ఏమిటిలోకం

ఎంఎఫ్ హుస్సేన్ అనేపేరు ఇంటర్లో ఉన్నప్పుడు మాధురి 'గజగామిని‌' అప్పుడు విన్నా. ఆతర్వాత అడపాదడపా మీడియాలో చూశాను. వయసులో పెద్దాయన, చేతిలో పనితనం ఉన్నతను వగైరా వగైరాలతో మంచివ్యక్తి అని చిన్న‌అభిప్రాయం.
హిందూదేవతల్ని, భారతమాతను నగ్నంగా గీశాడు అని విన్నాను కానీ వాటిని చూసేందుకు అవకాశంలేదు. చూడాలనీ అనుకోలేదు. మొన్నామద్యన మళ్ళీగొడవ మొదలవ్వడం ఆతర్వాత ఒకమిత్రుడు ఆచిత్రరాజాలను పంపడంతో వాటిని చూసి అందులోని ఉన్నతప్రమాణాలను అర్థంచేసుకోలేని నాలోని అర్భకుడు తలపట్టుక్కూచున్నాడు. నేనేమీ పెయింటింగ్‌లను కొని ఇంట్లోపెట్టుకునే కళాపోషకుణ్ణికాదు. కనీసం ఆర్ట్ ఎగ్జిబిషన్లకు ఎగేసుకుపోయే కళాపిపాసినికాదు. అంతెందుకు మాంచిపెయింటింగ్లను డౌన్లోడ్ చేసుకుని డెస్క్‌టాప్ పైన పెట్టుకునేంత తృష్ణ నాలోలేదు. అయినా మనిషన్నాక కొద్దోగొప్పో ఆలోచించగలుగుతాడు. వాటికి అనుగుణంగా కొన్నినిర్ణయాలకు రాగలుగుతాడు. నేనిక్కడ రాస్తున్నవికూడా అలాంటి ఆలోచనలకు టపారూపమే.

మహేష్‌గారి బ్లాగులో మద్యాహ్నం కామెంట్ రాసినప్పుడు ఆయనిచ్చిన సమాధానం చదివాక నాకొచ్చిన అనుమానాలు.(ఇవి ఆయనపై విమర్శకోసం కాదు. కొంతసేపటిక్రితమే మాఇద్దరి మద్యనా చర్చజరిగింది. వాదనలు చెయ్యడం బాగోదుగనుక అక్కడ రాయలేక నాబ్లాగులో రాసుకుంటున్నా. మహేష్‌గారు తప్పుగా అర్థం చేసుకోవద్దు.) రాజారవివర్మకు ముందు ఇక్కడదేవతల్ని బట్టలతో ఎవరూచూడలేదు అంటున్నారు మరి బట్టలుకట్టకుండా ఏమూలవిరాట్టుకైనా పూజలుచెయ్యడం చూశారా?  గుడిపైన బొమ్మల్ని చూద్దాం. అక్కడ నగ్నంగా కనిపించేవి దేవతలుకాదు. దేవతల బొమ్మలు గోపురంముఖాల మద్యభాగంలో ఉంటాయి. అంచున నందీశ్వరుడు, సింహం వగైరావగైరా ఉంటాయి. మద్యలో వివిధభంగిమలలో ఉండేవి దేవతలుకాదు. మనుషులు లేక గంధర్వుల్లాంటి ఊర్థ్వలోకంలోనివారు. (ఇదినాఅభిప్రాయమే) ఇంకోవిషయం- ఆబొమ్మలలోని దేవతలకు బట్టలు ఉంటాయి. కానీ అవిచూసిన వెంటనే కనిపించవు. వాటి అంచులకు వేసిన డిజైన్లు, కుచ్చిళ్ళు వంటివి చూస్తే అర్థం అవుతుంది. అందుకే చనుమొనలు, జననాంగాలు వంటివి చూపరు.

సరె అప్పట్లో అలానే ఉన్నారని అనుకుందాం. మరి ఇప్పుడు అలావెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది? బట్టలు నెయ్యడం రాకముందు సమాజమంతా దిశమొలలే. ఇప్పుడూ అలానే తిరగొచ్చా?

బట్టలవిషయాన్ని పక్కనపెడదాం. మరి రావణుని తొడపైన సీతమ్మ కూర్చోవడం ఏమిటీ? మాయవేషంలో వచ్చి లంకకు అపహరించుకుపొయ్యేప్పుడుకూడా ఆతల్లిని నేరుగా తాకకుండా ఆమె సొమ్మసిల్లిపడిపోయిన ప్రాంతాన్ని నేలతోసహా పెకలించి తీసుకెళ్ళాడు. ఆతర్వాత అశొకవనంలోకూడా తనంతట తానుగా ఒప్పుకుంటేనే తాకుతానని చెప్పాడు. ఈరెండు వాల్మీకిరామాయణంలో చెప్పినవే. మరి దీనికేమి చెప్తాడు?

మరి ఇతరచిత్రాల్లో ఆయనగీసిన దృశ్యాలను ఏరకంగా అర్థంచేసుకోవాలో? దుర్గాదేవితో పులి వగైరా వగైరా. వీటిగురించి చదువుకున్నోడేకాదు నిరక్షరాస్యుడైనాసరే ఊహించుకునేందుకే ఏవగించుకుంటాడు. స్త్రీల స్వాభిమానం గురించి, స్వావలంబన గురించిమాట్లాడే ఫెమినిస్టులకు ఇక్కడ శక్తిస్వరూపిణి అయిన స్త్రీకి జరిగిన అవమానం పట్టలేదా? దుర్గామాత ఈసమాజంలో స్త్రీశక్తికి ప్రతీకగా చూస్తారా? లేక ఒకహిందూదేవత కాబట్టి మనమంతా సెక్యులర్లం అని తలతిప్పుకుపోతారా?

ఆయనకు ఊహాలోకంలో కనిపిమ్చినవంతా గీసుకొమ్మను. కానీ ఆతర్వాత తనిచేసినపనికి ఎవరైనా బాథపడుతారేమో అని ఒక్కసారి ఆలోచించల్సిన బాద్యత కళాకారుడిగా, వృద్ధుడిగా కాదు కనీసం మనిషిగా పాటించాల్సిన కనీసధర్మం. ఆఆలోచనలేనివ్యక్తి, చేసినతప్పుకు పశ్చాత్తపం చెందనివాడు ఈసమాజంలో ఉంటేఎంత? పోతేఎంత? కళ అనేది మనషి వికాసానికి , సమాజానికి మార్గంచూపడానికి పాటుపడ్దప్పుడే దాని ఉనికి అర్థం. నీద్వారా రూపుదిద్దుకున్నవి ఎవరిని బాగు పరుస్తాయి? తల్లిలోనూ, చెల్లిలోనూ నగ్నత్వం చూడ్డంగాక ఒరిగేదేముంది? అయ్యా హుస్సేన్గారు (లేక ఆయన తరపున వకాల్తాపుచ్చుకున్నవాళ్ళూ) ఆచిత్రాలను ఏభావంతో గీశారో చెప్పికాస్త పుణ్యకట్టుకో(ండి). నాకింకా జ్ఞానదంతం మొలవలా. వచ్చిమొలిపించండి. ఆనొప్పిభరిస్తా.

గీసేప్పుడు సరే ఏదోఆవేశంలో జరిగిపోయింది. మరిదాన్ని ప్రదర్శించేటప్పుడు ఆలోచించాలా?వద్దా? మరి వద్దని నువ్వనుకున్నప్పుడు మేమెందుకు నీగురించి ఆలోచించాలి? ఇక్కడ జరుగుతున్న ఇంకోతమాషా- ఆయన్ని సమర్థించేవాళ్ళంతా సమాజంలో కుళ్ళును తీసేసేవాళ్ళు. వ్యతిరేకించేవాళ్ళంతా హిందూమతసంస్థల కార్యకర్తలు. మరినాలాంటి సామాన్యుడిగోడు ఎవడికిపట్టింది? ఇదిమామనసును గాయపరిచింది అన్నామంటే మేమేదో మతసంస్థకి కార్యకర్తలం.
పోనీ ఆతర్వాతైనా తననిబద్ధతను నిరూపిమ్చుకున్నాడా? దేశంవదిలి వెళ్ళిపోయాడు. దీన్నిమించిన కేసులు నడుస్తున్నాయి ఇక్కడ. వాళ్ళెవరూ వదిలిపోలేదే? ఆతర్వాత ఇంకెక్కడొ పౌరుడిగా మారుతున్నావు. పోనీ ఆదేశమేమైనా పద్ధతైనదా? కళాకారుడికి అన్నింటికన్నా ముఖ్యమైనది భావప్రకటనస్వేచ్చ. అది పుష్కలంగా లభించే ఎన్నోదేశాలుండగా మచ్చుకైనా కనిపించని దేశాన్ని ఎంచుకున్నావు. ఇక్కడ నీవ్యక్తిత్వం ఏమిటో తెలియట్లేదా?

హిందువుకానీవాడు, ఆధర్మాన్ని ఒక్కరోజైనాపాటించనివాడు, కనీసం దానిగురించి తెలుసుకోవాలన్న ఆలోచనలేనివాడికి (ఇప్పుడు గీసింది హిందూదేవతల గురించి కాబట్టి. ఇది ఏసిద్ధ్హాంతానికైనా, మతానికైనా వర్తిస్తుంది. ఆయాకమ్యూనిటీల్లో భాగంగా లేనివాడికి, ఆచరించనివాడికి దానిగురిమ్చి విమర్శించెహక్కు ఉండదు.) ఇలాంటి బొమ్మలుగీసే నైతికహక్కు ఎక్కడిది? నీబోటోడు దేశాన్నొదిలి వెళ్ళిపోయినంత మాత్రాన ఇక్కడ రంగులు ఎండిపోవు, కుంచెలు విరిగిపోవు, కళాకారుల సృజనాత్మకత ఇగిరిపోదు.
నేను గమనించిన ఇంకోవిషయం- హుస్సేన్ గారి(డి) పెయింటింగ్స్ మనకు దొరకాలంటే లక్షలుపొయ్యాలి. కొన్ని శాంపిల్స్ ఇంటర్నెట్‌లో ఉన్నా వాటి నాసిరకంవి. మరి ఈచిత్రాలుమాత్రం ఉచితంగా విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. పైరసీ విషయంలో ఎన్నోజాగ్రత్తలు తీసుకునే ఆయన వీటినెందుకు ఇలావదిలాడొ?

3 comments:

  1. ఏమిటిలోకం అంటున్నారు ఎవరు బాబూ తమరు. వాళ్ళలోకమెంటో మీకు ఇంకా తెలియదా? వాళ్ళది పైత్యలోకం, వాళ్ళ వాదం పైత్యవాదం. రిపైరింగ్‌కు పనికి రానంతగా చెడిపోయాయి వాళ్ళ బుర్రలు. పక్కన పెట్టేయడం ఉత్తమం.

    ReplyDelete
  2. @నాగ, మలక్‌పేట్‌రౌడీ: ధన్యవాదాలు

    ReplyDelete