tag:blogger.com,1999:blog-33777630215277427452024-03-05T10:44:46.547+05:30స్వర్ణముఖినీళ్ళు తక్కువ. ఇసకెక్కువసుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.comBlogger76125tag:blogger.com,1999:blog-3377763021527742745.post-34023957940189069552012-11-21T23:21:00.000+05:302012-11-21T23:37:39.548+05:30ఒక ఆలోచన<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: left;">
<div class="separator" style="clear: both; text-align: justify;">
<b id="internal-source-marker_0.25807492271997035" style="font-weight: normal; text-align: left;"><span style="font-family: Arial; vertical-align: baseline; white-space: pre-wrap;">కొంతకాలం క్రితం ఒక ఆలోచన నామనస్సులో మెదిలింది. అన్నిఊర్లలాగే మాఊర్లోనూ జనాలకి శతక పద్యాలు కంఠోపాఠంగా ఉండేవి. అన్ని ఊర్లలాగే మావాళ్ళకీ గత దశాబ్ధకాలంగా అవి మరుపుకు వస్తున్నాయి. వారిలో నేనూ ఒకడిని. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మాతాతయ్యే దానికి హెడ్మాస్టరు. రోజూ సాయంత్రం ఒకపద్యాన్ని తీసుకుని, వివరంగా చెప్పేవాడు. తర్వాతరోజు పిల్లలంతా వాటిని అప్పజెప్పాకే మరొక పద్యానికి వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు అలాంటివి ఊహించడమే కష్టం. ఒకరోజు చిన్నప్పుడు బాగా గుర్తున్న ఒకట్రెండు పద్యాలు మనసులో చెప్పుకుంటే సగం తర్వాత తడబడ్డాను. ఎక్కడో తేడాగా అనిపించింది. అప్పుడు ఉన్నది ఉత్తరప్రదేశ్లో. ఉన్నఫళంగా ఒకపుస్తకాన్ని కొనుక్కుని చదువుదామన్నా కుదిరేదికాదు. నెట్ కనెక్షన్ ఇబ్బంది పెట్టి 3,4 రోజులు ఆన్లైన్ మార్గాలుకూడా తెరుచుకోలేదు. నాలాంటి పరిస్థితుల్లోనే చాలామంది ఉన్నారేమోనని ఆరోజు నాకు అనిపించింది. మరి దీనికి పరిష్కారం ఏమిటా అని ఆలోచించాను. మనసుకి ఒక అలోచన వచ్చింది. ఊరికెళ్తే ఆపని చెయ్యాలని అనుకున్నాను. </span><br /><span style="font-family: Arial; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-family: Arial; vertical-align: baseline; white-space: pre-wrap;">ఆ ఆలోచనకి ఈరోజు రూపం ఇచ్చాను. ఉదయాన్నే నెల్లూరు వెళ్ళి ఓ పదిహేను సుమతి శతకాలు, పదిహేను వేమన శతకాలు, డజను కాళకస్తీశ్వర శతకాలు పట్టుకొచ్చాను. వాటిని రేపు శివాలయంలో పెట్టేస్తా. ఊరిజనాలు అక్కడ ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. వరండాలో స్టూలు మీద భజనపాటలు, సద్గురువుల పారాయణ గ్రంధాలవంటి కొన్ని పుస్తకాలు అక్కడ ఎప్పుడూ ఉంటాయి. వాటితో పాటు ఇవీ పెట్టెస్తాను. ఇష్టం ఉన్నవాళ్ళు చదువుతారు. ఖచ్చితంగా జనాలకి ఇష్టం పెరుగుతుంది. అదే శతకాల్లో ఉన్న గొప్పతనం. ఒకసారి పేజీలు తిరగేసినవాళ్ళకి మరిచిపోయిన కొన్ని పద్యాలు గుర్తుకు రావచ్చు. శతకాలు తెలియని పిలకాయలకి ఎవరైనా వివరించి చెప్పొచ్చు. చెప్పేవాళ్ళు ఎవరూలేకపోయినా ఇబ్బంది కలగకుండా టీకాతాత్పర్య సహితంగా ఉన్నవి పట్టుకొచ్చాను. దూరవిద్యల యుగంలో మనమద్యన ఏకలవ్యులు చాలామందే ఉన్నారు. వాళ్ళు మాశివుడి ముందు కూర్చుని రోజూ చదువుకోవచ్చు. ఆయన భోళాశంకరుడే కాబట్టి బొటనవేలడుగుతాడని భయం లేదు. హాయిగా చదువుకుని, నలుగురితో పంచుకుంటే వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోయిన శతకకారులు మళ్ళీమన మద్యకు వచ్చి ఇంటిపెద్దలవుతారు. మంచీ చెడ్దా నేర్పుతారు. </span></b></div>
<div class="separator" style="clear: both; text-align: justify;">
<b style="font-weight: normal; text-align: left;"><span style="font-family: Arial; vertical-align: baseline; white-space: pre-wrap;"><br /></span></b></div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiCf1KYdZGTiOf2t0Ul3aQ6tYawzNE00N05bgfaEEYt6Q0i5aLtF_dvHPZbOs3Kmbdg9FuJvbz2lFWOnydeLX2D61RehpcaqGA5CGtvde14tbLm4pBxqmriEUcwtI5tDmghTZbBEczvSxk/s1600/images+(7).jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiCf1KYdZGTiOf2t0Ul3aQ6tYawzNE00N05bgfaEEYt6Q0i5aLtF_dvHPZbOs3Kmbdg9FuJvbz2lFWOnydeLX2D61RehpcaqGA5CGtvde14tbLm4pBxqmriEUcwtI5tDmghTZbBEczvSxk/s1600/images+(7).jpg" /></a></div>
<b id="internal-source-marker_0.25807492271997035" style="font-weight: normal;"><br /><span style="font-family: Arial; vertical-align: baseline; white-space: pre-wrap;">వీలైతే మీరూ ఆపని చెయ్యండి. ఒక్కొక్కటీ 10-15 రూపాయల్లో దొరుకుతుంది. పది పుస్తకాలు తీసుకెళ్ళి మీఊరి గుడి దగ్గరో, చెట్టుకిందో, టీకొట్టు దగ్గరో, అంగళ్ళ దగ్గరో నలుగురు మనుషులు కలిసే ఏచోటైనా పెట్టండి. ఎవడైనా వాటిని ఎత్తుకు పోయినా పర్లేదు. వాడినుంచి ఎవరో ఒకడికి అందుతుంది. వాటిపేజీలు చించేసి శనగలు పోసిచ్చినా పర్లేదు. దాన్ని విప్పి ఎవడో ఒకడు చదువుకుంటాడు. కనీసం రెండు పద్యాలు అతనికి గుర్తురావచ్చు. తెలియని వాడైతే నేర్చుకోనూవచ్చు. వాటివల్ల ఆసక్తి కలిగి మరిన్ని శతకాలూ, పద్యాలూ, తెలుగు భాషా నేర్చుకోనూవచ్చు. అందులో ఉన్నవి నిత్యసత్యాలు. ఒకభాషకో, మతానికో, కులానికో, వృత్తికో చెందినవి కావు. పౌరునిగా మనకు కనీస బాద్యతను తెలిపేవి. . సంస్కృతంలో బర్తృహరి సుభాషితాలు, తమిళంలో తిరుక్కురళ్ లాగా అన్నిభాషల్లోనూ ఇలాంటివి ఉన్నాయి.</span><br /><span style="font-family: Arial; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-family: Arial; vertical-align: baseline; white-space: pre-wrap;">ఇవన్నీ నాలోని అశావాదికి కలిగిన ఆలోచనలు. ఆశావాదిగా మనంవేసే ఒక్క అడుగు కేవలం భాషనేకాక ఎన్నో సమకాలీన అంశాలను ప్రభావితం చెయ్యనూవచ్చు. ఒకవేళ ఎవరికైనా ఇప్పటికే ఈఆలోచన వచ్చి మొదలుపెట్టి ఉంటే చాలాసంతోషం.</span></b></div>
</div>
సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com9tag:blogger.com,1999:blog-3377763021527742745.post-61036509459405752202012-10-20T00:48:00.000+05:302012-10-28T19:29:12.461+05:30మేరునగ తప్పిదం- 15. డ్రాగన్ బుసకొట్టింది<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
హఠాత్తుగా జనరల్ కౌల్ అస్వస్థతకు గురవ్వడం భారత శిబిరాలను ఆందోళనకు గురిచేసింది. చొరవ తీసుకుని ఆదేశాలు ఇవ్వగల వ్యక్తి ఎవరూ సైన్యానికి లేరు. జరుగుతున్నది సాంప్రదాయక యుద్ధమైతే అతని స్థానంలో జనరల్ ప్రసాద్ బాద్యతలు తీసుకోవాలి. యుద్ధభూమిలో నాయకుడు మరణించడం, లేదా తీవ్రంగా గాయపడి సార్ధ్యం వహించలేక పోవడం, నాయకునికి మిగిలిన బృందాలకు సంబంధాలు తెగిపోవడం అన్నది చరిత్రలో ఎన్నోసార్లు జరిగింది. ఆపద్ధర్మ నాయకునిగా ఎవరుండాలి అన్నది సైన్యం యుద్ధానికి ముందే చర్చించాలి. అధికార రహస్యాలు, యుద్ధవ్యూహాల పట్ల అతనికి పూర్తి అవగాహన ఉండాలి. యుద్దం అంటే ఏమైనా జరగొచ్చు. కానీ ఇక్కడ అలాంటి ఏర్పాట్లేవీ లేవు. నిజానికి రాజకీయ నాయకులు, సైన్యంలోని వారి అనుయూయులు తప్ప మరెవరూ సరిహద్దు వ్యవహారాల పట్ల ఆసక్తితో లేరు. ఇక వీళ్ళేమో అసలు యుద్దమే రాదన్న ఆలోచనలతో వ్యూహాలు పన్నుతున్నారు. ఈపరిస్థితిల్లో చైనా అనుకోని దెబ్బ తీసింది. సరిగ్గా ఆతర్వాతే జనరల్ కౌల్ అనారోగ్యానికి గురవ్వటం అనేక విమర్శలకు తావిచ్చింది. ప్రతిపక్షాలకు, పత్రికలకు, విమర్శకులకు, మేధావి వర్గానికి, రక్షణరంగ నిపుణూలకు, అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులకు, అన్నిటికన్నా మిన్నగా నెహ్రూ ప్రత్యర్థులకు ఇదొక ఆయుధమైంది. దురదృష్తవశాత్తూ వీరికెవరికీ వాళ్ళ చేష్టలు సైన్యం నైతికస్థైర్యాన్ని, ప్రజల స్వాభిమానాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో స్పురించట్లేదు. ఒకవేళ స్పురించినా వారివారి అవసరాలు ఈవిషయాలను వెనక్కి నెట్టేశాయి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ఇక్కడ వ్యవహారాలు కేవలం సైనిక చర్యలకే పరిమితం కాకుండా రాజకీయ అవసరాలు తోడవ్వడంతో ఎవరూ ఈ బాద్యతను భుజానికి వేసుకోను ముందుకురాలేదనే చెప్పాలి. ఓడిపోతున్న గుర్రం మీద ఎవరు పందెం కాస్తారు? ఈపరిస్థితుల్లో అనవసర వివాదాల్లో ఇరుక్కుంటామని అందరూ గుట్టుగా ఉండిపోయారు. ఈపరిస్థితుల్లో అక్టోబరు 19న, రాజపుత్రుల దళం నాయకుడు లెఫ్టినెంట్ కల్నల్ రిఖ్ దాల్వీని కలిశాడు. చైనీయుల బలం, వాటి కదలికలను విపులంగా చర్చించాడు. తన ప్రాంతంలో గస్తీని పెంచినట్టు తెలియజేశాడు. చివరగా " సార్! మీరు దిగులు పడొద్దు. వారి బలం ఎంతున్నా సరే, రాజపుత్రులం సరిహద్దులో ఉన్నంత సేపూ దేశాన్ని తలదించుకోనివ్వం. మా తుదిశ్వాస విడిచే వరకూ శత్రువుకు ఈభూమిమీద నిలబడే అవకాశం ఇవ్వం. ఒకవేళ మీరు వెనక్కి వెళితే, మనల్ని ఇలా మద్యలో వదిలేసి, దేశం పరువుతో రాజకీయాలు చేస్తున్న వారిని విడిచిపెట్టనని మాటివ్వండి చాలు." అని వెళ్ళిపోయాడు. ఇంకొందరు వచ్చి, "అందరూ తలోదారి చూసుకుని వెళ్ళిపోతుంటే ఇక్కడున్న అధికారులకు మాత్రం ఏందుకు ఈతలనెప్పులన్నీ? మీరు రాజీనామా ఇచ్చేసి వెళ్ళిపోండి." అని తమ అధికారులకు సలహా ఇచ్చారు. కానీ ఈ పరిస్థితుల్లో సహచరులను వదిలి ఎలా వెళ్ళగలమని అందరూ పోరాడడానికే నిశ్చయించుకున్నారు.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ఇక సరిహద్దులో బలగాల పరిస్థితి చూస్తే, 12మైళ్ల దూరంలో సన్నగా విస్తరించి ఉంది. ఈ చివరి నుంచి ఆ చివరకు వెళ్ళడానికి కనీసం 5రోజులు పడుతుంది. అందరికీ కలిపి 2 పారాఫీల్డ్ తుపాకులు, 4 మోర్టార్లు, అరకొర మందుగుండు. ఆత్మరక్షణకు కనీసం కంచెకూడా లేదు! ఇక బంకర్ల సంగతి సరేసరి. యుద్ధశాస్త్రంలోని ప్రాధమిక నియమాలను పాటిస్తూ ఒక్క సదుపాయంగానీ, ఒక్క వ్యూహంగానీ, ఒక్క ఆదేశంగానీ లేదు. కౌల్ రాకతో గందరగోళానికి గురైన అధికార క్రమం తాజా పరిణామాలతో పూర్తిగా కుప్పకూలింది.</div>
<div style="text-align: justify;">
1962 అక్టోబరు 20 తెల్లవారుఝామున 5గంటలకు, మూడవ బ్రిడ్జి వద్ద ఉన్న చైనీయులు ఉన్నపళంగా భారతదళాలపై దాడి చేశాయి. కొన్ని అడుగుల దూరంలోనే ఇరుపక్షాల దాడి-ప్రతిదాడులతో హిమాలయాలు ఉలిక్కిపడ్దాయి. భారతదేశ విదేశీ, రక్షణ, ఆర్థిక వ్యవహారాల డొల్లతనానికి సాక్షులుగా నిలిచాయి. ఆ సమయంలో భారత సైన్యంలో మొత్తం 4లక్షల మంది పనిచేస్తున్నారు. కానీ శత్రువుతో పోరాడడానికి 600మంది మాత్రమే ఉన్నారు. వీరికి అతి దగ్గరలో ఉన్నదళం 1000మైళ్ళ దూరంలో ఉంది.</div>
<div style="text-align: justify;">
చైనా దళాలు వ్యూహాత్మకంగా ముందుకువెళుతూ మొత్తం ప్రాంతాన్ని కబళించసాగాయి. కానీ అందరికన్నా ముందుగా ఉండే పంజాబీదళంపై దాడి చెయ్యలేదు. వారిని దాటుకుంటూ ముందుకెళ్ళసాగాయి. లుంపు వైపుగా శత్రువు కదలుతున్నారు. ఇక మిగిలింది మూడు బృందాల రాజపుత్రులు, ఒక గూర్ఖా బృందం. ఎవరి దగ్గరా సరిపడినంత బలం లేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో తమవీరత్వంతో ప్రపంచాన్ని మైమరపించిన ఈరెండు దళాల భవిష్యత్తు ఈరోజు ఒకబలమైన శత్రువు చేతిలో ఇరుక్కుంది. ఈసమయంలో జనరల్ ప్రసాద్ ఫోన్ చేసి హీనపక్షం ఒక బృందాన్నైనా సాంగ్లేకు పంపమని, ఇది పైవాళ్ల ఆదేశమని చెప్పాడు. సైన్యాని ఏమి చెయ్యాలో పాలుపోలేదు. ఒకవేళ ఈఆదేశాలను పాటిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళెముందే శత్రువు చేతిలొ హతమవ్వడం ఖాయం.</div>
<div style="text-align: justify;">
చైనీయులు ముందుగా రాజపుత్రులు గూర్ఖాలను వేరు చేస్తూ ఒకదళాన్ని వారిరువురి మద్యనా పంపారు. మిగిలిన రెండు దళాలను ఒక్కొక్కరి మీదకు పంపారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వీరిరువురూ శత్రువును మూడుగంటల పాటు నిలువరించారు. సిగ్నల్ బంకర్ మీద దాడిచెయ్యడంతో అందులోని వారంతా మరణించారు. నాలుగవ బ్రిడ్జి దగ్గరున్న బృందం రెండుదాడులను సమర్థవంతంగా తిప్పికొట్టగా, చైనాదళాలన్నీ కలిసి సునామీలాగా విరుచుకుపడటంతో తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క పోస్టు ఎన్నివేలమందినని నిలువరించగలదు? జెమదర్ బిశ్వాస్ సారధ్యంలోని బెంగాలీదళం, మేజర్ గురుదయాళ్ సింగ్ సారథ్యంలోని పదాతిదళం దాడులతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. వీరులందరూ నేలకొరగ సాగారు. చివరకు మిగిలిన రిఖ్ ను లొంగిపొమ్మని కోరగా, అతను ఒప్పుకోలేదు. ఆయనతోపాటుగా కెప్టన్ భాటియా, భూప్ సింగ్, ఇతర సహాయకులు బంకర్లలోనే ఉండిపోయారు. చైనీయులు తమ మెచీన్ గన్లతొ బంకర్లపై గుండ్లవర్షం కురిపించారు. దాంతో భాటియా అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలతో బతికిన కొందరు బందీలయ్యారు. భాటియా సామర్థ్యాన్ని గుర్తించిన సైన్యం అతన్ని పూణేలోని శిక్షణాకేంద్రానికి బదిలీచేసింది. 20న తనబృందానికి వీడ్కోలు చెప్పి బయల్దేరాల్సిన వ్య్కతి ఈలోకానికే వీడ్కోలు చెప్పాడు.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div class="separator" style="clear: both; text-align: justify;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhmF4g6qcfCfODgV9bx0TLfteOcuOmVGPNNjFbplQ31W5mWjlgn7MaeYsgmIQiG5bjl_Z9ZTq_khRLbGugoxGUPgp9n1AGutv2ytU0Ua59rmtImnS0Qf-tC5QJcpdKRXNt8g9DOjACzyNQ/s1600/0.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="240" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhmF4g6qcfCfODgV9bx0TLfteOcuOmVGPNNjFbplQ31W5mWjlgn7MaeYsgmIQiG5bjl_Z9ZTq_khRLbGugoxGUPgp9n1AGutv2ytU0Ua59rmtImnS0Qf-tC5QJcpdKRXNt8g9DOjACzyNQ/s320/0.jpg" width="320" /></a></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ఈసంఘటన సైనికులను తీవ్ర ఉద్వేగానికి గురిచేసింది. తుదిశ్వాస విడిచే వరకూ తలవంచకూడదని నిశ్చయించుకున్నారు. మరోవైపు సుబేదార్ దశరథ్ సింగ్ బృందం అప్పటికే మూడుసార్లు దాడులను ఎదొర్కొన్నది. చివరికి ఏడుగురే మిగిలారు. వారివద్ద సామాగ్రి నిండుకుంది. అయినా తలొంచని రాజపుత్రులు బాకులతో ద్వంద్వయుద్దానికి దిగారు. ఈపోరాటంలో నలుగురు మరణించగా, మిగిలిన ముగ్గురూ బందీలయ్యారు. జెమదర్ బోస్ సారధ్యంలోని బెంగాలీలు మూడుదాడుల తర్వాత 10మంది మిగిలారు. అయినా పోరాడి అమరులయ్యారు.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
మేజర్ బీ.కే.పంత్ సారథ్యంలోని రాజపుత్రుల బృందం అసాధ్యమని తెలిసినా శత్రువును నిలువరించేందుకు ప్రాణాలను పణంగా పెట్టడానికి వెనుకాడలేదు. సహచరులను ఉద్దేశించి "రాజపుత్రదళం చరిత్రలో ఈరోజు మనమొక నూతన అధ్యాయాన్ని లిఖించబోతున్నాం. రాజపుత్రులను సాహసానికి, వీరత్వానికి చిరునామాగా ఎందుకు పేర్కొంతారో శత్రువుకు తెలియజేద్దాం." అంటూ కాలికి తగిలిన గాయాన్ని కూడా లెక్కచెయ్యకుండా కదనరంగంలోకి ఉరికాడు. మొదటి మూడు దాడులని ఎదుర్కొనేసరికే చాలామంది గాయపడ్డారు. నాలుగవ దాడికి ఆయన పొట్టకి, రెండుకాళ్ళకి తీవ్రగాయాలయ్యాయి. అయినా లెక్కచేయకుండా వీరులభూమిలో మృత్యువుకు చోటులేదంటూ నినదించసాగాడు. "రాజపుత్రులు ఈదేశంకోసం చావడానికే పుడతారు. దేవుడు ఈరోజు ఈప్రాంతాన్ని మీకు నిర్నయించాడు. దీనికోసం పోరాడండి." అంటూ గర్జిస్తున్న ఈయన్ని చూసిన చైనీయులు ముందుకెళ్ళడానికి ఈయనే ప్రధాన అవరోధం అని కనుగొన్నారు. వెంటనే తమ వనరులన్నింటినీ అక్కడికే మళ్ళించారు. ఒక మెచీన్ గన్ పంత్ శరీరాన్ని తూట్లుతూట్లు చేసింది. విపరీతమైన రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్తూ, పిడికిలి పైకిత్తి "జై బజరంగ్ బలి" అంటూ నినాదంచేస్తూ తుదిశ్వాస విడిచాడు. వీరమరణం పొందిన ఆయన ఆత్మ స్వర్గానికన్నా వెయ్యిరెట్లు ఆనందాన్నిచ్చే భరతమాత ఒడిలోకి చేరింది. రాజపుత్రుల సాహసాలకు శత్రువు సైతం అచ్చెరువొందాడు. వారివల్ల జరిగినంత నష్టం మరెక్కడా జరగలేదని, అస్లు రాజపుత్రుల వంటి శత్రువును చైనీయులు ఇదివరకు చూడలేదని కొనియాడారు.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
మరోవైపు పంజాబీలు వ్యూహాత్మకంగా దాడులు చేస్తూ శత్రువును ముప్పతిప్పలు పెట్టసాగాయి. వనరులు, సమయం, సామాగ్రి, భౌగోళికాంశాలు- ఇన్ని పరిమితుల మద్య వారు మొదటి నుంచి శత్రువును ఎదుర్కొంటూనే ఉన్నారు. వాళ్ళ నైపుణ్యానికి జోహార్లర్పిస్తూనేమో చైనీయులు ఎక్కడా వారితో నేరుగా పోరాడలేదు. వారిని మిగతాదళాలను వేరుచేసుకుంటూ, ఒంటరిగా ఉండేలా వ్యూహాలు పన్నారు. వీరు అందరికన్నా ముందు ఉండటంతో, దాడికి స్పందించే సమయం లేకపోయింది. ఎక్కువమంది ఆసమయంలోనే మరణించారు. సాంగ్లేలో ఉన్న దళాలు అదృష్టవశాత్తూ భూటాన్ వైపు మళ్ళిపోయాయి. మిగతావారికి అలాంటి దారికూడా లేకుండా పోయింది. ఉన్నా వారు పోరాటానికే దిగేవారన్నది అందరి విశ్వాసం.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div class="separator" style="clear: both; text-align: justify;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjoidM9YdvC732e2JZ-ESR4m_wj1EaN82YesB2so5aKtm9git4PIBDVDWF5x1rIasetnyXSqE-k2K2aakLPT3x4M3KdWx21odjRzljmLO4sn8COjDSGmqbPtRZeEc3SWII-WfCnYPonyg4/s1600/china-india-border+(1).jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="220" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjoidM9YdvC732e2JZ-ESR4m_wj1EaN82YesB2so5aKtm9git4PIBDVDWF5x1rIasetnyXSqE-k2K2aakLPT3x4M3KdWx21odjRzljmLO4sn8COjDSGmqbPtRZeEc3SWII-WfCnYPonyg4/s320/china-india-border+(1).jpg" width="320" /></a></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ఉదయం 7:30కల్లా ధాగ్ల ప్రాంతం పూర్తిగా చైనీయుల ఆధీనంలోకి వచ్చేసింది. మూడుగంటల్లో మొత్తం తుడిచిపెట్టుకు పోయింది. దానికి చైనీయుల వ్యూహాలేవీ అంత ఆధునికమైనవీ, చేదించ సాద్యం కానివీ కాదు. అయితే వారి దగ్గర సామాగ్రి ఉత్తమనైనది. బలం ఎక్కువ. స్థానికంగా అనుకూలాంశాలు ఎక్కువ. ఉన్నతస్థాయిలో తీసుకున్న నిర్ణయాలు ప్రభావ వంతమైనవి. తమ సామాగ్రి నిండుకునేదాకా భారత సైనికుడూ శత్రువుకు లొంగలేదు. వెన్నుచూపలేదు. మృత్యువును కౌగిలించుకున్నాడు. ఇక్కడ ఆసైనికుణ్ణీ చంపింది శత్రువా? లేక అరకొర వనరులు, అస్థవ్యస్థ నిర్ణయాలు, కుళ్ళు రాజకీయాలు నిండిన అధికార వ్యవస్థా? అన్నది వారివారి విచక్షణను బట్టి నిర్ణయానికి రావచ్చు.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
అక్కడి నుంచి చైనాబలగాలు సాంగధర్ లోని హెలిపాడ్ వైపు కదిలాయి. మద్యలో కొన్నిబృందాలను వ్యూహాత్మకంగా పక్కకు పెట్టాయి. అక్కడ వస్తుసరఫరా కోసం వచ్చిన హెలికాప్టర్ను కూల్చివేశారు. యుద్దం గురించి ఎయిర్ ఫోర్సుకు సమాచారం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు బలయ్యారు. మొదట్నుంచీ ఆర్మీ- ఎయిర్ ఫోర్సులోని కీలకవిభాగాల మద్య సమంవయం లేదు. ఇది అనేకసార్లు తేటతెల్లమయ్యింది. ముందురోజు జనరల్ ప్రసాద్ తాను సరిహద్దుకు వచ్చి, అక్కడి సైనికుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని మాటిచ్చాడు. అమాటప్రకారం ఆయన బయలుదేరబోగా, కిందవాళ్ళు వారించారు. ముందు తామెళ్ళి పరిస్థితిని చూసి వస్తామని, తర్వాత వెళ్ళమని చెప్పి బయల్దేరారు. ఆహెలికాప్టర్నూ కూల్చివెయ్యడంతో ఆయువకులిద్దరూ బలయ్యారు. అప్పటికే సిగ్నల్ అధికారి బందీగా మారాడు. అతని తర్వాతి వ్యక్తి ఈఘటనలో మృతి చెండాడు. దాంతో సమాచారం పూర్తిగా స్తంభించింది.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
దాల్వీ కొన్ని రహస్య పత్రాలను తగలబెట్టాక, మిగిలిన సహచరులతో కలిసి సాంగధర్ వైపు కదిలాడు. అక్కడికి చేరుకునే సరికే చైనీయులు భారీ యెత్తున దాడులు నిర్వహిస్తున్నాయి. భారత సైన్యం తమతమ శక్తిమేరా వారిని నిలువరించేందుకు యత్నిస్తున్నాయి. దూరం నుంచి వారి సాహసాన్ని చూస్తున్న దాల్వీబృందానికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. దాదాపు 4గంటలు పోరాడాక, వీరి దగ్గర కూడా నిల్వలు నిండుకోవడంతో ప్రాణాలు విడిచారు. ఇక మిగిలింది హథుంగ్లా వద్ద ఉన్న పంజాబీలు, గ్రెనేడర్లు.</div>
<div style="text-align: justify;">
సెర్ఖిమ్ వైపు వెళ్ళి వారిని కలుసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అక్కడికి చేరుకోవాలంటే 18500 అడుగుల ఎత్తులో ఉన్న శిఖరాలను దాటాలి. నిట్టనిలువుగా ఉన్న పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించారు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఈదారిలో 17000 అడుగుల ఎత్తున చిన్నగుహలో రాత్రికి తలదాచుకున్నారు. అప్పటికి 24గంటలుగా ఎవ్వరికీ అన్నం లేదు. నిద్రలేదు. నీళ్ళు తాగాలన్నా మంచువల్ల గొంతు పట్టేస్తోంది. అలానే రాత్రంతా గడిపారు. ఇంతటి కష్ట సమయంలోనూ సైనికుడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. తమ అధికారి పట్ల వారుచూపిస్తున్న గౌరవం దాల్వీని కట్టిపడేసింది.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
మార్గంలో ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురవుతూ వస్తుండటంతో వారిని వదిలి వెళ్ళక తప్పలేదు. మద్యాహ్నం 1:30కు కర్పోలా మార్గానికి చేరుకునేసరికి 12మంది మిగిలారు. కాళ్ళీడ్చుకుంటూ బండరాళ్ళు, కాలువలూ, పొదలు దాటి వెళ్తూ ఎక్కడొ దారి తప్పిపోయారు. కానీ ముందుకు పోవడం తప్ప మరొక మార్గం లేదు. కాబట్టి వెళ్తూ ఉన్నారు. అప్పటికే తిండితినీ, నిద్రపోయి 60గంటలయ్యింది! చైనీయులు ఒకదాని తర్వాత మరొకటి ఆక్రమించుకుంటూ మొత్తంప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. సరిహద్దు పోస్టుల్లో భారత త్రివర్న పతాకాన్ని అవనతం చేశారు. ఇక మళ్ళీ ఎప్పటికి మనఝెండా ఎగురుతుంది అన్నది కాలమే జవాబు చెప్పాలి. ఒక దట్టమైన అడవిని చీల్చుకుంటూ ముందుకు వెళ్ళగా మొత్తం దళం చైనాబలగాల మద్యలో ఇరుక్కుంది. వారంతా అక్కడే సేదతీరుతున్నారు. మొత్తం విజయం ఒక ఎత్తైతే దళనాయకుడు బందీగా దొరకడం ఎవడికైనా అమితానందాన్ని కలిగించేది. ఆక్షణం దాన్నే చైనీయులు అనుభవించారు.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
అలా ఈమట్టికోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు వెనకాడకుండా సైనికుడు సాగించిన పోరాటం ముగిసింది.</div>
</div>
సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com8tag:blogger.com,1999:blog-3377763021527742745.post-39224199150747828872012-10-17T15:30:00.002+05:302012-10-28T19:30:01.422+05:30మేరునగ తప్పిదం- 14.పద్మవ్యూహం<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<b id="internal-source-marker_0.08481175801716745" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 471px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">సరిహద్దు గందరగోళానికి గురై ఉండగా జనరల్ కౌల్ డీల్లీనుంచి ఎలాంటి ఆదేశాలు పంపలేదు. దళాలు రక్షణ చర్యలలో భాగంగా బంకర్లు నిర్మించడం మొదలుపెట్టాయి. కానీ అందుకు సరిపడా సామాగ్రి లేకపోవడం వారిని ఇబ్బంది పెట్టింది. కౌల్ వెళ్తూ వెళ్తూ అప్పగించిన "ప్రస్తుత స్థానాలను యధాతథంగా కొనసాగించడి." అన్న బాద్యతకు అనుగుణంగా 4మైళ్ళ పొడవున విస్తరించి ఉన్న ప్రధానప్రాంతంతో బాటు 10మైళ్ళ పొడవున విస్తరించి ఉన్న మిగతాప్రాంతాలను కాపాడటం అప్పటి బలానికి చాలాపెద్ద లక్ష్యం. </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">అక్టోబరు 12న లెఫ్టినెంట్ కల్నల్ హరిహర్ సింగ్ సారధ్యంలోని 4గ్రెనేడర్ బలగాలు ఒక్కొక్కటిగా సరిహద్దుకు చేరుకోవడం ప్రారంభించాయి. మిగతా దళాల మాదిరిగానే వీళ్ళుకూడా ఉన్నపళంగా మైదానాలు విడచి ఇక్కడకు రావడంతో విపరీతంగా అలసిపోయి ఉన్నారు. అంతేకాక కొత్తవాతావరణానికి అలవాటు పడటానికి సమయం పడుతుంది. వీరి రాకతో మొత్తం బలం 2500కు చేరుకుంది. అక్టోబరు 16కు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వారి పోర్టర్లు 450మంది సమకూరారు. సంఖ్యపెరిగిపోవడంతో సరకులనిల్వలు 2రోజులకు పడిపోయింది. </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">అక్టోబరు 11న డిల్లీ చేరుకున్న కౌల్, ఉన్నతస్థాయి సామావేశంలో పాల్గొన్నాడు. అన్నిరకాలుగా చైనీయులు మనకన్నా మెరుగైన స్థానంలో ఉన్నారని చెప్పాడు. అక్కడ చైనీయులను ఎదుర్కోవడం అసాధ్యమని, ధోలానుంచి బలగాలను ఉపసంహరించాలని వాళ్లకు నివేదించాడు. వారికి మూడు ప్రత్యామ్నాయలను ప్రతిపాదించాడు. ఒకటి- సరిహద్దులో బలాన్ని పెంచుకుని చైనాపై దాడి చెయ్యడం. రెండు- దాడి చెయ్యకుండా యదాతథ స్థానాలలో కొనసాగించడం. మూడు- ప్రస్తుత స్థానలకన్నా మెరుగైన ప్రాంతాలకు బలగాలను పంపడం. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో మూడవది, అంటే అక్కడ్నుంచి బలగాలను వేరేచోటకు పంపడం, తప్ప వేరేవేవీ కుదిరేవి కావు. కానీ మూడింటినీ చెప్పడం కౌల్ చేసిన </span><span style="font-weight: bold; vertical-align: baseline; white-space: pre-wrap;">ఘోరతప్పిదం.</span><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"> దాడి చేసేంత బలం మనకు లేదన్నది సుస్పష్టం. బలమైన శత్రువుకు ఎదురుగా, ఎలాంటి రహస్య కార్యకలాపాలనూ కొనసాగించలేని చోట బలగాలను ఉంచి ఏమిలాభం? వాళ్ళకు రక్షణ ఎలా? రాజకీయ కోణంలోంచి చూస్తే బలగాలను అక్కడే కొనసాగించడ మొక్కటే సరియైనది. అలా చేస్తేనే ప్రభుత్వం ప్రజలకు, పార్టీ ప్రతిపక్షానికి జవాబు చెప్పగలదు. కాబట్టి యదాతథ స్థానాలను కొనసాగించమని ఉత్తర్వులు జారీచేసింది. సైన్యం తనకుతానుగా ఇచ్చిన ప్రత్యామ్నాయలలో ఇది ఉంది కాబట్టే వాళ్ళు దాన్ని ఎంచుకున్నారు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">13న నెహ్రూ కొలంబో బయలుదేరుతూ చైనీయులను తరిమికొట్టమని ప్రభుత్వం సైన్యాన్ని ఆదేశించిందని పత్రికలకు చెప్పాడు. ఇది చైనీయుల గుండెలు భగ్గుమనేలా చేసింది. రేడియోలో ఈవార్తలను విన్న సరిహద్దుదళాలు గందరగోళానికి గురైయ్యాయి. ఎట్టకేలకు కౌల్ నుంచి ఆదేశాలు అందాయి. వాటిననుసరించి- </span><span style="font-weight: bold; vertical-align: baseline; white-space: pre-wrap;">దళాలు యదాతథ స్థితిని కొనసాగించా</span><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">లి. కానీ అందుకు అవసరమైన అదనపు వనరులు, ప్రణాళిక, పాలనావిషయాలేవీ చర్చించలేదు. అంతకుమునుపు వచ్చిన ఉత్తర్వుల్లానే ఇదికూడా ఒక నినాదంగా మిగిలిపోయింది.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">మరోవైపు చైనా నెహ్రూ ప్రకటనను సాకుగా చూపించి, భారీ యెత్తున సన్నాహాలు మొదలుపెట్టింది. కొరియాయుద్దంలో నాయకత్వం వహించిన వ్యక్తికి దీనిబాద్యతలు అప్పగించింది. దళాలన్నీ చురుగ్గా పనులు చెయ్యడం మొదలుపెట్టారు. వారి కదలికలను గమనించడానికి భారతసైన్యం 25 అబ్జర్వేషన్ పోస్టులను నెలకొల్పింది. సరిహద్దుకు అవతల మనలను లక్ష్యంగా చేసుకుని చైనా చేపడుతున్న యుద్దసన్నాహాలను మూగగా చూస్తూ ఉండటం కన్నా భారత జవాను చెయ్యగలిగింది ఏమీలేదు! అరకొర సదుపాయాలు, పనిముట్లతో దాడిసంగతి దేముడెరుగు కనీసం ఆత్మరక్షణకు కూడా ఏర్పాట్లు సరిపోవు. ఆసమయంలో నాలుగు తుపాకులను పంపగా, అందులో రెండు హెలికాప్టర్లు జారవిడిచేటప్పుడు ముక్కలయ్యాయి. మనదగ్గరున్న అతిపెద్ద ఆయుధం సామర్థ్యం చైనీయుల సంచార ఆయుధాల సామర్థ్యంకన్నా తక్కువ. పర్వత ప్రాంతం కావడంతో వాటి పరిమితి మరింతగా పెరిగిపోయింది. </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">మరొకవైపు వైద్యసదుపాయాలు యుద్దావసరాలకు ఏమాత్రం సరిపోవు. పంజాబీదళం ఎలాంటి వైద్యసదుపాయం లేకుండానే పోరాడుతోంది. ఉన్నపళంగా సైన్యాన్ని సరిహద్దుకు పంపడంతో దానికనుగుణంగా వైద్యశిబిరాలను ఏర్పాటు చెయ్యటం గందరగోళానికి గురైంది. మొదట లుంపులో నెలకొల్పాల్సిన శిబిరాన్ని కౌల్ ఆదేశాలతో సరిహద్దుకు మార్చాల్సి వచ్చింది. ఇన్ని సమస్యల్లోనూ వైద్యబృందం అహర్నిశలూ కృషిచేసి రోజుకు నలభైమందికి వైద్యాన్నిచ్చింది. కేసుల్లో సింహభాగం చలినుంచి సరైన రక్షణలేకపోవడంవల్ల, అలవాటులేని పర్వతప్రాంతంలో ఉండవలసినందువల్ల ఏర్పడినవే. రోగులను తరలించడం తలకుమించిన భారమైంది. రోగులను ఎనిమిదిగంటలపాటు మోసుకుంటూ పర్వతాలను దాటి ఆసుపత్రిలో చేర్చాలి. తిరుగుప్రయాణంలో అక్కడినుంచి సామాగ్రి మోసుకురావాలి. </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఇలాంటి ప్రతికూల సమయాల్లోనూ కెప్టెన్ బీ.బీ.కూలే సారధ్యంలోని వైద్యబృందం రోజుకు 40మందికి పైగా రోగుల్ని చూసేవారు. అందులో కనీసం పదిమంది పరిస్థితి అపాయకరంగా ఉండేది. ఎయిర్ ఫోర్సుకు చెందిన స్కాడ్రన్ లీడర్ విలియమ్స్ ధైర్యసాహసాలతో విమానాన్ని నడిపి రోగులను ప్రధాన కేంద్రానికి చేర్చేవాడు. తెల్లవారుఝామున మొదలైన విమానం పొద్దుగూకే వరకూ తిరుగుతూనే ఉండేది. ఒకరోజు 23 రౌండ్లు తిరిగిన ఈయన సాహసాన్ని గౌరవిస్తూ, వైద్యబృందం యుద్దవీరుల అవార్డుకు ఈయన్ని నామినేట్ చేసి గౌరవించింది. మద్యలో జనరల్ కౌల్ ఉత్తర్వులు వీరిని కొంత అసహనానికి గురిచేశాయి. వైద్యుల సలహాను తీసుకోకుండానే ఆయన ఒకబృందాన్ని సరిహద్దుకు పక్కనే ఏర్పాటు చెయ్యమన్నాడు. దాడిజరిగితే అది ధ్వంసమయ్యే ప్రమాదాన్ని ఆయన గమనించలేదు. అలానే ఇంకొక బృందాన్ని ఎత్తైన ప్రాంతంలో ఏర్పాటు చెయ్యగా ఆక్సిజన్ వసతులు లేకుండా 9000అడుగులకన్నా ఎత్తులో ఆపరేషన్ చెయ్యడం కుదరని కారణంగా దాన్ని విరమించుకున్నారు. విసుగెత్తిన మేజర్ జయరామన్ తన పైఅధికారి కల్నల్ మైత్రాకు పిర్యాదు చేశాడు. ఆయన తనబృందానికే మద్దతునివ్వడంతో వాళ్ళు ఊపిరిపీల్చుకున్నారు. </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఇక వస్తురవాణా పరిస్థితి నానాటికీ తీసుకట్టుగా తయారవసాగింది. ఒకవైపు అవసరాలు పెరిగిపోతుండగా, మరొకవైపు వస్తువులను జారవిడిచేందుకు ఎన్నుకున్న ప్రాంతం ఇరుకైనది కావటాన మూడోవంతు మాత్రమే సైన్యానికి అందసాగింది. మిగతాది అక్కడినుంచి దొర్లి లోయల్లో పడిపోతున్నాయి. అలానే సామాగ్రిని నిల్వచేయను చాలినంత గోదాములూ లేవు. సైన్యానికి అవసరమైన సామాగ్రి ఏమిటీ? వాటి ప్రాధాన్యతా క్రమం ఏమిటీ? అవసరానికి తగినట్టు అందుతున్నాయా? పదాతిదళానికీ వాయుసేనకు మద్య సమాచారం సరిగా అందుతుందా? వంటి కీలకమైన ప్రశ్నలకు జవాబిచ్చే స్థితిలో సైనికాధికారులు లేరు. </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఇక సమాచార వ్యవస్థ- 4డివిజను సిగ్నల్ రెజిమెంట్ వాళ్ళు ఒక టెలిఫోన్ లైనును ఏర్పాటు చేశారు. అది కాస్తా సాధారన యుద్ధనియమాలకు విరుద్ధంగా సరిహద్దుకు సమాంతరంగా, చెనీయుల వాకిట్లో ఏర్పాటుచేస్తారు. సరిహద్దు- ప్రధానకేంద్రం మద్యన సమాచాఅం శత్రువు దయాదాక్షిణ్యాలమీద ఆధారపడినట్లైంది. ఆప్రాంతానికి లైను వెయ్యాలంటే అంతకన్నా వేరేమార్గం లేదు. అలాంటి ప్రాంతాన్ని ఎంచుకున్నాం కాబట్టి అనుభవించక తప్పదు. మనవ్యవస్థలు, సదుపాయాలు అన్నీ శత్రువు కళ్లకెదురుగానే ఉంచాం. దాంతో సైనిక సన్నాహాల్లో కీలకమైన గుట్టు ఇక్కడ రట్టైంది.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఇన్ని సమస్యల మద్యలో, జనరల్ కౌల్ పానకంలో పుడకలాగా పైనుంచి ఊడిపడ్డాడు. మొత్తం అధికారక్రమంలో ఆయన స్థానమేంటి అన్నది అందరికీ అస్పష్టమే. దాంతో ఆయన తనతోపాటు కొందరు ఉద్యోగులను తనవెంట తీసుకొచ్చి, వాళ్ళందరికీ తలో హోదా కల్పించి ఖాళీల్లో ఇరికించాడు. ఖాళీలు లేకుంటే సృష్టించాడు. వీళ్లందరికీ పని ఇవ్వాలు. ఫర్నీచర్ ఇవ్వాలి. ఇతర సదుపాయాలు కల్పించాలి. అదొక వింతసమస్య!</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఇంత జరుగుతున్నా మనప్రభుత్వం సైనికులతో చదరంగం ఆడటం ఆపట్లేదు. అన్నివైపులనుంచీ విమర్శలు తారాస్థాయికి చేరుకుంటూ ఉండటంతో దీనికి జవాబిచ్చేలా ఏదైనా చెయ్యాలని ప్రభుత్వం యోచించింది. సాంగ్లే అనే ప్రాంతం ఆయాచితవరంగా మననాయకులకు లభించింది. ఇది భూటాన్ మూలన ఉంటుంది. నమ్కాచు నది అవతల ఉండటంతో ఇది చైనా భూభాగమవుతుంది. అక్కడకు మనసైనికులను పంపి ఆప్రాంతాన్ని మన ఆధీనంలో ఉండేలా చేస్తే అందరికీ జవాబివ్వొచ్చు అని భవైంచింది. అయితే అక్కడకు సైన్యాన్ని పంపడంలో గల పరిమితులను, వస్తురవాణాలోని ఇబ్బందులను, సైన్యం ఆత్మరక్షణకు గల ఇబ్బందులను పట్టించుకోలేదు. ఒకవైపు ఇప్పుడు కాపలాకాస్తున్న ప్రాంతమే తలకుమించిన భారమయింది. ఇక ఈకొత్తప్రాంతాన్ని కూడా కాపలాకాయాలంటే అస్సలు కుదిరేపనే కాదు. ఒకవేళ దాన్ని కాయాలంటే ఇక్కడ కొంతబరువును తగ్గించుకోవాలి. ఇంతా చేసి అక్కడకు వెళ్ళినందువల్ల ఏమైనా ప్రయోజనమా అఁటే అదీలేదు. అక్కడికెళ్ళడే పెద్దతలనొప్పి. సరైన దారిలేదు. మద్యలో ఉన్న పర్వతశిఖరం మంచుతో కప్పబడి, దాటడానికి దుస్సాధ్యంగా ఉంటుంది. రానున్న శీతాకాలంలో పరిస్థితి మరింత విషమిస్తుంది. అక్కడికెళ్ళెవాళ్లకి తప్పనిసరిగా చలికాలపి దుస్తులు ఇవ్వాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఏముంది. అప్పటికే వాటిని వాడుతున్న పంజాబీదళం నుంచి తీసుకుని సరఫరా చెయ్యాల్సి వచ్చింది. ఇది ఎంత దారుణమైన సంఘటన? కనీసం నోరుమెదపని జవానుకు మనం ఏమిస్తే ఋణం తీర్చుకోగలం? సైనికాధుకారులు ఎంత మొత్తుకున్నా మీనన్ ముందు చెవిటివాడి చెవిలో శంఖం పూరించిన చందమే. మరొకవైపు నెహ్రూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇస్తున్న ప్రకటనలు చైనీయులను మరింత రెచ్చగొట్ట సాగాయి. </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">అక్టోబరు 16న జనరల్ ప్రసాద్ ఫోన్లో కలిశాడు. పైవాళ్లను ఒప్పించలేక పోయానని, నవంబరు 1కల్లా చైనీయులను తరిమికొట్టాలన్నది రక్షణమంత్రి ఆదేశమని చెప్పాడు. దీంతో దాల్వీకి అరికాలిమంట నడినెత్తికెక్కింది. అది కుదిరేపని కాదన్నది ఇద్దరి అభిప్రాయం కాబట్టి పైవాళ్లకు దాన్ని తెలియజేయమన్నాడు. ఈపరిస్థితుల్లో రాజీనామా ఇవ్వడమొక్కటే దారి. అయినా పై అధికారులెవరూ ఆయనతో విబేధించట్లేదు. ఆయన అభిప్రాయాన్ని జనరల్ కౌల్ సహా అందరూ ఒప్పుకున్నారు. కానీ రాజకీయ అవసరాలు అన్నింటికన్నా ఎక్కువ ప్రధానమయ్యాయి. దాంతో ఎవరికీ ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">అక్టోబరు 17న ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్కాచులో సైన్యాన్ని ఉంచే ప్రశ్నేలేదు. వెంటనే వెనక్కి పిలిపించమని దాల్వీ ప్రసాదును కోరాడు. పైవాళ్లకు తెలియజేస్తానన్ని చెప్పడం మినహా ఆయన చేసిందేమీ లేదు. అక్టోబరు 18నాటికి చైనా సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఆరాత్రి కొందరు చైనీయులు భారత భూభాగంలోకి చొరబడ్డారని గ్రెనేడర్ దళం వారు పిర్యాదు చేశారు. వారిమార్గాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సిగ్నల్ కమాండర్ కే.కే.తివారి సమాచార వ్యవస్థను తనిఖీ చెయ్యడానికి వచ్చాడు. త్వరలోనే దళాలను ఇక్కడినుంచి ఉపసంహరించుకోవచ్చు అని తెలియజేశాడు. ఎలాంటి ఆధునిక పరికరాలూ లేకుండానే ఈయన సిగ్నల్స్ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాడు. తమ సామర్థ్యానికి మించిన కార్యక్రమాలనూ ఎలాంటి విసుగూ ప్రదర్శించకుండా నిర్వహించాడు. </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">అక్టోబరు 19కల్లా భారత సైన్యం పూర్తిగా చైనీయుల పద్మవ్యూహంలో చిక్కుకుపోయింది. వారి కదలికలను చూసినవారు ఎవరైనా పెద్దదాడికి సిద్దమవుతున్నారని సులువుగా గ్రహించగలరు. ఈసమయంలో జనరల్ ప్రసాద్ ఫోన్ చేసి మిగిలిన గూర్ఖాలను సాంగ్లేకు పంపమని చెప్పాడు. ఈసమయంలో దళాలను అక్కడకు పంపితే మార్గమద్యంలోనే చైనీయులు హతమార్చే ప్రమాదం ఉందని ఆయనకు చెప్పాడు. అడ్డమైన రాజకీయాలకు యుద్దభూమి వేదికగా నిలిచింది. ఎవరెవరో చేసిన పాపాలను కడుక్కునేందుకు సైన్యాన్ని బలిపశువుగా నివేదిస్తున్నారు. నోటిమాటలతో విసిగిపోయానని ఇకపై ఏఉత్తర్వులనైనా రాతపూర్వకంగా ఇస్తేనే చేస్తానని ఖచ్చితంగా చెప్పాడు. ఇప్పటికే చైనీయులు యుద్దానికి సిద్దమైపోయారని, వాళ్లదాడిని నిలువరించాలంటే వీలైనంత తక్కువ ప్రాంతంలో బలగాలను మోహరించాలని చెప్పాడు. ప్రస్తుతం బలగాలు సన్నగా 10మైళ్ళ దూరంలో విస్తరి6చి ఉన్నాయని, దాడిని నిలువరించే శక్తి వాటికి లేదని చెప్పాడు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">అప్పుడు ప్రసాద్ తీరిగ్గా ఒక నిజాన్ని బయటపెట్టాడు. హిమాలయ వాతావరణం పడక జనరల్ కౌల్ అస్వస్థతకు గురయ్యాడు! దానివల్లే దళాలకు తాజా ఉత్తర్వులేవీ అందట్లేదు. కౌల్ బాద్యతలు నిర్వర్తించలేని సమయంలో జనరల్ ప్రసాద్ ఇన్ చార్జ్ అవుతాడు. కానీ ఆబాద్యత తీసుకునేందుకు ఆయన సిద్దంగా లేడు. అంతేగాక ఇన్నేళ్ళుగా ఆయన పని అటు ప్రధాన కార్యాలయానికీ ఇటు సరిహద్దుకీ మద్యన పోస్టుమాన్ పాత్ర పోషిస్తూ వచ్చాడు. కిందవాళ్ళ నివేదిక పైవాళ్ళకు చేరవేయడం. పైవాళ్ళ ఆదేశాలు కిందకు పంపడం మినహా ఆయన చేసిందేమీలేదు. సర్వీసు ప్రకారం సీనియర్. అలాగని నిర్ణయాలు తీసుకునేంత సీనియర్ కాదు. కిందవాళ్ళతో కలవగలిగినంత జూనియరూ కాదు. ఆయన పరిస్థితి ఇటు ఉట్టికీ అటు స్వర్గానికీ కాకుండా ఉంది. ఆయన నిర్లిప్త ధోరణికి చికాకుపడ్డ దాల్వీ ఫోన్లో కొంచెంఘాటుగానే విమర్శించాడు.సైనికుల పరిస్థితి ఏమిటో తెలిసినందువల్ల ఆయన దాల్వీ మాటలతో ఏకీభవిస్తూ, అవసరమైతే తానూ యుద్దభూమికి వచ్చి సైనికులతోనే ఉంటానని చెప్పాడు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఒకవైపు శత్రువు సన్నాహాలు వాయువేగంతో పూర్తవుతుండగా, మనం మాత్రం సైనికుణ్ణి బలిపశువును చేసి, రాజకీయాల్లో మునిగి తేలుతున్నాం. వాటి ఫలితంగా మనసైన్యం శత్రువు పద్మవ్యూహంలో చిక్కుకుంది.</span></b></div>
సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com11tag:blogger.com,1999:blog-3377763021527742745.post-37237727959794100022012-10-14T03:11:00.001+05:302012-10-14T18:33:09.531+05:30మేరునగ తప్పిదం- 13.తేనెతుట్టె కదిలింది<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<br /></div>
<b id="internal-source-marker_0.5005465620197356" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 316px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">అక్టోబరు 4న జనరల్ కౌల్ తేజ్పూర్ చేరుకున్నాడు. ఆయనకున్న పలుకుబడి దృష్ట్యా ఉన్నతాధికారులు సైతం ఎదురెళ్ళి స్వాగతం పలికారు. ఇది సైనిక నియమావళి ప్రకారమైతే శిక్షార్హం. కానీ అక్కడ జరుగుతున్నది రాజకీయ కార్యకలాపాలేగానీ సైనికచర్యలు కాదు కదా! అప్పటికి అక్కడి సన్నాహాలు ఏమాత్రం సరిపోయేలా లేవు. జనరల్ ఉమ్రావు వైఖరితో ఆయన పై అధికారి జనరల్ సేన్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారయ్యింది. అప్పటికే అనేకసార్లు దాడిచెయ్యడానికి గడువును పొడిగించుకుంటూ వెళ్ళటం ప్రభుత్వాన్ని అసహనానికి గురిచేస్తోంది. ఇటువైపు హిమాలయాలే అనుకుంటే అంతకు మించి సమస్యలు. ఇప్పుడు జనరల్ కౌల్ రావటంతో ఆయనమీదున్న బరువంతా దిగిపోయింది. ఇక ఆతలనొప్పులేవో కౌలే చూసుకుంటాడు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">కౌల్ 7Infantry Brigadeను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాడు. అంటే ఇప్పుడు అందులో ఒక జనరల్, ఇద్దరు లెఫ్టినెంట్ జనరళ్ళు, ఒక మేజర జనరల్, మరియు ఒక బ్రిగేడియర్ ఉన్నారు! కానీ దళంలో సైన్యం, వాటికి వనరులు మాత్రం లేవు. పిరమిడ్ తిరగబడింది. ఉన్నతస్థాయిలో వ్యూహరచన చెయ్యాల్సినవాళ్ళు గుంపుగా యుద్దరంగంలో తిరుగుతుంటే గందరగోళం మరీ ఎక్కువైంది. అధికార క్రమాన్ని విడిచిపెట్టిమరీ కిందున్న సైనికుణ్ణి అదిలించి, గదమాయించి, బెదిరించి మొత్తానికి ఏదో నెట్టుకొస్తున్నారు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఇదిలా ఉండగా జనరల్ కౌల్ సన్నాహాల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ, "దళాలు బద్దకంగా పనిచేస్తున్నాయి. అసలు ఇలాంటి ప్రాంతాన్ని దాడికి ఎందుకు ఎంచున్నారు? ఇదసలు అనుకూలంకాదు. దాడి సంగతి పక్కన పెడితే కనీసం ఆత్మరక్షణకు సైతం ఇది పనికి రాదు." అని చెప్పుకొచ్చాడు. అదేమాట దళ కమాండర్ చెబుతున్నా వినిపించుకోకుండా ఫార్వార్డ్ పాలసీ పేరుతో అక్కడ పోస్టు పెట్టిందెవరు? బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళని అడిగి పోర్టర్లను తెప్పిస్తానని మాట ఇచ్చాడు. ఆయన ఆసంస్థ యాజమాన్యంలో జీవితకాల సభ్యుడు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">సైనికచర్య ప్రారంభించే ముందు 580టన్నుల మందుగుండు సిద్ధంగా ఉంచాలని, నమ్కాచులోయలో కదలికలు కష్టమనీ, అలాగే పోర్టర్ల కొరత తీవ్రంగా ఉందనీ జాన్రల్ ఉమ్రావ్ తెలియజేశాడు. అయినా శత్రువుమీద దాడి చెయ్యాలంటే వారికన్నా ముందుండాలి కాబట్టి, మంచుకురిసే దానికి ముందే దాడి చెయ్యాలి కాబట్టి సైనికచర్యలకు అవసరమైన సన్నాహాలు శీఘ్రగతిన చేపట్టాలని జనరల్ కౌల్ ఆదేశించాడు. కానీ శత్రువుకన్నా వేగంగా ఉండడమంటే అతనికన్నా వేగంగా వనరులు సమకూర్చుకోవడమని ఆయనకు తెలియదా? ఇన్నాళ్ళూ సైనికచర్యలు ఎందుకు చేపట్తలేక పోయామో అర్థం కాలేదా? దీనిని బట్టి అర్థం అయ్యేదేమంటే ఆయన ఒక సుశిక్షితుడైన సైనికునిలాగాక రాజకీయ నాయకుల తొత్తుగా వ్యవహరిస్తున్నాడు. తన చర్యలు, ఆదేశాలన్నీ సైనికుల పరిమితులను దృష్టిలో ఉంచుకునిగాక రాజకీయ అవసరాలకు అనుగుణంగా అమలుచేస్తున్నాడు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">దాదాపు వారం తర్వాత జనరల్ ప్రసాద్ కలిశాడు. ఆయన్ని తాము సమర్పించిన నివేదిక గురించి వాకబు చేశాడు. బదులివ్వకుండా గుట్టుగా ఉండటంతో మళ్ళీ అడిగాడు. "ఇక్కడెవరికీ మనబాధలతో, మనప్రాణాలతో పనిలేదయ్యా. నీ నివేదిక చదివే ఓపిక అక్కడెవ్వరికీ లేదు. వాళ్ళు కేవలం చైనీయులను తరిమికొట్టడం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. రాజకీయ కారణాల వల్ల సైనికచర్య వెంటనే చేపట్టమని ఒత్తిడి తెస్తున్నారు." అని ఆవేదనతో జవాబిచ్చాడు. అలాగే కౌల్ను ఇక్కడకు పంపేందుకు ముందు జరిగిన పరిణామాలన్నీ వివరించాడు. వెంటనే దాల్వీని నమ్కాచు ప్రాంతానికి బయలుదేరమన్నాడు. ఇంకా ఇక్కడె ఉన్నట్టు కౌల్కు తెలిస్తే ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందని చెప్పాడు. ఇప్పటికే ఆలశ్యమైందనీ, ఇప్పటికిప్పుడు బయలుదేరినా రాత్రికి అక్కడకు చేరుకోలేనని దాల్వీ చెప్పాడు. దానికి ఆయన బదులిస్తూ "కావాలంటే దారిలో ఏదైనా గుడిసెలో నిద్రపో. అంతేగానీ ఇక్కడ మాత్రం ఉండకు." అని బతిమాలాడు. ఇక తప్పనిసరై బయల్దేరుతూ ఇదేవిషయాన్ని దళాలకు సమాచారమందిస్తే వాళ్ళు కలవరపడ్డారు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">అక్టోబర్ 5న జనరల్ కౌల్ అక్కడకు వచ్చాడు. నిజానికి 7న ఆయన ధోలాలో దాల్వీతో సమావేశం అవ్వాల్సి ఉంది. అంటే ముందు రెండురోజులు ఆయన క్షేత్రస్థాయిలో సమీక్షించి ఒకనిర్ణయానికి రావాల్సి ఉంది. కానీ ఇలాంటివేమీ చెయ్యకుండానే వచ్చీ రావడంతోనే కిందివాళ్ళను, పైవాళ్ళనూ బద్దకస్తులన్నట్టు మాట్లాడసాగాడు. అందరిమీద పూర్తి ఆధిక్యత ప్రదర్శించ సాగాడు. అప్పటికే చైనీయుల ఆధిక్యత ఆయనకు అర్థమైంది. పట్టుసాధించడం చాలాకశ్టం అన్న సంగతి తెలిసొచ్చింది. కానీ ఇంకా చైనీయులను తరిమికొట్టాలి అనే మాట్లాడుతున్నాడు. </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">మద్యాహ్నానికి లుంపు చేరుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరినీ ఉన్నపళంగా ధోలాకు వెళ్ళమన్నాడు. వెళ్ళమని చెప్పి ఇంతకాలమైనా ఎందుకువెళ్ళలేదని వాళ్లమీద కసురుకున్నాడు. మిగతా ఉన్నతాధికారులను చులకన చేస్తూ తానొక్కడినే వీరునివలె యుద్ధరంగానికి వచ్చానని చెప్పుకున్నాడు. దళకమాండరుకు కనీస సమాచారం అందించకుండా వాళ్ళందరినీ అక్కడినుంచి సరిహద్దుకు పంపించాడు. ఆసమయంలో వాళ్ళడిన వాటన్నింటికీ "ముందు మీరెళ్ళండి. అక్కడికి అన్నీ వస్తాయి." అని చెప్పాడు .తరువాత కొంతకాలానికి దాల్వీనే ఈకార్యక్రమానికి ఒప్పుకున్నట్టు గాలిపుకార్లు లేచాయి. అంతకాలం ఎవరూ చెయ్యలేని దాన్ని తాను చేసి చూపించి, దళాలని థాగ్లా శిఖరం వరకు అప్రతిహతంగా నడిపించి గొప్పయోధునిగా కీర్తినార్జించాలని ఆయన పగటికలలు కంటున్నాడు. రాజకీయాలు చేస్తూ వీరునిగా ఎలా గుతింపు పొందుతాడు? ఆసమయంలో అతివిశ్వాసం ఆయన మాటల్లోనూ, చేతల్లోనూ ప్రస్పుటంగా కనిపించసాగింది. ఆకైపులో హిమాలయాలు, చైనాబలము, వాతావరణం, వనరులలేమీ ఇవేవీ కళ్లకు కనిపించలేదు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఇటువైపు ఈపనులన్నీ సాగుతూ ఉండగా, సరిహద్దుకు అటువైపు చైనా ఒకడివిజన్ మొత్తాన్నీ రంగంలోకి దించింది. అంతకుముందే మెక్ మోహన్ రేఖను తాము గుర్తించట్లేదని చైనా ప్రకటించింది. అప్పటి వరకు ఆరేఖను గౌరవిస్తూ, అందులో కొన్నిప్రాంతాలపై మాత్రమే అభ్యంతరాలు వ్యక్తం చేసినవాళ్ళు ఇప్పుడు ఏకంగా ఆరేఖే సరిహద్దుకాదంటూ ప్రకటించారు. దాంతో ఇక జరగనున్నది చెదురుమదురు ఘర్షణకాదని దాదాపూ అందరికీ అర్థమయ్యింది. </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjNVChfnxlbDm96BgvkSqaZao1wXELUtbPrMax0AaEYOyMI0gasFXEsF4MfqIw8em2gCuDgj944U-0Cm8tgeF95I79yaEIw4rquy_bsNd6PUFL8d3sGY8qtSFAaHOGTvTvvXrrNVbaprHk/s1600/Namka1.jpg" imageanchor="1" style="font-family: 'Times New Roman'; font-size: medium; margin-left: 1em; margin-right: 1em; text-align: center; text-indent: 0px;"><img border="0" height="225" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjNVChfnxlbDm96BgvkSqaZao1wXELUtbPrMax0AaEYOyMI0gasFXEsF4MfqIw8em2gCuDgj944U-0Cm8tgeF95I79yaEIw4rquy_bsNd6PUFL8d3sGY8qtSFAaHOGTvTvvXrrNVbaprHk/s320/Namka1.jpg" width="320" /></a><br /><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">5న బయలుదేరిన దాల్వీ 6కు కర్పోలా1 దగ్గరికి చేరుకున్నాడు. భుజాన 80పౌండ్ల బరువును ఉంచుకుని 16000అడుగుల ఎత్తులో బృందాలు ప్రయాణించాల్సి వచ్చింది. అక్కడ రేడియోలో వార్తలు వింటుంటే అంతకాలం కుదరదన్న ఆల్టిట్యూడ్ అలవెన్సును ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదించింది. కాకపోతే అదివిన్నావాళ్ళలో సింహభాగం అదిఅందేదాకా జీవించిలేరు. అక్కడి నుంచి 14500అడుగుల ఎత్తులోనున్న త్సాంగధరుకు చేరుకునే సరికే సాయంత్రం అయ్యింది. అప్పటికే డస్సిపోయి ఉన్నవాళ్ళు మిగతాదళాలను అక్కడినుంచి నమ్కాచుకు పంపారని తెలిసి దాల్వీతో సహా అందరూ తెల్లమొహం వేశారు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">అక్కడినుంచి కౌల్ను కలవడానికి ధోలాపోస్టుకు బయలుదేరారు.అక్కడున్న పంజాబీలను చూసి కౌల్ వారిని మెచ్చుకున్నాడు. మిగతావారిని పరిచయం చేసుకుంటూ చైనీయులను తరిమికొట్టడానికి ప్రభుత్వం తనను పంపిందని చెప్పుకున్నాడు. ఆప్రాంతపు భౌగోళిక అంశాలను చూసుకున్నాక తూర్పుకమాండరుకు కొన్నిసందేశాలను పంపాడు. అందులో మిగతావారిలాగానే పరిమితులను తెలియపర్చాడు. </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">అక్టోబర్ 8న థాగ్లావద్ద మోహరించి ఉన్న చైనా బలగాలను చూశారు. మద్యలో ఉన్న ఖాళీప్రాంతాలు, వాటికి వెళ్ళేందుకు దారులూ వాకబు చేశాడు. అలానే కొన్ని యుద్ధగాధలు చెప్పి ఉత్సాహపరచడానికి ప్రయత్నించాడు. రోజూ రాత్రిళ్లు ఆయన ప్రధానికి కొన్నిసందేశాలు పంపేవాడు. అవి డిల్లీకి చేరేందుకు మూడురోజులు పట్టేది. అదీ మన సమాచారవ్యవస్థ. ఆయన నివేదికలో చైనీయులను పూర్తిగా తరిమికొట్టడం అసాధ్యమని తేల్చేశాడు. అయితే అప్పటికే అనేకసార్లు గడువు పొడిగించారు కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ అక్టోబరు 10కల్లా దాడి జరగాల్సిందే అని నిశ్చయించుకున్నాడు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">అయితే అప్పటికే చైనాబలాలు భారీగా మోహరించుకుని ఉండటంతో నేరుగా దాడిచెయ్యకుండా థాగ్లాకు పశ్చిమాన ఉన్న </span><span style="font-weight: bold; vertical-align: baseline; white-space: pre-wrap;">యుంత్సోలా</span><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"> ప్రాంతానికి వెళ్ళి, చైనీయులను వెనకనుంచి కొడదామని పథకం వేశాడు. వెంటనే 2రాజపుత్రులను అక్కడికి వెళ్ళాల్సిందిగా ఆదేశించాడు. </span><span style="font-weight: bold; vertical-align: baseline; white-space: pre-wrap;">ఇది తప్పిదాల్లోకెల్లా ఘోరమైన, ఎవరెస్ట్ అంత పెద్దతప్పిదం.</span><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"> రాజపుత్రులు అప్పటికి ఇంకా అలసిపోయి ఉన్నారు. వాళ్ళు నడిచిన దారంతా చైనీయుల నిఘా ఉన్నది. ఇప్పుడు కౌల్ వెళ్లమంటున్నది ఎంతో సున్నితమైనదేకాక, చైనీయుల వశంలో ఉంది. అంతేగాక దళంవెళ్ళే దారిమొత్తం చైనీయుల నిఘాలో ఉంది. ఈఆదేశాలు వినడంతోనే ఒక్కొక్కరు బిత్తరపోయారు. తిరిగి కలుస్తామన్న ఆశ ఒక్కరికీ లేదు. అక్కడకు పంపేముందు కల్పించాల్సిన కనీస అవసరాల గురించి అడిగితే- ఛలికి ప్రత్యేకదుస్తులు 6000 కెనడానుంచి వస్తున్నాయి! ఆశయసిద్ధి కోసం పనిచేసే సైన్యం యుద్ధసామగ్రికోసం ఎదురు చూడదు! అయినా కొన్ని తుపాకులు తెప్పిస్తాను. పోర్టర్లు దారిలో ఉన్నారు. వీలైనంత త్వరగా వచ్చేస్తారు! అన్నాడు. అన్నీ మరెప్పుడొ వస్తాయి. కానీ దళంమాత్రం ఇప్పుడే బలైపోవాలి! ఇక చేసేదిలేక కనీసం ఒకసారి గస్తీ తిరిగి అక్కడీ పరిస్థితి చూసొస్తాం. అప్పటిదాకా ఆగండి. అని ఒప్పించి ఒకబృందాన్ని అందుకు పంపారు. అందరికీ బుర్ర తిరిగిపోతోంది. ఏమి జరుగుతుందో అర్థంకాని పరిస్థితి.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">అక్టోబరు 9 సాయంత్రం 9పంజాబ్ గస్తీకి వెళ్ళారు. తెల్లవారుఝామున హఠాత్తుగా ఒకచైనాదళం ఎదురవడంతో కాల్పులు మొదలయ్యాయి. పంజాబీలు సుమారు 50మంది ఉన్నారు. చైనీయులు 800 మంది. చైనీయులు తేరుకునేలోపే మనవాళ్ళు దెబ్బతీయడంతో మొదట మనవారిదే పైచేయి అయింది. కానీ బలగం ఎక్కువవటంతో వెంటనే తేరుకుని మోర్టార్లతో దాడిచెయ్యగలిగారు. మనవాళ్ళు 6మంది చనిపోగా, 11మంది గాయపడ్డారు. అందులో మేజర్ చౌధరీకూడా ఉన్నాడు. చైనీయులు 100మంది చనిపోయారు. చైనీయుల ఎదురుదాడిని చూసి నోరెళ్ళబెట్టిన జనరల్ కౌల్ "Oh My GOD” అంటూ పొలికేక పెట్టి, "వాళ్ళు మోసం చేస్తున్నారు. ఇది తొండి." అంటూ చిందులెయ్యసాగాడు. వెంటనే దాల్వీ వైపు తిరిగి "ఇది నీదళం. నీయుద్దం. కాబట్టి నువ్వే పోరాడాలి." అన్నాడు! ఒకసారి ఎదురుదెబ్బ తగిలితేకానీ ఎవరేమిటో అర్థం కాలేదు ఆయనకి. </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">అదృష్టంకొద్దీ నేరుగా రాజపుత్రులను పంపకుండా ఒకబృందాన్ని గస్తీకి పంపాం. అలాకాకుండా మెత్తం దళాన్నే పంపుంటే ఎంత నష్టం జరిగుండేదో? అక్కడికి వెళ్ళడానికి మరొక 5000అడుగులు ఎక్కాలి. వారి దగ్గర 100రౌండ్లకు సరిపడా సామాగ్రి మాత్రమే ఉంది. మొత్తందారి చైనీయుల కళ్ళముందే ఉంటుంది. వాళ్ళు వీరికన్నా ఎత్తులో ఉంటారు. కాబట్టి చాలాసులువుగా హతమార్చగలరు. ఒకవేళ దాడి చెయ్యకపోయినా, దళం అటువైపుకి చేరుకున్నాక వాళ్ళమర్గాన్ని మూసేస్తే ఆకలితో చచ్చిపోతారు. లేదంటే మరోవారంలో పడే మంచు ఆపని పూర్తిచేస్తుంది. ఆలోచించేందుకే భయమేస్తున్న ఈవ్యూహాన్ని జనరల్ కౌల్ గారు తనమేధాశక్తినంతా ఉపయోగించి రచించాడు. ఆరోజు చైనీయుల దాడిలో చనిపోయినవాళ్ళందరినీ జనరల్ కౌల్ హత్యచేసినట్టే పరిగణించాలి. </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">వెంటనే దాల్వీ ఉన్నపళంగా ఆప్రాంతాన్ని ఖాళీచేసి వెళ్ళిపోవాలని కౌల్, ప్రసాద్లకు చెప్పాడు. దానికి ఇద్దరూ అంగీకరించాడు. అన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోతేగానీ ఆయనకు నిజం తెలియలేదు. తదనంతరం తీసుకోవాల్సిన చర్యలకు ప్రధానిని కలిసిగానీ ఏవిషయం చెప్పలేనని తేల్చేశాడు. దళాన్ని అంతటి విపత్కర పరిస్థితుల్లో వదిలేసి డిల్లీకి బయల్దేరాడు. వెళ్తూ వెళ్తూ- తాను తిరిగివచ్చేవరకూ శత్రువును తరిమికొట్టే విషయాన్ని పక్కన పెట్టాలని, బ్రిడ్జిలను రక్షించుకోవాల్ని, లుంపు మార్గాన్ని,హథూంగ్లాలను కాపాడాలని ఆదేశించాడు. ఇప్పుడున్న స్థానాలని యథావిథిగా కొనసాగించాలని కూడా అదేశించాడు. </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">మరొకవైపు యుద్ధరంగంలో పంజాబీలు వీరోచితంగా పోరాడుతున్నారు. చైనీయుల ఆధిక్యతను సవాలు చేస్తున్నారు. వారికి సహాయాన్ని అందించడానికి చౌదరి, మిశ్రాలు దాల్వీని ఆదేశించమన్నారు. కానీ ఇక్కడ పరిస్థితి మరింత సున్నితంగా ఉంది. మనవద్ద ఉన్న ఆయుధాలు అంతదూరం బాంబులు విసరలేవు. అనవసరంగా వాటిని ఉపయోగించడం వల్ల మొత్తం చైనాబలగాలు వీరిమీదకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఒక్కరూ మిగలరు. ఈవిపత్కర పరిస్థితుల్లో దాల్వీ పంజాబీ వీరులు ఒక్కొక్కరూ నేలకొరుగుతుంటే చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. అప్పటికే చైనీయులు మరొక్క అవకాశం వస్తే మొత్తందళాన్ని చీల్చిచెండాడేలా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి అవకాశం ఇవ్వడం సబబు కాదు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">నిజానికి ఇక్కడ జరిగింది యుద్ధంకాదు. మన గస్తీమీదకి చైనీయులు దాడి చేశారు. అదీ మన భూభాగంలో. కానీ మన నాయకులు ప్రగల్భాలు పలుకుతూ ఇచ్చిన తప్పుడు ప్రకటనలలో డొల్లతనాన్ని ఉపయోగించుకుని చైనీయులు మనమే వాళ్ల భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళినట్టు, వారిపై దాడి చేసినట్టు, ఆత్మరక్షణలోనే చైనీయులు ప్రతిదాడి జరిపినట్టు ప్రపంచాన్ని నమ్మించారు. అది ఉద్దేశ్యపూర్వకంగా జరిగినదాడి కాదు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">రాజకీయ అవసరాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలను బలవంతంగా సైన్యంమీద రుద్ది, వారిచేత తమ అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపట్టించినందుకు ఫలితం- దేశంపరువు పోయింది. సైనికుడు అకారణంగా ప్రాణం కోల్పోయాడు. రాజకీయావసరాలే పరమావధిగా పనిచేసిన ఒక సైనికాధికారి స్వార్థం వీటన్నింటికీ కారణమయ్యీందా? లేక ఆయన్ని పంపకూడని చోటుకి పంపిన నాయకుల నిర్లక్ష్యం వీటన్నిటినీ నడిపిందా? కారణ మేదైతేనేం తేనెతుట్టె కదిలింది.</span></b></div>
సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com2tag:blogger.com,1999:blog-3377763021527742745.post-24844436886477882272012-10-14T00:04:00.000+05:302012-10-14T00:04:56.522+05:30మేరునగ తప్పిదం- 12.రాజుగారొచ్చారు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<b id="internal-source-marker_0.3811879944987595" style="font-family: Arial; font-size: 19px; font-weight: normal; text-indent: 134px;"><span style="font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">సెప్టెంబరు 30న రక్షణమంత్రి కృష్ణమీనన్, ఆతర్వాత అక్టోబరు 2న నెహ్రూ తమతమ విదేశీ పర్యటనలు పూర్తి చేసుకుని డిల్లీ చేరారు. ప్రభుత్వాధినేతగా నెహ్రూ పర్యటనలు చెయ్యాల్సి ఉంటుంది. దాన్నెవరూ కాదనలేం. ఆయన ఈసమస్యను అనేకదేశాల నేతలతో చర్చించి తన పలుకుబడిని ఉపయోగించి దీన్ని పరష్కరించాలని అనుకొని ఉండవచ్చు. కానీ వాటిమీదే ఆధారపడి మరే జాగ్రత్తలూ తీసుకోకపోవడం వ్యూహాత్మక తప్పిదమే. అనేక అంతర్జాతీయ వ్యవహారాలను సమర్థంగా చక్కబెట్టి దూరదృష్టిగల నేతగా మన్ననలందుకున్నాయన ఈవిషయంలో ఆవిధంగా వ్యవహరించకపోవడం పొరపాటే. తిరిగొచ్చే సమయానికి సరిహద్దు భద్రత రక్షణపరంగాకన్నా రాజకీయపరంగా ఎక్కువ సున్నితమై కూర్చుంది. చాలా వరకు సమస్య చెయ్యిదాటిపోతున్న సూచనలున్నా రష్యానాయకుడి వద్ద చైనా జనరల్ ఇచ్చిన మాటను పట్టుకుని నిమ్మళంగా ఉండిపోయారు. అయితే రాజకీయ ప్రత్యర్థులకు జవాబు చెప్పాలంటే దాడిచెయ్యడమే ఏకైక మార్గమని భావించాడు. తప్పిదానికి తొలిమెట్టు ఇక్కడే పడింది. అప్పటి వరకు లాంచనప్రాయంగా సమర్పిస్తున్న నివేదికలు తప్ప సరిహద్దు వద్ద వాస్తవ పరిస్థితి ఆయనకు పూర్తిగా తెలిసిరాలేదు. దాడిచెయ్యడాన్ని జనరల్ థాపర్ సమర్థించక పోయినా నెహ్రూను ఎదిరించేంత శక్తులేక మిన్నకుండి పోయాడు.</span><br /><span style="font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">సెలవుమీద ఉన్న జనరల్ కౌల్ను వెంటనే పిలిపించారు. ఇప్పుడు దేశరక్షణ, దాని పరువు అతని చేతిలో పెట్టే కార్యక్రమం మొదలయ్యింది. జనరల్ ఉమ్రావుతో విబేధించినప్పటికీ సేన్ కూడా సదిగ్ధంలోనే ఉన్నాడు. లక్ష్యం అసాధ్యమన్న వాస్తవం ఆయనకు నెమ్మదిగా బోధపడసాగింది. ఇదే విషయాన్ని మీనన్కు స్పష్టం చేశాడు. ఒకవేళ దాడి చెయ్యడమే మనకున్న మార్గం అనుకుంటే తరువాత పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్దపడాలని సూచించాడు. కానీ చలికాలం మొదలయ్యే లోపలే దాడిచెయ్యాలి. లేకుంటే కొన్ని నెలలపాటు మొత్తం కార్యక్రమం వాయిదా పడుతుందన్న కారణంతో మీనన్ తొందరపడ్డాడు. సైనికాధికారుల్లోని సందేహాలను ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం అనైతికం.</span><br /><span style="font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">ఇక వీరిని సముదాయించడాని కన్నట్టుగా నెహ్రూ జెనీవాలో రష్యానాయకుని సమక్షంలో చైనా జనరల్ ఇచ్చిన మాటను వారికి చెప్పాడు. "చైనా మనమీద యుద్ధం ప్రకటంచదు. దానికి నాది హామీ." అన్నవిధంగా వాళ్ళకి ధైర్యం నూరిపోశాడు. అలా ఒక సైనికచర్య కాస్తా రాజకీయ ప్రక్రియగా భావిస్తూ నెహ్రూ ఇంకా కలల్లోనే విహరిస్తున్నాడు. పోనీ దాడికి పూనుకున్నప్పుడు అదైనా పూర్తిస్థాయిలో చేస్తున్నారా? అంటే అదీలేదు. కేవలం తూతూమంత్రంగా కొన్నిదళాల్ని సరిహద్దులో పెట్టి, ఒకట్రెండు చోట్ల దాడిచెయ్యించి, చలి పెరిగేలోగా వెనక్కి వచ్చేద్దామన్నది వాళ్లవ్యూహం. చలిపెరిగేదాకా చూస్తూ కూర్చోవడానికి చైనా ఏమైనా పిచ్చిదా? బలహీనమైనదా? ఒకసారి మనం కదిపాక వాళ్ళు అంతటితో ఊరుకునే రకం కాదు. అందరూ మనలాగా ఉండరు కదా! తమలపాకుతో నువ్వు ఒకటిస్తే తలుపుచెక్కతో నేను పదిస్తా అనే రకం. మరి వాళ్ళప్రతిదాడిని సమర్థంగా తిప్పికొట్టే వనరులు, ప్రణాళిక, అనుకూల పరిస్థితులూ ఏమైనా ఉన్నాయా? అంటే వ్యూహకర్తలకు డిల్లీ భవనాల కారిడార్లు తెలుసుగానీ సరిహద్దులో వాస్తవికస్థితిని గురించి ఇసుమంతైనా తెలియదు. చైనా ప్రతిదాడి చేస్తే? అన్న ప్రశ్న మనసులో తలెత్తగానే అధికారులకు వెన్నులోంచి వణుకు పుట్టింది. ప్రత్యర్థుల బలాన్ని చూసికాదు. సైనికుల ప్రాణాలకున్న ముప్పును గురించి. రక్షణపరంగా ఎలాంటి ఉపయోగమూలేని ఒకరాజకీయ చదరంగంలో సైనికుడెందుకు బలవ్వాలి? ఒక సమర్థుడైన యోధుణ్ణి అనవసరమని తెలిసీ చూస్తూచూస్తూ అతని ప్రాణాలతో చెలగాటమెందుకు ఆడాలి? అన్న ఆలోచనలు అధికారుల్ని కలచివేశాయి. కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయత. నెహ్రూ స్థాయి నాయకునికి సరిహద్దు రక్షణకన్నా పార్టీ అధికారంలో ఉండటమే ముఖ్యమైంది.</span><br /><span style="font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">వెంటనే జనరల్ కౌల్ తెరమీదుకొచ్చాడు. ఆయనకోసం అప్పటికప్పుడూ ఒక దళాన్ని సృష్టించి (4Corps), దానికి కమాండర్ను చేశారు. వెంటనే ప్రభుత్వ సమాచారసాధనాలన్నీ ఊదరగొట్టడం మొదలుపెట్టాయి. కౌల్ బాద్యతలు చేపట్టి, సరిహద్దు వ్యవహారాల సమాచారాన్ని తెలుసుకున్నాడు. చేతిలో అద్భుతదీపం ఉన్నవాడిలా వ్యవహరించసాగాడు. రాజకీయ కారణాలతో హఠాత్తుగా నెలకొల్పిన దళానికి కమాండర్గా ఉన్నపళంగా సైనికచర్యలు చేపట్టి, మిగతా వారికీ తనకూ మద్యన తేడా ఏమిటో చూపి శ్రీవారి మన్ననలు పొందుదామన్న తపన అడుగడుగునా కనిపించసాగింది. ఆక్రమంలో అనాదిగా సైన్యం పాటిస్తున్న విలువలు, నియమాలు, క్రమశిక్షణ వంటివి బుర్రలోంచి తుడిచేశాడు. అయితే అరకొరగా ఉన్న వనరులను మెరుగుపరచడమన్నది మాత్రం ఆదేశాలిచ్చిన ఎవరికీ గుర్తు రాలేదు. చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ గా ఇది జనరల్ కౌల్ ప్రథమబాద్యత.</span><br /><span style="font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">ఈ వ్యవహారాలన్నింటినీ మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్న జనరల్ ఉమ్రావ్ కంటికింద నలుసులా తయారయ్యాడు. ఆయన XXXIII Corpsకు నాయకత్వం వహిస్తున్నాడు. అది తూర్పుదళం కింద అంటే జనరల్ సేన్ కింద ఉంటుంది. ఉమ్రావ్ కింద సరిహద్దులో ఉన్న దళాలన్నీ ఉన్నాయి. వాటి ప్రధాన కేంద్రం తేజ్పూర్లో. అక్కడి బాద్యతలు జనరల్ ప్రసాద్ నిర్వహిస్తున్నాడు. ఈదళాలన్నీ ఒకపద్దతి ప్రకారం నెలకొల్పి, శిక్షణ తీసుకుని అక్కడ కార్యక్రమాలు సాగిస్తున్నాయి. అరకొరవనరులైనా, తగినంతమంది సైనికులు లేకపోయినా ఎలాగో నెట్టుకొస్తున్నారు. జనరల్ కౌల్ను సరిహద్దుకు పంపాలనుకుంటే ఆయన్ని వీటిలో దేనికైనా సారధ్యం వహించమని చెప్పవచ్చు. కానీ అవన్నీ ఆయాన స్థాయికి తగినవి కాదు. ఆయన సాక్షాత్తూ జవహర్ లాల్ నెహ్రూద్వారా నియమించబడ్డాడు. ఆయన స్థాయికి తగినది ఏమైనా ఉందంటే అది Corpsకు నాయకత్వం వహించడం. మరి ఆస్థానంలో అప్పటికే జనరల్ ఉమ్రావ్ సింగ్ ఉన్నాడు. ఆయన్ని కదిలిస్తే ప్రజల నుంచి మరింత వ్యతిరేకత వస్తుంది. మరి జనరల్ కౌల్ ఏమి చెయ్యాలి? దానికోసమే రాత్రికి రాత్రి 4Corps అన్నదాన్ని ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహించమన్నారు. మరి అందులో ఎవరైనా సైనికులున్నారా? అంటే అదీలేదు. ఈసంగతి తెలిసి "మీరు మారరురా!" అని ప్రపంచం మనల్ని చూసి నవ్వింది. ఇక మొండిఘటమైన ఉమ్రావును సరిహద్దు వ్యవహారాలనుంచి పక్కకు తప్పించింది. అది ఆయన Corps కిందకు వచ్చే ప్రాంతమే అయినా ఆయనకు సంబంధంలేదు పొమ్మన్నది. ఒకవేళ ఉమ్రావే అక్కడ ఉండి ఉంటే? అన్న ప్రశ్నకు జవాబుగా- ఆయన అద్భుతాలు చేసి చూపించకపోయినా మనసైనికుల ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా కాపుడుండేవాడన్న సమాధానం మనందరికీ అనిపిస్తుంది. </span><br /><span style="font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">జనరల్ ఉమ్రావ్ సింగ్ గురించి కొన్ని విషయాలు-</span><br /><span style="font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">యోధులకు పుట్టినిల్లైన రాజస్థాన్లోని జైపూరుకు చెందిన రాజపుత్రుడీయన. ఎప్పుడూ నిబ్బరంగా కనిపించే ఈయన యుద్ధభూమిలో తిరుగుతూ ఉంటే సైనికులకు తెలియని ధైర్యం. సరిహద్దు వ్యవహారాల్లో అందరూ గాభరాపడిన సందర్భాల్లోనూ తొణక్కుండా పనిచేశాడు. వాస్తవ పరిస్థితిని అంచనా వెయ్యడానికి ఈయన పర్యటించినన్నిసార్లు మరే ఉన్నతాధికారీ పర్యటించలేదు. పైవాళ్ళ ఆగ్రహానికి గురవతామని తెలిసినా తన అభ్యంతరాలను లిఖితపూర్వకంగా సమర్పించడానికి ఎన్నడూ వెనకాడలేదు. దాడి చెయ్యలనుకున్నప్పుడు ఆయన అన్న మాటలు: " దాడి చేస్తాం. భారతీయులంతా మనగురించి గొప్పగా మాట్లాడుతారు. దండలు వేస్తారు. కానీ అకారణంగా ప్రాణాలు కోల్పోయిన సైనికుల మాటేంటి?" ఇది చాలు ఆయనలోని మనిషిని గురించి చెప్పడానికి. చైనీయులను తరిమివెయ్యాలన్న లక్ష్యాన్ని చూసినప్పుడు కిందవాళ్ళవంక జాలిగా చూశాడు. వాళ్ళను కాపడటానికి చెయ్యగలిగినంతా చేశాడు. ఒకవేళ ఆయన మాట వినుంటే సైనికుల ప్రాణాలతోబాటుగా దేశప్రతిష్ట నిలిచి ఉండేది. ఆస్థాయి వ్యక్తిని యుద్ధంమద్యలో తొలగించడం ఆయన్ని ఉరితీయడంకన్నా ఏరకంగానూ తక్కువకాదు. </span></b></div>
సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com3tag:blogger.com,1999:blog-3377763021527742745.post-58226854467968504942012-10-12T17:55:00.001+05:302012-10-14T00:05:42.896+05:30మేరునగ తప్పిదం- 11.తరిమికొట్టండి<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
సెప్టంబరు 20 రాత్రి 10:30కి రెండవ బ్రిడ్జ్ దగ్గర ఉన్న చైనా కాపలాదారుడొకడు హఠాత్తుగా భారత పోస్టు మీదకి ఒక గ్రెనేడ్ను విసిరడంతో మరొక అంకానికి తెరలేచింది. ఈ హఠాన్పరిణామానికి దిగ్భ్రాంతి చెందిన భారతసైన్యం వెంటనే ఎదురుదాడి చేసింది. ఇరువర్గాలూ పరస్పరం కాల్పులు జరుపుకోన్నాయి. ఇద్దరు చైనీయులు మరణించగా మరొక ఇద్దరు గాయపడ్డారు. ఐదుగురు భారతీయులకి స్వల్పగాయలయ్యాయి. అరకొర సామాగ్రితోనే భారత సైన్యం దాడిని సమర్థవంతంగా తిప్పి కొట్టింది. ఈదాడి అంతకుముందు జరిగిన చెదురుమదురు ఘటనల లాంటిది కాదు. దీనితో ఇక చైనీయులు ఆప్రాంతాన్ని వదిలి వెళ్ళరని స్పష్టంగా తెలిసొచ్చింది. చైనీయులతో మాట్లాడేందుకు భారత పౌరవ్యవహారాల అధికారి మోంగియా ప్రయత్నించగా వాళ్ల ప్రవర్తన కారణంగా అది కుదరలేదు. అలాగే మరొక 500మంది పోర్టర్లను సరఫరా చేసేందుకు ఆయన ముందుకొచ్చాడు. కానీ అప్పటికే సరిహద్దులో యుధ్దవాతావరణం నెలకొని ఉండటంతో గిరిజనులను సరిహద్దు వరకు పంపనని, వారు సెర్ఖిం వరకే తీసుకొస్తారని, అక్కడి నుంచి సైనికులే మోసుకెళ్ళాలని చెప్పాడు.<br />
<br />
మైదానాల నుంచి బయలుదేరిన పంజాబ్ దళాలు చిన్నచిన్న బృందాలుగా చేరుకోసాగారు. వాళ్ళు తొడుక్కుని ఉన్న కేన్వాస్ బూట్లు చిరిగిపోయి, రబ్బరు అడుగు బయటకు వచ్చేసి ఉన్నాయి. వాళ్ళు ధరించిన ఆలివ్ గ్రీన్ సమ్మర్ యూనిఫాం చలిని ఏమాత్రం ఆపలేదు. కానీ వాళ్ళదృష్టిలో అవన్నీ చాలా చిన్నవిషయాలు. సైనికుడూ యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాటి గురించి ఆలోచించకూడదన్న వాళ్ళ అభిప్రాయం. నిజమే! సైనికుడు ఆలోచించక పోయినా, అధికారులకి, ప్రభుత్వానికి ఆలోచించాల్సిన బాద్యత ఉందికదా. వాళ్ళడిగేవేవీ విలాసాలుకావు. కనీస అవసరాలు. దేశ ఆర్థికవ్యవస్థ ఎంత బలహీనంగా ఉన్నా మరీ ఇంతహీనంగా అయితే లేదు. ఇలాంటి సదుపాయాలతో చైనా ప్రభుత్వం తనసైనికుల్ని వెళ్ళమంటే సరిహద్దుదాకా వచ్చి ఉంటారా? అన్నది సందేహమే. కానీ ప్రాణాల్ని పణంగా పెట్టి పోరాటానికి సిద్ధమైన దళాల్ని గమ్యానికి చేరుకోవడంలో ఇంత ఆలశ్యం ఎందుకైందని ప్రశ్నించింది మన రాజధాని!<br />
సైన్యం చైనీయుల దాడీని సమర్థంగా తిప్పికొట్టి ఆపోస్టుతో పాటుగా రహదారులన్నీ తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. నమ్కాచు నది మీద ఉన్న నాలుగు బ్రిడ్జిల వద్దా పంజాబ్ దళాలను మోహరించారు. 40 అడుగుల వెడల్పున్న నదికి ఇరువైపులా రెండుదేశాల సైనికులు నిల్చుని ఉన్నారు. ఇది చరిత్రలోనే అరుదైన ఘట్టం. చైనీయులు తమ జిత్తులమారి ఎత్తులను సైన్యం మీద ప్రయోగించసాగారు. ఒకవైపు గ్రెనేడ్లు విసురుతూనే, చర్చలకు రమ్మంటూ శాంతిమంత్రాలని వల్లించసాగారు. పైనుంచి వచ్చిన ఆదేశాల్లో స్పష్టత లోపించడంతో సైన్యం గందరగోళానికి గురైంది. బట్లరు హిందీలో భారత్-చైనాల మద్య స్నేహాన్ని లౌడ్ స్పీకర్ల ద్వారా చెప్పసాగారు. ద్వంద్వ విధానాలద్వారా సైన్యం నైతికస్థైర్యాన్ని దెబ్బతీయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అయితే దీన్ని ప్రతిఘటించే విధంగా భారత అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో చైనీయులు ఇంకొక అడుగు ముందుకేసి "మా భూభాగంలో మీకేం పని?" అని ప్రశ్నించసాగారు. దీనికి మనవైపునుంచి సరైన జవాబు రాకపోవడం సైన్యాన్ని కొంతగందరగోళానికి గురిచేసింది. 40 అడుగుల దూరంలో బలమైన శత్రువును ఎదురుగా ఉంచుకుని, మానసిక స్థార్యాన్ని కోల్పోకుండా, రోజుల తరబడి పోరాడటం అంత సులువైన విషయంకాదు. ఇది వీధుల్లో ఝెండా పట్టుకుని "భారతమాతా కీ జై", "జైహింద్", "వందేమాతరం" అంటూ ర్యాలీలు చేసినంత, ఫేస్బుక్లో షేర్లు, లైకులు కొట్టినంత సులుభం కాదు. అణువణువునా దేశభక్తి నింపుకుని, ఈమట్టికోసం ఆత్మార్పణకు సిద్ధమైన వాడు మాత్రమే చెయ్యగల మహత్కార్యం.<br />
అరువుమీద దళాల్ని తెచ్చి, ఒక అతుకుల బొంత బ్రిగేడును తయారు చెయ్యడంలో అధికారులు ఎట్టకేలకు కిజయం సాధించారు. 1/9 గూర్ఖాల దళాన్ని, 2రాజపుత్రుల దళాన్ని వాడుకోవడానికి అనుమతి లభించింది. వీళ్లందరినీ 7 పదాతిదళ బ్రిగేడుకు అనుసంధానించారు. అలా ఒకజట్టుగా ఉండాల్సిన బ్రిగేడ్ కాస్తా నానాదళాల గుంపుగా అయ్యికూర్చుంది. ఒక్కొక్క దళం బలాబలాలు ఏమిటో? వాటి నైపుణ్యాలేమిటో? పరిమితులేమిటో? తెలియకుండానే వాటికి నాయకత్వం వహించాల్సిన బాద్యత దాల్వీ మీద పెట్టారు. సెప్టెంబరు 26కు ఈదళాలు లుంపుకి చేరుకున్నాయి. మిగతా దళాల మాదిరిగానే వీరి ప్రయాణాలూ జరిగాయి. "మీరు ముందు బయల్దేరండి. మీసామాగ్రి అంతా మీరక్కడికి చేరుకునే సరికే పంపిస్తాం." అని మాటిచ్చిన అధికారులు తరువాత మరిచిపోయినట్టున్నారు. అలా సెప్టెంబరు 10న బయల్దేరిన వాళ్ళు 15రోజుల తరువాత చేరుకున్నారు. దారిలో పర్వతాలు అలవాటులేక అనేకమంది రక్తపువాంతులు చేసుకున్నారు! అయినా లుంపు చేరాక తర్వాతిరోజే బాద్యతలు తీసుకోవాడిని సిద్ధపడ్డారు! చైనీయులను తరిమికొట్టడం మినహా వీరికంటూ సవివరంగా నిర్దేశించిన లక్ష్యాలంటూ ఏమీ లేవు.<br />
<br />
రాజపుత్రుల బృందమొకటి తెల్లవారుఝామున శిక్షణ తీసుకుంటున్నారు. కొత్తగా చేరిన కొందరికి గ్రెనేడ్ ఎలా ఉపయోగించాలో తెలియదు! అక్కడ సాధన చేస్తున్నారు. శిక్షణకు సరిపడినన్ని గ్రెనేడ్లు మనదగ్గర లేవు. కాబట్టి సైనికులు యుద్ధభూమిలోనే అన్నీ నేర్చుకొని, శత్రువుతో పోరాడాలి. తొవాంగును రక్షించే బాద్యత కళ్యాణ్ సింగ్ తీసుకున్నాడు. మనకు నిర్దేశించిన లక్ష్యాల్లో తొవాంగును కాపడటం, చైనీయులను థాగ్ల నుంచి తరిమికొట్టడం అన్న పరస్పర విరుద్ధమైనవి ఉండటాన సైనికబలం రెండింటిలో దేనినీ సాధించలేని స్థితిలో ఉంది. అలాగే మిసిమారి నుంచి తొవాంగుకు గల మార్గాన్ని రక్షించే బాద్యత పర్వతపాదాల వద్ద ఉన్న మెచీన్ గన్ దళానిది. 300మైళ్ళ దూరాన్ని ఎన్ని మెచీన్ గన్లతో కాపు కాయాలి?<br />
వాయురవాణా కొద్దిగా ఊపందుకోవడంతో నెమ్మదిగా పంజాబీలకు సరిపడినంత ఆయుధాలు లభించ సాగాయి. వాటిలో మైన్లు, ఫ్యూజుల వంటి సాధారణ సామాగ్రికూడా లేదు. గిడ్డంగుల జాబితాలో ఇవి విలాసాలుగా పరిగణించబడ్డాయి. పంజాబీలు రోజూ చైనీయులతో కాల్పులు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఆసమయంలో పంజాబీల గుండెనిబ్బరాన్ని చైనీయులు సైతం మెచ్చుకున్నారు. ఒకవీరుడికే మరొకవీరుని గొప్పతనం తెలిస్తుంది కదా! పంజాబీలకు సరిపడినంత సామాగ్రి అందజేశాక, మిగిలిన గూర్ఖా, రాజపుత్రదళాలకు సరఫరా మొదలుపెట్టారు.<br />
<br />
హెలికాప్టర్లు జారవిడిచిన వస్తువులను ఏరుకుని తెచ్చేదానికి రోజుకు 400మంది వినియోగించ బడుతున్నారు. ఇలాంతి దృశ్యాలు జనరల్ ఉమ్రావ్ సింగును తీవ్రంగా కలచివేశాయి. వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మాట్లాడమని, ప్రగల్భాలకు పోవద్దని హెచ్చరించాడు. రాజకీయ కారణాలను సాకుగా చూపించి హిమాలయాలంత పెద్ద అవరోధాన్ని పక్కన పెట్టలేం.<br />
<br />
రక్షణమంత్రితో జరిగిన సమావేశంలో "చైనీయులు మూడు కంపెనీలుగా ఉన్నాయి. వారికి వెనకనుంచి మద్దతివ్వడానికి ఇంకొన్ని దళాలు ఉన్నాయి. వారి రహదారులు, ఇతర సదుపాయాల దృష్ట్యా రవాణా కూడా మెరుగ్గా ఉంది." అని ఆర్మీ చీఫ్ వెల్లడించాడు. కానీ ప్రభుత్వం మాత్రం ఇవేవీ పట్టనట్టు "చైనీయులను తరిమికొట్టాల్సిందే" అని ఆదేశించింది. చేసేదిలేక జనరల్ థాపర్ రాతపూర్వక ఉత్తర్వులివ్వమని అడిగాడు. తక్షణం ఒక జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి ఉత్తర్వులను జారీ చేసేశాడు. ఒక ఆర్మీచీఫ్ స్థాయి అధికారికి జాయింట్ సెక్రటరీ ఉత్తర్వులు జారీచెయ్యగలిగినంత అతీతమైన శక్తులు డిల్లీదర్బారులో తిష్టవేసుకుని కూర్చున్నాయి. పైనుంచి వెలువడిన ఉత్తర్వులు పోస్టుమాస్టరులాగా జనరల్ థాపర్ జనరల్ సేన్కు బట్వాడా చేసేశాడు. అక్కడినుంచి కిందకి, ఇంకొకమెట్టుకిందకి జారుకుంటూ అనేక పోస్టుమాస్టర్ల ముద్రలు వేసుకుంటూ సరిహద్దులోని దళకమాందర్ దగ్గరికొచ్చి పడింది. ఆయన కింద కాగితాలు తీసుకునేవాళ్ళెవరూ లేర్. ప్రాణాలిచ్చే వాళ్ళు తప్ప. అలా ఒకదేశపు సైనికవ్యవహారం ఆదేశపు రాజకీయ అంశాలమీద ఆధారపడి నడిచింది.<br />
<br />
ఇక ఆ ఆదేశాన్ని ఆధారంగా చేసుకుని సైన్యం ప్రణాళికను రూపొందించాల్సి వచ్చింది. ప్రతి దళనాయకుడూ లాంచనంగా నిర్వహించే క్షేత్రస్థాయి అంచనాలను దాల్వీ తయారు చెయ్యనారంభించాడు. అన్ని ప్రతికూల అనుకూల అంశాలు ఇందులో పొందుపరచాలి. యుద్ధభూమిలో వాతావరణం స్థిరంగా ఉన్నంతకాలమే దీనికి ఆయుష్షు ఉంటుంది. ఒకసారి వేగం పుంజుకుంటే మారుతున్న పరిస్థితులకనుగుణంగా దీన్నీ మారుస్తూ వెళ్ళాలి. మామూలుగా అయితే ఇది తయారుచేసి పైవాళ్లకి పంపితే వాళ్ళు దాన్ని పరిశీలించి, మార్పులు చేసి ఆమోదముద్ర వేస్తారు. దానికనుగుణంగా ఆదేశాలు జారీచేస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి తిరగబడింది. ప్రభుత్వమే ఉందుగా ఆదేశాలిచ్చింది. దానిప్రకారం క్షేత్రస్థాయి అంచనాను దళకమాందర్ తయారు చెయ్యాలి. కానీ ఆలక్ష్యానికి అనుగుణంగా ఇక్కడ వనరులు లేవు.<br />
<br />
అలా దానిని ఎలా తయారుచెయ్యాలా అని తలబద్దలు కొట్టుకుంటూంటే జనరల్ ప్రసాద్ హఠాత్తుగా ఊడిపడ్డాడు. ప్రధాన కార్యాలయంలో ఉండాల్సినాయన్ని ఉన్నపళంగా యుద్ధభూమికి వెళ్ళి అక్కడ పరిస్థితులు సమీక్షించమని ఆదేశాలొచ్చాయి. దాంతో ఆవయసులో, జనరల్ స్థాయి అధికారి అయ్యుండీ కాళ్ళీడ్చుకుంటూ కొండలనెక్కి లుంపుకు చేరుకున్నాడు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయనపై కనీస దయాదాక్షిణ్యంకూడా చూపకపోవడం ఇదేమి ప్రజాస్వామ్యం? జనరల్ స్థాయి అధికారి మొత్తంవ్యవహారాన్ని సమీక్షించాల్సిందిపోయి ఒకదళాన్ని నడుపుతూ ఇక్కడ ఉండుపోవడం ఎలాంటి యుద్ధవ్యూహం?<br />
<br />
జనరల్ సేన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేస్తూ జనరల్ ఉమ్రావును వీలైనంత త్వరగా పని ముగించాలని ఆదేశించాడు. దాన్ని ప్రతిఘటించలేని జనరల్ ఉమ్రావ్ కిందివాళ్ళని ఒక అంచనా తయారు చేసి ఇవ్వమన్నాడు. ప్రబుత్వ నిర్ణయం దుస్సాధ్యమని అందరికీ తెలిసినా చెప్పి ఒప్పించేవాడే కరువయ్యాడు. ప్రభుత్వం ఈవిషయాన్ని అల్లరిమూకలను చెదరగొట్టి ఓట్లుదండుకునే వ్యవహారంగా చూసిందే తప్ప ఒకదేశసైన్యం మరొకదేశసైన్యంతో జరిపే పోరాటంగా చూడలేదు. ఆస్థాయికి వాళ్ళింకా ఎదగలేదు. అలా ప్రభుత్వం తనరాజకీయ కారణాల దృష్ట్యా తీసుకున్న దుస్సాధ్యమైన నిర్ణయం సైన్యానికి లక్ష్యంగా నిర్దేశించబడింది.<br />
దాల్వీ, జనరల్ ప్రసాద్ ఇద్దరూ అంచనాపత్రంతో కుస్తీ పట్టసాగారు. ప్రసాద్ ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి- అంచనా తయారు చెయ్యనని చెప్పి ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావడం. లేదా రెండు- లక్ష్యాలు చేదించడానికి అవసరమైన వనరులను, ఇతర అంశాలను అందులో పొందుపరచడం. ఆయన రెండవ దానికే మొగ్గుచూపాడు. పరిస్థితులను అదుపులో ఉంచడానికి, శత్రువుపై పైచేయి సాధించడానికి అవసరమైన పాలనాపరమైన సౌకర్యాలను కోరుతూ, వాస్తవ పరిస్థితిని, అలాగే లక్ష్యాలను చేదించడంలో మనకున్న పరిమితులను రాజధానికి తెలియపరచటం ద్వారా తనబాద్యతను పూర్తిచేశాడు. దాన్ని చూసిన ఉమ్రావ్ కొన్ని మార్పులుచేసి మరింత అయుధసామాగ్రిని, పాలనా సౌకర్యాలను కల్పించాలని సూచించాడు. లఖ్నో బయలుదేరుతూ అక్కడ జనరల్ సేన్కు అరకొర వనరులను వివరిస్తానని, కానీ ఎక్కువగా ఆశించవద్దనీ చెప్పాడు. అలాగే సరిపడా సమాగ్రి లభించేవరకు లుంపును దాటి ముందుకు వెళ్ళొద్దని హెచ్చరించాడు.<br />
ఆనివేదిక అందడంతోనే బలగాలను సాంగ్లే ప్రాంతంలో ఉంచమని ఆదేశించారు. జరల్ ఉమ్రావ్ అభ్యంతరాలను వినేస్థితిలో అక్కడ ఎవరూ లేకపోవడం సైనికుల పాలిట శాపమైంది. ఆయన తన అభ్యంతరాలను రాతపూర్వకంగా తెలియపరచాడు. వెంటనే చైనా పెద్దసంఖ్యలో సైన్యాన్ని అక్కడకు పంపింది. ఇక అక్కడనుంచి భారత బలగాలు వెనక్కిరాలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాయి. ఈఒక్కచర్యతో బలగాల మద్య సమాచారం, సమన్వయం పూర్తిగా లోపించాయి. ఇంకా చైనీయులను తరిమికొట్టమనే ప్రభుత్వం చెబుతోంది. ఇలా సెప్టెంబరు చివరినాటికి రాజధానిలోని వ్యూహకర్తలకు, సరిహద్దులోని సైన్యానికి మద్య అగాధం పూడ్చలేని విధంగా పెరిగిపోయింది.</div>
సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com4tag:blogger.com,1999:blog-3377763021527742745.post-47558125500636476242012-10-10T01:23:00.001+05:302012-10-14T00:05:56.927+05:30మేరునగ తప్పిదం- 10.శత్రువు వాకిలి<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<b id="internal-source-marker_0.36434115446172655" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 414px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">సెప్టెంబరు 11, అస్సాంరైఫిల్స్, పంజాబ్ దళాలు ధోలాకి వెళ్తూ ఉన్నారు. తేజ్పూర్లో దాల్వీ, ఇతర సైనికులూ రోజంతా తమ వైర్లెస్ సెట్లలోంచి మాట్లాడి సమాచారం సంపాదించను ప్రయత్నించినా వృధాప్రయాసే అయ్యింది. పురావస్తు శాఖకు అప్పగించాల్సిన సామాగ్రిని సైన్యానికిచ్చి యుధ్దంలో వాడమంటే ఇలాగే జరుగుతుంది. బృందాలు ఎక్కడూన్నాయో? వారి పరిస్థితి ఏమిటో? తెలియక అందరినీ ఉత్కంఠతకు గురిచేసింది. బృందాలు గమ్యానికి చేరుకునేలోగా అక్కడ వారికవసరమైన ఏర్పాట్లు చెయ్యడంలో అందరూ తలమునకలయ్యారు. ధోలానుంచి మరిన్ని ప్రమాదసంకేతాలు వస్తుండటం వారిని మరింత ఆందోళనకు గురిచేసింది.</span></b><br />
<b style="font-family: Arial; font-size: 15px; text-indent: 414px;"><span style="font-weight: normal; white-space: pre-wrap;"><br /></span><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">రక్షణమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశానికి జనరల్ సేన్ హాజరయ్యాడు. 600మంది చైనీయులు ధోలాప్రాంతంలో సంచరిస్తున్నారనీ, వాళ్లను ఎదుర్కోవాల్సిందిగా బ్రిగేడ్ను ఆదేశించామనీ, అందుకు వాళ్ళకి 10రోజులు పడుతుందనీ నివేదించాడు. అయితే సరిహద్దులో 600మంది మాత్రమే ఉన్నారనీ అక్కడివాళ్ళెవరూ సేన్కు చెప్పలేదు. వెనకాల మరెంతమంది చైనీయులు ఉన్నారో? వాళ్ల దగ్గరున్న ఆయుధాలెలాంటివో? ఎవరికీ తెలియదు. కిందివారినెవరినీ సంప్రదించకుండా సేన్ నివేదించిన సమాచారం ప్రాధమిక యుద్ధనియమాలకు విరుద్ధం. సైన్యంలో పైవాళ్ళు ఏది చెబితే అదే శాసనం అని అందరం అనుకుంటూ ఉంటాం. కానీ ఎవరైనా కిందవాళ్ళకి ఆదేశాలు జారీచేసేదానికి ముందు వారి నుంచి వాస్తవపరిస్థితి గురించి సమాచారం తీసుకుంటారు. కిందవాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకే వాళ్ళకి ఆదేశాలు జారీచేస్తారు. అప్పుడే వాటిని అమలుచెయ్యగలమని విశ్వసిస్తారు. ఒకవేళ అక్కడున్నది 600మందే అనుకున్నా అరకొర వనరులతో నెట్టుకొస్తున్న దళం వారిని ఎలా ఎదుర్కోగలదు. దళానికి సారధ్యం వహిస్తున్న అధికారి అక్కడకు చేరుకోక ముందే, వారినుంచి వాస్తవ పరిస్థితి గురించి సమాచారం రాకుండానే, సాధ్యాసాధ్యాలను వారితో చర్చింకుండానే జనరల్ సేన్ డిల్లీలో వాగ్దానం చేసేశాడు. ఇది విపరీతాలకు దారితీసింది.</span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">9పంజాబు దళం ఒకవైపు ఋతుపవనాలు కొనసాగుతున్నప్పటికీ అంత ఎత్తులో ప్రయాణిస్తూ చాలావేగంగా గమ్యానికి చేరుకున్నారు. మరోవైపు అస్సాం రైఫిల్స్ ధోలాపోస్టుతో అనుసంధానాన్ని ఏర్పరచుకున్నారు. వీరు నమ్కాచుకు దగ్గరగా ఉండటమేకాక అక్కడి స్థానిక అంశాలపై అవగాహన ఉన్నవాళ్ళు. అయితే ఈదళం రక్షణశాఖ కిందకు రాదు. దాంతో అది గమ్యానికి చేరుకునేంత వరకు సైన్యాన్ని విమర్శించినవాళ్ళకు చేరుకున్నాక మాత్రం అది విదేశాంగశాఖహు చెందిందని గుర్తొచ్చింది. మద్యలో పంజాబుదళంమీద అవాకులు చెవాకులు పేలడంతో సైన్యం సహనం కోల్పోయింది. కానీ అత్యుత్తమ దళాల్లో ఒకటైన దానిగురించి చేసిన విమర్శలను అందరూ వ్యతిరేకించడంతో మిన్నకుండిపోయారు. </span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">సెప్టెంబరు 13న దాల్వీ తేజ్పూరు నుంచి లుంపుకు బయల్దేరడానికి హెలీపాడ్కు వచ్చాడు. అనుకోని సాంకేతిక కారణాలవల్ల పైలట్ ప్రయాణానికి అభ్యంతరం చెప్పాడు. ఆదారి తనకు కొత్తదవడంవల్ల సాహసం చెయ్యలేనని, మరుసటిరోజు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఈసమాచారాన్ని తవాంగ్ కార్యాలయానికి అందజేశాడు. తొవాంగ్ సెక్టారుకు ఇన్ చార్జిగా బ్రిగేడియర్ కళ్యాణ్ సింగును పంపారు. అయితే అతని బద్యతలేమిటన్నది సరిగా నిర్వచించలేదు! డివిజినల్ మెచీన్ గన్ కమాండర్ను పర్వతపాదాలనుంచి తొవాంగ్ వరకు మార్గానికి ఇన్ చార్జీగీ నియమించారు. అంటే దాదాపుగా 300మైళ్ళ దూరంలోగల అనేక కీలకప్రాంతాలను కాపాడి, చైనీయులతో పోరాడే బాద్యత ఒక్క 4INDIAN DIVISION మీద పెట్టారు. దానికి సరిపడా దళాలుగానీ, వనరులుగానీ, సేవావిభాగాలుగానీ, వ్యవస్థలుగానీ లేవు. ఎక్కడెక్కడి నుంచో కొన్నిగుంపులను, మరికొంతమంది అధికారులను తీసుకొచ్చి దీన్నొక కలగూరగంపగా చేశారు. పేరు మాత్రం 4INDIAN DIVISION! దీనివల్ల అత్యుత్తమదళాల్లో ఒకటిగా ప్రపంచం గుర్తించిన ఒకభారతీయదళం అపకీర్తిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. సైన్యంలో దళం అంటే దానికొక సనిర్వచిత కార్యక్రమం ఉంటుంది. దానికనుగుణంగా అందొలో కొన్ని జట్లను ఏర్పాటుచేసుకొని, ప్రతిదానికి నిర్ధిష్టమైన పాత్రను ఇస్తారు. దానికనుగుణంగానే అవి ఏళ్ళతరబడి శిక్షణ తీసుకుంటూ రాటుదేలుతాయి. అందువల్లనే సైన్యం బలాలను సైనికులసంఖ్యతోకాక అందులోని దళాలు, వాటి శక్తిసామర్థ్యాలను బట్టి బేరీజు వేస్తారు. వాటికి సమర్థత, పరస్పర విశ్వాసం, సమిష్టిభావం వచ్చాకనే యుధ్దరంగంలో లక్ష్యాలను చేదించగలవు. కానీ ఇక్కడున్న నానాజాతిగుంపు పోరాటంలో గెలవాలంటే ఇదేమీ రాజకీయ వేదికకాదు. ఇక్కడ జరుగుతున్నది సిద్ధాంతాకోసమో లేక రెండువర్గాలు అధిపత్యంకోసమో జరుగుతున్న పోరాటంకాదు. గణతంత్రరాజ్యాలుగా తమనుతాము ప్రకటంచుకున్న రెండుదేశాలమద్య.</span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">అప్పటికే వాస్తవ పరిస్థితుల మీద అవగాహన ఉన్న జనరల్ ఉమ్రావ్ సైన్యానికి నిర్దేశించిన లక్ష్యం అసాధ్యమని తేల్చి చెప్పాడు. వీటిని విపూలికరిస్తూ జనరల్ సేన్కు ఉత్తరం రాశాడు. సాయంత్రం 5.30కు జనరల్ ప్రసాద్ ఫోన్ చేసి ఉన్నపళంగా తొవాంగుకు బయలుదేరమన్నాడు. ప్రయాణానికి కలిగిన అవాంతరాలను చెప్పబోగా వారించి వెంటనే బయలుదేరమని, ప్రస్తుతానికి ఇంతకన్నా ఏమీ అడగొద్దని చెప్పసాగాడు. అలాగే 9పంజాబు లుంపులో ఆగకుండా నమ్కాచు వరకూ పంపమని ఆదేశాలు వెలువడ్దాయి. బహుశా పంజాబీలను చూపించి చైనీయులను భయపెడదామనుకున్నారేమో! ప్రారంభంలో తీసుకున్న ఇలాంటి నిర్ణయాలకు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. సైన్యంలోని వివిధస్థాయిలమద్య, విభాగాలమద్య సమంవయం దెబ్బతిన్నది.</span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">పైవారి ఆదేశాలను అనుసరించి బయలుదేరాల్సి రావటంతో అక్కడకు చేరుకునే వరకు అవసరమైన కీలక ఆదేశాలను సరిహద్దుకు జారీచేసి, అవసరమైన పోర్టర్లను తీసుకుని మరుసటిరోజు తెల్లవారుఝామున ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఇంటెలిజెన్స్ అధికారి కెప్టన్ టీ.కే.గుప్తా తప్ప మిగతా అధికారులెవరూ లేకుండా, సంచార వైర్లెస్ సామాగ్రిని మోసేందుకు పోర్టర్లను వెంటపెట్టుకుని ప్రయాణం సాగించాడు. విపరీతమైన వర్షాల కారణంగా 15గజాలకన్నా ఎక్కువ దూరం కనబడటంలేదు. చీకటిపడే సమయానికి 22మైళ్ళు ప్రయాణించి లుమ్లా చేరుకున్నారు. దారంతా పంజాబ్ దళంతో మాట్లాడేందుకు ప్రయత్నించినా కుదర్లేదు. మరుసటిరోజు మరొక 18మైళ్ళు ప్రయాణించాక శక్తి వచ్చింది. తరువాత రోజు అంటే సెప్టేంబరు 16న లుంపుకు చేరుకున్నారు. విమానాలనుంచి జారవిడిచిన వస్తువుల సేకరించటం, వాటిని గమ్యానికి చేర్చటం, ఇక్కడి అవసరాలను పైవారికి తెలియపరచటం, తొవాంగుతో వైర్లెస్ సమాచారాలు జరపడం ఇక్కడి దళాల విధులు. కానీ సహజంగా ఇవేవీ పదాతిదళాల బాద్యతలు కావు. వాటికి పత్యేకమైన విభాగాలుంటాయి. కానీ ఇక్కడ పదాతిదళం యుద్ధం చెయ్యటమేగాక వాటికవసరమైన ఇతర పనులుకూడా వాళ్ళే చేసుకుంటూన్నారు. </span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">సెప్టెంబరు 13, 14 తేదీలలో డిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశాలు గందరగోళానికి వేదికల్య్యాయి. మొదట చైనీయుల సంఖ్య 60కి మించదని అంచనావేస్తూ కొన్నిదుందుడుకు నిర్ణయాలు తీసుకోగా, మెల్లమెల్లగా వాస్తవస్థితి తెలిసొచ్చాక వెనక్కి తగ్గనారంభించారు. అయితే ఈసమావేశాలలో ప్రధానిగానీ, విదేశాంగమంత్రిగానీ, సైన్యాధ్యక్షుడుగానీ, ఆర్థికమంత్రిగానీ హాజరవలేదు. ఇంతమంది లేకుండానే ఆదేశాలు ఎలా వెలువడ్దాయన్నది అర్థంగాని ప్రశ్న. కానీ ఏసందర్భంలోనూ శత్రువుల బలాన్ని, కదలికలను సరిగ్గా అంచనా వెయ్యలేక పోయ్యారన్నది చేదునిజం.</span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">లుంపుకు చేరుకునే సరికే విపరీతంగా అలసిపోవటంతో ఒకరోజు అక్కడ అలసట తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆసమయంలో తొవాంగులోని అధికారులతో మాట్లాడే అవకాశం కలిగింది. ఇంకొక రెండు బెటాలియన్లను మైదానాలనుంచి పంపుతున్నట్టు తెలిసింది. అలాగే GOC వీలైనంత త్వరలో ఆప్రాంతాన్ని సందర్శించి, తదనంత కార్యక్రమాలను గురించి చర్చిస్తానని చెప్పగా, దానికి దాల్వీ మరికొంతకాలం ఆగమన్నాడు. ఆకాశంలోంచి జారవిడుస్తున్న సామాగ్రిలో మూడోవంతు పారాచూట్లు తెరుచుకోక వృధా అయిపోతున్నాయి. అప్పటికే వాడివాడి చిరుగులుపడిన వాటినే వాడుతూ ఉండటతో ఈపరిస్థితి తలెత్తింది. అలానే పంపుతున్న వస్తువులన్నీ భారీవి కావడంతో లోయల్లోంచి తీసుకెళ్ళడం శక్తికి మించిన పనైంది. హిమాలయాలకు అనుగుణంగా ఎలాంటి ప్రణాళికలూ మనదగ్గరలేవని దీనిద్వారా స్పష్టంగా తెలుస్తుంది.</span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">సెప్టెంబరు 18 ఉదయాన్నే లుంపు నుంచి బయల్దేరారు. 15మైళ్ళ దూరంలో థాగ్ల వచ్చింది. పర్వతవాలుపై మోకాటిలోతు అడుసులో కాళ్ళీడ్చుకుంటూ ముందుకు పోసాగారు. ముందుకువెళ్ళే కొద్దీ వాలు ఇంకాపెరిగుతోంది. అడుసులో ప్రయాణం చాలాకష్టమైంది. హథూంగ్లా కనుమ 13400అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనికే ఇలా ఉంటే మరి 16500అడుగుల ఎత్తులో ఉన్న కర్పోలా కనుమ మాటేంటి. అది మనకు అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గం! దళాలు గమ్యం చేరుకోవడంలో ఎందుకాలశ్యమైందంటూ ప్రశ్నించిన వారిచేతిలో ఒకమ్యాపుతప్ప మరే సమాచారమూ లేదు. రాత్రికి సెర్ఖిమ్లో బసచేసి 19 ఉదయాన్నే బయలుదేరి హథూంగ్లా కనుమ దగ్గర బ్రిడ్జి 1 మరియు 2లను చేరుకున్నారు. </span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"><span style="font-weight: normal;">బ్రిడ్జి 1 దగ్గర కల్నల్ మిశ్రాను ఎదురొచ్చాడు. దాదాపు ఐదురోజుల తర్వాత కమాండర్ తనదళాన్ని కలిశాడు. మద్యలో ఎలాంటి సమాచారమూ లేదు. </span><span style="color: red; font-weight: normal;">1"=4మైళ్ళు</span><span style="font-weight: normal;"> స్కేలుమీద ఉజ్జాయింపుగా గీసిన మ్యాపును ఆధారంగా చేసుకుని చర్చించడం మొదలుపెట్టారు. ముందుగా ఈమ్యాపు గురించి- ఇప్పటి దాకా రాజధానినుంచి తొవాంగువరకు అన్నిస్థాయిల్లోనూ చర్చలకు ఒకేఒక ఆధారం ఈమ్యాపు. పోనీ అదేమైనా క్షుణ్నంగా సర్వేచెయ్యించి గీశారా? అంటే అదీలేదు. బ్రిటిషుకాలంనాటి ఒక అధికారిని సర్వే చెయ్యమని పంపారు. భూటానులోని తనప్రియురాలితో సమయంగడపడానికి ఆయన ఈప్రాంతంలో సర్వే ఎగ్గొట్టేశాడు. నమ్కాచు వైపు రాకుండానే, వేరేమార్గంలో వెళుతూ అక్కడ ఒకనది దక్షిణవాహినిగా ఉండటంతో నమ్కాచును కూడా అలానే చూపించాడు. నిజానికి అది పడమర నుంచి తూర్పుకు వెళ్తుంది. అస్సాం రైఫిల్స్ మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకతను తను వచ్చినదారిని ఉజ్జాయింపుగా చూపెడుతూ ఒకమ్యాపు గీశాడు. ఇందులో ఒకచివర నుంచి మొదలెట్టాక మరొకచివరకు చేరేసరికే మార్గం పూర్తికాలేదు. దాంతో పక్కపక్కనే చూపిస్తూ ఇరికించుకుంటూ గీశాడు. దాన్ని ప్రాతిపదికగా తీసుకుని పైవాళ్ళు లెక్కలుకట్టసాగారు. రెండుమైళ్ళుగా చూపెట్టిన ప్రాంతాలు చేరుకోవడానికి రెండురోజులు పట్టింది! సైనిక కార్యక్రమాల్లో</span><span style="color: red;"> కాలం-దూరం-వేగం</span><span style="font-weight: normal;"> ఎంతకీలకమో ప్రతి ఒక్కరికీ తెలిసిందే అయినా ఎవరికీ ఈప్రాధమిక విషయాలను పట్టించుకోలేదు. </span></span></b><br />
<span style="font-family: Arial; font-size: 15px; text-indent: 414px;"><span style="white-space: pre-wrap;"><br /></span></span>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgHD9hn-M4rrJEOMJEv-RYRuHhgrQ-X1_h_IIOQmwdcv01l7NXC0QZAmt3BpZiFgKA2neTDVYwnaO40NjgO6p0zdUd9jg8tEgG5MH_OuRi6tvdSpmwpXZ4C3sXFwqDxGzGHD8u2seyUEjw/s1600/01yr5.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="235" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgHD9hn-M4rrJEOMJEv-RYRuHhgrQ-X1_h_IIOQmwdcv01l7NXC0QZAmt3BpZiFgKA2neTDVYwnaO40NjgO6p0zdUd9jg8tEgG5MH_OuRi6tvdSpmwpXZ4C3sXFwqDxGzGHD8u2seyUEjw/s320/01yr5.jpg" width="320" /></a></div>
<span style="font-family: Arial; font-size: 15px; text-indent: 414px;"><span style="white-space: pre-wrap;"><br /></span><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">సెప్టెంబరు 15న పంజాబుదళం ఇక్కడికి చేరుకునేసరికే నదికి అవతలిగట్టున చైనాసైన్యం ఉంది. అటువైపునుంచి ఒక పౌరసేవాధికారి హిందీలో మాట్లాడుతూ "ఇది చైనా భూభాగం. భారత్ చైనాలమద్య అవిభాజ్య స్నేహం ఉంది.చిన్నచిన్న విషయాల కారణంగా అది చెడిపోకూడదు. మేము సరిహద్దుకు కాపలాను మాత్రమే పెట్టాం. మీరు సైన్యాన్ని ఎందుకు దించితున్నారు?" అని అడిగాడు. మిశ్రాకు పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం- ఆత్మరక్షణార్థమే కాల్పులు జరపాలి. ఖాళీచెయ్యడానికి ఒప్పుకోకపోతే వాళ్ళముందు రాస్తారోకోలు, రిలేనిరాహారదీక్షలు చేపట్టొచ్చు. ఇంతకన్నా వేరేదారిలేదు కాబట్టి, వంతెనల దగ్గరా దారికి కాపుకాస్తున్నారు. కొంతమందిని త్సాంగధర్కు పంపారు. ఇక్కడ మొత్తం నాలుగు బ్రిడ్జిలున్నాయి.మూడవ బ్రిడ్జి వద్ద ధోలాపోస్టు ఉంది. చైనీయులు వారినేమీ చెయ్యకపోయినా మద్యాహ్నానికి మూడవ బ్రిడ్జి కూల్చేశారు. బ్రిడ్జి అంటే అదేదో హౌరా బ్రిడ్జి అనుకునేరు. అంతలేదు. నాలుగు దుంగలను పక్కపక్కన పెట్టి తాళ్లతో కట్టేసి నదిమీద ఉంచారు. అదొక 24 అడుగుల వెడల్పున్న నది! రక్షణపరంగా అక్కడ బలగాలను ఉంచాల్సిన అవసరంలేదు. అయినా పైవాళ్ళ ఆదేశం.దీంతో ప్రభుత్వం సైన్యం మీద ఉంచిన మొదటిదశ పూర్తయ్యింది. ఈప్రాంతం సైనిక సరిహద్దుగా మారింది. పంజాబీలు 9మైళ్ల దూరంలో పలుచగా, పెద్దగా వనరులూ, పరస్పర సమాచారమూ లేకుండా పరుచుకున్నారు.</span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">అక్కడి నుంచి రెండవ బ్రిడ్జికి వెళ్లారు. అక్కడ చైనీయులు కాపలా ఉన్నారు. వారు అత్యాధునిక ఆటోమేటిక్ తుపాకులు, చలికి ప్రత్యేకమైన బట్టలు ధరించి సరిహద్దు కాపలాదారులుగా పిలవబడుతున్నారు! వాస్తవానికి విరుద్ధంగా భారత సైన్యాధికారులు చైనా యుద్ధసామాగ్రి, నైపుణ్యాన్ని తక్కువగా అంచనావేస్తున్నారు. దానికనుగుణంగానే లెక్కలుకట్టి, ప్రకటనలిస్తున్నారు. అంతవరకు గైడుగా తమనతోకూడా వచ్చిన పశువులకాపరి చైనీయులకి దాల్వీరాకను చేరవేశాడు. మనవద్దమాత్రం ఎలాంటి సమాచారమూలేదు. ఇదేవ్యక్తి అంతకుముందు జనరల్ కౌల్ వచ్చినప్పుడూ తోడు తీసుకెళ్ళారు! అక్కడ </span><span style="font-weight: bold; vertical-align: baseline; white-space: pre-wrap;"><span style="color: red;">సుబేదార్ ప్రతాప్ సింగ్</span></span><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"> ఎదురయ్యాడు. ఇతను కొద్దిరోజుల ముందు మిసిమారి రైల్వేస్టేషన్లో మీరఠ్ బండి ఎక్కడానికి ఎదురుచూస్తున్నాడు. 28ఏళ్ళు సైన్యంలో సేవలందించాక రిటైరయ్యి పెన్షన్ మీద వెళ్తున్నాడు. అక్కడున్నప్పుడు యుద్ధానికి పిలుపొచ్చేసరికే వెనక్కు తిరిగి ఇన్నిమైళ్ళూ నడుచుకుంటూ యుద్ధభూమికి చేరుకున్నాడు. ఇంటికెందుకు వెళ్ళలేదు అన్నప్రశ్నకు </span><span style="font-weight: bold; vertical-align: baseline; white-space: pre-wrap;">"సాబ్! బెటాలియన్కు ఇంత అవసరమొచ్చినప్పుడా నేను ఇంటికెళ్ళేది?</span><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">" అని ఎదురు ప్రశ్న వేశాడు. దానికి మనప్రభుత్వం దగ్గర జవాబుందా? ఆదేశభక్తుడు యుద్ధభూమిలోనే వీరమరణం పొందాడు. మరొక పోస్టు దగ్గర చాలాకాలంనుంచి పంచదారలేక ఉప్పును కలుపుకొని టీ తాగుతున్నారు. ఉత్తరాదివాళ్ళైనా వరి అన్నాన్నే తింటూన్నారు. రోటీపిండి లేదా? అని అడిగితే </span><span style="font-weight: bold; vertical-align: baseline; white-space: pre-wrap;">"దానికి పెనం తెచ్చుకోవాలి సాబ్. దానిబదులు వేరేదైనా సామాగ్రి మొయ్యొచ్చుకదా అని అన్నం తెచ్చుకున్నాం.</span><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">" అని బదులిచ్చారు. ఎక్కడా ఒక్కపిర్యాదులేదు. ఒక్క పితూరీలేదు. అందరి లక్ష్యం ఒక్కటే. మూడురంగుల ఝెండా పరువు కాపాడటమే. పంజాబీల దేశభక్తికి హిమాలయాలే సరైన ఉపమానం. ఇక్కడ ఇలా ఉంటే రాజధానిలో ఒక అధికారి "చైనీయులను సరిహద్దునుంచి తరిమివెయ్యమని సైన్యాన్ని ఆదేశించాం." అని ప్రకటన ఇచ్చాడు.</span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">అక్కడి నుంచి మూడవ బ్రిడ్జికి చేరుకోని ఒకరోజు పట్టింది. ఇక్కడ మేజర్ చౌదరీని కలిశాడు. చైనీయుల దాడి గురించి సమాచారం అందించింది ఇతనే. ఇక్కడితో మొత్తం ప్రాంతం తిరిగినట్లైంది. మొత్తానికి ధోలాప్రాంతం సైనికచర్యలకు పూర్తిగా ప్రతికూలమన్న సంగతి అర్థమైంది. హథూంగ్లా, కర్పోలా కనుమలను ఒకబెటాలియన్ ఎట్టిపరిస్థితుల్లోనూ రక్షించలేదు. అక్కడ దళాల మద్య పరస్పర సహకారం, సమాచార మార్పిడి కష్టం. దాడుల సమయంలో కదలికలకు ఏమాత్రం అనువుగా లేదు. సన్నాహాల గోప్యత అస్సలు కుదిరేదికాదు. అయినా రాజకీయ కారణాలవల్ల అది ప్రతిష్టాత్మకమై కూర్చుంది. సైనికుడు ప్రాణాన్ని పణంగా పెట్టడంకన్నా చెయ్యగలిగింది ఏమీలేదు.</span></span></div>
సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com5tag:blogger.com,1999:blog-3377763021527742745.post-69860421257778940052012-10-07T01:22:00.001+05:302012-10-14T00:06:09.809+05:30మేరునగ తప్పిదం- 9.గీత దాటాడు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<b id="internal-source-marker_0.14422015962190926" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">సెప్టెంబరు మొదటివారం- జనరల్ నిరంజన్ ప్రసాద్ తొవాంగ్ రక్షణకు అహర్నిశలు శ్రమించినందుకుగాను బెటాలియన్ను అభినందిస్తూ ప్రాసంగించాడు. గూర్ఖాలను ఉద్దేశిస్తూ సరిహద్దుకు ఉన్నపళంగా ముప్పేమీలేదు కాబట్టి హాయిగా దసరాను జరుపుకోమన్నాడు. గతమూడేళ్ళుగా గూర్ఖాలు వాళ్ళకుటుంబాలకు దూరంగా గడుపుతున్నారు. విపరీతమైన పని ఒత్తిడి కారణంగా అలసిపోయున్నారు. వారిని కొంతకాలం సైనిక కార్యకలాపాలకు దూరంగా ఉంచుతామని, స్వస్థలమైన యోల్కు వెళ్ళి కుటుంబసభ్యులతో దసరా జరుపుకోవత్సని హామీ ఇచ్చారు. ఆరోజు మద్యాహ్నం బ్రిగేడియర్ దాల్వి మండల ప్రధాన కార్యాలయమైన తేజ్పూర్కు బయలుదేరివెళ్ళాడు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">తరువాత రోజు సాయంత్రం దాల్వీకి తొవాంగ్ నుంచి ఫోన్ వచ్చింది. మేజర్ పెరీరా మాట్లాడుతూ " ధోలా పోస్టు నుంచి అక్కడీ కమాండర్ ప్రమాద సంకేతాల్ని పంపుతున్నాడు. సుమారు 600మంది చైనీయులు గీతదాటి లోపలికి వచ్చారు. అక్కడి ఒక వంతెనను కూల్చివేశారు. నీటిసరఫరాను కూడా నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. వెంటనే సహాయం కావాలని కమాండర్ అర్థిస్తున్నాడు." అని చెప్పాడు. వెంటనే లుమ్లా, లుంపులలోని అస్సాంరైఫిల్సును అప్రమత్తం చెయ్యమని పెరీరాను ఆదేశించాడు.ఉదయం 8గంటలకు దాడి జరిగితే సాయంత్రం 6:30 వరకు మండలకేంద్రానికి సమాచారం రాలేదు. ఇంతకుమించి అటువైపునుంచి మరే సమాచారంలేదు. వెంటనే పై అధికారికి విషయం తెలియజేయడానికి ప్రయత్నించగా ఆయన దొరకలేదు. రహస్య మ్యాపులు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. రాత్రి ఆయన, ఎయిర్ ఫోర్స్ లైసనింగ్ ఆఫీసర్ దొరికారు. అది వారాంతం కావడంతో సమాచారం చేరడం మరింత ఆలశ్యమైంది. ఆర్మీ ప్రధాన కార్యాలయంలో సోమవారం వరకు ఎవరైనా ఉంటారా? అన్నది అనుమానాస్పదమే. ప్రభుత్వం ముంచి ఆదేశాలు పొందకుండా భారతసిపాయీ ఏమీ చెయ్యలేడని చైనీయులకు తెలుసు. బహుశా అందుకే వారాంతాన్ని ఎంచుకుని ఉంటాడన్నది దాల్వీ అభిప్రాయం. రెండవ ప్రపంచ యుద్ధంలో ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">చైనీయులు దాడిచేసిన థాగ్ల ప్రాంతం నుంచి తొవాంగ్లోని బ్రిగేడ్ ప్రధాన కార్యాలయం చేరడానికి 5రోజులు పడుతుంది. అక్కడి నుంచి మండలకేంద్రం 200మైళ్ళ దూరంలో ఉంది. కార్ప్స్ ప్రధానకార్యాలయం ఇంకొక 200మైళ్ళ దూరంలోని షిల్లాంగ్లో ఉంది. అక్కడి నుంచి కమాంద్ ప్రధాన కార్యాలయం లక్నోలో ఉంది. ఇక అన్నింటికీ అగ్రభాగాన మేరునగమంత తప్పిదాన్ని ఎలాంటి ఇబ్బందీలేకుండా చెయ్యడానికి డిల్లీ ఉంది. అక్కడ సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించేంత తీరిక ఎవ్వరికీ ఉండదు. ఎవరి రాజకీయ అవసరాలు వారివి. కేంద్రకార్యాలయాల్లో పనంటే- గంటకొట్టినప్పుడు రావడం. ఇంకో గంట కొడితే ఇంటికెళ్ళిపోవడం. కొంతకాలం బయట పనిచేశాం అనిపించుకున్నాక కొందరు ఆరోగ్య కారణాలతోనూ, ఇంకొందరు కుటుంబ కారణాలమీద, మరికొందరు పలుకుబడిని ఉపయోగించీ ఇక్కడకు చేరుకుని రిటైర్మెంట్ ముందు జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. యుద్ధం వచ్చినప్పుడు సరిహద్దులోని దళాలకు దిశానిర్ధేశం చెయ్యల్సిన బాద్యత వీరిది. కానీ యుద్ధభూమిలో ఏమి జరుగుతుందో? అసలు యుద్దమెలా చేస్తారో? తెలియని వాళ్ళు ఏమిదారి చూపుతారు?</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">షిల్లాంగ్లోని XXXIII CORPS బ్రిగేడియర్ జనరల్ స్టాఫ్ కొన్ని ఆదేశాలు ఇచ్చాడు. అవి </span></b><br />
<br />
<ol>
<li><b id="internal-source-marker_0.14422015962190926" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><b id="internal-source-marker_0.14422015962190926" style="font-weight: normal;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ధోలా పోస్టు కామాండర్ అక్కడే ఉండాలి. వెంటనే అక్కడికి మరిన్ని దళాలను పంపాలి. అక్కడి సమాచార బాద్యతలు అస్సాం రైఫిల్స్ చూసుకోవాలి. </span></b></b></li>
<li><b id="internal-source-marker_0.14422015962190926" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">శక్తి, లుంపు ప్రాంతాల్లోని 9 పంజాబ్ బృందాలు ధోలాకు పంపి అక్కడి దారులను ఆధీనంలో ఉంచుకోవాలి. తొవాంగులోని మిగిలిన బలగాలను లుంపుకి వెళ్ళేందుకు సిద్ధం చెయ్యాలి.</span></b></li>
<li><b id="internal-source-marker_0.14422015962190926" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">సెలవు మీద వెళ్ళిన వారెవరూ రానవసరంలేదు. కానీ మార్గమద్యంలో ఉన్నవారు తదుపరి ఉత్తర్వులు అందేవరకూ ఎక్కడివారు అక్కడే ఉండాలి.</span></b></li>
</ol>
<b id="internal-source-marker_0.14422015962190926" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఇదే సమయంలో దాల్వి తొవాంగ్ ఎంతకీలకప్రాంతమో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాడు. దానిని రక్షించుకునేందుకు సేలా కనుమ రక్షణ బాద్యతలను తమనుంచి మరొకరికి బదిలీ చెయ్యమని కోరాడు. ఆపోస్టు వివాదాస్పద స్థలంలో సైన్యం అభిప్రాయాన్ని తీసుకోకుండానే నెలకొల్పారని, ఆప్రాంతంలో పోరడటానికి చైనీయులకు గల అనుకూలాంశాలను వివరించాడు. </span></b><br />
<b id="internal-source-marker_0.14422015962190926" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">మరుసటి రోజు తొవాంగ్ చేరుకోగానే అక్కడి అధికారులకు పైవాళ్ల ఆదేశాలను వివరించాడు. సిక్కుల దళానికి నాయకత్వం వహిస్తున్న లెఫ్టినంట్ కల్నల్ మాస్టర్ శిక్షణను ఇచ్చేందుకు పదాతిదళ శిక్షణా కేంద్రానికి వెళ్ళడంతో ఆయన స్థానంలో మిశ్రా కొద్దిరోజులముందే బాద్యతలు స్వీకరించాడు. ఆయన ముందురోజే థాగ్లా ప్రాంతమంతా కలియ తిరిగి అన్ని విషయాలనూ సేకరించి ఉంచుకున్నాడు. సైన్యం యుద్దానికి ముందు లాంచనంగా తయారు చెయ్యాల్సిన స్టాఫ్ పేపరును తయారు చేశారు. అందులోని ముఖ్యమైన అంశాలు</span></b><br />
<div>
<b style="font-family: Arial; font-size: 15px; text-indent: 374px;"><b id="internal-source-marker_0.14422015962190926"></b></b><br />
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;"><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 374px;"><b id="internal-source-marker_0.14422015962190926">
<li style="display: inline !important; list-style-type: decimal; vertical-align: baseline;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">భౌగోళిక అంశాలు</span></li>
</b></b></ol>
</div>
<div>
<blockquote style="border: none; margin: 0 0 0 40px; padding: 0px;">
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt; text-align: left;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;">
<li style="display: inline !important; list-style-type: lower-alpha; vertical-align: baseline;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">థాగ్లాకు వెళ్ళాల్సిన ప్రధాన మార్గం న్యాంగాంగ్చు లోయ- లుంపు- హథూంగ్లా కనుమ( 13400 అడుగులు)- నంకాచు నది మీదుగా వెళ్తుంది. మొత్తం దూరం 60మైళ్ళు. సైన్యం ఐదు విడతల్లో మార్చ్ చేసుకుంటూ వెళ్ళగలరు.</span></li>
</b></ol>
</blockquote>
<blockquote style="border: none; margin: 0 0 0 40px; padding: 0px;">
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;">
<li style="display: inline !important; list-style-type: lower-alpha; vertical-align: baseline;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ప్రత్యామ్నాయ మార్గం లుంపు నుంచి కర్పోలా 1 కనుమ ( 16500 అడుగులు) మీదుగా వెళ్ళొచ్చు. ఈమార్గంలో వెళ్ళటం చాలాకష్టం. కానీ ఇలా వెళ్తే చైనీయుల కంటపడే అవకాశం తక్కువ.</span></li>
</b></ol>
</blockquote>
<br />
<blockquote style="border: none; margin: 0 0 0 40px; padding: 0px;">
<b style="font-family: Arial; font-size: 15px; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">కీలక ప్రాంతాలు</span></b></blockquote>
<blockquote style="border: none; margin: 0 0 0 40px; padding: 0px;">
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt; text-align: left;">
<li style="display: inline !important; list-style-type: lower-alpha; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">త్సాంగధర్ మరియు హథూంగ్లా ముఖ్యమైన ప్రాంతం. ధోలా ప్రాంతం వృధా. ఇక్కడ వనరులు ఉపయోగించడం అనవసరం.</span></b></li>
</ol>
</blockquote>
<blockquote style="border: none; margin: 0 0 0 40px; padding: 0px;">
<b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">లుంపు - చుక్సెన్ మార్గం అనుకూలమైనది. వాయుసరఫారాకు కీలకమైన లుంపును రక్షించుకోవడానికి ఇది చాలా ముఖ్యం. </span></b><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">శక్తి ఇరుకైన కనుమ. కాబట్టి దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలకూడదు.</span></b></blockquote>
<b style="font-family: Arial; font-size: 15px; text-indent: 374px;"></b><br />
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
<li style="display: inline !important; list-style-type: decimal; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">మార్గాల పరిస్థితులు</span></b></li>
</ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
</ol>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
<li style="display: inline !important; list-style-type: lower-alpha; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">తొవాంగ్ నుంచి థాగ్లాకు వెళ్ళేదారిలో మనుషులు కాలినడకన మాత్రమే రాగలరు. కోతల సమయం కావడంతో పోర్టర్ల కొరత తీవ్రంగా ఉంది.</span></b></li>
</ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
<li style="display: inline !important; list-style-type: lower-alpha; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"><br /></span></b></li>
</ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
<li style="display: inline !important; list-style-type: decimal; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">బలాబలాలు</span></b></li>
</ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
</ol>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
<li style="display: inline !important; list-style-type: lower-alpha; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">చైనీయుల బలం గురించి ఖచ్చితమైన సమాచారం లేకపోయినా వాళ్ళు మనకన్నా ఎక్కువే ఉంటారు. </span></b></li>
</ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
<li style="display: inline !important; list-style-type: lower-alpha; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">మనదగ్గర రెండు బెటాలియన్లు ఉన్నా వాటి సామర్థ్యం ఒక్కబెటాలియన్కు సమానం. ఎలాంటి సాధనాలు మనవద్ద లేవు.</span></b></li>
</ol>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
<li style="display: inline !important; list-style-type: lower-alpha; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">తొవాంగ్ రక్షణ ప్రధమ కర్తవ్యం. </span></b></li>
</ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
<li style="display: inline !important; list-style-type: lower-alpha; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">పర్వత పాదాల నుంచి తొవాంగుకు రాను 10-12 రోజులు పడుతుంది. దారి పూర్తిగా దెబ్బతి ఉంది. కాబట్టి సత్వరం మరమ్మతులు చెయ్యాలి. </span></b></li>
</ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
<li style="display: inline !important; list-style-type: lower-alpha; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">అక్కడినుంచి థాగ్ల చేఉకోను 4-5 రోజులు పడుతుంది. వారు అలసట తీర్చుకోను కనీస సమయమివ్వాలి.</span></b></li>
</ol>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
<li style="display: inline !important; list-style-type: lower-alpha; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">సమాచార వ్యవస్థ, యుద్ధ సామాగ్రి మనకన్నా చెనా దగ్గర మెరుగ్గా ఉంది.</span></b></li>
</ol>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
<li style="display: inline !important; list-style-type: decimal; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"><br /></span></b></li>
</ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
<li style="display: inline !important; list-style-type: decimal; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"><br /></span></b></li>
</ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
<li style="display: inline !important; list-style-type: decimal; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">పరిపాలన</span></b></li>
</ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
</ol>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
<li style="display: inline !important; list-style-type: lower-alpha; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">అదనపు బలగాలు చేరుకొనేసరికే వారికవసరమైన దుస్తులు, యుద్దసామాగ్రి, వైర్లెస్ పరికరాలు, ఇతర సామాగ్రి చేరవెయ్యాలి. గిడ్డంగులు పధిలపరచుకోవాలి.</span></b></li>
</ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
<li style="display: inline !important; list-style-type: lower-alpha; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">లుంపు ఒక్కటే వాయుసరఫరాకు ఆధారం.</span></b></li>
</ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
<li style="display: inline !important; list-style-type: lower-alpha; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">పోర్టర్ల కొరత తీవ్రంగా ఉంది.</span></b></li>
</ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
<li style="display: inline !important; list-style-type: lower-alpha; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">గతకొంతకాలంగా వాయురవాణా కుదరకపోవటంతో థాగ్లాకు వెళుతున్న బలగాలకు సరిపడినంత యుద్ధసామాగ్రి లేదు. తొవాంగులోని బలగాలకేగాక మార్గమద్యంలో ఉన్నవారికి, అంటే పర్వతపాదం నుంచి తొవాంగ వచ్కేవారు, తొవాంగ్ నుంచి థాగ్లా వెళ్ళేవాళ్ళు, అవసరమైన సామాగ్రి సరఫరా చెయ్యాలి.</span></b></li>
</ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
<li style="display: inline !important; list-style-type: lower-alpha; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">పర్వతపాదం నుంచి థాగ్లా వరకుగల 220మైళ్ల దారిలో గిడ్డంగులు ఏర్పాటు చెయ్యాలి.</span></b></li>
</ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;"><br /></ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
</ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
<li style="display: inline !important; list-style-type: decimal; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">వాతావరణం</span></b></li>
</ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;">
<li style="display: inline !important; list-style-type: lower-alpha; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఋతుపవనాల కారణంగా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. విపరీతమైన వాలు మీద ప్రయాణం బృందాలకు చాలా కష్టం.</span></b></li>
</ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;">
<li style="display: inline !important; list-style-type: lower-alpha; vertical-align: baseline;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">బృందాలకు మార్గమద్యంలో ఎక్కడా షెల్టర్లు లేవు. సరైన దుస్తులులేక సైనికుల ఆరోగ్యం క్షీణించే ప్రమాదముంది.</span></li>
</b></ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;">
<li style="display: inline !important; list-style-type: lower-alpha; vertical-align: baseline;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"><br /></span></li>
</b></ol>
</div>
<div>
<div style="display: inline !important; white-space: pre-wrap;">
<div style="display: inline !important;">
<b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><b style="font-weight: normal;"><b style="font-weight: normal;"><span style="vertical-align: baseline;">చైనీయుల బలాన్ని, వాళ్ళప్రాంతాలను అంచనావేసేందుకు 9పంజాబ్ బృందాన్ని హథూంగ్లా కనుమ మీదుగా ధోలాకు పంపారు. వీరు ఆమార్గాన్ని తమ ఆధీనంలో ఉంచుకుంటారు. ఒక అస్సాంరైఫిల్స్ బృందాన్ని కర్పొలా కనుమ గుండా ధోలాకు పంపారు. మిగిలిన పంజాబీలను సమాచారం అందిన 4గంటల్లో గమ్యానికి చేరుకోవాలని ఆదేశించారు.. మద్యాహ్నానికల్లా వాళ్ళు సిద్దమయ్యారు. తరువాత రోజు జనరల్ ప్రసాద్ చేరుకుని పరిస్థితిని సమీక్షించాడు. ఆయన కొన్ని ఆదేశాలను ఇచ్చాడు. </span></b></b></b></div>
</div>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;"><b id="internal-source-marker_0.14422015962190926" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;">
<li style="display: inline !important; list-style-type: decimal; vertical-align: baseline;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">7 Infantfy Brigade 48గంటల్లోగా ధోలా ప్రాంతానికి చేరుకోవాలి.</span></li>
</b></ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;"><b id="internal-source-marker_0.14422015962190926" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;">
<li style="display: inline !important; list-style-type: decimal; vertical-align: baseline;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">XXXIII Corps 1/9 గూర్ఖాల సేవలను ఉపయోగించుకోను పైవాళ్ళని అభ్యర్థించింది. 2Rajputsను ఇక్కడికి పంపుతున్నారు.</span></li>
</b></ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;"><b id="internal-source-marker_0.14422015962190926" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;">
<li style="display: inline !important; list-style-type: decimal; vertical-align: baseline;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">తొవాంగులో కనీస సైన్యం ఎట్టిపరిస్థితుల్లో ఉండాలి.</span></li>
</b></ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;"><b id="internal-source-marker_0.14422015962190926" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;">
<li style="display: inline !important; list-style-type: decimal; vertical-align: baseline;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">9పంజాబ్ వెంటనే లుంపుకు చేరుకోవాలి</span></li>
</b></ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;"><b id="internal-source-marker_0.14422015962190926" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;">
<li style="display: inline !important; list-style-type: decimal; vertical-align: baseline;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">సెలవుమీద వెళ్ళేందుకు మిసమారిలో ఉన్న బృందాలు తిరిగి వారి బాద్యతలు స్వీకరించాలి. </span></li>
</b></ol>
</div>
<div>
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;"><b id="internal-source-marker_0.14422015962190926" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;">
<li style="display: inline !important; list-style-type: decimal; vertical-align: baseline;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">చైనీయులు ఎదురైతే</span></li>
</b></ol>
</div>
<div>
<blockquote style="border: none; margin: 0 0 0 40px; padding: 0px;">
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt; text-align: left;"><b id="internal-source-marker_0.14422015962190926" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;">
<li style="display: inline !important; list-style-type: lower-alpha; vertical-align: baseline;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">వాళ్ళని వెనుదిరిగి వెళ్ళమని చెప్పండి.</span></li>
</b></ol>
</blockquote>
<blockquote style="border: none; margin: 0 0 0 40px; padding: 0px;">
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;"><b id="internal-source-marker_0.14422015962190926" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;">
<li style="display: inline !important; list-style-type: lower-alpha; vertical-align: baseline;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">వాళ్ళు వెళ్ళకపోతే ముందుకు రానియ్యకుండా నిరోధించండి.</span></li>
</b></ol>
</blockquote>
<blockquote style="border: none; margin: 0 0 0 40px; padding: 0px;">
<ol style="display: inline !important; margin-bottom: 0pt; margin-top: 0pt;"><b id="internal-source-marker_0.14422015962190926" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;">
<li style="display: inline !important; list-style-type: lower-alpha; vertical-align: baseline;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఆత్మరక్షణార్థం మాత్రమే కాల్పులు జరపాలి.</span></li>
</b></ol>
</blockquote>
</div>
<div>
<div style="display: inline !important; white-space: pre-wrap;">
<div style="display: inline !important;">
<b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><b style="font-weight: normal;"><b style="font-weight: normal;"><span style="vertical-align: baseline;">ఈఆదేశాలతో భారత ఆర్మీకి నిర్ధిష్టమైన లక్ష్యాలుగానీ, జాతీయ విధానంగానీ లేవని తేటతెల్లమయ్యింది. రాజకీయ నాయకులను నిందిస్తూ దీర్ఘకాలిక రక్షణాచర్యలపైన కనీస అవగాహన లేకుండా ఉండటం ఆమోదనీయం కాదు.</span></b></b></b></div>
<b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"></b></div>
<b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;">
</b></div>
<div>
<div>
<b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 374px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">సైన్యంలో పదాతి దళం తప్ప మరేబలగమూ లేదు. వాళ్ళు ఒక స్థానంనుంచి మరొక స్థానం చేరుకునేంతవరకూ మద్యలో ఎలాంటి సమాచారమూ లభించదు. కనీసం కొనిగంటలపాటు అలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చెయ్యాల్సి వస్తుంది. ఒకేసారి దళమూ, దాని వెనకే అధికారులూ ప్రయాణిస్తే ఇద్దరిమద్యనా సమాచారం చాలా ఇబ్బందౌతుంది. ఇది పర్వతప్రాంతాల్లో చాలాకీలకమైన విషయం. అలా రోజుల తరబడి ప్రయణించాలి. ఈకారణాలవల్ల దళం గమ్యానికి చేరుకునేదాకా తను తొవాంగులోనే ఉంటానని దాల్వీ తన పైఅధికారికి తెలియజేశాడు. గైడుల సహాయం లేకపోవడంతో హథూంగ్లా కనుమకు వెళ్ళాల్సిన పంజాబ్ బృందం దారితప్పింది. ఆరాత్రి జనరల్తో మాట్లాడుతూ కొన్ని వాస్తవాలను తెలియపరిచాడు. మనకున్న పరిమితుల దృశ్ట్యా ఎన్ని రాజకీయ ఒత్తిడులు వచ్చినా తలొగ్గొద్దని మనవి చేసుకున్నాడు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">పైనుంచి వచ్చిన ఆదేశాల్లోని డొల్లతనం దాల్వీని మరింత అసహనానికి గురిచేసింది. తూర్పుదళ ప్రధాన కార్యాలయం ఇచ్చిన ఆదేశాల్లో 7Infantry Brigadeను థాగ్లాకు వెళ్ళమంది. ఇది అక్కడివారి సమర్థతపై ఎన్నో సందేహాలను రేకెత్తించింది. వాస్తవ పరిస్థితులు, మన బలాబలాలు, పరిమితుల గురించి కనీస అవగాహన ఉందా? అనిపించింది. ఎదురుగా చైనా సైన్యం అంతా నిలబడి ఉంటే ఇటువైపు ఒకదళాన్ని ఉంచి పోరాడమని చెప్పడం ఎంతవరకు సబబు? సైనిక ఆదేశాలన్నీ ఒక నిర్ధిష్టమైన పద్దతిలో ఒక్కొక్క విషయాన్ని వివరిస్తూ వెలువడతాయి. అలాగాక కేవలం ఒకద్ళాన్ని థాగ్లాకు పంపండి. అని చెప్పడం కేవలం రాజకీయ నినాదంకన్నా పెద్దగా పనికిరాలేదు. మనకు అనుకూలమైన, వివాదరహితమైన తొవాంగ్ ప్రాంతాన్ని వదలి ముందుకెళ్ళినందుకు తగిన మూల్యం చెల్లించుకుంది.</span></b></div>
</div>
</div>
సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com3tag:blogger.com,1999:blog-3377763021527742745.post-51077706120115747682012-10-05T23:39:00.000+05:302012-10-14T00:06:21.843+05:30మేరునగ తప్పిదం- 8.తుఫాను ముందు ప్రశాంతత<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div>
<b id="internal-source-marker_0.9214015079196543" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 468px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">సరిహద్దులోని వాస్తవ పరిస్థితులపై అవగాహనలేమి కారణంగా ప్రజలు సైన్యాన్ని నిందించడం మొదలుపెట్టారు. ఇంకోవైపు చైనా యుధ్దందిశగా ఒక్కొక్కడుగూ నెమ్మదిగా వేస్తూ ముందుకొస్తోంది. భారత్ మాత్రం ఒక జాతీయ లక్ష్యం అంటూ లేకుండా, ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్ళు మాట్లాడే అవకాశం కల్పిస్తోంది. ప్రజాస్వామ్యం అన్న ముసుగులో నాయకులు ఆడుతున్న ఆట కారణంగా దేశావసరాలు- నాయకుల లక్ష్యాల మద్య అంతరం స్పష్టంగా కనిపించసాగింది.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">లఢాఖ్లో చైనా ఆధీనంలోకి వెళ్ళిన ప్రాంతాలు ఆదేశ సైనికావసరాలకు అత్యంత కీలకం కావడంతో భారత్కు తిరిగి దక్కడం అంతసులువు కాదు. ఈసంగతి తెలిసినా నాయకులు మాత్రం "చివరి అంగుళం సొంతమయ్యేదాకా పోరాడుతాం." అంటూ ప్రగల్భాలు పలకసాగారు. 1959 తర్వాత టిబెట్లో పరిస్థితులు పూర్తిగా నియంత్రణలోకి రావడంతో చైనా అక్కడున్న సైన్యాన్ని భారత సరిహద్దు వైపు మళ్ళించసాగింది. రాజకీయ వేదికలపై మన పెద్దన్న పాత్రని పొగుడుతూనే ఇంకోవైపు సైనికచర్యలకు కావలసిన వనరులను క్రోడీకరించసాగింది. వీటికి జవాబుగా భారత్ చర్యలు శూన్యం. మన సన్నాహాలన్నీ వీధిపోరాటాలకు, అల్లర్లను అణగదొక్కడానికి పనికొస్తాయి తప్ప ఒక బలమైన శత్రువును పూర్తిస్థాయి యుద్ధంలో ఎదుర్కోవడానికి కాదన్నది విస్పష్టం. సైనిక సూతాలపై అస్సలు అవగాహనలేని నాయకులు దాన్ని కప్పిపుచ్చుకోను అహింసాసిద్దాంతాన్ని వల్లెవేయనారంభించారు. 1962 నాటికి చైనా వద్ద అత్యాధునిక యుద్ధసామాగ్రి, ప్రధమశ్రేణి యుద్దనైపుణ్యం ఉంటే మనంమాత్రం రెండవ ప్రపంచయుద్ధ కాలంనాటి సామాగ్రితో, అప్పటి యుద్ధతంత్రాలతో కుస్తీపడుతున్నాం. </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">1962 ఆగస్టులో లఢాఖ్లో చైనాతో ఘర్షణ జరిగింది. ఆతర్వాత చైనా మరొక ముప్పై సైనికపోస్టులను నెలకొల్పింది. అప్పటికే 12000 చదరపుమైళ్ళు ఆక్రమించి ఉన్న చైనా ఈసంఘటన తర్వాత మరొక 2000 చదరపు మైళ్ళు మింగేసింది. దీనిపై భారత్ చర్చలకు పిలవగా ససేమిరా అంది. అయినా భారత్ మాత్రం చర్చలతో విబేధాలన్నీ పరిష్కరించుకుంటాం అంటే శత్రువు దృష్టిలో ఎంత చులకన అయిపోతాం? తరచుగా యుద్దం- చర్చల మద్య దోబూచులాడుతూ భారత్ రెండుదారులనూ మూసేసుకుంది.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">మద్యలో ఇంకొక ప్రచారం మొదలైంది. దాని సారాంశం- ప్రముఖ రష్యన్ నాయకుడూ ఖుర్శ్చేవ్- చైనా విదేశాంగ మంత్రి మార్షల్ చేన్ యితో, భారత విదేశాంగ మంత్రి మీనన్తో జెనీవాలో ఒక సదస్సు సందర్భంగా కలిశాడు. అక్కడ ఇద్దరి మద్యనా నెలకొన్న సరిహద్దు వివాదం గురించి మాట్లాడి చీవాట్లు పెట్టాడు. భారత్, చైనా లాంటి సోషలిస్టు దేశాలు తగవులాడితే అది వలసపాలకులకు, పెట్టుబడిదారులకి వరంగా పరిణమిస్తుంది. కాబట్టి నోర్మూసుక్కూర్చోండన్నాడు. మార్షల్ చేన్ యీ శాంతియుత విధానాలద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని హామీ ఇచ్చాడు. దీంతో భారత ప్రభుత్వం ఊపిరి పీల్చుక్కుని ఇక యుద్ధంరాదని నిశ్చయించేసుకుంది. ఈసారి భారత సరిహద్దును రక్షించే బాద్యత సోవియట్ తీసుకుంది! ఈహామీ వల్లనే భారతప్రభుత్వం యుద్ధానికి సన్నాహాలు చెయ్యలేదని కొందరు చెబుతూ వచ్చారు. దీని విశ్వసనీయత ఎలా ఉన్నా, భారతప్రభుత్వం సరైన సన్నాహాలు చెయ్యలేదన్నది విస్పష్టం. </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">తరువాత చైనా లఢాఖ్లోని వివాదాస్పద గల్వన్ లోయను ఎంచుకుంది. 300మంది చైనీయులు అక్కడ కాపలా కాస్తున్న 40మంది గూర్ఖాలపై దాడి చేశారు. వాళ్ళని లొంగదీసుకునేందుకు అనేక జిమ్మిక్కులు వాడారు. చివరికి "భారత్ కోసం నేపాలీలు ప్రాణాలర్పించాల్సిన అవసరంలేదు. నేపాల్- భారత్లు స్నేహితులేంకాదు." అన్న వాదన కూడా మొదలుపెట్టారు. కానీ వాళ్ళు లొంగకపోవడంతో చైనీయులు పాశవికంగా హతమార్చారు. ఒకవైపు భారత నాయకులే సరిహద్దును గురించి పట్టించుకోకుండా రోజువారీ రాజకీయాలతో కాలం గడుపుతుంటే, మనదేశస్థులు కాకపోయినా విధినిర్వహణలో ప్రాణాలర్పించిన గూర్ఖాలు ప్రాతఃస్మరణీయులు. ఏమిచ్చి వాళ్ళ ఋణం తీర్చుకోగలం. కానీ దురదృష్టవశాత్తు మిగతా సైనికులలానే వీళ్ళ త్యాగాన్ని గుర్తించే తీరిక మనకు లేకుండా పోయింది! ఈ సంఘటన ద్వారా చైనా తన ఆలోచనను బయటపెట్టింది. భారత భూభాగాన్ని వశపరచుకునేందుకు ఎంతటి దాడికైనా సిద్ధమని చెప్పకనే చెప్పింది. అయినా మనకే అర్థంకాలేదు. బహుశా అర్థమైనా కానట్టే నటించామనుకుంటా.</span></b></div>
<div>
<b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 468px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"><br /></span></b></div>
<div>
<b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 468px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"><br /></span></b></div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgYybYMroEUTJvslarNttlcqPDHieXGoV8fuBr2C7DgleTFlT4xAfRd1OTZBaNagf5nsVBs_5_H9WUUxGcZ0pXQKCaL9UgN3-lSS78kXyqiA5F7JPIQP3kF_f9YztbVL6BQxritxn0xNuk/s1600/ChinaIndia_951129c.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="200" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgYybYMroEUTJvslarNttlcqPDHieXGoV8fuBr2C7DgleTFlT4xAfRd1OTZBaNagf5nsVBs_5_H9WUUxGcZ0pXQKCaL9UgN3-lSS78kXyqiA5F7JPIQP3kF_f9YztbVL6BQxritxn0xNuk/s320/ChinaIndia_951129c.jpg" width="320" /></a></div>
<b id="internal-source-marker_0.9214015079196543" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 468px;"><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">రెండు దేశాలు సరిహద్దుకి ఇరువైపులా ఎదురెదురుగా నిలబడే రోజు అతిచేరువగా వచ్చేసింది. అప్పటికి రెండువైపులా సన్నాహాలను బేరీజు వేస్తే-</span></b><br />
<b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 468px;"><span style="white-space: pre-wrap;"><br /></span><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ముందుగా చైనా వైపున-</span></b><br />
<b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 468px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"><br /></span></b>
<br />
<ol style="margin-bottom: 0pt; margin-top: 0pt;">
<li style="list-style-type: decimal; vertical-align: baseline;"><b id="internal-source-marker_0.9214015079196543" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 468px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">అంతకు కొన్ని నెలలు ముందుగానే చైనా కొంతమంది ఏజెంట్లను భారత్లోకి పంపించింది. వీళ్ళు రోడ్డుకార్మికులుగా ఆప్రాంతమంతా జల్లెడపట్టారు.</span></b></li>
<li style="list-style-type: decimal; vertical-align: baseline;"><b id="internal-source-marker_0.9214015079196543" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 468px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">కొరియా యుద్దంలో నాయకత్వం వహించిన వ్యక్తిని ఆయుద్ధం ముగిశాక ఇక్కడికి పంపారు.</span></b></li>
<li style="list-style-type: decimal; vertical-align: baseline;"><b id="internal-source-marker_0.9214015079196543" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 468px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">అన్ని ముఖ్యమైన భారతీయ భాషలకూ దుబాసీలను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి భారత ఆచారాల పట్ల, నమ్మకాల పట్ల అవగాహన కల్పించారు. బహుశా వీరినే సాంస్కృతిక బృందాలుగా మనదగ్గరకి పంపి ఉండొచ్చు.</span></b></li>
<li style="list-style-type: decimal; vertical-align: baseline;"><b id="internal-source-marker_0.9214015079196543" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 468px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఫోటోగ్రాఫర్లను, వీడియో కెమెరామెన్లను భారత్లోకి పంపి కావలసినంత సమాచారం తెచ్చుకున్నారు.</span></b></li>
<li style="list-style-type: decimal; vertical-align: baseline;"><b id="internal-source-marker_0.9214015079196543" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 468px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">కొన్ని వందలమంది గిరిజనులను కార్మికులుగా నియమించుకున్నారు. వీళ్ళకి భారత సైన్యం దుస్తులు కూడా చైనావాళ్ళే ఇచ్చారు! </span></b></li>
<li style="list-style-type: decimal; vertical-align: baseline;"><b id="internal-source-marker_0.9214015079196543" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 468px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఆయుధాగారాలను కీలకప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్నారు. వాటిని నిల్వచేయడానికి, సరఫరాకు కావలసిన పరిపాలనా వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. వేసవికాలమంతా వీటిని నింపుకున్నారు.</span></b></li>
<li style="list-style-type: decimal; vertical-align: baseline;"><b id="internal-source-marker_0.9214015079196543" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 468px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">3000 మంది యుద్ధఖైదీలను ఉంచగలిగే క్యాంపులను నిర్మించారు. యుద్ధఖైదీల వరకు ఆలోచించారంటే చైనా యుద్ధానికి ఎన్నేళ్ళముందే నిర్ణయించుకుందో అర్థమవుతుంది. ఇక్కడ 3000 అని చెప్పడం ద్వారా భారత్ అంతకన్నా ఎక్కువమందిని పంపదు అన్న ఖచ్చితమైన అంచనా అక్కడి ఇంటేలిజెన్స్ ఇవ్వగలిగింది.</span></b></li>
<li style="list-style-type: decimal; vertical-align: baseline;"><b id="internal-source-marker_0.9214015079196543" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 468px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఇంతకు ముందే చెప్పుకున్నట్టు రోడ్లు, సమాచార వ్యవస్థలు, ఇతర మౌలికసదుపాయాలు పూర్తిస్థాయిలో నిర్మించారు.</span></b></li>
<li style="list-style-type: decimal; vertical-align: baseline;"><b id="internal-source-marker_0.9214015079196543" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 468px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">వాళ్ళ బలగాలకు భారత్కు వ్యతిరేకంగా నూరిపోసి అదే ఆలోచనలతో బ్రతికేలా చేశారు. సమస్యను భారత్ మొదలు పెట్టింది కాబట్టి మనం జవాబు చెప్పాలి అన్నది వాళ్ళ భావనైంది. </span></b></li>
<li style="list-style-type: decimal; vertical-align: baseline;"><b id="internal-source-marker_0.9214015079196543" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 468px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">వాళ్ళ సైనిక లక్ష్యం, రాజకీయ లక్ష్యం ఒకటిగా చేసుకున్నారు. దీనివల్ల ఉన్నతస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఒకటే విధానమైంది.</span></b></li>
</ol>
<b id="internal-source-marker_0.9214015079196543" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 468px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఇటు భారత్ వైపు సన్నాహాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు లేవు. సమాచార వ్యవస్థలేదు. ఇంటిలిజెన్స్ ఉందో?లేదో? తెలీదు. అవసరమైన యుద్ధసామాగ్రి, ఇతర వనరులు లేవు. ఆ సమయంలో సరిహద్దులో ఉన్న సైన్యానికి అతిదగ్గరగా ఉన్న మరొక దళం పంజాబులో ఉంది! మన భూభాగం అని చెప్పబడే ప్రాంతం గురించి కనీసవగాహన లేదు. అక్కడి భౌగోళిక పరిస్థితులు, వాతవరణం, జాతులు, వాళ్ళ భాష వగైరాలు వీసమెత్తైనా తెలీకుండానే మనవాళ్ళను అక్కడికి పంపారు. అన్నింటికన్నా ప్రమాదకరమైన అంశం- ఇక్కడ రాజకీయ లక్ష్యం, సైనిక లక్ష్యం పరస్పర విరుద్ధంగా ఉండటం. దీనివల్లే సమస్య రోజురోజుకీ ఝటిలమౌతూ వఛ్కింది. సైన్యంలోని మొదటి దళం అక్కడికి ప్రవేశించకముందే నాయకులు గంభీరమైన ప్రకటనలు ఇచ్చేశారు. ప్రజలకు నమ్మకం సడలిపోయాక, గగ్గోలు పెడుతూ ఆప్రభావాన్ని సైన్యంమీదకి తోశారు. అంతేగానీ ప్రజలను మభ్యపెట్టినందువల్లే సమస్య ముదిరిందన్న నిజం మాత్రం ఒప్పుకోలేదు. జాతీయ నాయకునిగా గుర్తింపుపొందిన వ్యక్తి సారధ్యంలోని ప్రభుత్వం దేశసంక్షేమానికన్నా పార్టీ బతకడమే ముఖ్యంగా భావించడం జీర్ణించుకోలేని నిజం.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">సరిహద్దులో వాతావరణం వేడెక్కేనాటికి ఉన్నత స్థాయిలోని వ్యక్తులెవరికీ వాస్థవ పరిస్థితిపై అవగాహన లేదన్నది వాస్తవం. సరిహద్దుకవతల చైనా శిబిరంలో ఏమి జరుగుతుందనే సమాచారం ఇవ్వాల్సిన ఇంటేలిజెన్స్ ఏమి చేస్తుందో తెలియట్లేదు. యుధ్ధ సన్నాహాల్లో మిగతా వాటికైతే ఖర్చవుతుంది. మనం అంతఖర్చును భరించలేకున్నాం. మరి ఇంటెలిజెన్స్ అన్నది ఆసాకుతో తోసెయ్యలేం కదా. మరి దాన్ని ఎందుకు పూర్తిస్థాయిలో వాడుకోలేదు? </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">సెప్టెంబరు మొదటివారంలో కూడా నాయకులంతా నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరించారు. నెహ్రూ లండన్లో జరుగుతున్న కామన్వెల్త్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు వెళ్ళాడు. ఆయన అక్కడ్నుంచి నైజీరియాకు వెళ్తాడు. కృష్ణమీనన్ ఐరాస సర్వసభ్య సమావేశంలో తన పలుకుబడిని పెంచుకునేందుకు పరిగెత్తాడు. అప్పట్లో ఈయన అనధికార ఉపప్రధానిగా వ్యవహరిస్తున్నాడు. ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ కూడా ప్రధానితో బాటు లండన్లో ఉన్నాడు. ఆయన అక్కడ్నుంచి వాషింగ్టన్ వెళ్ళి ప్రపంచబ్యాంకు సమావేశంలో పాల్గొంటాడు. మరొకవైపు సైన్యంలో చూస్తే- జనరల్ కౌల్ సెలవు పెట్టి కాశ్మీరులో విశ్రాంతి తీసుకుంటున్నాడు. "సరిహద్దులో యుద్ధం ఏక్షణానైనా రావచ్చు." అని ప్రకటన ఐతే ఇచ్చాడుగానీ దానికి తగ్గట్టుగా వ్యవహరించలేదు. ఈయన అక్టోబరులో పరిస్థితులు పూర్తిగా చెయ్యిదాటిపోయే వరకు డిల్లీకి రాలేదు. సైన్యంలో కొంతమంది అధికారులు శిక్షణనిమిత్తం వాళ్ళవాళ్ళ దళాలకు దూరంగా ఉన్నారు. ఇంకొంతమంది ఆటలపోటీలకు వెళ్ళారు.దాల్వీ సెలవుమీద బయటకు వెళ్తున్నాడు. పైనుంచి ఇథమిత్ధ్దంగా ఆదేశాలు ఏవీ లేకపోవడంతో అందరూ కులాసాగా ఉన్నారు. యుధ్దం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏమాత్రం అనుమానం కలిగినా సైన్యంలో కిందనుంచి పైదాకా ఇంత బేజారుగా ఉండేవాళ్ళు కాదేమో. మొత్తానికి సరిహద్దులో పరిస్థితి తుఫాను ముందు ప్రశాంతతగా చెప్పుకోవచ్చు.</span></b></div>
సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com4tag:blogger.com,1999:blog-3377763021527742745.post-84169260657683734542012-10-04T01:26:00.000+05:302012-10-04T01:27:25.689+05:30మేరునగ తప్పిదం- 7. ఆపరేషన్ ఓంకార్<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<b id="internal-source-marker_0.3014423558488488" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 471px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">లఢాఖ్లో బాద్యతలు నిర్వహిస్తున్న దాల్వీకి సెలవుమీద డిల్లీ వచ్చే అవకాశం దక్కింది. డిల్లీలో ఉన్నప్పుడు అనుకోకుండా మిలిటరీ సెక్రటరీ జనరల్ మోతీసాగర్ను కలిశాడు. ఆయన "అస్సాంలోని 7 బ్రిగేడ్కు కమాండర్గా పనిచేస్తున్న వ్యక్తి ఆరోగ్యకారణాల రీత్యా అక్కడినుంచి వెళ్ళిపోయాడు." అని చెప్పి, "అక్కడకు వెళ్ళేందుకు సిద్దమేనా?" అని అడిగాడు. అప్పటికే లఢాఖ్లో ఉన్న పరిస్థితులతో విసిగిపోయిన దాల్వి, అస్సామే మెరుగనుకుంటూ ( దాదాపూ అందరు ఉద్యోగులు ఇలానే ఆలోచిస్తారనుకుంటా!) వెంటనే అంగీకరించాడు. 1962 జనవరిలో బదిలీ ఉత్తర్వులు అందాయి. లఢాఖ్లో కమాండర్గా ఉన్న విక్రంసింగ్ విదిలేని పరిస్థితుల్లో అందుకు ఒప్పుకున్నాడు. అప్పటిదాకా ఈశాన్యసరిహద్దు గురంచి ఎలాంటి అవగాహనా లేకపోవడంతో, డైరెక్టర్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ బ్రిగేడియర్ డీ.కే.పలిత్ను కలిసి అక్కడి సమాచారాన్ని తీసుకున్నాడు. ఆయన కూడా దగ్గర్లో యుద్ధం వచ్చే అవకాశాలు లేవన్నట్టే మాట్లాడాడు. అయితే మైదానాల్లో పనిచేసే 9 పంజాబ్ దళాన్ని చలికాలంలో అక్కడికి పంపడం పట్ల అసహనాన్ని చూపెట్టాడు. భూటాన్ సరిహద్దు కొద్దిగా సున్నితమని హెచ్చరించాడు. ఫిబ్రవరి 27న డిల్లీ నుంచి బయలుదేరి మార్చి 1న రంగియా అనే స్టేషనుకు చేరుకున్నాడు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఆస్టేషన్లో ఎటుచూసినా సైనికులే. కాలకృత్యాలు తీర్చుకోను కనీస వసతులు లేవు. కాంటీన్లు లేకపోవడంతో అర్దాకలితో అలమటిస్తున్నారు. అక్కడినుంచి మిసిమారిలోని ప్రధాన కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ మేజర్ జనరల్ ఆమ్రిక్ సింగ్ను కలిసి పంజాబ్ దళాన్ని ఎవరు రప్పించారు? అని అడిగితే పైనుంచి ఉత్తర్వులు అన్నారేగానీ వాళ్ళకీ ఖచ్చితంగా తెలియదు. డీ.ఎం.ఓ.తో చర్చించిన విషయాలను ప్రస్తావించగా, ఇది తూర్పుదళం కిందకు వస్తుందని, కాబట్టి తూర్పుదళం ప్రధానకార్యాలయం ఉత్తర్వులు తప్ప మరేవీ పట్టించుకోవద్దనీ చెప్పారు. ఆయన సహజ స్వభావానికి విరుధ్ధంగా చాలా అసహనంగా కనిపించాడు. ఈసంఘటన దాల్వీకి కొన్ని అనుమానాలు రేకెత్తించింది. లెఫ్టినెంట్ కల్నల్ మనోహర్ సింగ్ను కలవగా, ఆయన రాబోయే కొన్నినెలలు సరిహద్దు వెంబడి కొత్తగా పోస్టులను నెలకొల్పడమే ప్రధాన బాద్యతగా తెలుపుతూ, దానికి </span><span style="font-weight: bold; vertical-align: baseline; white-space: pre-wrap;">ఆపరేషన్ ఓంకార్</span><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"> అన్న సంకేతాన్నిచ్చారు. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ను కలవగా ఆయన అక్కడి పరిస్థితులను వివరించి, కొన్ని కీలకమైన సమస్యలను తెలియజేశాడు. అక్కడ కూడా నిర్థిష్టమైన భద్రతా ప్రణాళికలు లేవని అర్థమైంది. దీంతో ఈశాన్య సరిహద్దులో పరిస్థితి లఢాఖ్ కన్నా ఏమీ మెరుగ్గాలేదనీ, పెనం మీద నుంచి కుంపట్లో పడ్డాననీ ఆయనకి తెలిసొచ్చింది. ఆప్రాంతంలో పరిశీలించగా తొవాంగ్ వైపు వెళ్తున్న దళాలు అక్కడకు తీసుకెళ్ళలేని కారణంగా భారీస్థాయిలో యుధ్దసామాగ్రిని, వాహనాలను, ఇతర ఉపకరణాలను వదిలిపెట్టేశారు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">దాల్వీ మరొక అధికారితో కలిసి మిసిమారి నుంచి తొవాంగ్కు బయలుదేరాడు. సముద్రమట్టం నుంచి 7000 అడుగుల ఎత్తులో ఉన్న <span style="color: red;">చాకో</span> అనే ప్రాంతంలో కొద్దిగా విశ్రాంతి తీసుకుని టీ తాగే సదుపాయం ఉన్నది. ఆదారిన వెళ్తున్న సైనికులందరికీ అదే ప్రధాన మజిలీ. అప్పటికే రెండేళ్ళనుంచి సైన్యం అదారిని వాడుతున్నా ఇంతకన్నా మెరుగైన సదుపాయం ఏదీలేదు. అక్కడి నుంచి<span style="color: red;"> డీరంగ్</span> అనే ప్రాంతానికి చేరుకునేసరికే సాయంత్రమైంది. ఇది సముద్రమట్టం నుంచి 5500 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడ అప్పటికే 1 SIKHSకు చెందిన ఒకబృందం కలిసింది. అక్కడ బోర్డర రోడ్స్ ఆర్గనైజేషన్ కార్యాలయానికి వెళ్ళి అక్కడీ ఇంజనీర్లను కలిశాడు. హిమాలయాల్లో రోడ్లు వెయ్యడం అంత సులువైన విషయంకాదు. కొండలను తొలుచుకుంటూ, వాలుమీదుగా రోడ్లు వెయ్యాల్సి వస్తుంది. ఒకసారి వేసిన తర్వాత కూడా తరచుగా కొండచరియలు విరిగి పడటం, మట్టి కుంగిపోవడం, వాలు వెంబడి మట్టి జారిపోవటం చాలాతరచుగా జరుగుతూ ఉంటాయి. ఒకసారి కట్టేదానికంటే వాటి మరమత్తులకే ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. ఇన్ని సమస్యల్లోనూ వాళ్ళు కొద్దిసమయంలోనే మెరుగైన రోడ్డు నిర్మించారు. అయితే రక్షణమంత్రి సభలో ప్రకటించినట్టి ఇది యుద్ధావసరాలకు సరిపోదు. చైనా రహదారులు 7టన్నులు మోయగలిగితే, ఇది కేవలం 1టన్ను మాత్రమే మోయగలదు. అదీ పొడివాతావరణంలోనే! </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">డీరంగ్ నుంచి బయలుదేరితే వెళ్ళేదారిమొత్తం అనేకచోట్ల మట్టికుంగిపోయి, అడుసుతో నిండిపోయి ఉంది. కొన్నిచోట్ల ఇటువైపు వాహనాన్ని వదిలి, అటువైపుకు అడుసులోనే నడుచుకుంటూ వెళ్ళి, ఇంకోవాహనంలో ఎక్కాల్సి వఛ్కింది. ఇక ఈదారిలో టాంకర్లు ఎలా వస్తాయి? <span style="color: red;">సెంగె</span> అనే ప్రాంతంలో మరొకబృందాన్ని కలిశారు. సేలా అనే ప్రాంతం చేరాక ఇక వాహనం ముందుకెళ్ళేందుకు దారిలేదు! దాంతో దాన్ని అక్కడే వదిలేసి కాలినడక వెళ్ళసాగారు. అది సముద్రమట్టం నుంచి 13000 అడుగుల ఎత్తులో ఉంది! అంటే ఇన్నిసమస్యలూ దాటి మన ఇంజనీర్లు అక్కడిదాకా రోడ్లు వేశారు. కానీ నిధుల కొరతతో అది సైనికావసరాలకు సరిపోనివిధంగా తయారయ్యింది.</span></b><br />
<b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 471px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"><br /></span></b>
<b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 471px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">సముద్రమట్టానికి 12000 అడుగుల ఎత్తునున్న <span style="color: red;">నురానౌంగ్</span> అనే ప్రాంతానికి చేరుకునేసరికే రాత్రవడంతో అక్కడే ఆగిపోయారు.</span><span style="vertical-align: baseline;"> </span><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">చుట్టూ ఎత్తైన పర్వతాలు ఉండటంతో ఇక్కడ సూర్యరశ్మి రోజుకు 2గంటలకన్నా ఎక్కువసేపు పడదు. దీంతో అది ఆప్రాంతంలోకెల్లా అత్యంత చల్లని ప్రదేశంగా పేరుకెక్కింది. అక్కడ జంతురవాణా ద్వారా ఉత్తరాలు బట్వాడా చేసే బృందం ఒకటి కనిపించింది. వాళ్ళు ప్రతిరోజూ ఇదేవాతావరణ పరిస్థితుల్లో సైన్యానికి ఉత్తరాలు బట్వాడా చేస్తుంటారు. కానీ వాళ్ళకు ఒకటార్పాలిన్ పట్ట తప్పించి కనీసం రగ్గు, భోజనం కూడా సరఫరా చెయ్యలేదు! ఎంత అమానుషం. తెలవారాక అక్కడినుంచి బయలుదేరి<span style="color: red;"> జాంగ్ </span>అనే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ జీపులో ఎక్కి తొవాంగ్కు బయలుదేరగా, 5మైళ్ల ముందు అది అడుసులో ఇరుక్కుపోయింది. చివరికి కాళ్ళీడ్చుకుంటూ సాయంత్రానికి <span style="color: red;">తొవాంగ్ </span>చేరారు. </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఇప్పుడు దాల్వీ ప్రయాణించిన మార్గాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుంటే- పర్వతపాదంలోని మిసిమారి నుంచి నిటారుగా పైకి 9000 అడుగులకు చేరితే మొదటి మజిలీ. అక్కడి నుంచి ఇంకాస్త పైకెక్కితే 1000 అడుగుల ఎత్తులో బొండిల్లా. నిట్టనిలువుగా కిందకి దిగి 5500అడుగులకు డీరంగ్. అక్కడినుంచి మళ్ళీ 13500 అడుగుల ఎత్తులో సేలాకనుమ. మళ్ళీ 5000 అడుగులకు దిగితే జాంగ్. చివరగా తొవాంగ్ చేరాలంటే 10000 అడుగుల ఎత్తుకు చేరాలి. ఒకసైనికుడు రంగియా స్టేషనుకు వచ్చి రైలు దిగాక, యుధ్దభూమికి చేరాలంటే ఇదేదారిలో వెళ్ళాలి. దాల్వీ అధికారి కాబట్టి జీపొచ్చింది. మనుశులు పలికారు. మరి మామూలు సిపాయి సంగతేంది? ఇదే దారిలో జనరల్ కౌల్ మరియూ జనరల్ సేన్ వచ్చారు. దారంతా చూసివెళ్ళారు. అయినా ఎలాంటి పురోగతీలేదు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">సైన్యం యుధ్దభూమికి చేరుకొని తమస్థానాల్లో నిలబడాలంటే కొన్ని కీలకమైన అంశాలు ప్రభావితం చేస్తాయి. దారిలో వాళ్ళ మజిలీలెక్కడ? ఎవరు ఎక్కడ ఆగాలి? ఎక్కడ ఆగకూడదు? మొత్తం సమయం ఎంత పడుతుంది? ఎన్ని బృందాలుగా పంపాలి? ఎంతెంత నిడవిలో ఒక్కొక్క బృందం బయల్దేరాలి? వంటివి. వాటికనుగుణంగా సౌకర్యాలు కల్పించాలి. మరి సౌకర్యాలన్న ఆలోచనే లేనప్పుడు ఈప్రశ్నలేవీ ఉదయించవు గదా.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఇక తొవాంగ్ పరిస్థితుల గురించి పెద్దగా చెప్పేదేమీలేదు. అదే పాతకథ. ఒక్క వైద్యసదుపాయాల విషయంలో మాత్రం ఇది మెరుగైంది. 1960లో ఒక సర్జికల్ యూనిట్ను ఇక్కడి వైద్యబృందం మొదలుపెట్టింది. మేజర్ జయరామన్ నేతృత్వంలోని వైద్యబృందం సైనికులకేగాక, స్థానిక అధికారులు, గిరిజన తెగలకు తమదగ్గరున్న సౌకర్యాలతో మెరుగైన సేవలను అందిస్తోంది. నెమ్మదిగా అక్కడ ఒక 25 పడకల ఆసుపత్రి, ఎక్స్ రే పరికరాలను ఏర్పాటు చేశారు. కానీ ఇది ఒకేచోట ఉండి పనిచేసేది కావడంతో యుద్ధావసరాలకు ఏమాత్రం సరిపోదు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">తొవాంగ్ చాలా అందమైన ప్రాంతం. బౌద్ధారామం. ఆరవ దలైలామా పుట్టినచోటు. మంగోలుజాతి తెగలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. బయటి ప్రపంచంతో సంబంధంలేకుండా వారిదైన సాంప్రదాయ జీవనాన్ని గడుపుతున్న వారికి ఇరుదేశాల సైన్యం ఆప్రాంతంలో సంచరించటం మూలాన జీవనవిధానంలో మార్పులొచ్చాయి. ద్రవ్యాన్ని వినియోగించటం వంటివి అలవరచుకున్నారు. అక్కడి రాజకీయ అధికారి షైజాను, దుబాసీలను కలిసుకుని స్థానికి పరిస్థితులను తెలుసుకున్నాడు. అలానే ఇతర ముఖ్యులను కలిసి పరిచయం చేసుకున్నాడు. ఇక సైనిక ఆపరేషన్లను పునర్విచారణ చేసుకోవడమే మిగిలిన పెద్దపని.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఒక పదాతిదళ నాయకునిగా అన్నికీలకమైన బాద్యతలు కమాండర్ భుజాలపైనే ఉంటాయి. ఏదైనా లోటుపాట్లుంటే కమాండింగ్ ఆఫీసర్కు తెలియజేసి, అవసరమైన మార్పులుచేర్పులు చెయ్యడం ఎంతోఅవసరం. కెమాంగ్ సరిహద్దు ప్రాంతంలో 7 INFANTRY BRIGADEకు అప్పగించిన కీలకబాద్యతలు</span></b><br />
<ol style="margin-bottom: 0pt; margin-top: 0pt;">
<li style="list-style-type: decimal; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 471px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">తొవాంగ్ను రక్షించడం</span></b></li>
<li style="list-style-type: decimal; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 471px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">సరిహద్దు వెంబడి చొరబాట్లను నిరోధించడం</span></b></li>
<li style="list-style-type: decimal; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 471px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">అస్సాం రైఫిల్స్ పోస్టులు నెలకొల్పడం</span></b></li>
<li style="list-style-type: decimal; vertical-align: baseline;"><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 471px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">అస్సాం రైఫిల్సుకు మద్దతునివ్వడం</span></b></li>
</ol>
<b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 471px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">కాగితం మీద చదివేందుకు బావానే ఉన్నా బాద్యతలకు- వనరులకు మద్య ఏమాత్రం పొంతనేలేదు. మొదటి బాద్యత అయిన తొవాంగ్ను రక్షించాలంటే బలగాలన్నీ అక్కడే మోహరించాలి. కానీ పోస్టులు నెలకొల్పడం, వాటిని కాపాడాలి అంటే 350 మైళ్ళ పొడవున బలగాలను విస్తరింపచెయ్యాలి. ఇంతటి పరస్పర విరుద్ధమైన లక్ష్యాలను సాధించేంత వనరులు, సదుపాయాలు మనదగ్గర లేదు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">బలగాలన్నీ వివిధప్రాంతాలనుంచి వచ్చాయి. వాటికి ఆప్రాంతం కొత్త. ఎక్కడ ఏకొండ ఉందో? ఎక్కడ ఏగుట్ట ఉందో? ఎవరికీ తెలియదు. పైగా అవన్నీ ఒకే దళానికి చెందినవి కావు. అనేక దళాల కలగూరగంప. ప్రతిదళానికి కొన్ని పరిమితులుంటాయి. అవేంటో తెలుసుకొని, ఒకరికొకరు సమన్వయ పరచుకుంటూ పనిచెయ్యడానికి కనీసం మూడునెలల సమయం పడుతుంది. కానీ సైనికుల్లో సింహభాగం ఇతరపనుల్లో నిమగ్నమయ్యారు. పోర్టర్లు లేకపోవడంతో హెలికాప్టర్లు వదిలిన సామాగ్రి వాళ్ళే తీసుకురావాలి. హెలీపాడ్ నిర్మించడానికి 1200మంది మూడునెలలు కష్టపడాల్సి వచ్చింది. "7000 అడుగులకన్నా ఎత్తులో మేము ఎగరలేం" అని వాయుసేన చెప్పడంతో, చేసేదిలేక రోజూ 2500 అడుగులు కిందకు వెళ్ళి పనిచేసి మళ్ళీ పైకి ఎక్కాల్సి వచ్చింది. మౌలిక సదుపాయాల నిర్వహణ కింద ఈపని BRO ఫరిధిలోకి వస్తుంది. ఇదే విషయాన్ని అక్కడి ఇంజనీరుకు చెబితే ఆయనకు చెయ్యాలని ఉన్నా పద్దుల నిర్వహణలో ఉన్న ఇబ్బందులు, నిధుల కొరత కారణంగా సందిహిస్తూనే సహాయం చేశాడు. మిగతావాళ్ళు 14000 అడుగుల ఎత్తులోనున్న పఁకెంగ్టాంగ్ అనేప్రాంతంలో షెల్టర్లు కట్టేపనిలో నిమగ్నమయ్యారు. ఇక శిక్షణ ఇచ్చేది ఎప్పుడూ? వాళ్ళ బలాబలాలను బేరీజు వేసేదెప్పుడు? వాళ్ళకు బాద్యతలు అప్పగించేది ఎప్పుడు? అదే ప్రశ్న అడిగితే "చైనాతో యుధ్ధంరాదు." అన్నదే సమాధానం. శిక్షణకు అనువైన రేంజి దొరికినా అధికారులు అనుమతివ్వరు!</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఇక్కడ ప్రధానంగా మూడు దళాలున్నాయి. ఒకటి 1/9 GORKHASని ప్రధమశ్రేణి దళంగా మంచిపేరుంది. వెళ్ళిన ప్రతిప్రాంతంలోనూ స్థానికులతో సంబంధాలను నెరపి సైన్యంపట్ల సదభిప్రాయం కలిగించడంలో వీళ్ళు సిద్ధహస్తులు. రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రఖ్యాతిగాంచిన ఇటలీ కేసినో యుద్ధంలో గెలవడంతో వీరు ప్రపంచ ఖ్యాతినార్జించారు. తరువాత కాశ్మీరులో పూంచ్ సెక్టారులో అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. కానీ ఇక్కడ రెండేళ్ళుగా శిక్షణ లేదు! అదేస్థాయికి చెందిన మిగతా రెండు దళాలు 9 PUNJAB, 1SIKHS లదీ అదేపరిస్థితి. </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">పెద్దపెద్ద బాద్యాతలైతే నెత్తినపెట్టారు గానీ, సైనికుల సంఖ్యమీద పరిమితిని మాత్రం సడలించలేదు. దానికి ప్రధానకారణం- 1700 మందికన్నా ఎక్కువమందికి సామాగ్రిని సరఫరా చెయ్యలేకపోవడమే. తొవాంగ్లో సంఖ్యను పరిమితం చేసినప్పుడు కనీసం అలారం వ్యవస్థను, రహదారులను మెరుగుపరుచుకోవాల్సింది. కానీ అలాంటివేమీ చెయ్యలేదు. బలగాల మోహరింపు అన్న సున్నితమైన విషయం భవిష్యత్తును ప్రమాదంలో తోసేసేలా తయారయ్యింది. ఎక్కడా అదనపు బలగాలు, అదనపు సమాగ్రి వంటివాటిని ఆలోచించలేదు. ఇక్కడికే వ్యయం పెరిగిపోతుండంటూ పైవాళ్ళు గగ్గోలుపెడుతున్నప్పుడు అదనపు అన్నమాటను వింటే చీల్చిచెండాడేలా ఉన్నారు. అదే సమయంలో చైనీయుల బలం గురించి, వాళ్ళు దాడులు చేసే దారుల గురించి రక్షణశాఖకు ఎటువంటి సమాచారం లేదు. కేంద్ర ఇంటేలిజెన్స్ వ్యవస్థ ఎలాంటి నివేదకనూ సమర్పించలేదు. </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఒకవైపు మూడూప్రధానమైన మార్గాలను, మరోప్వైపు అస్సాంరైఫిల్స్ ఆధీనంలోని పోస్టులను రక్షించాల్సిన బాద్యత అక్కడి సైన్యంపై పడీంది. ఇక్కడ ఇంకొక ప్రధానమైన సమస్య- అస్సాం రైఫిల్స్ కేంద్ర విదేశాంగ శాఖ కిందకు వస్తాయి. అంటే దాని అధికార క్రమం, ఇతర పరిపాలనా విషయాలతో సైన్యానికి ఎలాంటి సంబంధంలేదు. సైన్యం చెయ్యగలిగిందల్లా వాళ్ళని కాపాడటమే. ఇలాంటి ప్రైవేటు సైన్యాలను ఏర్పాటుచేసిన ప్రతిచోటా సమస్యలు రెట్టింపవ్వడం తప్ప సాధించిందేమీ లేదు. ఒకరి కింద ఆదేశాలు పాటిస్తూ జీతం తీసుకుంటూ, మరొకడితో పనిచెయ్యడం అన్నది ఎప్పుడూ సత్పలితాలివ్వదు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">తొవాంగ్లో పరిస్థితులు అర్థమయ్యాక, మిగతా ప్రాంతాలను చూసుకుంటూ, సరిహద్దు ప్రాంతాన్ని విశ్లేషించడానికి దాల్వీ బయలుదేరాడు. ఆప్రాంతంలో ప్రధానమైన దారులు, వంతెనలు ఇతర భౌగోళిక విషయాలు చూసుకోవడం అత్యంతకీలకం. అందరికీ కాశ్మీరు ప్రాంతంమీదున్నంత అవగాహన ఈప్రాంతంమీద లెకపోవడం కొద్దిగా కలవరపరిచే విషయం. తనకు తోడుగా లెఫ్టినెంట్ కల్నల్ అహ్లూవాలియా, మరొక స్థానికుడు తోడుగా వచ్చారు. దారిలో ఉన్న గ్రామాలను, తండాలను సందర్శిస్తూ, అక్కడి గ్రామపెద్దలతో పరిచయాలు పెంచుకున్నాడు. వాళ్ళ ఆహారపుటలవాట్లు, ఆచారవ్యవహారాలు తెలుసుకున్నాడు. సైన్యం నుంచి అందాల్సిన బకాయిలను వెంటనే అందేలా చర్యలు తీసుకున్నాడు. అక్కడున్న షక్తి, లుంపు, చోక్సన్ ప్రాంతం కీలకమైనదిగా గుర్తించారు. తిరిగొచ్చాక మరొక దిక్కువైపునున్న బూమ్లాకు బయలుదేరాడు. బుమ్లా అత్యంతపురాతన వాణీజ్యకేంద్రం. సతాబ్దాలుగా ఈదారిలో వర్తకవాణిజ్యాలు జరుగుతున్నాయి. తన పరిశీలనలను పైఅధికారులకు నివేదిస్తూ అదనపు బలగాలను కోరాడు. వాళ్ళు దాల్వీ చెప్పిన అంశాలను అంగీకరిస్తూనే అదనపు బలగాలివ్వటం కుదిరేపనికాదని తేల్చిచెప్పారు. దళాలను కూడా బృందాలుగా విడిపోయి ప్రాంతమంతా తిరగాల్సింగా ఆదఆేశించాడు. సంచార యుధ్దసామాగ్రిని ఉపయోగించడంపై పధకాలు రచించారు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఇక ఆపరేషన్ ఓంకర్లో భాగంగా ముఖ్యమైన పోస్టులు నెలకొల్పే పనిని మొదలుపెట్టారు. భూటాన్ మూలకు ఉన్న థాగ్లా ప్రాంతంపైన అప్పటికే చైనీయులు విబేధించి ఉన్నారు. నెహ్రూ కూడా </span><span style="font-weight: bold; vertical-align: baseline; white-space: pre-wrap;">వివాదాస్పదంకాని </span><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ప్రాంతాల్లోనే పోస్టులు ఏప్రాటు చెయ్యమన్నాడు. కానీ ఎక్కడెక్కడ పోస్టులు ఏర్పాటుచెయ్యాలన్న పట్టీలో వివాదాస్పదమై ఉన్న థాగ్లాను చేర్చారు! ఇది మొత్తం వ్యవహారానికి కేంద్రబిందువయ్యింది. కాలక్రమంలో మేరునగ తప్పిదానికి మూలమయ్యింది. అయితే మీనన్ ఈప్రశ్నకు సమాధానమిస్తూ " ఎక్కడ ఏర్పాటు చెయ్యాలనేది రాజకీయ అంశం. అది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అయితే అక్కడ పోస్టు ఏర్పాటు చెయ్యాలా? వద్దా? అన్నది సైన్యమే నిర్ణయించుకోవాలి." అంటూ విషయాన్ని మరింత వివాదాస్పదం చేశాడు. భారత్ చేస్తున్నది ఫార్వర్డ్ పాలసీకాదని. తన భూభాగాన్ని రక్షించుకోవడమేనని. చైనాయే ఫార్వర్డ్ పాలసీతో ఇటువైపు వస్తోదని. చెప్పడంతో చైనాను మరింత రెచ్చగొట్టాడు. అయితే ఈవిషయంపై జనరల్ కౌల్ ఎక్కడా సమాధానమివ్వలేదు. దాంతో ఈనిర్ణయం ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకున్నదా? లేక సైన్యం దానికి సమ్మతిని తెలిపిందా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకలేదు.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఒకవేళ ఇక్కడీ పరిస్థితి అదుపుతప్పితే ఏఁచెయ్యాలో అర్థంకాక దాల్వీ పై అధికారుల సూచనలను, ఇతర సమాచారాన్ని కోరాడు. కానీ వాళ్ళు సమాధానమివ్వకపోగా, ఆయన సందేహాలన్నింటినీ కొట్టిపారేశారు. ఒక్క నమ్కచు పోస్టు తప్ప మిగతావన్నీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాయి. భౌగోళిక అంశాల దృశ్ట్యా ఆదేశాల్లో పేర్కొన్న ఢోలా పోస్టుకూడా సరియైనది కాదు. దానికి ముందున్న థాగ్లా పర్వతశ్రేణి ( భారత్ చెప్పినట్టు సరిహద్దు) లేదా వెనకాల ఉన్న హథుంగ్ల కనుమ పోస్టుకు అనుకూలం. అయినా పై అధికారులెవరికీ భౌగోళిక పరిస్థితులమీద అవగాహన లేకుండటంతో కష్టసాధ్యమైన ప్రాంతాల్లో పోస్టులు నెలకొల్పారు. అందుకు జాతి తగిన మూల్యం చెల్లించుకుంది.</span></b></div>
సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3377763021527742745.post-34468569556903701022012-10-03T01:20:00.001+05:302012-10-03T01:32:29.372+05:30మేరునగ తప్పిదం-6. వైకుంఠపాళి<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<b id="internal-source-marker_0.23785109003074467" style="font-weight: normal;"><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">ప్రకటనలైతే గంభీరంగా ఇచ్చేస్తున్నారుగానీ సరిహద్దులో వాస్తవ పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రావట్లేదు. ప్రభుత్వ కార్యాలయాలు , సైనిక విభాగాలు గందరగోళానికి గురై ఉన్నాయి. సుహృద్బావ వాతవరణంలో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. ప్రభుత్వ ఉత్తర్వుల్లోని డొల్లతనం, ప్రణాళికాలేమి సైన్యాన్ని మరింత సందిగ్ధంలోకి నెట్టేస్తూ వచ్చింది. ఆపద్ధర్మ నియామకాలు, వనరుల నామమాత్రపు పెంపు తప్ప సైనిక వ్యయంపై విధించిన ఆంక్షలను సడలించలేదు. మూడవ పంచవర్షప్రణాళికకు కేటాయించగా మిగిలన నామమాత్రపు నిధులతో రక్షణచర్యలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సైనిక అవసరాలన్నీ పూర్తిగా ప్రభుత్వరంగ ఉత్పత్తుల మీద ఆధారపడాల్సి వచ్చింది. 1960 ఏప్రిల్లో చౌ ఎన్ లై భారత పర్యటనకు వచ్చాడు. సరిహద్దును మరోసారి పర్యవేక్షించి చర్చలు జరిపేందుకు అంగీకరించాడు. తర్వాత పెకింగ్లో జరిగిన చర్చల్లో రేఖవెంబడి ప్రధానంగా థాగ్ల ప్రాంతంలో భారత్ వాదనతో చైనా విబేధించింది.</span><br /><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">1960 అక్టోబరులో జే.పీ.దాల్వీకి బ్రిగేడియరుగా పదోన్నతి లభించింది. ఆయన అప్పటికి లఢాఖ్లో బాద్యతలను నిర్వర్తిస్తున్నారు. అక్కడి XV CORPSకి బ్రిగేడియర్ ఇన్ చార్జ్ అడ్మినిస్ట్రేషన్గా నియమించబడ్డారు. అప్పటికే సైన్యాన్ని లఢాఖ్ పంపి సంవత్సరం కావస్తున్నా వాళ్ళకి నిత్యావసరాలు కూడా కరువైనాయి. అగ్గిపెట్టెలు, కిరోసిన్, గోధుమలు వంటి వాటికి కూడా రేషన్ అమలుపరిచే స్థితిలో అక్కడ సైన్యం పనిచేస్తుంది. అప్పటికే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేశన్ ఏర్పాటు చేసి ఉన్నా, చెప్పుకోదగ్గ ప్రగతి ఏమీకనిపించలేదు. రవాణా పూర్తిగా హెలికాప్టర్ల ద్వారానే నడుస్తోంది. అటు ఎయిర్ ఫోర్స్ వద్ద తగినన్ని విమానాలు, ఇతరపరికరాలు లేవు. సైన్యం విశాలమైన ప్రాంతాల్లో అక్కడక్కడా బెటాలియన్లుగా విడిపోయి పనిచేస్తుండటంతో సరైన వైద్యసదుపాయాలు కల్పిచడం కష్టమైంది. వైద్యం చెయ్యడానికి హెలికాప్టర్లొక్కటే మార్గం. సమయానికి అవి దొరకనప్పుడు, దొరికినా వాతావరణం అనుకూలించనప్పుడు వైద్యం అందక కొందరు జవాన్లు మరణించడం అధికారులను కలచివేసింది. ఈసమయంలో నెహ్రూ "భారత భూభాగాన్ని పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నాం. మరో ఒకట్రెండు సంవత్సరాల్లో పర్వతప్రాంతాలన్నింతికీ రోడ్లు, ఇతర సదుపాయాలు సమకూరుస్తాం." అని ప్రకటించాడు.</span><br /><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">సైన్యానికి ఉన్న సమయమంతా ఇటుకలు కాల్చడానికి, చెట్లు నరికడానికి, హెలికాప్తర్లు విడిచిన వస్తువులు తీసుకురావడానికే సరిపోయింది. ఇక శిక్షణకు తీరికేది? నిజానికి ఎవ్వరూ వాళ్ళకు ఇవ్వాల్సిన శిక్షణగురించి దిగులుపడలేదు. అసలు యుద్ధం వస్తేకదా అన్నది వాళ్ళ వాదన.</span><br /><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">బ్రిగేడియర్ దాల్వీ అక్కడి బాద్యతలు స్వీకరించేసరికే ఆర్మీకి- ఎయిర్ ఫోర్సుకి మద్య సమంవయలోపం పెద్ద సమస్యగా మారింది. ఆర్మీవాళ్ళు ఎయిర్ ఫోర్సును "అత్యధికంగా ఎంత బరువు మీహెలికాప్టర్లు మొయ్యగలవు?" అని అడిగితే "అసలు మీకు ఎంత బరువు మొయ్యాలి? అది చెప్పండి ముందు." అంటూ వాళ్ళు ఎదురుప్రశ్న వెయ్యసాగారు. వారంలో ఎన్నిరోజులు హెలికాప్టర్లు పనిచేస్తాయో చెప్పలేని స్థితిలో ఎయిర్ ఫోర్సు వాళ్ళు ఉన్నారు. వాళ్లకి ఇక్కడీ వాతావరణ పరిస్థితుల మీద ముందెన్నడూ అవగాహనలేదు. ఆర్మీ- ఎయిర్ ఫోర్సుల మద్య ఒక ఉమ్మడి కార్యాచరణలాంటిదేదీ తయారుచెయ్యకపోవడం, అలానే రెండింటిమద్యా సమన్వయానికి ఉన్నతస్థాయిలో ఎలాంటి చర్యా తీసుకోకపోవడం ఎన్నోసమస్యలకు దారితీసింది. ఇదేసమయంలో మీనన్ ఎయిర్ ఫోర్సును వాళ్ళ సామర్థ్యాన్ని ఎక్కువచేసి చెప్పమంటూ ఒత్తిడి తేవడంతో చేసేదిలేక వాళ్ళు అలానే చెయ్యల్సి వచ్చింది. ఇవేవీ పట్టని ప్రధాన కార్యాలయం సైన్యాన్ని పోస్టులు ఏర్పాటు చేసి కాపలా కాయమంది. </span><br /><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">సరుకు రవాణా గురించి లెక్కలువేసిన అధికారులు డిల్లీలో ఒకసమావేశాన్ని ఏర్పాటు చేశారు. దళాల మద్య సమన్వయం పెంపొందించడానికి లెఫ్టినెంట్ జనరల్ ఎల్.పీ.సేన్ నాయకత్వంలో ఈసమావేశం ఏర్పాటు చెయ్యటం జరిగింది. జనరల్ కౌల్ అప్పటికి ఇంకా చీఫ్ కాలేదు. క్వార్టర్ మాస్టర్ జనరల్ (QMG)గా బాద్యతలు నిర్వర్తిస్తున్నారు. సమావేశానికి కొన్నినిముషాలు ఆలస్యంగా వచ్చిన ఆయన కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా, తనలాంటి బిజీమనుషులకి ఇవిమామూలే అన్నట్టుగా ప్రవర్తించడం ఆయనగురించి తెలియనివాళ్ళని నిశ్చేష్టుల్ని చేసింది. వచ్చీరావడంతోనే ఇతరుల అభిప్రాయాలను వినకుండా ఒకసంఖ్య చెప్పి, అంతకన్నా సామాగ్రిని రవాణాచెయ్యడం కుదరదని తేల్చి చెప్పేసి, వేరేదో పనుందంటూ వెళ్ళిపోయాడు. ఉన్నతాధికారులను పలకరించటం, సైనిక కార్యకలాపాలను చర్చించటం వంటి సైనిక ఆచారాలేవీ పాటించకుండా తనొక ప్రత్యేకమైన వ్యక్తిని అన్నట్టు ప్రవర్తించడం అధికారులకు మింగుడుపడలేదు. అప్పటివరకు ఆయన గురించి వినడమేగానీ ఎప్పుడూ చూడని దాల్వీవంటి వాళ్ళకి విచిత్రంగా అనిపించింది. జనరల్ సేన్ నిర్ణయంకోసం అందరూ ఎదురుచూస్తుండగా ఆయన కౌల్ నిర్ణయమే ఆఖరిది అన్నట్టు మాట్లాడాడు. దీంతో నిరాశకెందిన జనరల్ వర్మ తమకు ఈవిషయంలో నిర్ధుష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. తరువాత కొంతకాలానికి కౌల్ చీఫ్ అయ్యాక అక్కడే మరొక సమావేశం జరిగింది. ఉన్నత స్థాయి రహస్య సమావేశంగా పేర్కొన్నదాంట్లో రక్షణవ్యవహారాలకు, సరిహద్దులో సైనిక చర్యలకు ఎలాంటి సంబంధంలేని ఎవరెవరెవరో ఆహ్వానితులుగా పిలవబడ్డారు! అందులో ఒకాయన హెలికాప్తర్లలో యాత్రికులను లఢాఖ్ వరకు తీసుకువెళ్ళేందుకు కుదురుతుందా అని అడిగాడు!</span><br /><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">సమావేశంనుంచి తిరిగొచ్చాక కౌల్ పేర్కొన్న పరిమితిబట్టి లెక్కవేస్తే రవాణా పూర్తిగా నిర్మాణ పనులకే సరిపోయింది. ఇక యుధ్ధసామాగ్రిని ఎలా తీసుకురావాలి? ఈప్రశ్నకు సమాధానం "చైనాతో యుధ్ధంరాదు. కాబట్టి యుధ్ధసామాగ్రి అవసరంలేదు." !! లఢాఖ్ రాజధాని లేహ్ వరకు రహదారి పూర్తవుతున్నా దాన్ని సైనిక అవసరాలకు వినియోగించేందుకు మరిన్ని సదుపాయాలు కల్పించాలి. </span><br /><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">నెహ్రూ లోక్ సభలో మాట్లాడుతూ "పరిస్థితులు పూర్తిగా మనకు అనుకూలంగా మారాయి. సైన్యం ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాల్లో మన ఆధిపత్యం పూర్తిగా బలపడింది. చైనీయులతో పోరాడేందుకు మనసైన్యం సన్నద్ధంగా ఉంది." అని ప్రకటించాడు. ఈవార్త తెలియడంతోనే జనరల్ వర్మ వాస్తవ పరిస్థితులను తెలియజేస్తూ తన పై అధికారి అయిన పశ్చిమదళ కమాండర్ జనరల్ థాపర్కు ఘాటైన లేఖ రాశాడు. లేఖలోని విషయాలను వెంటనే ఆర్మీ ప్రధానకార్యాలయానికి తెలియజేయమని కోరాడు. జనరల్ థాపర్ వర్మను సముదాయిస్తూ వాస్తవ పరిస్థితులు తమకు తెలుసునని, కేవలం ప్రజాగ్రహం నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి నెహ్రూ ఆప్రకటన చేశాడని చెబుతూ లేఖను ఉపసంహరించుకోవాలని సూచించాడు. అయితే వర్మ ఈవిషయంలో చాలామొండిగా వ్యవహరించాడు. తరువాత కొంతకాలానికి ఆయనకన్నా జూనియర్లైన సేన్ మరియు దౌలత్ సింగ్ లకు పదోన్నతి కల్పించడంతో మనస్తాపానికి గురైన వర్మ రాజీనామా చేశాడు. తరువాత ఆయనను ఎన్నో ఇక్కట్లకు గురిచేశారు. కొంతకాలం పెన్షన్ కూడా అందలేదు. కొన్ని తప్పుడు ఆరోపణలు ఆయనమీద చెయ్యడంతో మనస్తాపానికి గురైన ఆయన తన ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రులను, ఇంటిని, మాతృభూమిని వదిలిపెట్టి బ్రిటన్లో నివసించసాగాడు. </span><br /><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">అయితే ఈఅంశం రక్షణమంత్రి మీనన్ శత్రువులకు ఒక రాజకీయ అస్త్రంగా మారింది తప్ప సైనిక నియామకాల్లోనూ, పదోన్నతి విధానాల్లోనూ మార్పు తేలేకపోయింది. జనరల్ కౌల్ను ఆర్మీచీఫ్గా నియమించడంతో వాదోపవాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో మీనన్ తరపున నెహ్రూ వకాల్తా పుచ్చుకున్నాడు. "జనరల్ కౌల్ అసాధారణ ప్రతిభా పాటవాలు గలిగిన సైనికుడనీ, యుద్ధభూమిలో ఆయన మహాధీరుడ"ని చెప్పుకొచ్చాడు. కానీ సదరు కౌల్ గారికి అప్పటి వరకు ఒక్క యుధ్ధంలోనూ దళానికి సారథ్యం వహించిన దాఖలాలు లేవు. అంబాలాలో సైనికుల గృహనిర్మాణాలు చెయ్యించడమొక్కటే ఆయన అప్పుడు నిర్వహిస్తున్న అతిపెద్ద కార్యక్రమం. పాతికేళ్ళు పదాతిదళంలో పనిచేశాడని నెహ్రూ చెప్పగా జనరల్ తిమ్మయ్యకూడా దానిని ఖండించాడు. </span><br /><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">మొదట కొంతకాలం పదాతిదళంలో పనిచేసినా వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి దాన్ని వదిలి వేరే శాఖకు బదిలీ చెయ్యించుకున్నాడు. అప్పిటికి ఎక్కడా యుధ్దం చెయ్యనేలేదు. ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ఆయన డిల్లీలోని ప్రధాని కార్యాలయం వద్దనే పనిచేస్తూ తన పరిచయాలు పెంచుకున్నాడు. స్వతంత్ర్యం వచ్చాక నెహ్రూ ఆయనని వాషింగ్టన్కు భారత సైనిక ప్రతినిథిగా పంపాడు. 1948లో ఐరాస భద్రతాసమితిలో కాశ్మీరు అంశంపై భారత ప్రతినిధిగా పంపాడు. షేక్ అబ్దుల్లాతో బేధాభిప్రాయాలు రావడంతో ఆయన వెనక్కు రావల్సివచ్చింది. ఇక్కడికే ఆయనకి భారత రాజకీయాలు, లాబీపద్దతులు వగైరాలు బాగా తలకెక్కాయి అనుకుంటా. 1953లో షేక్ అబ్దుల్లా కొరకరానికొయ్యగా మారుతుండటంతో ఆయన్ను అరెస్టు చెయ్యడానికి నెహ్రూ కౌల్ను ఉపయోగించుకున్నాడు. యుద్ధతంత్రంతోపాటు కొద్దిగా రాజకీయ చతురత అవసరమైనప్పుడల్లా నెహ్రూ కౌల్ను ఉపయోగించుకోసాగాడు. అంటే ఒకవిధంగా చెప్పాలంటే సత్తా ఉన్న సైనికుణ్ణి నెహ్రూ తన అవసరాలకోసం కలుషితం చేశాడు. కౌల్ తనొక సైనికాధికారి అన్న సంగతి మర్చిపొయ్యి ఆవిషాన్ని వంటపట్టించుకుని, మత్తులో తేలియాడాడు. వీటన్నిటి ప్రభావంతో కౌల్ తన భవిష్యత్తు గురించి భారీగా కలలు కననారంభించాడు. ఇప్పుడు కౌల్ లక్ష్యం సైనికాధ్యక్షుడో, రక్షణమండలి సభ్యత్వమో, రక్షణమంత్రి కావడమో కాదు. నెహ్రూ తర్వాత ప్రధాని కావడమే! అని అనేకులు సందేహం వెలిబుచ్చేలాగా కౌల్ ప్రవర్తన మారిపోయింది.</span></b><br />
<b><span style="font-family: Arial; font-weight: normal;"><span style="font-size: 15px; white-space: pre-wrap;"><br /></span></span><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">కిందిస్థాయినుంచే రాజకీయ పరిచయాలు పెంచుకోవడం, అనేక వివాదాస్పద విషయాల్లో నాయకులు ఇతన్ని ఉపయోగించుకోవడంతో కౌల్ సర్వీసులో అధికభాగం చిల్లర విషయాలను పరిష్కరించడానికే సరిపోయింది. దాంతో క్రమంగా అతనిలోని సైనికుడు అంతర్థానమైపోయాడు. ఒక సైన్యాధ్యక్షునిగా అత్యంత అవసరమైన యుద్ధతంత్రాలను రూపొందించే అనుభవం అతనికి ఎప్పుడూ ఎదురవలేదు. అరేళ్లపాటు జరిగిన రెండవ ప్రపంచయుద్ధంలో పాల్గొని తననుతాను నిరూపించుకునే సువర్ణావకాశాన్ని ఉపయోగించుకోలేదు. సర్వీసులో సింహభాగం ఆయన పనిచేసిన శాఖలు సైన్యంలో కీలకం కావు. </span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;"><span style="font-weight: normal;">ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నత పదవులకు వ్యక్తులను నియమించేటప్పుడు ప్రధాని నిర్ణయం అత్యంత కీలకం. ఇది ఎవరూ కాదనలేనది. ఎక్కడైతే అధికారం ఉందో అక్కడే అంతకు పదింతల బాద్యత ఉంటుంది. రెండుదేశాల మద్య సంబంధాలు కీలకదశకు చేరుకున్నప్పుడు, జాతి గౌరవం అత్యంతముఖ్యమైనప్పుడు సైనికాధ్యక్షుణ్ణి ఎన్నుకునేవ్యక్తికి అది అధికారంలాగాక బాద్యతగా కనిపించాలి. ఎక్కడైనా ఉన్నతస్థాయిలో నియామకాలు, పదోన్నతులు కల్పించేటప్పుడు ప్రతిసారీ సీనియర్లనే ఎన్నుకోవాలి అన్నది కుదిరేపనికాదు. కొన్నిసార్లు జూనియర్లనూ పదవిలో కూర్చోపెట్టాల్సి వస్తుంది. దీనికి ఏసంస్థా, ఏవ్యవస్థా అతీతంకాదు. కానీ అక్కడ నిబద్ధత, సామర్థ్యం తప్ప మరేవీ కొలమానాలుగా ఉండకూడదు. ఉన్నతస్థాయికి చేరడమనే వైకుంఠపాళిలో కొందరికి నిచ్చెనలు మరికొందరికి పాములూ సహజమే. కానీ ఎవ్వరికి ఎప్పుడు నిచ్చెన ఇవ్వాలి, ఎంతపెద్ద నిచ్చెన ఇవ్వాలి, ఒకసారి నిచ్చెన ఇచ్చాక అతను పాముకు బలికాకుండా ముందుకుపోగలడా అన్నది చూసుకోవడం అధినాయత్వపు ప్రధాన లక్షణమై ఉండాలి. కానీ జనరల్ కౌల్ విషయంలో ప్రాధమిక అంశాలుగా దేశభద్రత, జాతిగౌరవంగాక రాజకీయాలు ప్రధానమవ్వడంతో ఆయనకు అందగూడని నిచ్చెనలు అందించారు. చైనా యుద్ధంలో భారత్ చేసిన తప్పులలోకెళ్ళా ఇది </span><span style="color: red;">ఎవరెస్ట్ శిఖరమంత</span><span style="font-weight: normal;"> తప్పు.</span></span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">భారతదేశంలో చిన్నపిల్లలనుండి కురువృద్ధుల వరకూ నెహ్రూను మహాయోధునిగా చూస్తారు. దైవాంశసంభూతునిగా పూజిస్తారు. గత రెండుమూడు శతాబ్దాల్లో దేశంలో ఏరాజుకీ లభించని ఆదరణ నెహ్రూకి లభించింది. స్వతంత్ర పోరాటంలో తెల్లవాని జిమ్మిక్కులను తన వాదనలతోనూ, దౌత్యపరమైన కార్యక్రమాలతోనూ ఎదుర్కొన్నతీరు ప్రజలను ఉద్వేగానికి గురిచేసింది. దేశగౌరవంకోసం పదేళ్ళపాటు జైళ్ళలో మగ్గిన ఈనాయకుడంటే పడిచచ్చిపోతారు జనం. ఆయన్ను వ్యతిరేకించేవానికి రాజకీయ భవిష్యత్తు ఉండదన్న స్థాయిలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. కానీ సంపన్నకుటుంబంలో పుట్టి, విదేశాల్లో చదువుకుని, దొరల జీవనశైలిని అవలంబించటం అతనికీ- సామాన్య ప్రజలకేకాదు, ఆతనికీ- నాయకులకూ, అధికారులకు మద్యనకూడా పొత్తుకుదరలేదు. తన ఆలోచనలను అర్థంచేసుకునే స్థాయికి వీళ్ళు ఇంకా ఎదగలేదని భావించసాగాడు. నెమ్మదిగా మానసికంగా ఒంటరితనం పెరిగిపోయింది. పటేల్ మరణంతో ఇది మరింత పెరిగిందనే చెప్పొచ్చు. నెమ్మదిగా కీలకమైన అంశాల గురించి కొద్దిమందితో మాత్రమే చర్చించి, ఏకపక్షనిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇది దేశభద్రతను తీవ్రంగా ప్రభావితం చేయసాగింది.</span></b></div>
సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com4tag:blogger.com,1999:blog-3377763021527742745.post-48637087654920490602012-10-02T02:26:00.002+05:302012-10-02T03:07:26.488+05:30మేరునగ తప్పిదం- 5. సైనికులతో చదరంగం<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<b id="internal-source-marker_0.5400706629734486" style="font-weight: normal;"><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">సైన్యాన్ని మరింతముందుకు పంపాలని ప్రభుత్వంనుంచి ఒత్తిడి వచ్చినప్పుడల్లా జనరల్ తిమ్మయ్య మొండిగా వ్యవహరించడం నాయకులకు అసహనాన్ని తెప్పించింది. తూర్పుదళానికి నాయకత్వం వహిస్తున్న జనరల్ థాపర్ కూడా ఆయనకు మద్దతిస్తూ భౌగోళికంగానూ, ఆర్థికపరంగానూ మనకున్న పరిమితులను వివరిస్తూ సుదీర్ఘ నివేదిక ఇవ్వడంతో చేసేదేమీలేక గుట్టుగా ఉండిపోయారు. తిమ్మయ్య పదవీ విరమణ చెయ్యడంతో ఆయనకు వారసుణ్ణి వెతకాల్సిన పని ప్రభుత్వంమీద పడింది. జనరల్ థాపర్ తిమ్మయ్యతో ఏకీభవించినవాడు కావడంతో ఆయనకు పెన్షన్ ఇచ్చి పంపేసింది. లఢాఖ్లో దళాలకు నాయకత్వం వహిస్తున్న జనరల్ వర్మను పక్కన పెట్టడంతో మనస్తాపంచెంది ఆయన రాజీనామా సమర్పించాడు. జనరల్ థొరట్ కూడా మాటవినేరకం కాదని ఆయన అభ్యర్థిత్వాన్ని బుట్టలోపడేశారు. అలా నిబద్దత, నిజాయితీతోపాటు సర్వీసు ఉన్న అధికారులను పక్కన పెట్టడంద్వారా నాయకులు తమ అడుగులకు మడుగులొత్తే వ్యక్తిని ఆస్థానంలో కూర్చోబెట్టేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. అలా జనరల్ బీ.ఎం.కౌల్ సైన్యాధ్యక్షుడుగా బాద్యతలు చేపట్టాడు. </span></b><br />
<b style="font-weight: normal;"><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;"><br /></span></span></b>
<b><span style="font-family: Arial; font-weight: normal;"><span style="font-size: 15px; white-space: pre-wrap;"><br /></span></span><span style="vertical-align: baseline;"><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; white-space: pre-wrap;">జనరల్ కౌల్ వచ్చీరావడంతోనే 'ఫార్వర్డ్ పాలసీ'ని భుజంమీదవేసుకుని తిరగటం మొదలుపెట్టాడు. నెహ్రూ- కౌల్, థాపర్, మీనన్లతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఒకమ్యాపులో చైనా ఆక్రమించుకున్న ప్రాంతాలను చూపెడుతూ "మనము కూడా వీలైన చోట పోస్టులను ఎందుకు ఏర్పాటు చెయ్యకూడదు? చైనా చేస్తున్నప్పుడు మనము చెయ్యకూడదా?" అని అడిగాడు. అందుకు థాపర్ బదులిస్తూ మనకున్న ప్రతికూలాంశాలను వివరించాడు. "సరిహద్దు ప్రాంతానికి సరైన మౌలికసదుపాయాలు లేవు. ఒకవేళ మనం ఎక్కడైనా పోస్టును ఏర్పాటు చేస్తే చైనా దాన్ని ఆక్రమించుకొనే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే మరింత అభాసుపాలవుతాం. సైన్యం ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది." అని తెలియజేశాడు. దానికి నెహ్రూ ప్రతిస్పందిస్తూ " చైనా మనమీద యుద్ధం చేస్తుందని నేను అనుకోను. నాకు ఆవిషయంలో నమ్మకముంది. మనకున్న పరిమితుల కారణంగా చైనాతో పోటీపడి పోస్టులను నిర్మించలేము. కానీ ఎలాంటి వివాదంలేని, మనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో పోస్టులను కడదాం. వాళ్ళు ఒకచోట ముందుకొస్తే మనం ఇంకొకచోట ముందుకెళదాం.మనం ఈరకంగా </span><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;">చదరగం</span></span><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; white-space: pre-wrap;"> ఆడదాం. ఇది చైనాకు మహా అయితే చికాకు తెప్పిస్తుంది. అంతకన్నా ఇంకేమవ్వదు." అన్నాడు.</span> </span><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">ఇంతకీలకమైన విషయం గురించి నెహ్రూ పార్లమెంటుకుగానీ, క్యాబినెట్టుకుగానీ, సర్వసైన్యాధ్యక్షుడైన రాష్ట్రపతికిగానీ, రక్షణ మండలికిగానీ సమాచారమివ్వకుండా ఏకపక్షంగా తీసుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిది. ఆయన ఆలోచనలన్నింటికీ మూలం "</span><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">చైనా యుద్ధం చెయ్యదు</span><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">." అన్న ఒక్కఊహ. అదికాస్తా అబద్దం అని తేలినప్పుడు బలయ్యింది సైనికుడు. పరువు పోగొట్టుకున్నది భరతజాతి. </span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">జనరల్ కౌల్ గౌహతీలో సైనికాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ ఫార్వర్డ్ పాలసీని నెహ్రూ అభిప్రాయంగా చూపెట్టి వాళ్ళ అభిప్రాయాన్ని కోరాడు. అప్పటీకే దానికి నెహ్రూట్యాగ్ పడిపోవటంతో మిగతావన్నీ లాంచనప్రాయమయ్యాయి. </span></b><span style="font-family: Arial; font-size: 15px; white-space: pre-wrap;">అయితే రక్షణరంగ నిపుణుల అభిప్రాయం వేరేగా ఉంది. జనరల్ కౌల్ తెలివిగా అటు బయటి వాళ్లకి నెహ్రూపేరు చెప్పి ఒప్పించి, ఇటు నాయకులకు సైనికాధుకారులు సమ్మతిని తెలియజేశారని చెప్పడంతో తన పని పూర్తిచేసుకున్నాడు. దీనివల్ల ఒకవేళ ఇది విజయవంతమైతే సైన్యాధ్యక్షునిగా ఎనలేనిపేరు. పోనీ వైఫల్యం చెందిందా ఆచెడ్డపేరు నెహ్రూకి. కొన్ని సందర్భాల్లో సైనికులు విధిగా ఆచరించే అధికారక్రమాన్ని కూడా పక్కనబెట్టి కిందిస్థాయివారితో నేరుగా కలవడాన్ని చూసిన ప్రతి ఒక్కరికీ ఫార్వర్డ్ పాలసీ ఈయన స్వంతనిర్ణయమనే అనుమానం చాలా బలంగా కలిగింది. </span><br />
<span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br />
<span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 4 INDIAN DIVISION ను పంజాబ్ నుంచి అస్సాం సరిహద్దుకు వెళ్ళాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే- ఈదళం మైదానాల్లో పోరాడటానికి తర్పీదు పొందింది. ఎవ్వరికీ పర్వతాల్లో పోరాడిన అనుభవంలేదు. వాళ్ళ దగ్గరున్న సామాగ్రి అందుకు తగినదీ కాదు. పర్వతాలకు మైదానాలకు మద్య ఉన్న కొన్ని ముఖ్యమైన బేధాలు- మైదానాల్లో యుద్ధం ఆరుబయట జరుగుతుంది. దళం గుంపులుగా విడిపోయి ఒకేసారి అనేకచోట్ల దాడి చేస్తుంది. పర్వతాల్లో అనుకూలమైన ప్రాంతాలు కొన్నే ఉంటాయి. ముందు వాటిని చేజిక్కించుకుని, గుహల్లో దాక్కుంటూ దాడి చెయ్యాలి. మైదానాల్లో రవాణా పెద్ద ఇబ్బందికాదు. అదే పర్వతాల్లో పూర్తిగా వాతావరణంమీద ఆధారపడాలి. రవాణాకోసం కంచరగాడిదలవంటి జంతువులమీద, హెలికాప్టర్లమీద ఆధారపడాలి. అలానే మైదానాల్లో సామాగ్రిని పెద్దపెద్దడబ్బాల్లో తీసుకొస్తారు. అదే పర్వతాల్లో వాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నచిన్నభాగాలను తీసుకెళ్ళి బిగించుకుంటారు. వ్యూహాత్మకంగా పర్వతాల్లో పోరాడాలంటే అన్నింటికన్నాముందు వీలైనంతప్రాంతాన్ని నియంత్రించగలిగిన ప్రదేశాన్ని కనుక్కొని దాన్ని చేజిక్కుంచుకోవాలి. ఇలాంటి వ్యూహాత్మకవిషయాల్లో తర్పీదు చాలా కీలకం. 4 INDIAN DIVISION వారివెంట తెచ్చుకున్న చాలావరకు సామాగ్రి భారీవి కావడంతో హిమాలయ పర్వతపాదాల వద్ద వదిలి వెళ్ళాల్సి వచ్చింది.</span><br />
<span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;"><br /></span></span><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">తరువాత 1/9 గూర్ఖాదళంనుంచి రెండుకంపెనీలను సిమ్లానుంచి పంపగా అవి రెండునెలల తర్వాతగానీ చేరుకోలేక పొయ్యాయి. వీటికి మాత్రం హిమాలయాల్లో పనిచేసిన అనుభవం ఉంది. 4 INDIAN DIVISIONకు భూటాన్ నుంచి బర్మా వరకు గల 360మైళ్ళ సరిహద్దును కాపాడాల్సిన బాద్యతను అప్పగించారు. ఆసరిహద్దు వెంబడి రోడ్లు లేకపోవడంతో ఒకప్రాంతం నుంచి మరొకప్రాంతానికి వెళ్ళాలంటే పర్వతాలను దిగి బ్రహ్మపుత్రలోయలోకి వచ్చి తర్వాత మరొకపర్వతాన్ని ఎక్కాలి! ఇక్కడ ఎలాంటి నివాసాలుగానీ, జంతురవాణాగానీ లేవు. కానీ డిల్లీలోని నాయకులు మాత్రం ఏర్పాట్లను చూసి సంతుష్టులయ్యారు. సభలో సమాధానం ఇవ్వడానికొక అనుకూలాంశం దొరికింది. కానీ ప్రజలకు మాత్రం మరొక ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. సైనికులని అక్కడకు పంపడం మినహా పంపిన తర్వాత చేపట్టాల్సిన ప్రణాళికలు రూపొందించడంగానీ, లక్ష్యాలను నిర్దేశించడంగానీ జరగలేదు.</span><br />
<span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br />
<span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">ఒకదళం పంజాబ్ నుంచి అస్సాంకి వస్తుందన్న సంగతి స్థానిక అధికారులకు తెలియనే తెలియదు. తీరా అక్కడికి వెళ్ళాక "మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపించారు? మీ అవసరం ఏమీలేదు. చైనా మనమీద యుధ్ధం చెయ్యదు." అని చెప్పసాగారు. అక్కడ పరిపాలన అంతా NEFA Administration చూసుకుంటుంది. ఇది విదేశాంగశాఖ కింద పనిచేస్తుంది!! ఆప్రాంతాన్ని మనదేశంలో భాగంగా మనం చెబుతున్నప్పుడు అక్కడ మిగతాప్రాంతాలమాదిరిగానే రాష్ట్రప్రభుత్వమో, గవర్నర్ పాలనో, స్థానికసంస్థలో ఉండాలి. ఒకవేళ సున్నితమైన ప్రాంతం అనుకుంటే దాన్ని కేంద్రహోంశాఖకు అప్పగించాలి. అంతేగానీ మద్యలో విధేశాంగశాఖ ఎక్కడినుంచి వచ్చింది! అలాగే అక్కడి రక్షణ వ్యవాహారలన్నీ చూసుకునే అస్సాం రైఫిల్స్ కూడా రక్షణశాఖకింద కాకుండా విదేశాంగశాఖకింద పనిజేస్తుంది! కానీ ఈరెండింటికీ పొసగదు. కానీ సైన్యం ఇక్కడకు రావడం వీటికి ఇష్టంలేదు. ఈఒక్క విషయంలో మాత్రం అక్కడ భారత పరిపాలనా వ్యవస్థ ఉంది అని బలంగా నమ్మొచ్చు! ఏచిన్న సహాయంకోసం స్థానిక అధికారులదగ్గరకు వెళ్ళినా "ఇక్కడ మీ అవసరంలేదు. వెళ్ళిపోండి."అన్న నిర్లక్ష్యపు సమాధానమే సైనికాధికారులకు ఎదురైంది.</span><br />
<span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;"><br /></span></span><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">గూర్ఖాదళంలో ఒకకంపెనీని బొండిల్లా అనే ప్రాంతానికీ, మరొక కంపెనీని తొవాంగుకు పంపారు. ఆరెండు కంపెనీలు అనేక ప్రాంతాలు మారుతూ చివరికి ఆగష్టు 1960 నాటికి ఈరెండూ తొవాంగులో కలిశాయి. అంటే ప్రధాని సభలో ప్రకటన చేశాక ఒక్కసంవత్సరానికి సైన్యం అక్కడికి చేరుకో గలిగింది. మొదట చేరుకున్న కంపెనీకి ఒక నివాసప్రాంతం, ఒక బంగళా దొరకగా రెందవ దానికి అవికూడా ఏర్పాటు చెయ్యలేకపోయారు. ఎవరి అశక్తత వారిది.</span><br />
<span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;"><br /></span></span><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">సైన్యం స్వయంగా కార్యాలయము, గిడ్డంగులు, ఇళ్ళు కట్టుకునేందుకు సంకల్పించగా వారికి స్థలం దొరకడం గగనమైంది. తొవాంగ్లోనే కట్టుకునేందుకు పూనుకోగా అక్కడీ స్థానికులు ససేమిరా అన్నారు. సైన్యం మరికొన్ని ప్రాంతాలు సూచించగా ప్రతిదానికీ ఇక్కడ రిసార్ట్ కట్టబోతున్నాం, అక్కడ కాలేజీ వస్తుంది, మరోచోట అమ్యూజ్మెంట్ పార్క్ వస్తుంది అంటూ బ్లూప్రింట్ ముందుపెట్టి అరచేతిలో స్వర్గం చూపించసాగారు. దీంతో విసుగెత్తిన బ్రిగేడియర్ రణబీర్ సింగ్ అనే రాజపుత్రుడు ఒకరోజు ఉదయాన్నే తమదళం ఝెండా అయిన అరుణ గరుడపక్షిని ఎగరేసి ఇదే మాసైనికపోస్టు అని ప్రకటించడంతో అధికారులంతా మిన్నకుండిపోయారు. </span><br />
<span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br />
<span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">తూరుదళానికి జనరల్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్ అయిన జనరల్ థోరట్ అక్కడి వాస్తవ పరిస్థితుల మీద యధాతధ నివేదిక (appreciation) తయారు చేశాడు. ఆయన చెప్పిన దానిప్రకారం మొత్తం ప్రాంతానికి అత్యంత కీలకమైన ప్రాంతం బొండీల్లా. అస్సాంలోకి శత్రువు చొచ్చుకుపోవాలంటే ఏదారిలోంచి వచ్చినా దీన్నిదాటి రావాల్సిందే. అంటే దీన్నిదాటి ముందుకెళ్ళాలంటే సరిపడినంత బలగాల్ని ముందు ఇక్కడ పెంచుకోవాలి. మక్ మహోన్ రేఖను రక్షించుకోవాలంటే దానిదగ్గరకు వెళ్ళి పోరాడటం సాధ్యంకాదు. దానికి ముందు ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉందో అక్కడ మనబలం పెంచుకున్నప్పుడు అది తనకు తానుగా మన ఆధీనంలోకి వస్తుంది. ఇది పర్వతాల్లో పోరాటానికి మూలసూత్రం. పర్వతప్రాంతాల్లో ఇలాంటి కీలకప్రాంతాలు సరిహద్దురేఖల దగ్గర ప్రతిసారీ ఉండవు. నిజానికీ సరిహద్దు దగ్గరగా ఉండకుండా రెండుదేశాలూ ప్రయత్నిస్తాయి. </span><br />
<span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br />
<span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">కానీ దురదృష్టవశాత్తూ మన నాయకులకి ఇలాంటివి బోధపడవు. తమ రాజకీయావసరాలకు అనుగుణంగా లేనప్పుడు అది ఎంత కీలకమైన అంశమైనా తుక్కు కిందే లెక్క. సరిహద్దును రక్షించడం అంటే ప్రతి అంగుళాన్నీ జయించడం అన్నది అసాధ్యం. అందునా పర్వతాలమద్యన చైనా వంటి బలమైన శత్రువును ఎదుర్కొనేటప్పుడు అది కుదరదు గాక కుదరదు. మనం చెయ్యగలిగిందల్లా చొరబాట్లను అరికట్టడమే. అందువల్లనే థోరట్ కేవలం ఒక్క కంపెనీని మాత్రమే సరిహద్దుకు దగ్గరగా ఉండే తొవాంగ్ దగ్గర పెట్టి మిగతావారిని వెనకాల ఉంచాడు. అక్కడక్కడా మన పోస్టులను నెలకొల్పినా వాటిని కేవలం ఆప్రాంతం మనది అని చాటుకోవడానికి వాడుకోవాలి. అంతేగానీ వాటికోసం ఎక్కువ వనరులను ఖర్చు పెట్టగూడదు. అందుకనుగుణంగా జనరల్ థోరట్ తయారు చేసిన ప్రణాళికకు ఆయన పై అధికారుల సమ్మతి అయితే లభించిందిగానీ ప్రభుత్వానుమతి మాత్రం దొరకలేదు! ప్రభుత్వం పదేపదే చైనాయుధ్ధంరాదని చెబుతూ సైన్యాన్ని సరిహద్దు దగ్గరగా తీసుకుని వెళ్లమని ఒత్తిడీ చెయ్యసాగింది. తమ రాజకీయ మనుగడకు ఇదితప్ప వేరేదారి లేదని నాయకులు బలంగా విశ్వసించసాగారు. "సైన్యం అక్కడ ఉంటే చాలు. పోరాడవలసిన అవసరంలేదు. ఒకవేళ చైనా గీతదాటి లోపలకి వస్తే ఇవతల మాసైన్యంకూడా ఉంది అని చూపించగలిగితే చాలు. ఇంతకన్నా పెద్ద లక్ష్యాలు సైన్యానికి మేము నిర్దేశించబోము." అని సాక్షాత్తూ రక్షణమంత్రే పేర్కొంటే ఇక మాట్లాడెదేముంది. </span><br />
<span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br />
<span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">1944లో జపాన్ బలగాలు బర్మా సరిహద్దు దగ్గర దాడూలకు పాల్పడినప్పుడు భారత సైన్యం వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గింది. జపాన్కు అనుకూలమైన ప్రాంతం లభించక వెనుతిరగాల్సి వచ్చింది. ఇలాంటి ఉదాహరణలు చరిత్రలో కోకొల్లలు ఉన్నా భారత నాయకులకు యుద్దాల మీద అవగాహన శూన్యం. చైనీయులకు టిబెట్ పీఠభూమి రూపంలో అనువైన ప్రాంతం వరంలాగా దొరికింది. మనసైన్యం మాత్రం పూర్తిగా పర్వతప్రాంతాల్లో, విపరీతమైన వర్షపాతం, చలి మద్య గడపాల్సి వస్తుంది. పసలేని నిర్ణయాలు పైనుంచి ఉత్తర్వులుగా వెలువడుతూ ఉండటంతో అధికారులు వాటిని అమలుపరచాల్సి వస్తుంది. రాజధాని రాజకీయాలు అర్థం చేసుకోలేని సైనికుడు తానిప్పుడు చదరంగంలో పావునని, ఎప్పుడైనా ఎరగా వేస్తారని తెలియక సణుగుతూనే అధికారుల ఆదేశాలు పాటిస్తున్నాడు. </span><br />
<span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"><br /></span>
<span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">భారతదేశంలోని నాయకులెవరికీ యుధ్దవ్యూహాలపై అవగాహనలేదు. వాళ్ళు అప్పటీదాకా చూసినవన్నీ అల్లర్లు మాత్రమే. చైనావంటి బలమైన శత్రువుతో పూర్తిస్థాయి యుద్ధం గురించి ఊహాచిత్రాన్ని గీసుకునే సామర్థ్యంకూడా వాళ్ళ మస్తిష్కాలకు లేవు. అలాంటి సమయంలో తీసుకునే నిర్ణయాల్లో ఏదైనా వ్యూహాత్మక తప్పిదాలుంటే తెలియజెయ్యాల్సిన బాద్యత సైనికాధుకారులది. కానీ వాళ్ళమాటలు నాయకులు వినరు. అడ్దంగా వాదించి నోరుమూయిస్తారు. వాళ్ళకు ఆక్షణంలో కావలసింది వారివారి రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవటం. ప్రజలు చెయ్యగలిగిన పని వాళ్లకి ఓటువెయ్యడం. ప్రజల పరిమితి- వీళ్ళు తప్ప మరెవరూ ప్రత్యామ్నాయం లేకపోవడం.</span></div>
సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com2tag:blogger.com,1999:blog-3377763021527742745.post-40456349075581769232012-09-30T17:40:00.003+05:302012-09-30T17:44:34.365+05:30మేరునగ తప్పిదం- 4. 1959<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
<br /></div>
<b id="internal-source-marker_0.48897825623862445"><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">చైనా మరింత దురుసుగా ప్రవర్తించసాగింది. 1959 ఆగష్టులో సరిహద్దు వెంబడి మూడు చోట్ల జరిగిన దాడులు సమస్య తీవ్రతను దాచిపెట్టలేనిస్థాయికి తీసుకెళ్ళాయి. రెండుదేశాల మద్య చర్చలు జరిపగలిగే వాతావరణం పూర్తిగా తొలిగిపోయింది. నెహ్రూ పార్లమెంటులో దాడుల గురించి అలానే అక్సాయ్ చిన్ ప్రాంతంలో నిర్మించిన రహదారిని గురించి, దాన్ని తనిఖీ చెయ్యడానికి వెళ్ళిన భారత అధికారులను నిర్బంధించడం గురించి ప్రస్తావిస్తూ సైనిక సన్నాహల విషయంలో వైఫల్యం చెందామని అంగీకరించాడు. భారత భూభాగంలో చైనాసైన్యం కాంపు ఏర్పాటు చేసుకుంది అని ప్రకటించడంతో సభ ఆందోళన చెందింది. సరిహద్దు పరిస్థితులపై ప్రధాని ప్రకటన చెయ్యాలని పట్టుపట్టడంతో నెహ్రూ కొన్నికఠోరవాస్తవాలు విపులంగా చెప్పాల్సి వచ్చింది.</span><span style="font-weight: normal; vertical-align: baseline;"> </span><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">సరిహద్దు వెంబడి చైనా మూడుచోట్ల దాడులకు పాల్పడింది. అవి ఖెంజమెన్, లోగ్జు మరియు అక్సాయ్ చిన్.</span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">ఖెంజమెన్ అనేది థాగ్ల అనే ప్రాంతంలో ఉంది. భారత్ అక్కడ ఉన్న పర్వత శిఖరాన్ని సరిహద్దుగా పేర్కొంటే, చైనా అక్కడినుంచి రెండుమైళ్ళ లోప్ల ఉన్న బ్రిడ్జిని సరిహద్దుగా చూపించసాగింది. అక్కడి దాడిని గురించి సభకు వివరిస్తూ నెహ్రూ, "ఆగష్టు 7న 200మంది చైనీయులు సరిహద్దు దాటి లోపలికి ప్రవేశించారు. మన సైన్యం వారిని వెనక్కి వెళ్ళమని కోరగా వాళ్ళు వినలేదు. మనసైన్యాన్ని బ్రిడ్జివరకు తోసేసారు. మన సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. అక్కడ కాల్పులేవీ జరగలేదు. తరువాత చైనీయులు పూర్తి ప్రాంతాన్ని మనకు వదిలేసి వెళ్ళిపోయారు. మనవాళ్ళు తిరిగి యధాస్థానానికి వచ్చేశారు. చైనీయులు మళ్ళీవచ్చి వెనక్కి వెళ్ళాలని, భారత పతకాన్ని దించెయ్యాలని ఆదేశించారు. అయితే సైనికులు వాళ్ళ మాటలను వినలేదు. చైనీయులు బలప్రయోగం చెయ్యబోగా ఫలించలేదు. ఆ తరువాత ఇంకేమీ జరుగలేదు." అన్నాడు. </span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">రెండవ సంఘటన లొంగ్జులో జరిగింది. దాని గురించి ప్రస్తావిస్తూ " 25న చైనా సైన్యం సుబంసిరి ప్రాంతంలో గీత దాటి వచ్చి మన బలగాలపై కాల్పులకు పాల్పడింది. చైనీయులతో పోలిస్తే మనబలం చాలా తక్కువగా ఉంది. లొంగ్జు ప్రాంతం నుంచి సమీప సైనిక పోస్టు అయిన లిమెకింగ్కు చేరేందుకు ఐదురోజులు పడుతుంది. లిమెకింగ్ నుంచి రోడ్డుకి 12రోజులు పడుతుంది. అంటే ఘటనా స్థలాన్ని చేరుకునేందుకు కనీసం మూడు వారాలు కావాలి. దీనిని బట్టి సమాచారం, రవాణా, సైనికచర్యలవంటివి ఎంతకష్టమో సభ్యులు అర్థం చేసుకోగలరు. 26న చైనీయులు మరోసారి దాడిచేసి మనవాళ్ళని నిర్బంధించారు. ఇరుపక్షాలూ కాల్పులు జరిగినప్పటికీ ఎవరూ చనిపోలేదు. మాకు సమాచారం అందడంతోనే చైనాప్రభుత్వానికి మా అభ్యంతరాలను తెలియజేశాం."</span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">ఈశాన్య సరిహద్దును పూర్తిగా సైన్యానికి అప్పగించినట్లు నెహ్రూ సభలో ప్రకటిఁచాడు. అస్సాం రైఫిల్స్ ఈవ్యవహారాన్ని చూసుకుంటుందని తెలియజేశాడు. వారు అక్కడీ పరిస్థితి నియంత్రిస్తారని అవసరమైతే ఇతరబలగాలను కూడా అక్కడకు పంపుతామని చెప్పాడు.</span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు- నెహ్రూ తన సహజ శైలికి విరుద్ధంగా సభలో చిన్నచిన్న వివరణలు ఇచ్చుకోవడం. సభ్యులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించడం. బహుశా ఇది నాయకులను, అధికారులను కలవరపెట్టి ఉండొచ్చు. సరిహద్దు భద్రతకు సన్నాహాలు చేస్తున్నామని నెహ్రూ చెప్పాక, ఏరకమైన సన్నాహాలు చేస్తున్నారు? అని సభ్యులుగానీ మీడియాగానీ అడగకపోవడం విడ్డూరం. అప్పటి పరిస్థితులకు అవసరమైనంత అదనపు వనరులు రక్షణశాఖ దగ్గరైతే లేదు. కొత్తగా సైనికుల నియామకం చెయ్యటేదు. సామాగ్రిని కొనుగోలు చేసే ప్రతిపాదనలేవీ చెయ్యలేదు. మరి అదనపు బలగాలు ఎక్కడి నుంచి వస్తాయి? మొట్టమొదటిసారిగా ప్రధాని సరిహద్దు రక్షణ గురించి మాట్లాడాక కూడా దీర్ఘకాలిక లక్ష్యాలేవీ పెట్టుకోలేదు. సమస్యతీవ్రతను అధ్యయనం చెయ్యలేదు. 1962 వరకు జరిగిన ప్రతిఒక్కదాడినీ చెదురుమదురు ఘటనలుగా కొట్తిపడేస్తూ వచ్చాడు. ఘటనలను పూర్తిస్థాయి అధ్యయనం చేసి జాతీయ భద్రతా విధానాన్ని తయారు చెయ్యకపోవడం ఆసమయంలో భారత్ చేసిన అతిపెద్దతప్పు.</span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;"><span style="font-weight: normal;">సెప్టెంబరులో లడాఖ్, ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో సుమారు యాభైవేల చదరపుమైళ్ళ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుని తమభూభాగంగా ప్రకటించింది. అయితే 1961 వరకు భారత్ కనీస చర్యలు చేపట్టకపోవడం విడ్డూరం. దీన్నికూడా చెదురుమదురు ఘటనలుగానే భావించి ఉండవచ్చు. ఇదేమీ పెద్దవిషయంకాదనీ, విపరీతాలకేమీ దారితీయదనీ నెహ్రూ చెప్పుకొచ్చాడు. ఒక సందర్భంలో "</span>అది బంజరుభూమి. అక్కడ గడ్డిపోచకూడా మొలవదు.<span style="font-weight: normal;">" అని పేర్కొనడం దేశవ్యాప్త నిరసనలకు తావిచ్చింది. నెహ్రూ ప్రతిష్ట మసకబారింది. అప్పటివరకూ నాయకుల, మేధావుల నుంచి విమర్శలనెదుర్కొన్న నెహ్రూ తనని దైవాంశసంభూతునిగా భావించి పూజించే సగటుమనిషినుంచి కూడా విమర్శలనెదుర్కోవాల్సి వచ్చింది. సభా సమయమంతా ఈఅంశంతోనే వృధాగా సాగిపోతోంది. అసమ్మతికి, ప్రతిపక్షాలకు నెహ్రూమీద దాడి చెయ్యడానికి సువర్ణావకాశం లభించడంతో సరిహద్దు సమస్య రాజకీయరంగు పులుముకుంది. ఇంతటి విషమ పరిస్థితుల్లోనూ ప్రజలకు నెహ్రూ తప్ప మరొక ప్రత్యామ్నాయం దొరకకపోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మిక్కిలి శోచనీయం.</span></span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">నమ్మదగ్గ మనుషులు పెద్దగా దొరకక పోవటంతో నెహ్రూ తన అభీష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోసాగారు. దాంతో ప్రతిదానికి చర్చలద్వారా సానుకూల పరిష్కారాన్ని కనుగొనడమే భారత విధానమైంది. దీనిక్కూడా విపక్షాలనుంచి విమర్శలెదురవడంతో సరిహద్దు రక్షణకు చర్యలు మొదలుపెట్టారు. అయితే ఇవి దేశ అవసరాలను తీర్చేస్థాయిలో చేపట్టలేకపోయాం. సరిహద్దు ప్రాంతాలన్నీ సుదూరంగా ఉండటం, అక్కడికి రవాణాసౌకర్యాలను మెరుగుపరచక పోవడంతో వస్తురవాణా పూర్తిగా హెలికాప్టర్లమీద ఆధారపడి జరపాల్సి వచ్చింది. అయితే హెలికాప్టర్లను అన్నికాలాల్లోనూ వినియోగించలేకపోవడం, పైనుంచి జారవిడిచిన వస్తువుల్లో ఎక్కువభాగం వృధాగా పోవడం సైన్యానికి పెద్ద సమస్యగా మారింది. సరిహద్దును సైన్యానికి అప్పగించాక చేపట్టాల్సిన ఇతరపనులు, సైనిక వనరులు పెంచడం వంటివి జరగకపోవడంతో ఆకార్యక్రమం పెద్దగా ఏమీ సాధించలేకపోయింది. చైనా తనసైన్యానికి అత్యాధునిక ఆయుధాలు, సౌకర్యాలు కల్పించి పెద్దసంఖ్యలో బలగాల్ని మోహరించినా వారిని సరిహద్దు <span style="color: red;">కాపలాదారులు</span>గానే పేర్కొనింది. మనంమాత్రం ఎలాంటి సౌకర్యాలుగానీ, ఆయుధసామాగ్రికానీ ఇవ్వకుండానే ఓడజనుమందిని కాపలాకు పెట్టి<span style="color: red;"> సైన్యం</span> అని పిలిచాం. </span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">అక్టోబరులో హవిల్దార్ కరం సింగ్ నేతృత్వంలోని పోలీసుబృందమ్ మీద చైనీయులు దాడి చేశారు. 9మంది చనిపోగా 10మందిని నిర్బంధించారు. ప్రతిసారీ భారతసైన్యానికే ఎదురుదెబ్బలు తగులుతూ రావడంతో ఈఘటని విపరీతమైన ప్రజాగ్రహానికి కారణమైంది. ఇక చర్చలకు ఆస్కారంలేదనీ, యుధ్ధానికి సమయం దగ్గర పడుతుందనీ ప్రతి ఒక్కరికీ అర్థమయ్యింది.</span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">ఇంతలో రక్షణశాఖలో పెద్ద దుమారం లేచింది. రక్షణమంత్రి కృష్ణమీనన్కు ఆర్మీచీఫ్ జనరల్ తిమ్మయ్యకు మద్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. తిమ్మయ్య చాలాక్రితమే చైనాతో పొంచి ఉన్న ముప్పుని వివరిస్తూ సైన్యానికి కావల్సిన అదనపు వనరుల్ని కోరాడు. ఈసమయంలో మీనన్ కొంచెం దురుసుగా ప్రవర్తించడంతో నిబద్ధత కలిగిన అధికారిగా తిమ్మయ్య మనస్తాపానికి గురయ్యాడు. ఆయన జనరల్ అయ్యేందుకు ముందే సైన్యం వద్ద వనరులు తగినంతలేవని భావించి చైనాసరిహద్దు రక్షణ నిమిత్తం మరింత బలోపేతం చెయ్యాలని భావించాడు. అయితే ఆయన సూచనలేవీ అమలుకాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో తిమ్మయ్య తనరాజీనామాను సమర్పించాడు. ప్రజాస్వామయ వ్యవస్థలో సర్వీసులో ఉన్న సైనిక అధికారికి ఇతకన్నా చెయ్యగలిగింది ఏమీలేదు. కీలక సమయంలో ఈదుమారం దేశాన్ని కలవరపరిచింది. మద్యలో నెహ్రూ కలుగజేసుకుని రాజీనామానైతే ఉపసంహరింపజేశాడుగానీ తిమ్మయ్యకు లభించాల్సినంత నైతికమద్దతు లభించలేదు.</span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgZpS9jPypE3EqqP0vWwMQ16wkl3WWrGgkjcNMbgQDZ4QIlxyJEEYhlVJljt6aDncCGpeWN0K60nv8iNtygo2gbA4CFmFY6pk39Xr_RQozvrEr5-FpXT6sbAehFplUw7gqgUQeSd4E7InM/s1600/Thimayya,+Kodandera+Subayya+2.jpg" imageanchor="1" style="font-weight: normal; margin-left: 1em; margin-right: 1em; text-align: center;"><img border="0" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgZpS9jPypE3EqqP0vWwMQ16wkl3WWrGgkjcNMbgQDZ4QIlxyJEEYhlVJljt6aDncCGpeWN0K60nv8iNtygo2gbA4CFmFY6pk39Xr_RQozvrEr5-FpXT6sbAehFplUw7gqgUQeSd4E7InM/s320/Thimayya,+Kodandera+Subayya+2.jpg" width="217" /></a><br /><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">తిమ్మయ్య గురించి కొన్నివిషయాలు క్లుప్తంగా- ఈయనది కర్ణాటకలోని కుడిగి జిల్లా. ఫీల్డ్ మార్షల్ కరియప్పకు దగ్గరి బంధువు. బంధువుల్లో చాలామంది సైన్యంలో పనిచేస్తుండటంతో చిన్నప్పటినుంచీ సైన్యంలో చేరటమే ఆశయంగా పెరిగాడు. సైన్యంలో చేరాక అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో దళానికి కమాండర్గా నాయకత్వం వహించిన ఒకేఒక భారతీయుడీయన. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అవార్డు కూడా తీసుకున్నాడు. దేశవిభజన అనంతరం తెలెత్తిన ఉద్రిక్తత అల్లర్లకు దారితీసినప్పుడు పంజాబ్ ప్రాంతంలో చేసిన కృషికి ఇరువర్గాలనుంచి ప్రశంసలందుకున్నాడు. తరువాత కాశ్మీరులోయలో అనేక విజయాలకు నాయకత్వం వహించాడు. అక్కడి నుంచి రక్షణశాఖ ప్రధానకార్యాలయానికి బదిలీ అయ్యాడు. సర్వీసుమొత్తం నిజాయితీకి, నిబద్దతకు, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఈయనంటే సైన్యంలో అందరికీ ఎంతో గౌరవం ఉండేది. సైన్యంలో ఉన్నన్నాళ్ళూ ఎవరిమీదా దురుసుగా వ్యవహరించిన సందర్భాలు లేవు. సహచరులంతా</span><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;"> టిమ్మీ </span><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">అని ముద్దుగా పిలుచుకునేవాళ్ళు. ఉత్తరాదివాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా ఉండే సైన్యంలో దక్షిణాదివాడైనా అందరి గౌరవానికీ పాత్రుడయ్యాడు. ఇంతటి ఉన్నత విలువలు, ప్రతిభాపాటవాలు, దేశభక్తి ఉన్నవ్యక్తి ఆర్మీచీఫ్ అయినరోజు భారతసైన్యం పులకించిపోయింది. సహజంగా ఇంతటి ఉన్నతస్థాయిలో ఎవరైనా రిటైర్ అయితే వాళ్ళకి తగుహోదా కల్పిస్తూ ఏదేశానికైనా రాయబారిగానో, సలహాదారుగానో నియమిస్తారు. కానీ ఈయనకి అలాంటివేమీ దక్కలేదు. కొన్నేళ్ళ తర్వాత ఐరాస సైప్రస్లో శాంతిని పునరుద్దరించేందుకు అక్కడికి పంపగా గుండేపోటుతో మరణించారు.</span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">దేశం యుద్ధం వాకిట్లో నిలుచునే సమయానికి తగిన సన్నద్ధత లేదు. అంగబలం ఆర్థికబలం లేదు. కష్టకాలంలో తోడొచ్చే మిత్రులెవరూ లేరు. చైనా వాదనలకు సమానంగా ప్రవాదనలు వినిపించే అంశాలు లేవు. అదే సమయంలో మేజర్ జనరల్ బీ.ఎం. కౌల్ ను పదోన్నతిని కల్పిస్తూ రక్షణశాఖ డిల్లీకి బదిలీ చేసింది. ఈయన మీనన్కు సన్నిహితుడవడం ఇక్కడ కీలకమైన విషయం.</span></b></div>
సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com2tag:blogger.com,1999:blog-3377763021527742745.post-71023880715589671532012-09-30T01:42:00.001+05:302012-09-30T02:55:05.227+05:30మేరునగ తప్పిదం- 3. మిత్రబేధం<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<b id="internal-source-marker_0.9574426831677556" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 523px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">చైనాతో స్నేహం, దౌత్యసంబంధాలు, అంతర్జాతీయ సమాజం వంటి అంశాలకు స్థాయికి మించి ప్రాముఖ్యత ఇవ్వడంతో భారతదేశ భద్రత గాలిలో దీపం చందంగా తయారయ్యింది. ఏరోజు సమస్యను ఆరోజు చూసుకోవడం, చెదురుమదురు ఘటనలంటూ సర్దిపుచ్చేసుకోవడం తప్ప భద్రతాపరమైన అంశాల్లో దీర్ఘకాలిక లక్ష్యాలేవీ భారత్ నిర్దేశించుకోలేదు. గతచరిత్ర నేర్పిన పాఠాలు నేర్చుకోకుండా భారత్ తన సరిహద్దును రక్షించుకోవడం అనే మౌలికధర్మాన్ని మరోసారి ఇతరుల దయాదాక్షిణ్యాలకు వదిలేసింది. కొంచెం ఘాటుగా ఉన్నా ఇది నిష్టుర సత్యం.</span><span style="vertical-align: baseline;"> </span><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఐరాస మద్యవర్తిత్వం కాశ్మీరు సమస్యను తీర్చకపోగా మరింత జటిలం చెయ్యడంతో నెహ్రూకు ఇంటిపోరు పెరుగుతూ వచ్చింది. దాయాది నుంచి తరచుగా ఎదురైన సమస్యలను సైన్యం సమర్థవంతంగా అణిచివెయ్యగలిగినా అమెరికా నుంచి దానికి లభిస్తున్న సహాయం ప్రమాదఘంటికలు మోగించసాగింది. </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">1956నుంచి చైనా నెమ్మదిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టడం ప్రారంభించింది. లఢాఖ్, ఈశాన్య సరిహద్దులను తమవిగా ప్రకటించుకుంటూ చర్చలకు పిలుపునిచ్చింది. భారతభూభాగాలను చైనాలో అంతర్భాగంగా చూపెడుతూ కొన్ని మ్యాపులను విడుదల చేసింది. భారత్ దానికి అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో అవి పాతమ్యాపులని, త్వరలో సవరించి కొత్తవి విడుదల చేస్తామని చెప్పింది. అక్సాయ్ చిన్ ప్రాంతంలో నిర్మించిన రహదారి విషయం చైనా మాద్యమాల ద్వారా బహిర్గతమవ్వడంతో హిందీచీనీ భాయీభాయీ యుగానికి శుభంకార్డు పడింది అని చెప్పవచ్చు. ఆతర్వాత జరిగిన చర్చలు భారత్కు చెప్పుకోదగ్గ లాభాలేవీ కలిగించలేకపోయినా చైనా మాత్రం పాతసంధిపేరు చెప్పి వాణిజ్యపరమైన లాభాలు ఆర్జించుకుంటూ వచ్చింది.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">చైనా నమ్మదగిన దేశంకాదు అన్న సంగతి నెహ్రూకు నెమ్మదిగా బోధపడసాగింది. కానీ దురదృష్టవశాత్తూ అప్పటికే దాదాపు ఒకదశాబ్దం వృధాగా గడిచిపోయింది. నెహ్రూ దగ్గర రెండు దారులున్నాయి. ఒకటి- అభివృద్ధి పధకాలు, పారిశ్రామికీకరణ ఆపేసి ఉన్నపళంగా రక్షణకు నిధులు మళ్ళించడం. కానీ ఇందులో చాలా సమస్యలున్నాయి. అందులో ముఖ్యమైంది సైనికదళాలకు డబ్బుతోబాటు తగినంత సమయం కావాలి. మన సైన్యంలో సింహభాగం మైదానాల్లో, ఎడారుల్లో యుద్ధంచెయ్యడానికి ( పాకిస్థాన్ సరిహద్దు) తర్పీదు పొంది ఉన్నారు. సైనికసామాగ్రి కూడా అందుకు అనుగుణంగా తయారు చెయ్యబడిందే. కానీ చైనా సరిహద్దు పూర్తిగా పర్వతాల మయం. అందులోనూ హిమాలయాలు. </span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">మరొక ముఖ్యమైన సమస్య- ఉన్నపళంగా అంతసామాగ్రిని సరపరా చేసే దేశమేది? మనకు సామాగ్రిని సరపరా చేసే బ్రిటన్, అమెరికాలకి అప్పటికే పెద్దమొత్తంలో బాకీ పడున్నాం. అందునా అంతర్యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఏదేశమూ ఇంతపెద్దమొత్తంలో సరపరా చెయ్యడానికి ముందుకురాదు. అప్పటికే పాకిస్థాన్ అమెరికా పంచన చేరి లాభపడుతుండగా మనం అలీనవిధానంద్వారా, ఆఫ్రోఏషియన్ కూటమిని నెలకొల్పడంద్వారా ప్రాశ్కాత్య వ్యతిరేకులమన్న ముద్రను ఆపాదించుకున్నాం. అమెరికా తనసామంతరాజ్య విరోధికి ఎంతవరకూ సహాయం చేస్తుందనేది అనుమానమే. ఫ్రాన్స్, స్వీడన్ వంటి దేశాలు యుద్ధసామాగ్రి సరపరాల వ్యాపారంలా చేస్తున్నా వాటినుంచి కొనుగోలుచేసేంత నిల్వలు మనదగ్గర అప్పట్లో లేవు. కాశ్మీరు సమస్య తేలేవరకూ ప్రాశ్చాత్య దేశాలనుంచి ఇలాంటిసహాయాల్ని పొందలేని స్థితిలో భారత్ ఇరుక్కుపోయింది. అదేసమయంలో రష్యా తన వీటోను ఉపయోగించి మరీ ఐరాసలో మనకు మద్దతునిచ్చింది. సాంకేతిక సహకారాలు, ఎగుమతులు వగైరా, వీటన్నింటినీ మించి సోషలిస్ట్ భావజాలం కారణంగా ప్రాశ్చాత్య దేశాలకు భారత్ మరింత దూరమయ్యింది. పోనీ రష్యానుంచే సైనికసహాయాన్ని పొందుదామా అంటే తనసోదరదేశమైన చైనాతో యుధ్ధానికి అది సహాయం చేస్తుందని ఎలా అనుకోగలం?</span></b><br />
<b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 523px;"><span style="white-space: pre-wrap;"><br /></span><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">వీటన్నింటినీ మించి- అప్పటికే అంతర్జాతీయ సమాజంలో శాంతివచనాలను వల్లిస్తున్న భారత్ (అంటే నెహ్రూ) ఉన్నపళంగా సైనికచర్యలకు ఆస్కారమిచ్చేలా ప్రవర్తిస్తే ఇంతకాలం కాపాడుకుంటూ వస్తున్న ప్రతిష్ట మసకబారిపోతుంది. స్వతంత్ర్యం వచ్చిన దశాబ్ధానికే ఏకూటమికీ చెందని, పెద్దగా సైనికబలంలేని, స్వయంసమృద్ధిని సాధించని భారత్ ముందు సైనికసామాగ్రి ఆధునికీకరణ అన్నదానికి ఆస్కారమే లేకుండా పోయింది.</span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">కాబట్టి సరిహద్దు భద్రత అన్న విషయంలో భారత్ ముందున్న దారల్లా చైనాతో సత్సంబంధాలు జరపడం. కాశ్మీరు విషయాన్ని అమెరికా చేతుల్లో పెట్టడం. రక్షణరంగంలో దుబారా చేసేకన్నా పారిశ్రామికీకరణకు నిధులు కల్పించడం ఉత్తమమన్న భావాన్నే నెహ్రూ ప్రతిసందంర్భంలోనూ బలంగా ప్రకటిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ మనం గమినించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే- మన సరిహద్దుల్లో సమస్య తలెత్తిన రెండుదేశాలు ప్రపంచంలో రెండు వెరేవేరు కూటములకు చెందినవి. అగ్రరాజ్యాల దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చేవి. అందునా రెండు సరిహద్దుల్లో ఒకటి మైదానం. మరొకటి మహాపర్వతం. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చెయ్యకూడని అంశం- సరిహద్దు భద్రత. పార్లమెంటులో ఈఅంశంమీద చర్చ జరిగినప్పుడల్లా నెహ్రూ తన అభివృద్ధికార్యక్రమాలకు విఘాతం కలుగకూడదన్న ఆలోచనతో జాతికి ఈవిషయంలో ఎలాంటి దిగులూ వద్దని </span></b><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 523px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">పదేపదే </span></b><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 523px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">హామీ ఇస్తూ వచ్చాడు. </span></b><br />
<b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 523px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">జాతీయ భద్రతా విధానాన్ని రూపొందించిండంలో భారత్ తడబడుతూ ఉంటే చైనా ఇదే అదునుగా చొరబాట్లను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. చర్చలు జరిగే సమయంలో చైనా ప్రతినిథులు కొంతదురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. భారత ప్రతినిథులు లేవనెత్తే అంశాలకు సరైన సమాధానాలు కూడా ఇవ్వకపోగా వాటిని వలసపాలకులు ఆసియామీద తమసైనికబలంద్వారా రుద్దినవిగా కొట్టిపారేశారు. ఆసమయంలో ఉన్నతస్థాయి రక్షణ నిపుణుల కమిటీ ఒకటి </span></b><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;">భారత్ను</span></span><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 523px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"> సందర్శించింది. ఆసందర్భంగా వారికి ప్రతి ఒక్కటీ ఎలాంటి దాపరికమూ లేకుండా చూపించాల్సిందిగా భారతప్రభుత్వం సైన్యాన్ని ఆదేశించింది. వాళ్ళు అంతా చూసుకుని వెళ్ళారు.</span></b><br />
<b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 523px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /></b><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 523px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">10 మార్చి 1959న </span></b><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 523px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">టిబెట్లో చెలరేగిన అల్లర్లు కీలకమైన మలుపులకు కారణంగా నిలిచాయి. ల్హాసాలో చైనా సైన్యానికీ టిబెటన్లకూ మద్య ఘర్షణ మొదలైంది. ఇది చైనా అంతర్గత సమస్యగా నెహ్రూ పార్లమెంటునుద్దేశించిన ప్రసంగంలో పేర్కొన్నాడు. ఘర్షణలు తీవ్రస్థాయికి చేరడం, సైన్యానిది పైచెయ్యి అవడంతో దలైలామా మరోసారి టిబెట్ను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఏప్రిల్ 3న దలైలామాకు భారత్ ఆశ్రయం ఇచ్చినట్టుగా నెహ్రూ స్పశ్టం చెయ్యడంతో చైనాతో సంబంధాలకు దారులు పూర్తిగా మూసుకుపొయ్యాయి.</span></b><br />
<b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 523px;"><span style="white-space: pre-wrap;"><br /></span></b>
<br />
<table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto; text-align: center;"><tbody>
<tr><td style="text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjaJBGYvKXQI1GiTArKvokhXZtJnVpzEHuAgLRgAiizz3RllQ8WHb_oBuFP74_L36bao5pFLshWIyJsm335L0B3TMVUivlA5kB0t367cHx8ycjM11A1pw6P7F9vPZIC5PL_fsbyyDudeQs/s1600/dalailama.jpg" imageanchor="1" style="margin-left: auto; margin-right: auto;"><img border="0" height="194" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjaJBGYvKXQI1GiTArKvokhXZtJnVpzEHuAgLRgAiizz3RllQ8WHb_oBuFP74_L36bao5pFLshWIyJsm335L0B3TMVUivlA5kB0t367cHx8ycjM11A1pw6P7F9vPZIC5PL_fsbyyDudeQs/s320/dalailama.jpg" width="320" /></a></td></tr>
<tr><td class="tr-caption" style="text-align: center;">టిబెట్ నుంచి భారత్ వస్తున్న దలైలామాబృందం. కర్టసీ: <a href="http://www.guardian.co.uk/">http://www.guardian.co.uk</a></td></tr>
</tbody></table>
<b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 523px;"><span style="white-space: pre-wrap;"><br /></span><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">దలైలామాకు ఉన్న ప్రతిష్ట దృష్ట్యా భారత్ ఆయనకు తగిన సౌకర్యాలు కల్పించింది. ఊహించని ఈపరిణామం </span></b><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;">భారత్ను </span></span><b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 523px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">సందిగ్ధంలో పడేసింది. చైనాతో సంబంధాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని నెహ్రూ బహిరంగంగా చెప్పాడు. చైనా భారత్ మీద దాడి చెయ్యడానికి ఇదే కారణమైతే ఆయుద్ధంలో నాదేశం ఓడిపోయినా దానికి నేను గర్విస్తాను. బలవంతుడైన వాడు తనకి నచ్చిన వాడికెవడికైనా ఆశ్రయమివ్వగలడు. కానీ పెద్దగా బలంలేని, అందులోనూ దీనివల్ల ఒకబలమైన శత్రువును ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసీ అందుకు ఒప్పుకున్నందుకు భారతీయులుగా మనందరం గర్వించాలి. ఈగడ్డమీద పుట్టిన ధర్మాన్ని కాపాడుకోవల్సిన భారతీయులుగా మన బాద్యత. ఈప్రాంతంలో బౌద్ధధర్మం బలంగా ఉన్న దేశాలు తమకుతాముగా ముందువాల్సిందిపోయి డ్రాగన్ను చూసి భయపడ్డాయి. దలైలామాకూడా భారతే తనకు రక్షణనివ్వగల ప్రాంతంగా భావించి వచ్చాడు. ఆనమ్మకాన్ని ఎన్నిసమస్యలెదురైనా ఇన్నేళ్ళుగా నిలబెట్టుకుంటూ వచ్చాం. యుద్ధంలో గెలుపోటములను బట్టే బలాబలాల్ని బేరీజు వేసే ప్రపంచానికి ఇలా వ్యవహరించేందుకు ఎంతటి మనోస్థైర్యం కావాలో అర్థం కాకపోవచ్చు. టిబెటన్లకు మాత్రం అర్థమయ్యింది.</span></b><br />
<b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 523px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">అప్పట్నుంచీ చైనా నెమ్మదిగా తన సైనిక సామర్థ్యాన్ని, సరిహద్దువెంబడి కార్యకలాపాల్ని పెంచుకుంటూ పోగా భారత్ మాత్రం కనీస చర్యలు చేపట్టకపోవడం ఆత్మహత్యా సదృశం. సమస్య రోజురోజుకీ పెద్దదవుతూ వస్తున్నప్పుడు కనీస చర్యలు చేపట్టి జాతి గౌరవాన్ని కాపాడుకోవడం అన్నది ఏప్రభుత్వమైనా నిర్వర్తించాల్సిన కనీసధర్మం. మూడేళ్ళలో చైనా ప్రణాళిక ప్రకారం సరిహద్దు వెంబడి పనులు చక్కబెట్టుకుంటూ పోతుంటే భారత్ కనీసం రోడ్లను కూడా మెరుగుపరచుకోలేదు. రక్షణపరంగా ఇదొక ఘోరతప్పిందం.</span></b></div>
సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com2tag:blogger.com,1999:blog-3377763021527742745.post-71099294304013555082012-09-29T00:28:00.002+05:302012-09-29T14:20:53.624+05:30మేరునగ తప్పిదం - 2. హిందీ చీనీ భాయీ భాయీ<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<b id="internal-source-marker_0.9974568148609251" style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 481px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">చైనీయులు టిబెట్ మీద నెమ్మదిగా పట్టు సంపాదించడం మొదలుపెట్టారు. 9 సెప్టెంబర్ 1951, చైనా బలగాలు టిబెట్ రాజధాని ల్హాసాలోకి ప్రవేశించాయి. వాళ్ళు చెయ్యాలనుకున్న పనులన్నీ దలైలామా చేత చెయ్యించుకున్నారు. రాజకీయక్షేత్రంలో నెమ్మదిగా మార్పులు చెయ్యడం మెదలుపెట్టారు. సైనికావసరాలకు అనుగుణంగా రోడ్లు, విమానాశ్రయాలు, సమచార వ్యవస్థలను మెరుగుపరుచుకున్నారు. వాటన్నింటినీ సైనికావసారలకు సరిపోయేంత సామర్థ్యంతో నిర్మించారు. ఇందులో భాగంగా వారు తలపెట్టిన ఔటర్ రింగ్ రోడ్డు కొంతభాగం భారత భూభాగమైన అక్సాయ్ చిన్ గుండా వెళ్ళాల్సి రావడంతో దాన్ని ఆక్రమించుకున్నారు. </span></b><br />
<b style="font-family: Arial; font-size: 15px; font-weight: normal; text-indent: 481px;"><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"><br /></span></b>
<b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">ఇటువైపు భారత్ పరిస్థితి పూర్తిగా తలకిందులుగా ఉంది. సైనిక సామర్థ్యం సంగతి దేవుడెరుగు కనీసం రహదారి నిర్మించారన్న సమాచారంకూడా భారత ప్రభుత్వానికి అందలేదు. తీరా విషయం తెలిశాక కొన్ని బృందాలను పంపితే వాటిని చైనా నిర్బంధించినా అడిగే నాథుడే కరువయ్యాడు. దీని గురించి పార్లమెంటుకు ఎందుకు సమాచారమివ్వలేదు అని అడుగిన ప్రశ్నకు జవాబిస్తూ నెహ్రూ " దానిగురించే చర్చించే సందర్భం రాలేదు." అని చెప్పాడు.</span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">1953కల్లా టిబెట్లోని అన్ని ముఖ్యమైన పట్టణాల్లో చైనాప్రభుత్వం తన సైనికావసారలకనుగుణంగా మౌలికవసతులను నెలకొల్పింది. 1954లో </span></b><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;">మెక్మహాన్రేఖ</span></span><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"> వెంబడి ఒక రహదారి, దాన్ని దేశంలోని మిగతాప్రాంతాలకు కలుపుతూ మరికొన్నిదార్లను పూర్తి చేసింది.</span><span style="font-weight: normal; vertical-align: baseline;"> </span><span style="vertical-align: baseline; white-space: pre-wrap;"><span style="font-weight: normal;">వందలకొద్దీ యువటిబెటన్లను చైనాకు తీసుకెళ్ళి కఠోరశిక్శణను ఇప్పించి వార్ని టిబెట్లోని ముఖ్యమైన శాఖల్లో నియమించింది. వారంతా శిక్షణపూర్తయ్యేసరికే కరడుగట్టిన కమ్యూనిష్టులుగా మార్చేసింది. భారత్ నుంచి సహాయం అలానే మిగతావ్యవహారలన్నీ చక్కబెట్టుకునేందుకు సమయం కావాలి కాబట్టి సరిహద్దు వ్యవహారాలను కదిలించలేదు. వ్యూహాత్మకంగా </span><span style="color: red;">హిందీ చీనీ భాయీ భాయీ</span><span style="font-weight: normal;"> అనే పల్లవి అందుకుంది. ఇద్దరి మద్యనా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకోవడం, పర్యటనలు, సాంస్కృతిక కార్యక్రమాలు వగైరాలతో కాలం వెళ్ళబుచ్చారు.</span></span></b><br />
<b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">ఆసమయంలో </span></b><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;">భారత్కు</span></span><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"> ఒకవైపు కాశ్మీర్ అంశం పీటముడి వేసుకుని గింజుకుంటోంది. మరోవైపు నెహ్రూ తన మానసపుత్రిక అయిన పంచవర్షప్రణాళికను ప్రకటించి దాన్ని అమలుపరచడంలో నిమగ్నమయ్యాడు. దేశమంతా దీనిమీద ఎన్నోఆశలు పెట్టుకుని ఫలితాలను బేరీజు వేసుకుంటోంది. టిబెట్ లో వర్తకవాణిజ్యాలు, ఇతర సంబంధాల మీద చైనా భారత్ లు ఒప్పందాన్ని చేసుకున్నాయి. దీని పీఠికలో పొందుపరిచిన ఐదు సూత్రాలు పంచశీల సూత్రాలుగా ప్రాచుర్యం పొందాయి. అవి 1. పరస్పర గౌరవం 2. ఒకరి మీద మరొకరు దాడి చెయ్యకుండటం. 3. ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు తలదూర్చకుండటం. 4. సమలాభం 5. స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండటం</span></b><br />
<b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"><br /></span></b>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiRiIHvrTrMKmxozrIENu5wdvcU2XI1FaXTE6Opf7fIugDqyhshqCr67rQgEw33m5qpe0ALn1IyoneGfcD7FXFZ4eahpzlT-5pJ6jWM5e5olo8rddfmhEfX7zSJyLWrx_7Skb-CDENMvQQ/s1600/panchsheel.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="247" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiRiIHvrTrMKmxozrIENu5wdvcU2XI1FaXTE6Opf7fIugDqyhshqCr67rQgEw33m5qpe0ALn1IyoneGfcD7FXFZ4eahpzlT-5pJ6jWM5e5olo8rddfmhEfX7zSJyLWrx_7Skb-CDENMvQQ/s400/panchsheel.png" width="400" /></a></div>
<b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"><br /></span></b>
<b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">ఈ ఒప్పందం ద్వారా చైనాకు జరిగిన మేలులో పదోవంతు కూడా మనకు దక్కలేదు. చైనీయులు మాటిచ్చిన సత్ప్రవర్తనకు ప్రతిగా మనం </span></b><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;">టిబెట్ను</span></span><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"> పళ్ళెంలో పెట్టి సమర్పించుకున్నాం. </span></b><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;">టిబెట్ను</span></span><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"> చైనాలో అంతర్భాగంగా ఒప్పుకున్నందుకు సమానమైనదేదీ భారత్ అడగలేదు. దీనివల్ల బ్రిటీష్ వాళ్ళ ద్వారా మనకు సంక్రమించిన టిబెట్ వ్యవహారలపై అధికారం, అక్కడి సమాచార వ్యవస్థ, సైనిక కార్యకలాపాల వంటి కీలకమైన హక్కులు చైనాకు తేరగా ధారపోశాం. </span></b><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">ఈ ఒప్పందాన్ని సమర్థించుకుంటూ నెహ్రూ తన ప్రకటనలో చైనా పట్ల తనకున్న నమ్మకాన్ని ప్రస్పుటంగా తెలియజేశాడు. ఈచర్యల ద్వారా చైనా భారత్ల మద్య సంబంధాలు బలపడతాయని ప్రగాడంగా విశ్వసించాడు. </span><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">నెహ్రూ బతికున్నంత వరకూ చైనాతో యుధ్దంరాదు</span><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"> అన్న నినాదం దేశమంతా బయలుదేరింది. అన్నిప్రభుత్వ శాఖల్లోనూ, ప్రభుత్వ విధానాల్లోనూ, ప్రజల మాటతీరులోనూ ఈవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపించింది. రెండు దేశాల మద్యన సంబంధాలు ఒకవ్యక్తి చుట్టూ తిరిగితే ఎంత ప్రమాదకరమో బహుశా భారతీయులకు అప్పుడు తెలిసుండకపోవచ్చు. నెహ్రూ మరణాన్ని జయించిన వాడేమీ కాదు. ఒక దార్శనికునిగా, రాజనీతి</span></b><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;">జ్ఞునిగా</span></span><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"> ఆయన శక్తియుక్తుల మీద ఎంతనమ్మకమున్నా దేశభవిష్యత్తును ప్రభావితం చేసే కీలక అంశాల్లో పార్లమెంటు, కేబినెట్ వారివారి అస్థిత్వాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దురదృష్టవశాత్తూ ఆయన బతికుండగానే యుధ్దం వచ్చింది. </span></b><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">"చరిత్రలో ఎన్నడూ భారత్ చైనాల మద్య యుద్దం రాలేదు. ఇకపై రాబోదు" అని ప్రకటించడం ద్వారా చైనా అనేక అంతర్జాతీయ అంశాల్లో </span></b><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;">భారత్ను</span></span><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"> వ్యూహాత్మకంగా వాడుకుంది. అలీన దేశాల నాయకునిగా, శాంతికాముక దేశంగా </span></b><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;">భారత్కు</span></span><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"> అంతర్జాతీయ సమాజంలో ఉన్న మంచిపేరును చైనా తన అవసరాలకనుగుణంగా ఉపయోగించుకుంది. </span></b><br />
<b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">భారత్ చేసిన మరొక వ్యూహాత్మక తప్పిదం- పంచశీల సమయంలో టిబెట్- </span></b><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;">భారత్ల</span></span><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"> మద్య సరిహద్దును చర్చించకపోవడం. అసలు టిబెట్ ఎక్కడ వరకు ఉందో చెప్పకుండానే </span></b><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;">టిబెట్ను</span></span><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"> చైనాకు ఇవ్వడం ఘోరమైన తప్పిదం. చైనా 1954లో భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నప్పుడు చౌ ఎన్ లై ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ </span><span style="vertical-align: baseline; white-space: pre-wrap;">ఇంకా సరిహద్దు ఏర్పాటు చేసుకోలేదు</span><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"> అని చెప్పడం ద్వారా హెచ్చరించినా భారత్ బుర్రకి ఎక్కలేదు. తర్వాత నెహ్రూను చైనా ప్రభుత్వం ఆహ్వానించి రాజలాంచనాలతో సత్కరించింది. నెహ్రూ పూర్తిగా సంతుష్టుడయ్యి డిల్లీ తిరిగొచ్చాక చైనాతో యుధ్ధంరాదు అని చెప్పడంతో చైనా తనవ్యూహాన్ని పక్కాగా అమలు పరచినట్టయ్యింది.</span></b><br />
<b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">1952లో జనరల్ కుశ్వంత్</span></b><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;">సింగ్ను</span></span><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"> దేశ ఉత్తర సరిహద్దుల పరిస్థితిపైనా, చైనాతో మనకున్న ముప్పుపైనా నివేదికను ఇవ్వవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆయన సమర్పించిన సుదీర్ఘ నివేదిక అటకెక్కింది. ఆయన సూచించినవేవీ అవసరంలేదని కాబినెట్ ఏకగ్రీవంగా తేల్చేసింది. కానీ ఆతర్వాత కనీసం రోడ్లు, సమాచార వ్యవస్థ, ఇంటిలిజెన్స్ వంటివి కూడా అభివృద్ధి చెయ్యకపోవడం ఘోరతప్పిదం. </span></b><br />
<b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">దేశవిభజన తదనంతర పరిస్థితులు, పాక్ అమెరికా పంచన చేరటం ద్వారా మారిన సమీకరణాలు, అంతర్యుద్ధం ఇత్యాది కారణాల వల్ల భారత రక్షణ వ్యవస్థ పూర్తిగా పాకిస్థాన్ పక్కనుంచి ఉన్న ప్రమాదాన్ని చూసుకుంటూ చైనాసమస్యను చిన్నచూపు చూసాయి. అమెరికా నుంచి పెద్ద ఎత్తున సైనికసహాయం అందటం ద్వారా పాకిస్థాన్ రక్షణ శక్తి ఇబ్బడిముబ్బడీగా పెరిగే ప్రమాదం పొంచుకొచ్చింది. భారత్ దీనికి అభ్యంతరం వ్యక్తం చేసినా అమెరికా మాటివ్వడంతో మరోసారి మనదేశభద్రతను మరొకరి చేతుల్లో పెట్టి వాళ్ళనోటిమాటతో తిరిగొచ్చాం. </span></b><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">అయితే 1965లో యుధ్ధం వచ్చినప్పుడు పాకిస్థాన్ అమెరికా సమకూర్చిన ఆయుధాలతో దాడి చేస్తుంటే అమెరికా కట్టడి చెయ్యకపోవడం గమనార్హం. </span></b><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">మారిన సమీకరణాలను తనకు అనుకూలంగా మలచుకునేందుకు రష్యా </span></b><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;">భారత్కు</span></span><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"> సహాయం చేస్తానని ముందుకొచ్చినా నెహ్రూ దాన్ని నిరాకరించడం ద్వారా అలీన విధానానికి మనసా వాచా కర్మణా తానెంత కట్టుబడి ఉన్నాడో చెప్పడం భారతీయుల మనసుల్లోనూ, అంతర్జాతీయ సమాజంలోనూ ఆయన మీద అపారమైన గౌరవభావం పెంపొందేలా చేసింది. </span></b><br />
<b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"></span><br /><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;">ఈరకంగా 1950-55 మద్యకాలంలో చైనా గుట్టుగా తనసామర్థ్యాన్ని పెంచుకుంటూ </span></b><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;">భారత్కు</span></span><b style="font-family: Arial; font-size: 15px; text-indent: 481px;"><span style="font-weight: normal; vertical-align: baseline; white-space: pre-wrap;"> జోలపాడి నిద్రపుచ్చింది.</span></b></div>
సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com5tag:blogger.com,1999:blog-3377763021527742745.post-16977024649561949132012-09-28T10:08:00.001+05:302012-09-29T14:20:42.567+05:30మేరునగ తప్పిదం- 1. టిబెట్ వివాదం<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<b id="internal-source-marker_0.14929292700253427" style="font-weight: normal;"><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">ప్రంపంచంలో తలెత్తే ప్రతిఒక్క వివాదం వెనుకా ఒక చరిత్ర ఉన్నట్టే టిబెట్ వివాదానికీ ఒకచరిత్ర నిజానికీ పెద్ద చరిత్రే ఉంది. బౌద్ధామారాలకి నెలవైన టిబెట్ భారతదేశంతో ఎన్నోశతాబ్దాలుగా స్నేహపూర్వక సంబంధాలున్నాయి. మత, సాంఘీక, సాంస్కృతిక, వాణిజ్య, మేథోపరమైన అంశాలెన్నో రెండుదేశాల మద్యనా సౌబ్రాతృత్వ వాతావరణాన్ని నెలకొల్పాయి. బౌద్ధధర్మం, హిమాలయాలు, సాధుజన సందోహం రెండింటి మద్యనా వారధులుగా నిలిచాయి. ఈబంధం ఎంతలా పెనవేసుకుపోయిందంటే రెంటిమద్యలో నిర్ధిష్టమైన సరిహద్దును ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనే ఎవ్వరికీ రాలేదు. ఆ అవసరమే లేదనుకున్నారు. దురదృష్టవశాత్తూ అదే మన కొంపముంచింది.</span></b><br />
<span style="font-family: Arial; font-weight: bold;"><span style="font-size: 15px; white-space: pre-wrap;"><br /></span></span><span style="vertical-align: baseline;"><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;">బౌద్ధమతంలో ప్రధానంగా ఉన్నవి రెండు శాఖలు. ఒకటి హీనయానం మరొకటి మహాయానం. టిబెట్లో ఈరెండూకాక వజ్రయానం అనే మరొకశాఖ ఉంది. వీరికి గురువులుగా లామాలు ఉంటారు. వీరందరికీ పెద్దగా అత్యున్నత పదవిలో దలైలామా ఉటాడు. మిగతాదేశాల్లోలాగా</span></span><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;">టిబెట్లో</span></span><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;"> మతాధిపతిగా ఒకరు, దేశాధిపతిగా మరొకరు ఉండరు. మతాధిపతి అయినా దలైలామానే ప్రభుత్వాధినేతగా పాలనా వ్యవహారాలు చూసుకుంటాడు. 1720లో మొదటిసారిగా చైనా బలగాలు టిబెట్టులోకి ప్రవేశించాయి. ప్రంపంచానికి తెలిసిన చరిత్ర ప్రకారం చూస్తే, పద్దెనిమిదో శతాబ్ధం వరకూ టిబెట్ స్వతంత్రంగానే ఉన్నది. టిబెటన్లు మంగోలులతో కలిసి కూటమిగా ఏర్పడి చైనామీదకి దాడిచెయ్యడానికి ప్రయత్నిస్తున్నాయి అన్నది చైనా కూపిన సాకు.</span></span></span><br />
<span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">అయితే 1792 వరకు చైనాకి టిబెట్టుమీద గుత్తాధిపత్యం లభించలేదు. 1792లో చైనా మొదటిసారి అంబన్ అనేహోదాలో తన ప్రతినిధిని నియమించి అతని ద్వారా వ్యవహారాలన్నీ నడపడం మొదలుపెట్టింది. కానీ కొన్నిసంవత్సరాలకే చైనా బలహీన మవ్వడంతో తదుపరి దలైలామాను చైనాకి తెలియజేయకుండానే ఎన్నుకోవడం ద్వారా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నట్టయ్యింది.</span><br />
<b style="font-weight: normal;"><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;"><br /></span></span><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">1904లో దలైలామా రష్యన్లతో చేతులు కలపవచ్చునన్న సందేహంతో లార్డ్ కర్జన్ దలైలామా చేత బలవంతంగా ఆంగ్లో టిబెటన్ ఒప్పందాల మీద సంతకాలు చెయ్యించాడు. తద్వారా టిబెట్ వాణిజ్యరంగంమీదా, విదేశాంగ విధానాలమీద ఆంగ్లేయులకు పట్టు చిక్కింది. టిబెట్ సార్వభౌమత్వాన్ని గుర్తించాల్సిందిగా కర్జన్ బ్రిటిశ్ ప్రభుత్వానికి సూచన చేశాడు. అయితే రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలిస్తున్న బ్రిటిష్ వారికి బలహీన చైనా పెద్దసమస్యగా కనిపించలేదు.</span></b><br />
<b style="font-weight: normal;"><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;"><br /></span></span><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">1910లో చైనా పాలకులు హఠాత్తుగా టిబెట్ మీద దాడి చేసి, దలైలామాను దేశంనుంచి వెళ్ళగొట్టారు. ఆయన భారత్ లో తలదాచుకున్నాడు. అయితే వెనువెంటనే చైనాలో విప్లవం రావటం, మాన్చువంశస్థుల పాలన అంతం కావడంతో 1912లొ దలైలామా తిరిగి అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. అడపాదడపా చైనీయులు దాడి చేసినా ఆంగ్లేయులు తమ వాణిజ్య, సైనిక అవసరాల నిమిత్తం టిబెట్ను కాపాడుతూ వచ్చారు.</span></b><br />
<b style="font-weight: normal;"><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;"><br /></span></span><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">1913లో టిబెటన్లు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. టిబెట్, చైనా మరియు బ్రిటన్ల మద్య త్రైపాక్షిక చర్చలు సిమ్లాలో జరిగాయి. ఆ ఒప్పందంలో ముఖ్యమైన విషయం- టిబెట్నుఅంతర టిబెట్, బాహ్యటిబెట్లుగా రెండు ప్రాంతాలుగా విభజించారు. భారతదేశంతో సరిహద్దు ఉన్నటువంటి వెలుపలి భాగంనుంచి చైనా పూర్తిగా వైదొలగాలి. ఈప్రాంతం పూర్తిగా స్వయంప్రతిపత్తిని కలిగి ఉండాలి. అయితే చైనా రెండుభాగాలమద్యనా ఒప్పందంలో నిర్దేశించిన సరిహద్దును ఒప్పుకోలేదు. ఒప్పదంమీద సంతకం చెయ్యడానికి నిరాకరించింది. అలాగే టిబెట్కు పొరుగునున్న భారత్, బర్మా, భూటాన్ దేశాలతో సరిహద్దుకూడా పేర్కొన్నారు. ఈసరిహద్దే తదనంతరం మెక్ మహోన్ రేఖగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే- చైనా ఒప్పందంలో పేర్కొన్న అంతర్గత సరిహద్దుల పట్ల అభ్యంతరం తెలియజేసిందిగానీ టిబెట్టుకు దాని పొరుగుదేశాల మద్యనున్న సరిహద్దు గురించి కాదు. కానీ సరిహద్దు వివాదం మొదలయ్యాక తనసలు దాన్ని గుర్తించనని, ఆనాటి ఒప్పందంలో తన సంతకాలు లేవు కాబట్టి అవి చెల్లవని స్పష్టం చేసింది!!!</span></b><br />
<span style="font-family: Arial; font-weight: bold;"><span style="font-size: 15px; white-space: pre-wrap;"><br /></span></span><span style="font-family: Arial; font-size: 15px; font-weight: bold; vertical-align: baseline; white-space: pre-wrap;"> </span><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">ఈఒప్పందం తర్వాత టిబెట్ పూర్తి స్వతంత్రంగా వ్యవహరించింది. రెండవ ప్రపంచయుద్ధంలో చైనా పాల్గొనగా ఇది పూర్తిగా తటస్థవైఖరిని అవలంబించడంద్వారా ఆవిషయాన్ని ప్రపంచానికి స్పష్టంచేసింది. ఈవిషయాలన్నీ గమనిస్తే మనకు అర్థం అయ్యేదేమంటే- చైనాకు బలం ఉన్నప్పుడు యుద్ధంకేసి గెలవడం తప్ప టిబెట్ మీద దానికి ఎలాంటి పట్టూ లేదు. టిబెట్ స్వాతంత్ర్యం అన్నది చైనా బలాబలాలమీద ఆధారపడి ఉన్నది. కొద్దికాలం మినహాయిస్తే టిబెట్ మీద చైనాకు పూర్తిస్థాయి పట్టు ఎన్నడూ లేదు. 1912 నుంచి 1950 వరకు టిబెట్ పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తిని అనుభవించింది.</span><span style="vertical-align: baseline;"> </span><span style="font-family: Arial; vertical-align: baseline;"><span style="font-size: 15px; white-space: pre-wrap;">టిబెట్ స్వాతంత్ర్యం అన్న విషయానికి బ్రిటిష్ పాలకులు చాలాప్రాముఖ్యతను ఇచ్చారు. అందుకు ముఖ్యమైన కారణం ఈప్రాంతం కమ్యూనిష్ట్ చైనాకు </span><span style="font-size: 15px; white-space: pre-wrap;">భారత్కూ</span><span style="font-size: 15px; white-space: pre-wrap;"> మద్యన ఒక తటస్థప్రాంతంగా అభివృద్ధిచెయ్యడంద్వారా రక్షణపరమైన సమస్యలు చాలావరకూ తగ్గించుకోవచ్చు. </span></span><br />
<b style="font-weight: normal;"><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;"><br /></span></span></b>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEglbZiVUkiXY3h1tCq_o5x27ukz5gw9CCNLenljAo-thL1CktpWJAEcwqYkmCNLJ3p4jBeaDryXesjCdIoYQwABKXtyS5tUQPW6NLLNJZwVBBuBBtqTjvA1XgeOAZAjYZWIarb2K1kKveo/s1600/tibet+map+2.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="213" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEglbZiVUkiXY3h1tCq_o5x27ukz5gw9CCNLenljAo-thL1CktpWJAEcwqYkmCNLJ3p4jBeaDryXesjCdIoYQwABKXtyS5tUQPW6NLLNJZwVBBuBBtqTjvA1XgeOAZAjYZWIarb2K1kKveo/s320/tibet+map+2.jpg" width="320" /></a></div>
<b style="font-weight: normal;"><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;"><br /></span></span></b>
<b style="font-weight: normal;"><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;"><br /></span></span><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">అయితే 1950లో చైనా టిబెట్ను దురాక్రమించుకోవడం ద్వారా రెంటిమద్యనున్న తటస్థవేదిక మాయం అయ్యింది. 25 అక్టోబర్ 1950న "టిబెట్ ప్రజలకు స్వేచ్చను ప్రసాదించడానికి, అవిభాజ్య చైనాను నెలకొల్పడానికి, వలసపాలనను పూర్తిగా నిరోధించడానికి, సరిహద్దు ప్రాంతాలను కాపాడుకోవడానికి టిబెట్ను చైనాలో విలీనం చేసుకుంటున్నాం." అని కమ్యూనిష్ట్ చైనా ప్రకటించడం ద్వారా ఒకబలమైన శత్రువు మనపెరటి తలుపు దగ్గర వచ్చి నిలబడ్డాడు. ఇది </span></b><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;">భారత్కు</span></span><b style="font-weight: normal;"><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;"> అత్యంతప్రతికూలాంశం. ఈచర్యతో ఉత్తర, ఈశాన్య సరిహద్ద్దు ప్రాంతాల్లో రాజకీయ సమతాస్థితి దెబ్బతింది. ( ప్రస్తుతం నేపాల్లో కమ్యూనిష్టులు బలపడటం భవిష్యత్తులో మరో ఉపద్రవానికి కారణం కావచ్చు) ఉత్తరాన కొన్నియుగాలుగా పెట్టని కోటలుగా ఉన్న హిమాలయలే నేడు ఒక బలమైన శత్రువుకు సైనిక స్థావరంగా మారే ప్రమాదం సంభవించింది. </span></b><br />
<b style="font-weight: normal;"><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;"><br /></span></b>
<span style="font-family: Arial; vertical-align: baseline;"><span style="font-size: 15px; white-space: pre-wrap;">రానున్న ఉపద్రవాన్ని ముందుగానే ఊహించిన పటేల్ మహాశయుడు తన మరణానికి నెలరోజులముందు ప్రధానికి ఒక సుదీర్ఘమైన లేఖను రాశాడు. అందులో </span><span style="font-size: 15px; white-space: pre-wrap;">టిబెట్ను</span><span style="font-size: 15px; white-space: pre-wrap;">చైనా ఆక్రమించడం దేశరక్షణకు ఎంతపెద్దముప్పో సవివరంగా తెలియజేశాడు. ఆయన అందులో అనుమానించినవన్నీకాలక్రమంలో నిజమయ్యాయి. కానీ దురదృష్టవశాత్తూ పటేల్ నిష్కృమణతో దేశరాజకీయాలు ఏకదృవమయ్యాయి. భారత ప్రభుత్వం మొక్కుబడిగా </span></span><span style="font-family: Arial; font-size: 15px; white-space: pre-wrap;">సంభ్రమాశ్చర్యాలను,</span><span style="font-family: Arial; font-size: 15px; white-space: pre-wrap;"> ప్రగాడ సంతాపాన్ని తెలియజేసింది.</span><br />
<b style="font-weight: normal;"><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;"><br /></span></span><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">రానున్నది ఎంతగడ్డుకాలమో కొద్దిమందికి తప్ప దేశంలో ఎవరికీ పట్టలేదు. సగటు మానవుడు కొత్తగా వచ్చిన స్వాతంత్ర్యాన్నిచూసుకుంటూ మురిసిపోతున్నాడు. మేథావులంతా కొత్తగా తయారైన రాజ్యాంగాన్ని పరిశోధిస్తున్నారు. అధికారగణమంతా జవహర్ను అంతర్జాతీయ సమాజంలో ధృవతారగా చూపే పనిలోనూ, విదేశాంగశాఖ ఆయన పర్యటనల ఏర్పాట్లలోనూ, ఉపన్యాసాలు తయారు చెయ్యడంలోనూ తలమునకలై ఉన్నారు. </span></b><b style="font-weight: normal;"><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">జయప్రకాష్ నారాయణ్, ఎన్.జీ. రంగా వంటివారు పార్లమెంటులో మనవైఖరిని విమర్శించినా పెద్దగా ఒరిగిందేమీలేదు.</span></b><br />
<b style="font-weight: normal;"><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;"><br /></span></b>
<b style="font-weight: normal;"><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">చైనీయులతో సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడానికే మొగ్గుచూపుతూ హిందూ చీనీ భాయీభాయి అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఆసమయంలో బలవంతుడు బలవంతుణ్ణే గౌరవిస్తాడు. అతనితోనే స్నేహంచేస్తాడు అన్న మౌలిక విషయాన్ని మనం మర్చిపోయామనుకుంటా. బలమైన చైనా చాలా ప్రమాదకారి. రాజ్యకాంక్షతో విస్తరణ చెయ్యడం దాని నైజం. జరిగిన పరిణామాలతో దానికి బలం, వనరులనేగాక కాంక్షను రెచ్చగొట్టగలిగిన అనేక అంశాలు అనుకూలమయ్యాయి.</span></b><br />
<b style="font-weight: normal;"><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;"><br /></span></b>
<b style="font-weight: normal;"><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">నిజానికి సమస్య తీవ్రతను బేరీజు వేసుకున్నాక, టిబెట్ను చైనా కబంధహస్తాల నుంచి కాపాడటానికి మనం దౌత్యపరంగానూ, న్యాయపరంగానూ చెయ్యగలిగిన ప్రయత్నాలన్నీ చేసుండాల్సింది. మనదేశరక్షణావసరాల దృష్ట్యా మనం తప్పక చెయ్యాల్సిన పని అది. జవహర్ అప్పటికే అంతర్జాతీయ సమాజంలో కూడగట్టుకున్న ప్రతిష్టను ఇందుకు వినియోగించాల్సింది. తద్వారా ఒకబలహీన దేశానికి చేయూత నందించిన వాడిగాను, తన దేశప్రయోజనాలను కాపాడుకున్న నాయకుడిగాను ఎంతోపేరొచ్చుండేది. </span><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">మహాభారతం ఉద్యోగపర్వంలో చెప్పినట్టు పెద్దలు, విజ్ణులైనవారు జరుగుతున్న చెడును నివారించకుంటే దానికి వాళ్ళూ బలైపోతారు. భారతదేశానికి ఈవిషయంలో జరిగిందిదే. వేలసంవత్సరాల చరిత్ర,, సంస్కృతి, ధర్మంపట్ల నమ్మకం కలిగిన జాతిగా మనం కళ్ళముందు జరిగిన దారుణాన్ని నిలువరించలేకపోయాం. నిలువరించేంత బలం లేకపోయినా కనీసం అంతర్జాతీయ సమాజానికి తెలియజెప్పే పనైనా చెయ్యాల్సిన విద్యుక్తధర్మం మనపట్ల ఉంది. కానీ దురదృష్టవశాత్తూ ఐక్యరాజ్యసమితిలో జరిగిన చర్చకు మద్దతిచ్చి టిబెట్ విముక్తికి సహాయపడాల్సిందిపోయి మనమే చర్చను వ్యతిరేకించాం. ఈసమస్యను టిబెట్ చైనాలు చర్చల ద్వారా పరిష్కరించుకుంటాయి అని చెప్పడం ద్వారా మనమే ప్రపంచంనోరు నొక్కేశాం. జరుగుతున్న పరిణామాలతో అందరికన్నా ఎక్కువగా ప్రభావితమయ్యే మనమే చర్చను వద్దనడంతో మిగతాదేశాలకు దీన్నిపట్టించుకొనవలసిన అవసరం కనిపించలేదు.</span></b><br />
<b style="font-weight: normal;"><span style="font-family: Arial;"><span style="font-size: 15px; white-space: pre-wrap;"><br /></span></span><span style="font-family: Arial; font-size: 15px; vertical-align: baseline; white-space: pre-wrap;">అలా టిబెట్ సమస్యను భారత్ పరిష్కరించేసింది. అది చైనాలో అంతర్భాగంగా అప్రతిహతంగా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక, రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పట్లో టిబెట్కు స్వేచ్చా స్వాతంత్ర్యాలు లభించే అవకాశాలు కనుచూపుమేరలో లేవు. డ్రాగన్ మనపక్కలోనే బుసలుకొడుతూ రోజురోజుకీ బలపడుతుంది. సైనిక సామర్థ్యాన్ని వందలరెట్లు పెంచుకుంటోంది. మరొకవైపున కాశ్మీర్ రగులుతూనే ఉంది. నేపాల్ కమ్యూనిష్టుల పరమవడంతో ఉత్తరసరిహద్దు పూర్తిగా రావణకాష్టంగా మారింది. ఏహిమాలయాలను చూసుకుంటూ పెట్టనికోటలంటూ మురిసిపోయామో అవేపర్వతాలు శత్రువుల సైనికస్థావరాలుగా, శిక్షణాశిబిరాలుగా, ఆయుధాగారాలుగా మారిపోతే చేష్టలుడిగి చూస్తున్నాం. దేశబడ్జెట్లో సింహభాగం సరిహద్దు రక్శణకే ఖర్చవుతోంది. దేశశ్రేయస్సు దృష్ట్యా రక్శణవ్యయాన్ని విపరీతంగా కుదించేందుకు మొగ్గుచూపినందుకుగాను తదనంతరం ఒకవైపు మనభూభాగాన్ని కోల్పోగా, మరోవైపు రక్షణవ్యయం అంతకంతకు పెరిగింది. ఖర్చయితే అవుతుందిగానీ సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం అయితే దొరకట్లేదు.</span></b></div>
సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com8tag:blogger.com,1999:blog-3377763021527742745.post-26614621944517757112012-09-27T01:05:00.002+05:302012-09-27T01:06:37.422+05:30మేరునగ తప్పిదం<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<span id="internal-source-marker_0.07152960433613986" style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 15px; font-style: normal; font-variant: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">వేలకొద్ది
సంవత్సరాల చరిత్ర కలిగిన ఒకజాతి తనఅస్థిత్వాన్ని కోల్పోయి, శతాబ్ధాలపాటు
బానిసత్వంలో మగ్గిన తరువాత, ప్రపంచం నివ్వెరపోయేలా అహింసని ఆయుధంగా
మలచుకుని, విషసర్పాల నడుములు విరగ్గొట్టి, తనఝెండాని రెపరెపలాడించింది.
సంబరాలు మిన్నంటిన మరుక్షణమే బాలారిష్టాలు మొదలయ్యాయి. అతుకులబొంతని
కాశ్మీరీ తివాచీలా మార్చేబాద్యతని పటేల్ మహాశయుడు భుజాన వేసుకుని
అద్భుతాన్ని ఆవిష్కరించాడు. సర్వజనామోదమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్
ప్రసాదించాడు. ప్రధమ భారత పధానిగా నెహ్రూ దూరదృష్టితో ప్రవేశపెట్టిన అనేక
పధకాలు, అమలుచేసిన విధాన నిర్ణయాలు, స్థాపించిన సంస్థలు, పరిశ్రమలు ఇతర
అంతర్జాతీయ విషయాలు ప్రజలకు మునుపెన్నడూ అనుభవంలేని ప్రజాస్వామ్యం అనే
కొత్తవ్యవస్థ పైన గురికుదిరేలా చేశాయి.</span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 15px; font-style: normal; font-variant: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"></span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 15px; font-style: normal; font-variant: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">నెమ్మదిగా
ఒక్కొక ఫలితం కళ్ళముందు కనబడటం మొదలవ్వటంతో నిన్నగాక మొన్న మేల్కొన్న జాతి
అంతలోనే మగత నిద్రలోకి జారుకుంది. పక్కలోనే నిప్పులుగక్కే డ్రాగన్
ఉన్నాడన్న నిజాన్ని విస్మరించి, అడపాదడపా తగిలిన ఎదురుదెబ్బలకి పెయిన్
కిల్లర్లతో సరిపెట్టి మగత నిద్రలోకి జారుకుంది. ఫలితం- ఓ తెల్లవారుఝామున ఆడ్రాగన్ భూతం
విరుచుకు పడింది. తెల్లారేసరికి వందలకొద్దీ సైనికులు ( చలికి, అన్నం
దొరక్క, గాయాలకి చనిపోకుండా మిగిలినవాళ్ళు) దేశంకోసం ప్రాణాలర్పించారు.
ఇంకొంతమంది యుద్ధఖైదీలుగా శత్రువుల చేతికి చిక్కారు. వందల చదరపు కిలోమీటర్ల
ప్రాంతం వాళ్ళ హస్తగతమైంది.బలవంతుడు వికటాట్టహాసం చేశాడు. </span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 15px; font-style: normal; font-variant: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"><br /></span>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiyWxXI3rcjHkd-1OVUC5sU3T-CPq7WzbzFEMns6lXHi9cT92euQzN8BQu0Y6JC5kUHLja4Rxsh3nA2CzXeUXRF5RBdobWbFBgyFHeFTA9oC_j9_BNEqTH8oESrALVcDJQZEDXV5ZjnUAI/s1600/1511-India-China101.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="240" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiyWxXI3rcjHkd-1OVUC5sU3T-CPq7WzbzFEMns6lXHi9cT92euQzN8BQu0Y6JC5kUHLja4Rxsh3nA2CzXeUXRF5RBdobWbFBgyFHeFTA9oC_j9_BNEqTH8oESrALVcDJQZEDXV5ZjnUAI/s320/1511-India-China101.jpg" width="320" /></a></div>
<br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 15px; font-style: normal; font-variant: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">ఇంత
జరుగుతున్నా రాజధానికి కనీస సమాచారం లేదు. గాలివార్తలు, పుకార్లు తప్ప
ప్రభుత్వం తరపునుఁచి నిర్ధిష్టమైన సమాచారం లేదు. అడపాదడపా ప్రకటనలు
వెలువడినా అవి జాతిని నిలువునా మోసం చేసి దారితప్పించేవే తప్ప సరిహద్దులోని
పరిస్థితిని యథాతథంగా తెలిపేవి ఒక్కటీలేవు. మనసరిహద్దులో ఏమి జరుగుతుందో
సామాన్యుడికి తెలియదు. అయినా ఒకధైర్యం. ఒక నమ్మకం అతనిని నడిపించాయి.
అతనికున్న ధైర్యమెల్లా సైనికుడి మీదే. నిజానికి ఆసైనికుడొక్కడే ఇతని
నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. దానికోసం ప్రాణాల్ని పణంగా పెట్టాడు. కానీ
అతని త్యాగమూ బూడిదలో పోసిన పన్నీరైంది.</span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 15px; font-style: normal; font-variant: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">ఇతని
చేతిలో అరకొర ఆయుధాలు. శత్రువు చేతిలోనేమో అత్యాధునిక ఆటోమేటిక్ రైఫిల్లు.
ఇటు మాసిన కేన్వాస్ షూస్ అటు తేలికపాటి సైనికబూట్లు. పన్నెండువేల అడుగుల
ఎత్తులో మామూలు నూలు దుస్తులతో మనవాడు. ప్రత్యేకమైన పాలిస్టర్ యూనిఫార్మ్లో
శత్రువు. చివరికి బలమే నెగ్గింది.</span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 15px; font-style: normal; font-variant: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"></span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 15px; font-style: normal; font-variant: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">ఆక్షణం
వరకు పోటాపోటీగా యుద్ధనిర్వాహక బాద్యతలకోసం కొట్టుకున్న అధికారగణం
ఒక్కసారిగా తప్పించుకు పారిపోను దారులు చూసుకోసాగారు. దేశంలోని అత్యున్నత
వ్యవస్థలు, అధికార కేంద్రాలనుంచి క్షేత్రస్థాయిలోని ఉద్యోగుల వరకూ
అన్నిచోట్లా వ్యవస్థ కుప్పకూలింది. అన్నిస్థాయిల్లోనూ, అన్నివిభాగాల్లోనూ
మొత్తం వ్యవస్థనే అస్థిరపరిచేంత ఒక్కమాటలో చెప్పాలంటే మేరునగమంత
పెద్దతప్పిదం మనదేశ రక్షణకు పెట్టనికోటల్లా భావించే హిమాలయాల సాక్షిగా
జరిగింది.</span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 15px; font-style: normal; font-variant: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"></span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 15px; font-style: normal; font-variant: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">పజల
మనసుల్లో దైవాంశసంభూతునిగా ఆదరణ పొందిన జవహర్ ప్రతిష్ట ఒక్కసారిగా
అథఃపాతాళానికి జారిపోయింది. ఒక్కసారిగా అలజడి. ఆందోళన. ప్రజలు ఎవ్వరినీ
విశ్వసించలేని పరిస్థితి. అయినా నపటేల్ నిర్యాణంతో ెహ్రూకి
ప్రత్యామ్నన్యాయం లేకపోవడం దేశానికి మరొక సంక్షోభం. ఏ ప్రగతిపేరు చెప్పి
సైనికావసారలకు డబ్బులేదన్నారో ఆప్రగతే పూర్తిగా కుంటుపడే పరిస్థితి. ప్రతి
విషయంలోనూ అన్నిటా తానై కనిపించే జవహర్ ఇప్పుడు తనప్రజలముందు నిలబడలేని
పరిస్థితి. ఇన్నేళ్ళూ ఒక్కొక్క ఇటుకా పేర్చుకుంటూ అంతర్జాతీయ సమాజంలో తాను
నిర్మించుకున్న కోట బీటలువారడం మింగుడు పడట్లేదు. అయినా సహించక తప్పని
పరిస్థితి. </span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 15px; font-style: normal; font-variant: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">యుద్ధానికి
పూర్వం ఆయనకు అతిదగ్గరగా తిరిగిన ప్రతి అధికారిదీదీ, నాయకునిదీ దాదాపూ అవే
అనుభవాలు. ఇంతమందిలోనూ ఒక్కడు మాత్రం ధైర్యంగా తలెత్తి నిలుచున్నాడు.
తనధర్మం నిర్వర్తించేందుకు ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టిన ఆఒక్కడికే
మాత్రమే తలెత్తుకుని జీవించే హక్కు ఉందన్నది దేశం మొత్తానికీ తెలుసు. </span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 15px; font-style: normal; font-variant: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"></span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 15px; font-style: normal; font-variant: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">ఆఘోర
తప్పిదం జరిగి 20 October 2012 కి యాభై ఏళ్ళు. శాంతి సౌబ్రాతృత్వాలే
ఆలంబనగా స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్న ఒకజాతి వెన్నుపోటుకి గురై యాభై
ఏళ్ళు. జాతిశ్రేయస్సుకన్నా వ్యక్తిగత ప్రతిష్టకే ప్రాధాన్యమిచ్చాడన్న
అపఖ్యాతి ఈదేశ ప్రధమ ప్రధాని మూటగట్టుకుని యాభై ఏళ్ళు. శతాబ్ధాల బానిసత్వం
తర్వాత ఎన్నోత్యాగాలకోర్చి సంపాదించుకున్న స్వతంత్ర్యాన్ని అపురూపంగా
చూసుకుంటున్న దేశం తనచరిత్రలో మొట్టమొదటి ఆధునిక యుద్దతంత్రంలో తడబడి
యాభైఏళ్ళు. సైనికావసరాలకన్నా సామాన్యుడి ప్రగతే ముఖ్యమని నమ్మిన పాలనా
వ్యవస్థ నగుబాటుకి గురై యాభై ఏళ్ళు. వెరసి <b style="color: red;">మేరునగమంత తప్పిదానికి యాబై
ఏళ్ళు</b>. </span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 15px; font-style: normal; font-variant: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"></span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 15px; font-style: normal; font-variant: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">ఈతప్పిదానికి
దారి తీసిన పరిస్థితులేవి? యుద్ధభూమిలో ఏమి జరిగింది? యంత్రాంగం ఎలా
స్పందించింది? ప్రభుత్వం ఎలా వ్యవహరిఁచింది? అన్నింటికన్నా ముఖ్యంగా అసలీ
తప్పిదం నుంచి జాతి ఏమి నేర్చుకుంది? ఈదేశపౌరులుగా మనమందరం ఆలోచింకాల్సిన
విషయాలివి. సైనికదళ నాయకునిగా చైనీయులతో పోరాడి, ఓడి ,శత్రువు చేతికి
చిక్కి, యుద్ధఖైదీగా శిక్షను అనుభవించి, తిరిగి స్వదేశానికి చేరుకున్న
మహావీరుడు <b style="color: red;">బ్రిగేడియర్ జే.పీ. దాల్వి</b> తన అనుభవాలను <b style="color: red;">HIMALAYAN BLUNDER</b> అన్న
పేరుతో పుస్తకంగా ప్రచురించాడు. చైనా యుద్ధానికి సంబంధించి విశ్వసనీయ
గ్రంధంగా ఈపుస్తకాన్ని రక్షణరంగ నిపుణులు, విమర్శకులు పేర్కోంటారు. చైనా
యుద్దం జరిగి యాభై ఏళ్ళయిన సందర్భంగా ఈపుస్తకంలోని ముఖ్యమైన అంశాలను
ప్రస్తావిస్తూ కొన్నిభాగాలుగా ప్రచురించ దలిచాను. </span></div>
సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com6tag:blogger.com,1999:blog-3377763021527742745.post-44244150658263837512011-08-14T12:48:00.003+05:302011-08-14T13:00:15.682+05:30అహో అమ్మా! ఒహో చెల్లీ!!<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<div style="text-align: justify;">
నేను భూమ్మీద పడ్డాక చాలాయేళ్ళు దీక్షగా సాగించిన కార్యం ఏదైనా ఉందా
అంటే చెంపకింద చెయ్యేసుకుని రెప్పవాల్చకుండా తదేకంగా ఆలోచిస్తూ ఉండడం. అలా
చేస్తూ ఉంటే చూసేవాళ్ళంతా వీడో అరిస్టాటిల్ అన్నట్టు ఫీలవుతున్నప్పుడు
మాంచికిక్ ఉండేది. అలా ఆలోచించగా చించగా ఓరోజు ఓగొప్ప ఆలోచన వచ్చింది.
ఆఆలోచన ఏమిటయ్యా అంటే దయచేసి హృద్రోగులు ఇకమీదట చదవొద్దు ప్లీజ్)
<span style="font-size: large;"><b><span style="font-size: small;">రోజూ నిద్రలేవడంతోనే అమ్మానాన్నల పాదాలకు దణ్ణం పెట్టాలి</span></b>.</span> అసలు దీనికి మూలం ఏమిటంటే మాఅమ్మని కథచెప్పమ్మా అన్నప్పుడల్లా
శ్రావణకుమారుడికథ మొదలుబెట్టి కావడిలో కూర్చునేసేది. 'ఈఆలోచన ఎలా
వచ్చిందిరా!' అని నన్నునేను ప్రశ్నించుకుంటే ఛాతీ విశాలమైంది. రోమాలు
నిక్కపొడుచుకున్నాయి. పాతగోరింటాకులో శొభన్బాబులాగా, కొత్త ఛత్రపతిలో
ప్రభాస్లాగా ఫీలయ్యాను. ఓరెండుమూడు నిమషాలైనాక సిగ్గు ముంచుకొచ్చేసింది.
అలా అలా నెమ్మదిగా హాల్లోకి వెళ్తే అమ్మ కూరలు తరుగుతూ ఉంది. 'వామ్మో!
ఇప్పుడు చెబితే పాపం ఎమోషన్లో చెయ్యి తెగ్గోసుకుంటుంది.' అనుకుని బయటే
కూర్చున్నా. కాసేపటికి బాగాధైర్యం తెచ్చుకుని ఊపిరి గాట్టిగా పీల్చి వదిలి, బాబా
రామ్దేవ్ తెలీకపోయినా ఆయన భంగిమలు ఓరెండుమూడు వేసేసి నెమ్మదిగా
అమ్మదగ్గరికి వెళ్ళాను.</div>
<div style="text-align: justify;">
"ఏరా! ఏమైంది" అని అడిగింది.</div>
<div style="text-align: justify;">
"అమ్మా! రేపట్నుంచి
ఓపని చేస్తానుమా." అన్నాను.</div>
<div style="text-align: justify;">
"?" అంది. (అనుకోవాలి)</div>
<div style="text-align: justify;">
"రేపట్నుంచి
నిద్రలేవడంతోనే నీకూ, ఒకవేళ నాన్న ఉంటే నాన్నకి కాళ్ళకి దండంపెడతానమ్మా."</div>
<div style="text-align: justify;">
"!!!!????" (ఆఎక్స్ప్రెషన్ని పూర్తిగా వ్యక్తీకరించే సింబల్స్ కీబోర్డులో
లేవు.)</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ఏదో ఆక్షణం అలా అనేశానేగానీ సాయంత్రానికి వాటితాలుకు జ్ఞాపకాలన్నీ
మెదడు అడ్రస్తెలీని ఏదోచోట దాచిపెట్టేసింది. తర్వాతరోజు తెల్లవారింది.
మనం మొద్దునిద్రనుంచి దిగడంతోనే అక్కడికి పరిగెత్తుకెళ్ళే అలవాటు.
ఆతొందర్లో రెండుమూడురోజులు లేచిన గంటకో గంటన్నరకో గుర్తొచ్చేది. తెగఫీలవుతూ
"అమ్మా! మర్చిపోయానే. రేపణ్ణుంచి. సరేనా." అనేసి గోడమీద 'దణ్ణం రేపు' అని
రాసిపెట్టుకున్నా.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
అలా వారమయ్యాక "అమ్మా! నాకు గుర్తుండడం లేదు. నువ్వే
గుర్తుచెయ్యవా." అనడిగా. మనమీద ఎక్స్పెక్టేషన్స్ ఆలెవల్లో ఉన్నాయో ఏమో?
పాపం "నువ్వు నిద్రలేచే సరికే ఎదురుగా నిలబడి నాకు దణ్ణంపెట్టరా ప్లీజ్ అని
నీయెదురుగా నిలబడాలా?" అని కోపంగా అడిగేసరికే నీకు దణ్ణం పెట్టడం
కష్టంగానీ నాకు అన్నం పెట్టు అన్నా.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
పాండురంగ మహాత్మ్యం క్లయిమాక్స్లో "అమ్మా! అని పిలిచినా ఆలకించవేవమ్మా?" విన్నప్పుడల్లా పడీపడీ నవ్వుకునే జ్ఞాపకం ఇది.</div>
<div style="text-align: center;">
*****</div>
<div style="text-align: justify;">
అందరూ రాఖీ... రాఖీ... అంటూ తెగగొడవ
చేసేస్తున్నప్పుడల్లా నాకు ఓ విషయం విపరీతంగా నవ్వు తెప్పిస్తుంది. అవి
నేను నిక్కర్లకి పాంట్లకి మద్యన ఒకసంధికాలంలో ఊగిసలాడుతున్నరోజులు.
అప్పుడే రాఖీ అన్నదొకటి ఉంటుందని దాన్ని అన్నలకు కడతారని తెలిసింది. సరే మరి 'అన్న' డెసిగ్నేషన్ మనకూడా ఉంది కాబట్టి మనంకూడా కట్టించుకోవచ్చు అనుకుని ఆముచ్చట
చెల్లితో చెప్పాను. "సరేరా కడతాను. కానీ దానికి నువ్వునాకు డబ్బులు ఇవ్వాలి
అంట. ఈఆటలో ఆరూల్ కూడా ఉందంట." అని చెప్పింది. భాషా సినిమాలో రజనీ
ఓపెద్దకుర్చీలో కూర్చుని చేతిమీదముద్దులు పెట్టించుకున్నట్టు నేను రాఖీలు
కట్టించుకున్నట్టు కలలు కంటున్న నాకు ( అదెంత పీడకలో ఆవయసులో తెలియలేదు.)
ఈసంగతి తెలియడంతోనే నిక్కర్లకి ఉన్న చిల్లుజేబులు గుర్తొచ్చాయి. <b>మై డాడ్
ఈజ్ ఎన్ ఏటీఎం</b> అనుకుంటూ నాన్న దగ్గరికి వెళ్ళాను. వెంటనే ఇచ్చేశాడు.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
చెల్లెలు పెద్దభూచక్రం సైజుది కొనుక్కొస్తుంది అనుకుంటే మేకగడ్డం
షేపులో ఉన్నది తీసుకొచ్చింది. 'చెల్లెళ్ళన్నాక రకరకాలుగా ఉంటారు.మనమేసర్దుకుపోవాలి. సర్లే ఈసారికి ఇలాకానిద్దాం.' అనుకుని ఎదురుగా
నిలబడ్డా. ఏవిటొ ఈజీవితానికి ఎప్పుడూ అలవాటులేని సిగ్గొకటి మొహంమీద
తాండవిస్తుంది. ఒకభంగిమలో నిలబడి మెలికలు తిరిగిపోతున్నా. బహుశా శునకానందం
అంటే ఇదేనేమో. చెయ్యిముందుకి చాచి కట్టమన్నాను. అది సీరియస్గా కడుతుంది.
రెండు మూడు నిముషాలైనా అది కుస్తీపడుతుంది తప్ప కట్టడం పూర్తికావట్లేదు.
నాకు కొద్దిగా విసుగొచ్చింది. అది ఇంకా ఆలశ్యం చేస్తోంది. ఎప్పుడెప్పుడు
కడుతుందా వీధిలోకెళ్ళి ప్రదర్శన మొదలెడదామా అన్న ఆరాటం క్షణక్షణం
పెరిగిపోతోంది. ఇంకోపక్క చెయ్యి గుంజుతోంది. "అబ్బా! త్వరగా కానివ్వవే."
అంటున్నాను. ఇంతలో ఏదోజరిగింది. దానిచూపు కడుతున్న రాఖీనుంచి ఎక్కడికో
మళ్ళింది. పిచ్చ ఇరిటెషన్ రేగి ఒక్కటిపీకాను. నాకు తెలిసి భూమ్మీద
రాఖీకడుతున్న చెల్లెల్ని కొట్టిన యెదవ నాడాషుగాడిని నేనే అనుకుంటా. అది
కెవ్వుమంది. ఓపదినిముషాలు గింజుకోవడం, వాదులాడుకోవడం, కొట్టుకోవడం
వగైరాలన్నీ అయిపోయాక మానాన్న దగ్గరికి పిలిచి ఒక్కటి పీకాడు. దెబ్బకి టూత్స్ బ్రేక్స్. "రాఖీకి డబ్బులు
నాజేబులోంచే, తిరిగి నువ్విచ్చే మామూలూ నాదగ్గర్నుంచే. పోనీ ఇంతాచేసి ఏమైనా
ఆనందమా అంటే మీమొహాలకి అదీలేదు. అంతదానికి నాకెందుకురా డబ్బులు బొక్క. నాకు ఇంకో కింగ్ పాకెట్ వస్తుందికదా." అనేసి ఇక మీదట రాఖీకి బడ్జెట్ ఉందదని చెప్పేశాడు. అయినా తర్వాత ఒకట్రెండు సార్లు అదికట్టడమూ ఐదునిముషాల్లోనే పుటుక్కున
తెగిపోవడమూ జరిగిపోయేవి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నిన్న చెల్లిఫోన్ చేసి ఓపదిహేనునిమషాలు అలాఅలా నెమరేసుకుని పడీపడీ నవ్వుకున్నాం. కొట్టినా కొట్టించుకున్నా మాఇద్దరి మద్యనే. ఏమంటార్?</div>
</div>
సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com7tag:blogger.com,1999:blog-3377763021527742745.post-86487841711611267872011-02-24T00:56:00.000+05:302011-02-24T00:56:04.035+05:30విరహవేదన<div dir="ltr" style="text-align: left;" trbidi="on">పుట్టాక పాతికేళ్ళు వచ్చేదాకా నిన్నుచూడలేదు. మొదటిసారి నిన్ను చూసినప్పుడు కలిగిన ఉద్వేగం దాదాపూ ప్రతిఒక్కరి జీవితంలో కలిగేదే. లోకం తెలిశాక ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే నిరీక్షణే. కాకపోతే ఎదురొచ్చాక ఎవరికి వాళ్ళకి అదొక ప్రత్యేకమైన క్షణం. అది ఫలానా అని చెప్పగలిగే స్థితిలో కొద్దిమంది ఉంటారు. కానీ వాళ్ళు ఎంత విడమరచినా పదోవంతుకూడా ఉండదు.<br />
<br />
నాజీవితానికొక గౌరవం, నామీద నాకు నమ్మకం వచ్చిందంటే అది నువ్వు నాపక్క నిలబడ్డాకనే. నిన్ను అలా అరచేతిలోకి తీసుకుని ఎప్పటికీ ఉంచేసుకొవాలని నేను పడే తపన నీకుకూడా తెలుసు. నువ్వు ముద్దుగా బొద్దుగా రెండుచేతులా సరిపోయేంతగా ఉంటే చూడాలని కలలుగనే నాకు ఎప్పుడూ నిరాశే. డైటింగులు, జీరోసైజులంటూ బక్కచిక్కిన నిన్నుచూస్తే నీమీదకన్నా నామీద జాలేస్తూ ఉంటుంది. సరే అలాగైనా నిన్ను ఏలుకుందాం, కలకాలం దాచుకుందా అనుకుంటే నువ్వేమో వేళ్ళసందుల్లోంచి జారిపోతావు.<br />
<br />
తాతకి, నాన్నకి, మావలకి కూడా ఆవయసులో ఎదురైన అనుభవమే ఇది. అప్పుడప్పుడూ వాళ్ళజ్ఞాపకాలను తడిమిచూసుకుంటుంటే వినేవాడిని. నాకు అర్థమయ్యేంత వయసు రాలేదని అనుకునేవాళ్ళు. అదినిజమేననుకో. కాకపోతే నువ్వు జీవితానికి చాలా ముఖ్యమైన దానివని మాత్రం అర్థమయ్యింది. అప్పట్లో నీగురించి ఎన్నోఫాంటసీలు ... రంగురంగుల్లో ఈస్ట్మన్ కలర్లో, టెక్నికలర్లో, డిజిటల్ ఎఫక్ట్స్తో అబ్బబ్బా... ఆరంగులే వేరు. కానీ మొదటిసారి నువ్వు నాదగ్గరకి వచ్చిన క్షణం అర్థం అయ్యింది నువ్వు నేను ఊహించుకున్న దానికన్నా భిన్నమైన దానివని. కొన్ని ఎంతోగొప్పగా, మరికొన్ని అసహనం కలిగించేవిగా, ఇంకొన్ని చిత్రవిచిత్రంగా... నీమీదనేకాదు ఈప్రపంచం మీద నాకున్న కొన్ని అభిప్రాయాల్ని క్షణాల్లో తుడిచేసి నన్ను మార్చేసిన ఘనత నీదే.<br />
<br />
ఇంతకముందు విన్నదానికి, ఊహించుకున్నదానికి భిన్నంగా ఎదురొచ్చి నిల్చున్న నిన్ను చూస్తే ఒక్కసారి నన్నునేను అద్దంలో చూసుకున్నట్టు అనిపించింది. పెద్దోళ్ళు వయసులో ఉన్నప్పుడు మొదటిసారి చూసేటప్పుడు ఎదురెదురుగా చూస్కునే వాళ్ళంట. వాళ్ళపెద్దవాళ్లకీ చూపించి సంబరపడే వాళ్ళంట. రోజులు మారిపోయాయి. లోకం మారిపోతుంది. బంధాలూ మారుతాయి. అంతే. మనం వద్దన్నా..ఒప్పుకోకున్నా మనమూ మారతాం. కాకపోతే మారామన్నది తెలుసుకునేదానికి సమయం పడుతుంది. మన విషయంలోనూ అదేజరిగింది. నిన్ను ఎదురుగా చూడలేక, అరచేతుల్లోకి తీసుకుని ముద్దాడలేక తెరమీద ఉన్న నిన్ను తడుముకుని మురిసిపోయినప్పుడు తెలిసొచ్చింది జీవితం ఎంతయాంత్రికమైపోయిందో.<br />
<br />
ఎప్పుడూ ఒంటరిగానే వచ్చేదానివి అప్పుడప్పుడూ చెలికత్తెలని, తోబుట్టువుల్ని వెంటబెట్టుకొస్తావు. అదేవిటొ నీమీద ఉన్న మమకారంవల్లనో, వాళ్ళతో ఉన్న బంధుత్వం వల్లనో నాకు ఇరుకైనట్టుగా గానీ ఇబ్బందిగాగానీ అనిపించదు. కానీ వాళ్ళు నన్నొదిలి వెళ్ళేటప్పుడు కూడా బాధకలగడం ఒకింత నవ్వొచ్చే విషయం.<br />
<br />
<br />
నాకున్న ఒకేఒక్క కోరిక నువ్వు నాదగ్గరే కలకాలం ఉండిపోవాలి. కానీ నువ్వేమో నాచేతుల్లో కరిగిపోతావు, వేళ్ళసందుల్లోంచి జారిపోతావు, నామీద అలిగి వెళ్ళిపోతావు. వెళ్ళొద్దని నీచెయ్యిపట్టుకుని బ్రతిమాలితే "నిన్ను ఉద్ధరించడానికే...నిన్ను సుఖపెట్టడానికే..నిన్ను సంతోషపెట్టడానికే..." అంటూన్న నిన్నుచూస్తే నాలోని స్వార్థం వెయ్యిపడగలతో బుసకొడుతుంది. నువ్వు ఎక్కడికీ వెళ్ళకుండానే నాకు అన్నీ జరిగిపోవాలని శతవిధాలా ప్రయత్నించినా ఒకవెర్రినవ్వు నవ్వేసి నీపని నువ్వు చేసుకుంటానంటావు. వెళ్ళిపోయావని తెలిశాక కలిగేబాధ అనుభవించేవాడికొక్కడికే తెలుసు. "ఎక్కడికెళూతుందిరా? మళ్ళీ వస్తాదిలే" అని మనసుకు నచ్చజెప్పటం,నామాట విని తల ఊపెయ్యటం నాకూ మనసుకూ అలవాటైపోయింది. అలా రోజుల తరబడి, వారాల తరబడి ఎదురుచూస్తే వరదబాధితులకోసం హెలికాప్టర్ వచ్చినట్టు ఒక్కసారి చెయ్యూపి వెళ్ళిపోతావు. ఇనప్పెట్టెలో బంధించి నాదగ్గరే ఉంచుకోవాలని నాకున్నా నిన్ను విశాలప్రపంచంలోకి షికారు చెయ్యించాలనుకునే సూచీల బలం ముందు చేతగాని వాణ్ణవుతాను. ఆక్షణం నువ్వు చూసేచూపుకి తలదించుకుని నిలబడటం కన్నా ఏమీచెయ్యలేను.<br />
<br />
నెలల్లోకెల్లా ఉత్తమమైన నెల ఫిబ్రవరి. దీనికి ఇరవైఎనిమిదింపావు రోజులే ఉంటాయి. మిగతా నెలకంటె జీతండబ్బులు రెండురోజులు ముందేపడిపోతుంది. మరో ఐదురోజుల్లో మనఒళ్ళో వాలిపోయే నెచ్చెలి ఇచ్చే వెచ్చటికౌగిలికోసం ఎదురుచూస్తూ మరో నాలుగు ఒంటరిరాత్రులు సాగదీయాలి. ఈసారైనా ఎక్కడికీ పోనీకుండా కట్టిపడేద్దామంటే ఆదయపుపన్ను వాళ్ళు సేవింగ్స్ అడుగుతున్నారు. దాచిపెట్టుకోవడం సేవింగ్ కాదుట! వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పేదెలా? బేతాళుడు మళ్ళీ ఎక్కేస్తాడు.</div>సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com7tag:blogger.com,1999:blog-3377763021527742745.post-18990463105406901992010-12-06T20:27:00.000+05:302010-12-06T20:27:45.264+05:30నిరీక్షణ<span id="internal-source-marker_0.12714147963813305" style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"></span><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">సాయంసమయం సంధ్యారాగం పాడుతోంది. మొహాన ఎరుపద్దుకున్న సూరీడు జారిపోతూ పెట్టిన ముద్దుకి వీడ్కోలు చెబుతున్న ఆకాశం బుగ్గలు ఎరుపెక్కి కెంజాయ అలుముకుంటూ ఉంది. వడివడిగా పడుతున్న అడుగులు విరహాన్ని తట్టుకోలేని గుండెకి సర్దిచెప్పుకుంటోంది. పొన్నచెట్టుకింద ఎదురుచూస్తూ నిల్చున్న నువ్వు రెప్పవాల్చిన క్షణంలో కనిపించి అంతలో మాయమైపోతున్నావు. నిన్నందుకోవాలన్న తపనలో ఉఛ్వాసనిశ్వాసాలకు తేడాలేకుండా చాతీ ఎగిసిపడుతోంది. ఎంతదూరం నీకోసం పరిగెత్తానో వెనక్కితిరిగి చూసుకునేందుకు కూడా మనస్కరించడంలేదు. </span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"></span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">ఎక్కడ ఉన్నావో కూడా తెలీని నీకోసం ఎదుటే ఉన్నట్టు ఊహించుకుని తపనపడిపోతున్న మనస్సుకి ఎలాచెప్తే అర్థంచేసుకుంటుందో తెలియక సతమతమయ్యే క్షణంలో నాబాధ ఎవరికి అర్థమయ్యేను? నీకుతప్ప. అసలా బాధలో ఉండే ఆనందం ఎంత తృప్తినిస్తుందో ఎవరికి తెలిసేను? నాకుతప్ప. ఆకలయికలో కలిగే పరవశపు అనుభూతులెవరు పొందేరు?మనం తప్ప. ఆదృశ్యాన్ని కళ్లముందు సాక్షాత్కరింపజేసుకున్న తక్షణం లాగివదిలినబాణంలా ఒక్కసారిగా ఒళ్ళువిరుచుకుని ముందుగు వందరెట్లవేగంతో, వెయ్యిరెట్ల విశ్వాసంతో నీవైపుసాగే నాకు బలమెక్కడిది? నమ్మకమెక్కడిది? అని అడుగుతున్న లోకానికి నువ్వున్న దిక్కువైపు చూపినప్పుడు వాటిగొంతుమూగబోయిన క్షణం నేను ఈప్రపంచాన్ని గెలిచేరోజు ఎంతోదూరంలో ఉండబోదన్న వాస్తవం అర్థమైంది.</span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"></span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">ఒక్కక్షణం..నాకళ్లను నేనేనమ్మలేని ఒక్కక్షణం. గుండెబరువు దిగిపోయింది. ఇంతకాలం మనసుతో వేళాకోళం చేస్తున్న మస్తిష్కం ఓటమినొప్పుకుంది. వెళ్తూవెళ్తూ చివరిగా కొండలతో పరాచికాలాడుతున్న సూర్యుడు మనవైపే కళ్లప్పగించి చూస్తున్నాడు. ఒకవైపు నువ్వు. మరోవైపు ఇంతకాలం నీరూపాన్ని ఊహించుకుంటూ ఊసులాడుకున్న సంధ్య. మద్యన నేను. ఇన్నేళ్ళుగా నేపంచుకున్న మాటలన్నీ నీతో పూసగుచ్చినట్టు చెప్పిన తనకి కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పుకున్నా. ఒక్కక్షణం నాలో పొంగిన ఆవేశాన్ని అణూచుకోలేక నీపైకి ఉరికిన ఉరుకులో 'నాది' అన్న అహమే తప్ప మరేంలేదన్నది మనకు మాత్రమే తెలిసిన సత్యం. అలా బిగుసుకున్న మనిద్దరి మద్యనా ఊపిరాడని సంధ్య ఇకనావల్ల కాదంటూ విదిలించుకుని సిగ్గుతో మొహాన్నిదాచుకుంటూ చీకటిలోకి వెళ్ళిపోయింది.</span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"></span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">నీతో చెప్పుకోవాలనుకున్న ఎన్నోసంగతులు గుర్తుకురాక, గుర్తొచ్చినవాటిని చెప్పడానికి భాషచాలక మూగవాడినైన క్షణంలో వినిపించిన నీగుండెచప్పుడు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. కళ్లను గుండెపై ఆన్చినప్పుడు నీకనురెప్పలు పదులసంఖ్యలో దింపిన మన్మధబాణాలు నన్ను అచేతనుణ్ణి చేశాయి. మన్మధుడి అమ్ములపొదిలో ఐదుబాణాలైతే నీదగ్గర అంతకన్నా పదునైనఆయుధాలు ఎక్కడినుంచి వచ్చాయి? రతీదేవి ఇచ్చిందా? లేక నువ్వే రతీదేవివా? అంతమెత్తటి చురకత్తులకి నాగుండెని కోసేంత పదునుందని ఊహించలేకపోయాను. ఆక్షణంలో హృదయంపైన నీకళ్ళు పులిమిన కాటుకమరక పుట్టుమచ్చలా ఎప్పటికీ నిలిచిపోవాలని కోరుకున్న క్షణంలో అనిపించింది "నీకళ్ళలో కాటుకనైపోతే?" అవును. అంతకన్నా ఆనందమేముంది? నాకంతకన్నా హోదా ఏముంది? నీకోసం నేనుచెయ్యగలిగింది అంతకన్నా ఏముంది? </span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"></span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">అరచేతుల్తో నీముఖాన్ని పట్టుకుని నెమ్మదిగా పైకెత్తుతున్నాను. నీకళ్ళు కనిపించిన క్షణంలో కాటుకనైపోదామని తపిస్తున్నాను. అలా నీకళ్ళు చూసిన క్షణంలో ఈసృష్టిలోనే అత్యంత అపురూపమైన దృశ్యాన్ని చూశాను. నీకంటి చివర సన్నగా మెరుస్తూ, గురుత్వబలాన్ని ధిక్కరిస్తూ, ఉబికివస్తున్న ఉద్వేగాన్ని ఆపుకుంటూ, నేను నీతోడున్నానన్న దర్పాన్ని ప్రదర్శిస్తూ ఒక్కనీటిచుక్క. ఆల్చిప్పలో ముత్యాలుగా మారామని మురిసిపోతున్న కోట్లకొద్దీ నీటిచుక్కలకి ఆక్షణంలో అవికోల్పోయిన రాచపదవి ఎంతగొప్పదో అర్థమైంది. నేనిప్పుడూ కోహినూర్ అన్నభావాన్ని ప్రదర్శిస్తున్న ఆరాచబిందువును నెమ్మదిగా తీసుకుని నాకళ్ళలో వేసుకున్నా. అలానీకళ్లలోకే చూసుకుంటూ ఉండగా పెదవులు ముడిపడ్డక్షణంలో, నాఉచ్వాసానికి నీనిశ్వాసం నీఉచ్వాసానికి నానిశ్వాసం తోడైనిలిచి ఇద్దరిశ్వాస ఒకటైనప్పుడు కల్గినతృప్తి అమ్మపాలు తాగినప్పుడు అనుభవించానేమో?</span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"></span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">కాటుకమరక. నీటిచుక్క. ఈజన్మకి లభించిన అపురూప బహుమతులని తనివితీరా ఆస్వాదిస్తూ తన్మయత్వంలో మూసినకళ్లను ఎప్పుడు తెరిచానో తెలీదు. చుట్టూ చీకటి. నీతోగడిపిన క్షణాలన్నీ నీకళ్లను చూసేందుకే సరిపోయింది. అంతలో మాయమైపోయావు. మరునాడు నీవదనాన్ని, శరీరాన్ని వర్ణించమని అడిగితే తనుకూడా కళ్లను తప్పమరేమీ చూడలేదని సంధ్యచెప్పింది. దిక్కులు పిక్కటిల్లేలా అరుద్దామన్నా ఒంట్లో ఆవహిమ్చిన నిస్సత్తువ ఆప్రయత్నాన్ని విరమింపజేసింది</span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">.</span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">ఎక్కడున్నావో? నాదగ్గరికి ఎప్పుడొస్తావో? తెలీని నీతో చెప్పాలనుకున్న మాటలు సంధ్యతో పంచుకుంటూన్నా</span>.<br />
<blockquote><blockquote><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">నాకు దూరంగా ఎన్నాళ్ళుంటావు? మనిద్దరం కలిసి నడవాల్సిన దూరాలు, జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు, ఎదిరించాల్సిన పరిమితులు, చేదించాల్సిన లక్ష్యాలు మనకోసం ఎదురుచూస్తున్నాయి. నువ్వు నాపక్కనుండు. ప్రపంచమంతా ఇన్నేళ్ళనుంచి నమ్ముతూ వస్తున్న సిద్ధాంతాల్ని అభూతకల్పనలని. కాలాన్ని స్థంబింపజేచే శక్తి మనిషికుందని నిరూపిస్తా. శిశరాన్ని వసంతంగా మార్చడమెలానో చేసిచూపిస్తా. మనసు మస్తిష్కానికన్నా బలమైనదని ప్రకటిస్తా. నమ్మకానికి మించిన బలం, ఎదురుచూపులకు మించిన ఆనందం లేదని ప్రపంచానికి చాటిచెపుతా. ఇంకా ఎందుకీ దాగుడుమూతలు. వచ్చి నాఅరచేతుల్లో నీముఖాన్ని దాచేసుకో. నీకంటికాటుకను గుండెలపై దిద్దేసుకో.</span></blockquote></blockquote>సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com15tag:blogger.com,1999:blog-3377763021527742745.post-9302916675254355012010-11-16T00:32:00.002+05:302010-11-16T18:05:15.410+05:30శరత్ చంద్రికోత్సవం<div class="separator" style="clear: both; text-align: center;"><span style="font-size: small;"><br />
</span></div><span style="font-size: small;"><span id="internal-source-marker_0.00024018427853211843" style="background-color: transparent; color: black; font-family: Arial; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">వినాయక చవితిరోజు సాయంత్రం తర్వాత పండగ ఏవిటా అని డౌటొచ్చి కేలెండర్ చూస్తే దసరా అని కనిపించింది. దాన్ని చూడ్డంతోనే గుర్తొచ్చిన మరొకపండగ మనసులో ఉత్సాహాన్ని నింపింది. చూస్తుండగానే రోజులలా దొర్లుకుంటూ దుర్గాష్టమి వాకిటనిలబడ్డాయి. </span><span id="internal-source-marker_0.00024018427853211843" style="background-color: transparent; color: black; font-family: Arial; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">మూడురోజులు టౌన్షిప్లో కాళీపూజ, రామలీల, మేళాలతో గడిచిపోయింది. ఇక ఏకాదశిరోజునుంచి కౌంట్డౌన్ మొదలెట్టి 4,3,2,1 అనుకుంటూ పున్నమికి చేరుకున్నా.</span></span><br />
<span style="font-size: small;"><br />
</span><br />
<span style="font-size: small;"><span id="internal-source-marker_0.00024018427853211843" style="background-color: transparent; color: black; font-family: Arial; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> సంవత్సరంలో వచ్చే డజను పున్నముల్లో ఇదినాకు ప్రత్యేకం. విజయదశమి తర్వాతవచ్చే పున్నమిరోజు రాత్రి మాశివాలయంలో శరత్చంద్రికోత్సవం జరుగుతుంది. పదిహేనేళ్ళక్రితం ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ షెహనాయ్తో మొదలయిన ఈకార్యక్రమానికి అప్పట్లో పేరేమి పెట్టలేదట. అలా మూడేళ్ళు గడిచాక నిర్వహణాబృందానికి </span><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-style: normal; font-weight: bold; text-decoration: none; vertical-align: baseline;">శక్తి సంగీతకళా పరిషత్</span><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> అన్నపేరు, జరిగేఉత్సవానికి </span><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-style: normal; font-weight: bold; text-decoration: none; vertical-align: baseline;">శరత్చంద్రికోత్సవం</span><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> అన్నపేరు నిర్ణయించారు. అప్పట్నుంచి క్రమంతప్పకుండా ప్రతియేడూ నిర్వహిస్తున్నారు. ఏటేటా అభిమానులు పెరుగుతున్నారు.<a href="http://swarnmukhi.blogspot.com/2009/10/blog-post.html">గతేడాది ఎలాజరిగిందో రాశాను</a>. అప్పటిలానే ఈసారీ మూడువారాల వరకు రాయడానికి కుదర్లేదు. అప్పట్లానే ఈసారీ ఓఅరగంట ఆలశ్యంగా వెళ్ళాను. ఆరాత్రిలాగానే ఈసారీ అదే ఆనందం, అనుభూతి సొంతం చేసుకున్నాను.</span></span><br />
<span style="font-size: small;"><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">ఇక ఈసారి కార్యక్రమాల విషయాల్లోకి వెళ్తే-</span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">ప్రముఖ సంతూర్ విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మవంటి పెద్దతలకాయల డేట్లు కుదరకపోవటంతో నిర్వాహకుడు సత్యనారాయణ పాండేగారు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న కళాకారులని తీసుకొచ్చారు.</span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> </span></span><br />
<span style="font-size: small;"><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">గౌహతీవాసుడయిన విద్యుత్మిశ్రా వయోలిన్, డిల్లీవాసి సుధీర్పాండే తబలా జుగల్బందీతో కార్యక్రమం మొదలయ్యింది. దాదాపు గంటన్నర సాగిన ఈకార్యక్రమంలో చివరి పదినిముషాలు మాత్రమే చూడగలిగాను.</span><br />
<br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">హిందుస్తానీగాయని కల్పనా ఝుకార్కర్- సంతోష్మిశ్రా (సారంగి), పుండలీక భగవత్ (తబలా) మరియు భయ్యన్జీ (హార్మోనియం) బృందంతో భాగేశ్వరీరాగంలో కచ్చేరీని మొదలుపెట్టింది. తరువాత కళావతిరాగంలో కృష్ణున్ని స్మరిస్తూ సాగినకీర్తన ఓపదిహేను నిమషాలు సాగింది. (గమనిక: పాడేముందు ఆవిడ రాగాలపేర్లు, సంగతులు వగైరా చెప్పింది కాబట్టే నేనురాయగల్గుతున్నా. అంతకు మించి మనకు సీన్ లేదు.) ఈకీర్తన చివరికి వచ్చేసరికే మనసు జరుగుతున్న కచ్చేరితో శృతికలిపింది.అప్పటిదాకా ఉన్న చిన్నచిన్న అలజడులు దూరమయ్యాయి. </span></span><br />
<span style="font-size: small;"><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">ఆతర్వాత తుమరీ అనే ప్రక్రియలో 'కొమలియా మన్కర్ పుకార్'అనే కీర్తన పాడింది. సంగీతానికన్నా సాహిత్యానికి పెద్దపీట వెయ్యటం ఈప్రక్రియకున్న ప్రత్యేక లక్షణం. ఆతర్వాత ఝూలా అనేపద్దతిలో ఇంకోకీర్తనపాడేటప్పుడు మనసు ఉరకలేసింది. బాలాజీపంచరత్నాల్లో 'ఎంతమాత్రమున..' కీర్తన విన్నప్పుడు కలిగే ఒకఊపు అప్పుడు కలిగింది. అయ్యాక దాదాపు పదినిముషాలు చప్పట్లేచప్పట్లు. చివరగా నిర్గుణి భజన్ 'బోలా మన్ జానే అమర్ మేరే కాయా' ఆలపించింది.</span></span><br />
<div style="text-align: center;"><span style="font-size: small;"><iframe allowfullscreen='allowfullscreen' webkitallowfullscreen='webkitallowfullscreen' mozallowfullscreen='mozallowfullscreen' width='320' height='266' src='https://www.youtube.com/embed/wvLnDC9CnfM?feature=player_embedded' frameborder='0'></iframe></span></div><div style="text-align: left;"><span style="font-size: small;"><br />
</span></div><span style="font-size: small;"><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">చివరగా ఆరాత్రికే హైలెట్గా నిలిచిపోయిన భాగం కథక్ నృత్యప్రదర్శన. సంగీతకచేరీలకు వెళ్ళిన అనుభవమైతే ఉందికానీ కూచిపూడిగానీ భరతనాట్యం ఎప్పుడూ చూడలేదు. శాంభవీశుక్లా అనే అమ్మాయి దాదాపు రెండున్నరగంటలపాటు అలసట లేకుండా చేసిన నాట్యం అద్భుతం. వాళ్లమ్మ కవితాశుక్లా కూడా కథక్ నృత్యకారిణట. గురువు ఫతేసింగ్ గంగానీ, అమ్మ కవితాశుక్లా, ధర్మనాథ్ మిశ్రా మరియు సంతోష్మిశ్రాలు తాళం అందించారు. శంకర్ అతిప్రచండకర్.. అంటూ నటరాజుని స్తుతిస్తూ మొదలుపెట్టింది. </span></span><br />
<span style="font-size: small;"><br />
</span><br />
<span style="font-size: small;"><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">తరువాత విద్యనేర్పిన ముగ్గురు గురువులను స్మరిస్తూ తీన్తాళ్ చేసినప్పుడు గోగ్రహణం జరిగినప్పుడు అర్జునుడు నమస్కారబాణాలు వదలడం గుర్తొచ్చింది. ఆతర్వాత ఉఠాన్ ప్రదర్శించింది. సృష్టిలోని పంచభూత తత్వాలను నాట్యంలోని వివిధఅంశాలతో పోలుస్తూ చేసిన అంశం సూపర్...హైలైట్. </span></span><br />
<span style="font-size: small;"><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">పండిట్ కిషన్మహరాజ్ గణేష, దుర్గా, శివులపై రచించిన శ్లోకాలకు నృత్యరూపకం చాలానచ్చింది. తర్వాత తనుస్వయంగా రూపొందించుకున్న ఒకతాళపద్దతిని ప్రదర్శించింది. "శ్యామ్రాధాసంగ్ .." అంటూ రాధాకృష్ణుల సరససల్లాపాలు ఓపదినిముషాలు చక్కిలిగింతలు పెట్టాయి. ఆగీతంమాత్రం 'చందనచర్చిత..' థీంలో ఉంది.</span></span><span style="font-size: small;"> </span><span style="font-size: small;">శాంభవీ ప్రదర్శన చూసిన ప్రతిఒక్కరికీ ఆమెకు నాట్యంపట్ల ఉన్న గౌరవం, అంకితభావం ముప్పిరిగొల్పాయి. భవిష్యత్తులో గొప్పనర్తకి అవుతుందని దాదాపూ ప్రతిఒక్కరూ అనుకున్నారు. ఏదో పెర్ఫార్మెన్స్ ఇచ్చాను అన్నట్టుగా కాకుండా కథక్లోని చిన్నచిన్నసంగతులు, భంగిమలు, తాళగతులు కొద్దికొద్దిగా వివరిస్తూ సాగిన ప్రదర్శన నిజంగా అద్భుతం. ఇకపై నేనుచూసే నాట్యప్రదర్శనల్లోనూ దీన్ని బెంచ్మార్క్లాగా పోల్చుకుని నిర్ణయానికొస్తానేమో!</span><br />
<span style="font-size: small;"><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">ఉత్తరాదికచేరీలకు గతంలో ఒకసాంప్రదాయం ఉండేదట. ప్రతికచేరీ చివర్లో భైరవిరాగంలో ముగుస్తుంది. ఆచివరి ప్రదర్శనలో ఆరోజు వచ్చిన కళాకారులంతా పాల్గొనాలి. భైరవిరాగంలో ఉంటుంది అన్నవిషయంతప్ప మరేసమాచారం ఉండదు. అక్కడికక్కడే ఏకీర్తనపాడాలి అన్నది నిర్ణయించుకుని అంతాకలిసి బృందంగా ఆలపిస్తూ, వాద్యబృందం వాయిస్తూఉంటే నాట్యం చెయ్యాలి. రానురాను చివరిదాకా ఉండే అలవాటు కళాకారుల్లో మాయమవటం, ఏదైనా ఇవ్వండి నేనుసిద్ధం అనిచెప్పగల్గే ఆత్మవిశ్వాసం లోపించటంతో నెమ్మదిగా కనుమరుగైపోయింది.ఈవిషయాన్ని ప్రస్తావిస్తూ పాండేగారు ఈరోజు ఆసాంప్రదాయాన్ని తిరిగి బతికించాలని కోరటమూ, అందుకు అందరూ అంగీకరించటం క్షణాల్లో జరిగిపోయింది.</span></span><br />
<span style="font-size: small;"><br />
</span><br />
<div class="separator" style="clear: both; text-align: center;"><span style="font-size: small;"><br />
<iframe allowfullscreen='allowfullscreen' webkitallowfullscreen='webkitallowfullscreen' mozallowfullscreen='mozallowfullscreen' width='320' height='266' src='https://www.youtube.com/embed/nOPlLkahNFU?feature=player_embedded' frameborder='0'></iframe></span></div><span style="font-size: small;"><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"></span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">చివరగా తులసీదాసు విరచితం "భజమను భజమను రామచరణ సుఖదాయి.."అనే భజనగీతాన్ని సమిష్టిగా ప్రదర్శించాక, జైపూర్ పద్దతిలో నూటొక్క చక్కర్లుకొట్టడంతోఉత్సవం ముగిసింది.</span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"></span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">ఏదో నేనివనన్నీ విశ్లేషిస్తాననికాదు. అంతమంచి కార్యక్రమం ఒకటి జరిగినప్పుడు, చూసొచ్చి నలుగురితో పంచుకోవడంలో ఆనందాన్ని అనుభవిద్దామని అంతే.</span></span>సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com12tag:blogger.com,1999:blog-3377763021527742745.post-58571912653018939272010-11-13T20:53:00.000+05:302010-11-13T20:53:35.445+05:30భలేమంచి చౌకబేరముఅమ్మలారా! అయ్యలారా! భూమికవతల ఉన్న క్రౌంచద్వీపవాసులారా!<br />
మీద్వీపంలో(ద్వీపకల్పంలో) మాశాసనసభలో గవర్నరుసందేశానికి ధన్యవాదాలు తెలిపినట్లు బంధుమిత్రులకి ధన్యవాదాలు తెలిపే జాతర మాగొప్పగా జరగతాదంట. ఆపక్కరోజునే కాళసుక్రోరం వస్తాదంట. ఆరోజు నాబోటి ఉత్తమజాతి మానవులకి వాయనాలు గట్రా ఏర్పాటుచేస్తే చానాపుణ్యమని మొన్నమద్దెన స్కాందపురాణం చదవతాఉంటే తెలిసింది. ఈవాయనాన్ని బ్రహ్మచారులకి, అందులోనూ బ్రహ్మచారిబ్లాగర్లకి, మళ్లీవాళ్లలో ఏనదిపేరునో బ్లాగుకి పెట్టుకున్నవారికి వాయనాలిస్తే ఎఫెక్టు ఇన్స్టెంటంట. ఇంతపెద్దరహస్యాన్ని ఓపెన్చేసేస్తే అంతా నాకువాయనాలిచ్చి స్వర్గానికి గ్రీన్కార్డ్ తీసుకుంటారని ఈకత వినాయకచవితికతలో, సత్తెనారాయణసామివ్రతంకతలో చెప్పలేదంట.<br />
<br />
కాబట్టి మీకంతా చెప్పొచ్చేదేందంటే-<br />
మీరంతా పిల్లాజెల్లాతో కలిసి రాత్రంతా జాగారంచేసి, తెల్లవారుఝామున వైకుంఠఏకాదశిరోజు ద్వారదర్శనం భక్తుల్లాగా వాల్మార్ట్ వాకిట్లో నిలబడి హరినామస్మరణగావిస్తూ, వీలైతే తలుపుతీయనన్న జయవిజయుల్ని ఉరిమిచూసి (ఈపని మనలేడీస్కి అప్పగించండి.) చేతికిచిక్కిందంతా జవురుకొచ్చేయండి.<br />
<br />
ఆతర్వాత మీమీబుట్టల్ని నావాకిట్లోపెడితే పుణ్యం ట్రక్కుల్లో లభిస్తాది. అంతేకాదు లచ్చిందేవి మీసాలరీ అకౌంట్లని, డీమాట్లని ప్రయారిటీ ఆర్డర్లో ముందుకునెడుతుంది. గ్రహాలు అనుకూలించిన క్షణంలో వరదగోదారిలా పోటెత్తిస్తాది. సరస్పద్దేవి మీబ్లాగుల్లో కామెంట్లు విచ్చలవిడిగా కురిపిస్తాది. భలేమంచి చౌకబేరము..ఇది సమయము మించిన దొరకదు ఎన్నారై బ్లాగర్లార...సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com5tag:blogger.com,1999:blog-3377763021527742745.post-65059554826297573512010-10-21T00:03:00.002+05:302010-10-21T00:03:27.584+05:30సింహాసనం చిత్రరాజం<span id="internal-source-marker_0.11357368480415198" style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">కొద్దిరోజుల క్రితం సింహాసనం చిత్రాన్ని చూడడం, చూసిన తన్మయత్వంలో చిందులెయ్యటం జరిగింది. అప్పట్లో బజ్లో రన్నింగ్ కామెంట్రీ పెట్టాను. దాన్నికాపీపేస్ట్ కొట్టి టపాచేశా. అదీ కిందమేటరు </span><br />
<br />
<span id="internal-source-marker_0.11357368480415198" style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">701MB, 11 Seeds, 12 Peers</span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">1D5H, Avge 6.8kbps</span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"></span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">'సింహాసనం' చిత్రరాజం దిగుమతి అయ్యింది.</span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">రాత్రికి సెకండ్షో "ఝుం ఝుం ఝుం ఝుం తననా ఝుం"Edit</span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">3 people liked this -</span><a href="http://www.google.com/profiles/ramarajubhaskar#buzz"><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> </span><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Bhaskar Ramaraju</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">,</span><a href="http://www.google.com/profiles/tchandrasekhar1956#buzz"><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> </span><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Chandrasekhar Thimmavajjala</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> and </span><a href="http://www.google.com/profiles/105658139383721716810#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Ravi Theja</span></a><br />
<a href="http://www.google.com/profiles/ramarajubhaskar#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Bhaskar Ramaraju</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - :): ఆకాశంలో ఒకతార.....Aug 13DeleteUndo deleteReport spamNot spam</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - </span><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: bold; text-decoration: none; vertical-align: baseline;">విక్రమసింహుడు</span><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> (కృష్ణ): కుట్ర. కుటిలసామంతుల కుట్ర. దశార్ణ సింహాసనాన్ని కబళించేందుకు పన్నిన పన్నాగం. అలకనందాదేవి పట్టాభిషేకాన్ని నిరోధించే ప్రయత్నంలో ప్రధమఘట్టం ఈమకుటాపహరణం. మనం అప్రమత్తులమై ఉండాలి. ఈ తిరుగుబాటును ఆదిలోనే అంతంచెయ్యాలి.</span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">సైనికుడు: నరనరాలలో రాజభక్తిని నింపిన దశార్ణ సేనావాహినిపై కత్తిగట్ట సాహసించిన ఆసామంతులు ఎవరు నాయకా?</span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">విక్రమసింహుడు: ఉన్నాడు ఒక అల్పాయుష్కుడు. కరికాల భైరవుడు. తనసంస్థాన ప్రజలనే కాల్చుకుతినే ఆకలుషాత్ముడికి రాజ్యాధిపతి కావాలన్న ఆశే కానీ ఈసువిశాలదేశాన్ని సుభిక్షంగా పరిపాలిమ్చగల శక్తిసామర్థ్యాలు లేవు. కానీ వాడీమద్యకాలంలో తనసంస్థానంలోని సైనికులసంఖ్య పెంచడమేకాక కొందరు చిన్నచిన్నసామంతుల తోడ్పాటునుకూడా సంపాదించగలిగాడు. ఆసామంతులను, కిరీటపు దొంగలను, అవంతీరాజ్యంలో అలజడులు సృష్టిస్తున్న బంధిపోట్లను- అందరినీ ఒకేశక్తి నడిపిస్తుందని నాసందేహం.ఆ మూలశక్తి ఏదో, రాజనీతిలో రాటుదేలిన ఆవ్యక్తి అవంతీ నివాసుడో, దశార్ణ కాపురస్తుడో ఏకొంతైనా సమాచారాం తెలుసుకుంటేగానీ కిరీటాన్ని సాధించడం సాధ్యంకాదు.</span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">ఇంకో సైనికుడు: మరిప్పుడు మనకర్తవ్యం?</span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: bold; text-decoration: none; vertical-align: baseline;">విక్రమసింహుడు</span><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;">: ఆవిషసర్పాలు పడగలు ఎత్తకముందే వాటినడుములు విరగ్గొట్టాలి. దశార్ణరాజవంశాన్ని అంతరింపజేయడానికి ప్రయత్నిస్తున్న రాజద్రోహులను తుదముట్టించి, తలకుపన్ను, చెట్టుకుపన్ను, పుట్టకుపన్నులతో విసిగివేసారిన అంవతీప్రజలకు విముక్తికల్పించి, ఉభయరాజ్యాలప్రజలు శాంతిసౌభాగ్యాలతో వర్థిల్లేటట్లు చెయ్యడమే మనకర్తవ్యం.దశార్ణరాజ్యంలో ధర్మపాలనను నిలబెట్టడం, అవంతీరాజ్యంలో అధర్మపాలనను అరికట్టటమే మన ఈఅజ్ఞాతవాసపులక్ష్యం. ఆలక్ష్యసాధనకోసమే మహావీరులైన మీరందరూ సర్వసుఖాలను త్యజించి నాతోపాటు ఇక్కడ ఉన్నారు.</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - మందాకిని ఎంట్రీ. వహ్వా! నీయవ్వనం...</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - కిరీటం పోయిందని కాంతారావు మంచమెక్కేశాడు. జయప్రద పట్టాభిషేకం చెయ్యించమని కృష్ణ లెటర్ రాసేశాడు. జయప్రదమళ్ళీమళ్ళీ మనసుపారేసుకుంటూ ఉంది</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - అండర్గ్రౌండ్లో సత్యనారాయణ, ప్రభాకర్రెడ్డి స్కెచ్ వేస్తున్నారు</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - కృష్ణ కౌంటర్ ప్లాన్ చేస్తున్నాడు</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - కృష్ణబ్యాచీ మొత్తం గెరిల్లాయుద్ధం చేస్తున్నారు. చెట్లమీదనుమ్చి బాణాలు, నీళ్ళకిందనుంచి బాణాలు. ఒకటి ఏసాక రెండోది ఎక్కడ్నుంచి వచ్చిందో అర్థంకావట్లా. ఎవడిదగ్గరా తూణీరం లేదు</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - సూపర్స్టార్ డ్రాగన్బొమ్మచూసి భయపడి తేరుకుని యుద్ధంచేసి కిరీటం సంపాదించాడు</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - పట్టాభిషేకానికి మద్యలో సామంతరాజు "అబ్జెక్షన్ యువరానర్" అన్నాడు. ఇప్పుడు బ్లైండ్ ఫైటింగ్EditAug 13DeleteUndo deleteReport spamNot spam</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - ఫైటింగ్లో గెలిచిన కృష్ణ 400kV line తాకినంత ఎక్జైట్మెంట్లో ఉన్నాడు. జయప్రద స్పీచ్ ఇస్తూ ఉంది. కైకాల "ఐహర్టెడ్!" అంటున్నాడు</span><br />
<a href="http://www.google.com/profiles/ramarajubhaskar#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Bhaskar Ramaraju</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - పాట??లేదా??</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - వావ్! జెయప్రద తనను తాను అర్పించుకునేందుకు పెట్టెలో వచ్చేసింది.</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - ఇక్కడే... ఆ ఇక్కడె... అవును ఇప్పుడే... ఎనిమిదన్నర నిముషాల నిడవిగల గానం....ఝుం తన ఝుం...హే హే హేహెహ్హె..ఆఆఆఅ...లాలాలల్లాఆఅ....ఆకాశంలో ఒకతార...</span><br />
<a href="http://www.google.com/profiles/ramarajubhaskar#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Bhaskar Ramaraju</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ...కృష్ణా స్టెప్పులు...మనసులో గిర్రున తిరుతున్యాయి</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - రెడ్డికొడుకు మందాకిని వెంటపడ్డాడు. రక్కడంతోనే చనిపోయాడు. మైగాడ్! ఆమె విషకన్య అన్నసంగతి తెలిసిపోయింది.</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - మందాకిని సూసైడ్ అటేంప్ట్. కొడుకు పోయాడని రెడ్డికూడా సూసైడ్ అటేంప్ట్. కైకాల బ్రెయిన్ వాష్. చిన్నరహస్యం</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - కృష్ణ ఫైట్.చూడాల్సిందే. నేరాయలేను.</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - విక్రమసింహుడు-ఆదిత్యవర్థనుడూ (డబల్ యాక్షన్) కలుసుకున్నారు</span><br />
<a href="http://www.google.com/profiles/115220095190455084752#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">padmanabha rao tadepalli</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - "కృష్ణ ఫైట్.చూడాల్సిందే. నేరాయలేను."...</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - మాంచి ఫ్లోలో ఉన్నప్పుడు నెట్ డిస్కనెక్ట్ అయ్యింది.ప్చ్</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - గిరిబాబుని రాజుగా చేసేందుకు కైకాల గేంప్లే చేస్తున్నాడు. ఇంతలో డూప్లికేట్ ఆదిత్యవర్ధనుడూ(విక్రమసింహుడు) వచ్చేశాడు.</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - కత్తులు మంటల్లోపెట్టి ఓట్టేసుకున్నారు కృష్ణ-జెయప్రద. పాలనాసంస్కరణలు యాట యాట</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - రాథ టచ్లో తేడాకనిపెట్టేసింది. ప్రాణానికి ప్రాణమైన జెయప్రద అనుమానించడంతో కృష్ణ హర్ట్ అయ్యాడు. నిజం చెప్పాడు</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - జాతరలో పోతురాజు కత్తిపట్టుకున్నట్టు కృష్ణ రాజదండం పట్టుకు తిరుగుతున్నాడు.</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - గబ్బర్సింగ్ బాదంపప్పు కామెడీ.దీన్ని జీడిపప్పుకి చెప్పాలి</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - కైకాల మళ్ళీస్కెచ్ వేస్తున్నాడు.</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - విషకన్యను(మందాకినీ) కృష్ణమీదకి వదిలారు. వావ్! మందాకినీ అమృతకన్యగామారిపోయింది. కృష్ణ ఔటాఫ్ డేంజర్</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - కృష్ణమీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కృష్ణ టైం టూబాడ్. అప్పటికే ఒరిజినల్ రాజు వచ్చేసినా అతన్ని డూప్లికేట్ అనుకుంటున్నారు.ఉరిశిక్ష వేశారు.</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - దశార్ణసైన్యం, విక్రమసింహుడి బలగం కలిసి అటాక్ చేస్తున్నాయి. కృష్ణకత్తికి నాలుగైదుపక్కల పదునుంది.</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - కృష్ణ గుర్రం సైన్వేవ్లాగా దానిపైన కృష్ణ కొసైన్వేవ్లాగా ఎగురుతున్నారు. మొత్తానికి కోటలోపలికి వచ్చేశాడు.</span><br />
<span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"></span><a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - *పతాక సన్నివేశం*గబ్బర్సింగ్, కపాలకోటుడు అప్రూవర్లుగా మారిపోయారు. కైకాల పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు. పెద్దఫైట్. కైకాల, గిరిబాబు అండ్ కో మటాష్.</span><br />
<a href="http://www.google.com/profiles/102853592905293694175#buzz"><span style="background-color: transparent; color: #000099; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: underline; vertical-align: baseline;">Subrahmanya Chaithanya Mamidipudi</span></a><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"> - శుభంకార్డు పడేముందు మళ్ళీ మరొక్కసారి "ఝుం తనా ఝుం తననా తననా...ఆకాశంలో ఒకతార.." ఏసేస్కుని తెరదించెయ్యడమే. మేకింగ్ ఆఫ్ సింహాసనం ఎక్కడైనా దొరికితే బావుండు</span><span style="background-color: transparent; color: black; font-family: Arial; font-size: 11pt; font-style: normal; font-weight: normal; text-decoration: none; vertical-align: baseline;"></span>సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com3tag:blogger.com,1999:blog-3377763021527742745.post-44980200125104482902010-10-07T20:24:00.001+05:302010-10-07T20:27:51.917+05:30అర్థాంగినాన్న నాలుగో తరగతిలో ఉన్నప్పుడే పెళ్ళైపోయింది. బాల్యవివాహం! ఆపెళ్ళికి పెద్దకూడా ఆయన అన్నగారే. ఆయన పిల్లని చూపిస్తే నచ్చేసింది అన్నాడంట. ముహూర్తం, వేదిక అన్నీ ఆపెద్దే నిర్ణయించేశాడు. సమిధలు తెచ్చేసి, హోమం వేసి మొత్తానికి అందరికళ్ళూగప్పి అగ్నిసాక్షిగా మొదటిభార్యను చేతిలోకి తీస్కున్నాడు. నాతిచరామి అన్నపదాన్ని జీవితాంతం మర్చిపోకుండా పాటించాడు. పెళ్ళికి ముందే అమ్మకి కూడా పెద్దభార్య సంగతి తెలుసనుకుంటా.(గ్యారంటీ ఇవ్వలేను.) కానీ సర్దుకుపోయింది.<br />
<br />
పెదమ్మ అమ్మలాగా సాదాసీదా కాదు. బాగా కాస్ట్లీ. మెయింటినెన్స్ ఖర్చు భీభత్సంగా ఉండేది. ఆవిషయంలో మాత్రం అమ్మకి ఆవిడకి తగవుపడేది. కానీ పట్టపురాణిహోదాలో ఆవిడమాటే చెల్లుబాటయ్యేది. ఇల్లంతా చెత్తపడెస్తే పాపం అమ్మ రోజుకు మూడునాలుగుసార్లు శుభ్రం చేసేది. అయినా చెత్త ఏదోఒకమూల ఉండాల్సిందే. బయటకూడా నాన్నపేరు చెబితే ఆపెద్దమ్మే గుర్తొస్తుంది అందరికీ. నాన్న ఎక్కడికివెళ్తే అక్కడికి వేలుపట్టుకుని వెళ్తూనే ఉండేది. అది మావలకి, తాతకి, మిగతాబంధువులకి కొంచెం బాధనిపించినా నాన్నంటే భయంవల్ల, భయం అటే అలాంటిలాంటి భయంకాదు. టెర్రర్..టెర్రిఫిగ్గా భయపడేవాళ్ళు. కొడుకైనందున నేను భయపడ్డా అర్థముందికానీ ఆయనకోపానికి వాళ్ళమ్మ కూడా భయపడేది. నీఇష్టం నాయనా అంటూ వెళ్ళిపోయేది. తర్వాత మదర్ సెంటిమెంట్లు గట్రా మామూలేననుకో! నేను బజారుకెళ్తే నారాయణశెట్టికూడా ఆవిడ గురించే అడిగేవాడు.ఆయనకు ఆవిడ తెలుసుగానీ ఎప్పుడూ మాట్లాడిందిలేదు. <br />
ఏమాటకామాటే చెప్పుకోవాలేగానీ కొన్నివిషయాల్లో ఆయన్ని అందరికన్నా ఎక్కువే అర్థం చేసుకుంది. సగటు మనిషిలా నాన్నకూడా ఆస్తిక-నాస్తికవాదాల మద్యన ఊగిసలాడే ఆలోచనల్లనే తనమొహానికికూడా కాషాయం- ఎరుపుమద్యన ఒకరకమైన షేడ్లో మేకప్ చేసుకునేది. చీకట్లో ఆయనవెళ్ళేప్పుడు దారిచూపించేంత కాకపోయినా ఎదురొచ్చేవాళ్ళు నాన్నని గుద్దకుండా కాపాడేది. మనసుబాలేకున్నా,మరీ ఆనందంగా ఉన్నా నాన్నెప్పుడూ తనతోనే పంచుకుంటాడని కొంచెంబలుపు చూపించేది. రోజులు గడిచేకొద్దీ వాళ్ళ అనుబంధం బాగాపెరిగిపోయింది. ఆయనరక్తంలోకి చేరి చివరికి గుండెల్లో గూడుకట్టుకుంది.<br />
చివరికి నాన్నతోబాటే సతీసహగమనం చేసింది. తనుమెట్టినింటికి వస్తూవస్తూ మంధరలాంటి దాసీని తీసుకొచ్చింది. అదిప్పుడు సన్యాసుల్లో కలిసిపోయి దేవుడిదగ్గర దీపం, అగరొతులు వెలిగిస్తూ జీవితాన్ని సాగదీస్తోంది. అమ్మకి మాత్రం అప్పుడప్పుడూ చిన్నభయం. నేనూ ఎవరినైనా పెళ్ళి చేస్కున్నానేమోనని. నేను అమ్మకొడుకునని తనకి తెలుసనుకో.సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com17tag:blogger.com,1999:blog-3377763021527742745.post-5934378759950392192010-09-24T00:37:00.000+05:302013-06-10T21:37:17.760+05:30జీర్ణించుకోలేని నిజం<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
ఓనెలక్రితం అమ్మతో కూడా రామేశ్వరం వెళ్ళాను. ఇంతకు ముందు రెండుసార్లు అక్కడికి వెళ్ళాను. తిరుచ్చిలో చదివేటప్పుడు సెమిస్టెర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఓసారి క్లాస్మేట్స్ అందరంకలిసి మరోసారి ఫ్రెండ్తో కలిసివెళ్ళాను. రెండోసారి అక్కడున్నప్పుడే అమ్మఫోన్ చేసి పాపకి వచ్చిన సంబంధం గురించిచెప్పింది. అంతకుముందే కాశీనుంచి తీసుకొచ్చిన గంగాజలంతో రామనాథేశ్వరునికి అభిషేకం చేసొచ్చాను. అందువల్ల ఈయాత్ర బాగా సెంటిమెంట్ అయ్యింది.<br />
<br />
దీవిలో ముఖ్యమైన ప్రాంతాలు బాగానే పరిచయం ఉండటంతో తిరిగేందుకు పెద్దగా ఇబ్బందనిపించలేదు. కొత్తగా వెళ్ళినవాళ్ళకి కూడా అక్కడేమీ ఇబ్బంది ఉండదనుకోండి. అక్కడికెళ్ళిన వాళ్ళు ఎవరైనా చేసేపని ముందు తీర్థాల్లో స్నానంచేసి దర్శనం చేసుకొచ్చి, బయట టిఫిన్ గట్రా పూర్తిచేశాక ఓఆటోవాడితో బేరం కుదుర్చుకుని దీవిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో తిరగటం.<br />
<br />
మొదటి రెండుసార్లు వెళ్ళింది స్టూడేంట్స్గా. దాంతో ప్రతిదీ బడ్జెట్టే. ఆటోవాడు మూడోందలు అంటే "అన్నా! స్టూడేంట్స్ అన్నా. కుంజేం కమ్మి పణ్ణీంగే అన్నా." ఇలా ప్రతిదీ బేరమాడటమే. చివరికి కొబ్బరిబొండాల్లో కూడా. కొబ్బరిబొండాలోడితో మావాడొకడైతే "అన్నా! కావాలంటే నీళ్ళు తక్కుంవుండే కాయిచ్చి డబ్బులు తక్కువ తీసుకో," అన్నాడు. భోజనాల హోటల్లో సంగతైతేసరేసరి. వాడు నిజంగా వీళ్ళు స్టూడేంట్సేనా? అని అనుమానించేదాకా వెళ్ళిపోయాడు. తిరుగుప్రయాణం మధురై వరకు పాసింజెర్లో. ఇది ప్లాన్ చేసింది మాత్రంనేనే! బస్సులో వెళ్ళేకన్నా ఇందులో అయితే కొంచెం ఎంజాయ్ చెయ్యొచ్చని. లెక్కలేశాక (తమిళ్నాడులో బస్సుచార్జీ ఎంత చవకైనా మరీ పాసింజరుకన్నా తక్కువుండదుగా) ఆర్థికవిషయాలు చూసుకునే బృందసభ్యుడు టెక్నోఎకనమికల్ క్లియరెన్స్ ఇచ్చేశాడు. మళ్ళీ రెండున్నరేళ్ళ తర్వాత ఉద్యోగంలో కుదురుకున్నాక, కొంత ఆర్థికస్థితి మెరుగయ్యాక, అమ్మతో రావడం ఏదోతెలీని తృప్తి, ఆనందం. కిందటి రెండుసార్లకంటే ఈసారే బాగాజరిగిందనిపిమ్చింది.<br />
<br />
ఉదయాన్నే దర్శనం చేసేసుకున్నాక బయటికొచ్చి ఆటోవాడితో బేరంమాట్లాడా. ఉదయాన్నే రైల్వేస్టేషన్ నుంచి వచ్చింది ఈఆటోలోనే. అప్పుడే వాడు మమ్మల్ని రిజర్వ్ చేసుకున్నాడు. బేరం అంటే ఏదో అనుకునేరు. మనకంత సీన్లేదు. నాకు బేరంరాదు. అమ్మకి భాషరాదు. అదీ సంగతి. ఏఏ ప్రదేశాలో లిస్టు చెప్పా.<br />
<br />
ఆదీవిలో చూడాల్సినవన్నీ ఒక్కోటీ ఒక్కోమూల ఉంటాయి. దక్షిణాన చివర్లో రామసేతువు. అక్కడేమీ కనిపిచదు. దానికి ముందు విభీషణుడికి పట్టాభిషేకం జరిగినప్రాంతం. ఉత్తరాన రామపాదం. పశ్చిమంగా పంచముఖ ఆంజనేయస్వామిగుడి, ఇంకొన్నిగుళ్ళు. ఇంకా చివరికి వస్తే పాంబన్ రైల్వేవంతెన. ఇది మాతృభూమికి రామేశ్వరద్వీపానికి పేగుబంధం. తూర్పునేముంది అనడగొద్దు. అటైపు సముద్రం (అగ్నితీర్థం). అన్నింటికీ మద్యలో రామనాథస్వామిగుడి.<br />
<br />
ఓవైపు అన్నేళ్ళబాధనుంచి తనకుకలిగిన విముక్తికి జనకీమాత ప్రతిష్టించిన శివలింగం ఇక్కడి స్త్రీ ఆత్మగౌరవానికి, జాతివీరత్వానికి ప్రతీక ఐతే మరోవైపు ఒకమామూలుఇల్లు ఆధునికభారత సాంకేతిక దాశ్యసంకెళ్ళను తెంచి, గగనవీధుల్లో దేశపతాకను ఎగరేసిన చారిత్రకఘట్టాలకు సూచిక. రామేశ్వరం పేరువినడంతోనే గుర్తొచ్చేపదాలు సీతారాములు, వానరకోటి, రామనాథేశ్వరుడు, సేతువు, లంక, సైకతలింగం, రామాయణం, తీర్థాలు, రావణుడు, పాంబన్ .... కానీ వర్తమానకాలంలో ఆద్వీపంపేరు వినడంతోనే గుర్తొచ్చే ఒకేఒకపదం 'కలాం'.<br />
<br />
ఈద్వీపపు ఇసుకతిన్నెల్లో బాల్యాన్నిగడిపి, శ్రీహరికోటదీవి ఇసుకతిన్నెల్లోంచి తన అగ్నిగవాక్షాలతో రాకెట్లెగరేసి, దేశానికే ప్రధమపౌరునిగా "కలాం మాప్రధమపౌరుడు" అని నూరుకోట్లగొంతులు సగర్వంగా చెప్పేలా జాతికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు. వర్తమానంలో ఈయనకు సాటిరాగల స్పూర్తిప్రదాత ప్రపంచంలోనే ఎవరూలేరు.<br />
ఆయన ఇల్లు గుడికి పశ్చిమంగా ఆలయప్రధానర్చకుడు పక్షిలక్ష్మణశాస్త్రిగారి ఇంటికి వెనుకరోడ్డులో వెళ్ళి కుడివైపున ఉన్న ఒకసందులోకి వెళ్ళాలి. ఇంతకుముందు వెళ్ళినప్పుడు "ఈసందులోనే కలాంఇల్లు" అని ఆటొవాడు చెప్పి లోపలికి తిప్పాక ఇంటిముందు ఆగిచూసేదాకా ఎంతఆరాటపడ్దామో మాటల్లో చెప్పలేను.<br />
<br />
అక్కడ నీలిరంగుఇల్లు, వాకిట్లో గ్రిల్స్, దానిపైన ఇనుపచువ్వలను అక్షరాలుగా మలిచి "HOUSE OF KALAM" అని రాసుంది. అలహాబాదులో భరద్వాజమహర్షి ఆశ్రమం ఎదురుగా ఓపెద్దభవనం ఉంది. దాని ఆవరణలోనే మరోభవనం. రెండూ ఇప్పుడు జాతికి అంకితం చేయబడ్దాయి. ఒకటి ఆనందభవన్, మరోటి స్వరాజ్యభవన్. కొన్నిదశాబ్దాలక్రితం ఈజాతి భవష్యత్తును దిశానిర్దేశంచేసే ఎన్నో మార్గదర్శకసూత్రాలను, సిద్ధాంతాలను రూపొందించిన యజ్జ్ఞవాటిక అది. అణువణువునా దేశభక్తిని ఇముడ్చుకున్న మహనీయుల పాదధూళితో పావనమైన దేవాలయం. వాటికి ఏమాత్రం తీసిపోని మరోభవనం నాకళ్ళముందు కనిపిమ్చింది. మాదగ్గర కెమెరాలేదు. సెల్తోనే ఆఇంటిముందు ఫోటోలు దిగాం. "మనలాంటి ఓటెక్నోక్రాట్ రాష్ట్రపతి అయ్యాడురా (ఇలాంటప్పుడు ఏదోరకంగా వరసకలిపెయ్యకపోతే మనసునిలవదు.) ఇప్పుడు కెమెరా లేకపోతేనేం భవిష్యత్తులో పెద్దకెమెరాతో వచ్చి ఫోటోలు తీద్దాం. దానికెక్కువ సమయంపటదులే" అనుకుని పక్కనే ఆయన బంధువుల షాపులో శంఖులు, ముత్యాలు వగైరా అమ్ముతారు. అక్కడికెళ్ళాం. అక్కడ మనకీ ఆయనకి బేరంకుదరక శంఖు కొనకుండానే వచ్చేశాననుకోండి. అదివేరే విషయం.<br />
<br />
అమ్మతో కలిసి విభీషణుడి పట్టాభిషేకం చేసిన స్థలం చూసుకుని తిరిగొస్తుండగా ఆటోవాడితో "కలామ్ ఇంటికి తీసుకెళ్ళు." అన్నాను. అతనేదో తమిళంలో చెప్పాడు. సరిగా వినబళ్ళేదు. అమ్మకి వీలైనంత త్వరగా ఆఇల్లు చూపించి, దానిముందు ఫోటో తీసుకోవాలి అన్నది నాఆరాటం. సహజమే కదా. ఇప్పటికీ నాదగ్గర కెమెరాలేదు. ఫ్రెండ్ కెమెరా తీసుకొచ్చా. సరిగ్గా ఆసందుకు దగ్గరగా వచ్చాం. "అమ్మా! ఈసందులోనే." అని చెప్పా. అంతలో ఆటోవాడు దాన్ని దాటుకుని వెళ్తున్నాడు. "అన్నా! మున్నాడి కలాం వీడు." అని చెప్తునా వాడు నేరుగా వెళ్తున్నాడు. వాడివీపు తట్టి "కలాం వీడు. కలాం వీడు." అని చెప్పాక. "ఇందాకే చెప్పాకదా సార్?" అంటూ వెనక్కి తిప్పి ఇంటిముందుకి తీసుకొచ్చి ఆపాడు. <br />
అప్పుడర్థమైంది అంతకుముదేమిచెప్పాడో. కలాం ఇల్లుకూల్చేశారు. ఆఇల్లు ఉండాల్సిన చోట పెద్దపెద్దతడికలు పెట్టున్నారు. దిగిచూస్తే పిల్లర్లకోసం పునాదులు తొవ్వేసున్నారు.<br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhFwNrajLPpPUkilk9lY7ojQ7Q3Zf3J2YYroi4g4w-Y3Kv1L0H66BMTKM51ZJFheF8b_6RywzPmKuDK_OU3VV-BCkfkgpsqu98y2kTmgpNhKUPG4sMGVB74t-cePR1kvUO9Kyk0H6L-9zo/s1600/DSCN2766.JPG" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="480" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhFwNrajLPpPUkilk9lY7ojQ7Q3Zf3J2YYroi4g4w-Y3Kv1L0H66BMTKM51ZJFheF8b_6RywzPmKuDK_OU3VV-BCkfkgpsqu98y2kTmgpNhKUPG4sMGVB74t-cePR1kvUO9Kyk0H6L-9zo/s640/DSCN2766.JPG" width="640" /></a></div>
<br />
ఎందుకో గుండెలోతుల్లోంచి బాధ తన్నుకొచ్చింది. లోపల్నుంచి తన్నుకొచ్చిన ఆవేశాన్నంతా అమ్మమీద చూపించా. "కనీసం పెళ్ళాంపిల్లలు కూడా లేరు. ఉన్న ఇంటినికూల్చి పాలెస్కట్టి ఎవడికిస్తాడంట." ఈదేశంలోని కోటలకి, భవనాలకి, చారిత్రక ప్రదేశాలకి ఏమాత్రం తీసిపోని ఒకఇల్లు. దేశం గర్వపడే విజయాలు సాధించిన ఒకదార్శనికుడు తనస్వార్జితంతో కట్టుకున్న ఇల్లు. ద్వీపాన్ని దర్శించే ప్రతియాత్రికుడు ఒకఫోటోతీసుకోవాలనిపించే ఒకచిన్న పర్యాటకప్రదేశం. ఈదేశప్రజలకి ఆమాటకొస్తే ప్రపంచంలోని ప్రతిమనిషికి స్పూర్తినిచ్చే చారిత్రక కట్టడం. ఇకకళ్ళముందు లేదన్న నిజం జీర్ణీంచుకోవడానికి నాలుగైదు నిముషాలు పట్టింది. ఇకపై ఆఇంటిని చూడాలంటే Indomitable Spirit(ఎవరికీ తలవంచకు)వంటి పుస్తకాల్లోనో, పత్రికల్లో వచ్చినఫోటోల్లోనో చూసుకోవాలి.<br />
మిగతాప్రాంతాలు తిరగబుద్దికాలేదు. ఆసమయంలో కలామ్ నాముందున్నా "ఈఇంటిని కూల్చే హక్కునీకెవరిచ్చారు?" అని అడుగుంటానేమో. అదీ ఆయనమీద గౌరవంతో పుట్టుకొచ్చిన ఆవేశమే. ఇన్నేళ్ళలో ఈఒక్కవిషయంలో నాకూ ఆయనకీ మద్యన అభిప్రాయబేధాలొచ్చాయి. (ఎత్తుభారం. నేనొప్పుకుంటే ఎంత? లేకుంటే ఎంత?) ఇంటిని కూల్చేసినంత మాత్రాన ఆయనిచ్చిన స్పూర్తి తగ్గదు. కానీ మనసులోతెలీని లోటు. ఇన్నిరోజుల తర్వాత మీతో చెప్పుకోవాలనిపించి....</div>
సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com8