ఎక్కువైంది అన్నమాట.)

నెల్లూరులో స్నేహితుని పెళ్లికి వెళ్లి పూర్వాశ్రమపు హితులను కలిశారు. తరువాత ఇంటికివెళ్లి 2రోజులు మళ్లీ తల్లిప్రేమను నింపుకొని చుట్టుపక్కల గ్రామాల్లోని అభిమానులను కలిశారు. 5వతేదీ వరకు జిల్లాలోని వివిధప్రాంతాలను దర్శించి, సింహపురి బండికి భాగ్యనగరానికి చేరుకొన్నారు. నగరపర్యటన వివరాలు ఆయన మాటల్లోనే.

6వ తేదీ ఉదయం 8కి హైదరాబాదుకు చేరుకొన్నా. నేను చెన్నై బెంగుళూరు, డిల్లీ, మంగుళూరు, వారణాసి, కాన్‌పూరు, తిరుచ్చి, ఎర్నాకులం మొదలైన ఊర్లన్నీ తిరిగానుగానె ఈ ఊరితో నాకున్నది బీరకాయ పీచు చుట్టరికం. మొదటిసారి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్‌కి( అప్పట్లో ఒక్కచోటే జరిగేది.) 2000 డిసంబరులో వచ్చాను. తరువాత 2003లో జే.ఎన్.టీ.యు. లో ఒక పేపరు ప్రెజెంట్ చెయ్యటానికి వచ్చాను. రెండుసార్లు ఉదయం నారాయణాద్రి దిగి సాయంత్రం చార్మినార్కి తిరుగుప్రయాణం. నాకు తెలిసింది సికిందరాబదు స్టేషను, కూకట్‌పల్లి, మాసాబ్‌టాంక్. మూడొసారి 2008 మేలో జిందాల్ వాడు ఇంటర్వ్యూకి పిలిచాడు. ఈసారైనా సిటీచూద్దాం అంటే వాడుకూడ ఏంజీరోడ్డులో పెట్టాడు. ప్రాజెక్ట్ సమర్పణ అనే బృహత్కార్యాన్ని పూర్తిచేయాల్సి రావటంతో కనీసం స్నేహితుల్నైనా కలవకుండానే వేళ్లిపోవాల్సి వచ్చింది. అలా హైదరాబాదు అనేది నాకు ఒక ఎండమావిలా తయారైంది. ఎవరైనా ఏవిషయంపైన ఐనా మాట్లాడుతూ ఉంటే వాళ్లలోకి ఎంచక్కా దూరిపోయి నోటికొచ్చింది వాగేసే నేను అనబడే నేను ఒక్క హైదరాబాదు గురించి మాత్రం ఫక్తుశ్రోతలా మారిపోతాను. నాకు హైదరాబాదు తెలుసు. నేను విన్న టాంకుబండు, సెక్రటేరియట్, ఖైరతాబాద్, మాదాపూర్, కూకట్‌పల్లి, మైత్రీవనం( స్నేహపుతోట), తార్నాక, మొదలైన ప్రాంతాలతో నాకునేనుగా ఒక భాగ్యనగరాన్ని కట్టుకొన్నా. ఎప్పుడు హైదరాబాదు పేరు విన్నా మనసు నానగరంలోకి వెళ్ళి చక్కర్లుకొట్టి ఒక అరగంట తరువాత తిరిగివచ్చేది. మొత్తానికి పవనుగాడి పెళ్ళిపుణ్యమా అని 3రోజులు అక్కడే ఉండేలా ప్లాన్ చేస్కొన్నా.

రైలు దిగిన వెంటనే మావాడికి ఫోనె చేస్తే రేతిఫైల్(ఈపదం అర్ధం కావడానికి అరగంట పట్టింది. అదికూడా బోర్డుచూసిన తరువాత.) బస్టాండుకి వచ్చి కాచిగూడ రమ్మన్నాడు. అక్కడ హోటల్ మంజీరలో రూము. స్నానంచేసి కోఠిమీదుగా దిల్‌సుఖ్‌నగర్ వెళ్లి పెళ్ళికొడుకు బట్టల్లోని పవన్ గాడిని కనీసం పలకరించకుండా ముందు భోజనం బంతుల్లో కూలబడ్డా. తరువాతవాడే వచ్చి అందరినీ వాళ్ల ఇంట్లో పరిచయం చేశాడు. అక్కడినుంచి పంజాగుట్టలో గిఫ్టు ఒకటికొనుక్కొని తిరిగి కాచీగూడ వెళ్ళిపోయాం. రాత్రి 1వరకు పెళ్ళిచూసి మావాడిని అంకుల్‌నిచేసి వచ్చేశాం.

ఉదయం హరిగాడిని అడిగితే హబ్సీగూడా వెళ్తున్నా అన్నాడు. వాడితోగూడా ఉస్మానియా మీదుగా హబ్సిగూడకి చేరి నేను నాచారంపక్క ఒకచుట్టువేశాను. తిరిగివచ్చేసరికే వాడుకూడా పనిముగించుకొని నాతోకలిశాడు. సాయంత్రం అమీర్‌పేట్ బిగ్ మూవీస్‌లో అడవికి తికెట్లు తీశాను అని మా శనిగాడు ఫోన్ చేశాడు. నగరంలో మొదటిసినిమా వాడిది ఎందుకు తీశావురా అంటె అవే చవగ్గా దొరికాయిరా అన్నాడు. సినిమాచూసి( దాన్ని సినిమా అన్నందుకు క్షమించాలి. 100 టికెట్‌లో 70రూపాయలు నిషాకే అనుకోవచ్చు.) అక్కడే రాజధాని భోజనం కానిచ్చి మూసాపేట్ మీదుగా కూకట్‌పల్లికి వెళ్లా.

ఉదయానేలేచి తిరిగి రూంకి వచ్చి ఖాళీచేసి బంజారాహిల్స్ లో ఇంకో ఫ్రెండ్‌ని వెళ్లా. వాడేదో పరీక్ష ఉంది అంటే నేను జీవీకే1లో స్నేహితుడా చూసొచ్చా. (పర్లేదు. కామెడీఎ ఉంది. నానిఒగాడితో హీరోయిన్ బానే పోటీపడింది. పెద్దగా లాజిక్కులు తీయకుండా కేవలం ఎంజాయ్ మాత్రమె చెయ్యాల్సిన సినిమా.) వాడింకా రాలేదు అంటే రూంలోనే ఓయ్ కూడ కవర్ చేశా. ఇంతలో ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేసి స్నేహపుతోటకి రారా అంటే అక్కడికివెళ్ళి అలానాల్గు వీధులు తిరిగి అందాల్ని వీక్షించి రీలోడ్ అయ్యాను. అక్కడే రాత్రికి నాగపూర్‌బస్సుకి టికెట్ తీస్కొని తిరిగి రూంకెళ్ళి ఫ్రెండ్స్ తో ఓగంట హస్కేసి బాగ్ సర్దుకోని 10కి బయల్దేరా. ఒకటి మాత్రం నిజం. నేను ఇప్పటిదాకా చూసిన అన్ని సిటీల్లోకి హైదరాబాదే బెస్ట్. చెన్నైలో అరగంటకే విసుగొచ్చేది. బెంగుళూరులో మొదటివారం పర్లేదుకానీ తరువాత చాలా స్లోగా ఉంటుంది లైఫ్. బద్దకం చాలా పెరుగుతుంది. ఇక డిల్లీ విషయానికి వస్తే మనంకొంచెం తక్కువమాట్లాడుకొందాం. నోయిడా పర్లేదు. మిగతా ఊర్లూ అంతే. కానీ ఇక్కడ ఎంతతిరుగుతున్నా శరీరం చురుగ్గానే గానే ఉంది. అన్నింటికీ మించి బస్సుబోర్డులు తెలుగులో ఉంటాయి కాబట్టి ఆసుఖమేవేరు.

అలా రాష్ట్రపర్యటన ముగించి 9వతేదీ ఉదయం నాగపూరు చేరుకొని, అక్కడ రాబోతున్న కొత్తప్రాజెక్టులో పనిచేస్తున్న తన మాజీ రూంమేట్‌ని కలిసి వెరైటీచౌరస్తాలో సాయంత్రంవరకు గడిపి, అక్కడినుంచి జబల్‌పూర్‌కి బస్సులో చేరుకొన్నారు. అక్కడున్న పాతస్నేహితులను ఇద్దరిని కలిసి రాత్రికి శక్తిపుంజ్‌కి తిరిగి నివాసానికి చేరుకొన్నారు.
ఇంత తిరిగిన పనికిమాలిన వాడికి కోతికొమ్మచ్చి కొనేందుకు తీరికలేదు. క్షమించగలరు.