సైన్సుకోసం ఒక్కరోజు

శతాబ్దాల బానిసత్వం. కరువుకాటకాలతో నిత్యంపోరాటం. మూఢనమ్మకాల వలలో చిక్కుకున్న సమాజం. అదేసమయంలో ప్రాశ్చాత్యదేశాల్లో సాంప్రదాయక సిద్ధాంతాలను బుట్టదాఖలుచేస్తూ అభివృద్ధిచెందిన ఆధునికసైన్సు. ఆసిద్ధాంతాలకు రూపం ఇచ్చే సాంకేతిక సమాజం. వీటన్నిటినీ మించి పారిశ్రామికవిప్లవ ఫలితాలు. ఇవన్నీ వెరసి సాంప్రదాయకశాస్త్రాలకు పుట్టినిల్లయిన భారతావనికి- సైన్సుల్యాబులకు పర్యాయపదంగా మారిన ప్రాశ్చాత్యదేశాలకు మద్య ఒక అగాధాన్ని సృష్టించాయి.

భారతీయులది రాజకీయబానిసత్వమే తప్ప శాస్త్ర‌అద్యయనంలోనూ, జ్ఞానసముపార్జనలోనూ కాదని నిరూపిస్తూ అగాధాన్ని పూడ్చేందుకు ఉదయించిన జ్ఞానజ్యోతి 'సీవీరామన్‌'.

తమిళ్నాడులోని తిరుచ్చిరాపల్లిలో కావేరిఒడ్డున జన్మించి, గంగఒడ్డున కలకత్తాలో ఐ.ఏ.సీ.ఎస్‌.లో పరిశోథనలు చేసి నోబెల్ పురస్కారాన్ని అందుకొన్న ఈమహనీయుని పేరు వినని భారతీయవిద్యార్థి ఉండడనుకుంటా. చిన్నతనంలోనే విశాఖకు వలసవచ్చారు. తండ్రి గణిత ఉపాద్యాయుడు కావటంతో చిన్నప్పటినుంచి ఇంట్లోవాతావరణం సైన్సుపై ఆసక్తి కలిగించింది. ఆపై మద్రాసు ప్రెసిడెన్సీకళాశాలలో బీఎస్సీలో బంగారుపతకం, ఎమ్మెస్సీలో డిస్టింక్షను సాథించాక ఆర్థికశాఖలో అసిస్టెంట్ అకౌంటెంట్ జెనరల్‌గా చేరారు.

కొద్దికాలానికే దాన్నివదిలేసి కలకత్తా విశ్వవిద్యాలయంలో పలిత్‌ప్రొఫెస్సరుగా చేరారు. అదేసమయంలో ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ (IACS)లో తనపరిశొధనలను కొనసాగించారు. ఈసమయం తనజీవితంలోకెల్లా అత్యుత్తమమైనదిగా, తనపరిశొధనలకు అక్కడివిద్యార్థులు ఇచ్చిన తోడ్పాటు వెలకట్టలేనిదా రామన్ అభిప్రాయపడేవారు.
ఎనభైరెండేళ్ళక్రితం, ఫిబ్రవరి 28, 1928, ఈరోజు ప్రపంచ శాస్త్రసాంకేతిక సమాజం అవాక్కయి భారతావనివైపు చూసినరోజు. ప్రాశ్చాత్యులకు మనమేమి చెయ్యగలమో చేసిచూపించినరోజు. వలసపాలనకింద నలిగిపోతున్న ముప్పైకోట్లమంది ఉపఖండవాసులు గర్వంగా తలెత్తి నిలిచినరోజు. అన్నేళ్ళకృషి ఫలితంగా పురుడుపోసుకున్న 'రామన్ ఎఫెక్ట్‌' ను ప్రపంచానికి అందించినరోజు.

Rs.35/- దాటని ప్రయోగం, ఒకటిన్నరపేజీల నిడవిగల వ్యాసం, అందులోని విశ్లేషణనుంచి ఉద్భవించిన ఒకవాక్యం-" కాంతి ఒకపదార్థం ద్వారా ప్రసారించి వికిరణం చెందినపుడు, కాంతి పౌనఃపున్యంలో మార్పు అదిప్రసరించే మాద్యమంలోని అణూవుల మద్యఉన్న అణుబంధంపై ఆథారాపడి ఉంటుంది." ఆధునిక శాస్త్రసమాజానికి దిక్సూచిలా దిశానిర్దేశం చేసింది. అభినవ బృహస్పతిగా పేరొందిన ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన క్వాంటంసిద్ధాంతంలోని అనుమానాలను ఇదిపటాపంచలు చేసింది. రెండుసార్లు ఊరించి చేజారిన భౌతికశాస్త్ర నోబెల్ పురస్కారం ఎట్టకేలకు 1930లో వరించింది. భౌతికశాస్త్రరంగంలో నోబెల్ అందుకున్న మొదటి ఆసియావాసి మరియు శ్వేతేతరుడు రామన్.
ఈయన సిద్ధాంతాన్ని
  • @ అధిక పౌనఃపున్యంగల ఫోనాన్, మాగ్నాన్, ఉత్తేజితస్థితిలోని ఎలక్ట్రాన్లను అద్యయనం చెయ్యడాని
  • @ వాతావరణం అద్యయనానికి
  • @ దహనచర్యలను విశ్లేషించడానికి
  • @ అయాన్ల శక్తిస్థాయిలను కొలిచేందుకు, మొదలైన రంగాల్లో ఉపయోగిస్తారు.
ఆపై కొంతకాలం బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(IISC)కు డైరెక్టరుగా పనిచేశాక ఒకరసాయన కర్మాగారాన్ని నెలకొల్పారు. అటుపై స్వతంత్రభారతావనికి మొదటి జాతీయ ప్రొఫెసరుగా సేవలందించారు.
కొళ్ళాయి బదులుగా తలపాగా ధరించి, చేతికర్రకు బదులుగా కటకాలను ఊతంగా చేసుకుని, భగవద్గీతకు బదులుగా భౌతికశాస్త్రవిజ్ఞానాన్ని పట్టుకుని శాస్త్రసాకేంతికరంగాల్లో భారతావని దాశ్యశృంఖలాలను ఛేదించేందుకు కాంతిసత్యాగ్రహాన్ని జరిపిన 'సైన్సుగాంధీ' సీవీరామన్. ఆయన చేసిన పరిశోధనలు సమాజ అభ్యున్నతికే తప్ప అణూబాంబుల తయారీకో, అసాంఘీకచర్యలకో ఊతమివ్వలేదు. ఏదేశమేగినా తన సంప్రదాయాలను, అలవాట్లను పాటించడంలో ఏమాత్రం రాజీపడలేదు. రాణిగారివిందులో మధువు ముట్టనని తనమాట నెగ్గించుకున్నారు.
రామన్ ఎఫెక్ట్ తర్వాత ఆయన చేసిన పరిశొధనల్లో ముఖ్యమైనవి -
  • @ సంగీతవాయిద్యాల్లో ధ్వనితరంగాల స్వభావాలు, హరాత్మక ప్రకంపనలు
  • @ తీగల్లోని తిర్యక్‌ప్రకంపనలు
  • @ కాంతి తరంగాలు అతిధ్వనుల మద్య సంబంధాలు
  •  @ స్పటికాలలో స్పెక్ట్రోస్కోపీ అద్యయనంద్వారా స్పటిక గతిశాస్త్రంలో(Crystal Dynamics) ప్రాథమికాంశాలపై విశ్లేషణ
  • @ ధూళికణాలలో కాంతిప్రసారం
  • @ మానవదృష్టికి సంబంధించిన అంశాలు
రామన్ ఎఫెక్ట్ ప్రతిపాదించిన రోజును డిపారర్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని జాతీయ శాస్త్రసాంకేతిక సమాచార పరిషత్తు(NCTSC) 1986లో జాతీయ సైన్సు దినంగా(NSD) ప్రతిపాదించింది. అప్పటినుంచి ప్రతియేడు ఈసందర్భాన్ని పురస్కరించుకుని దేశంలో సైన్సుపట్ల అవగాహనపెంచే పలుకార్యక్రమాలను చేపడుతుంది. సీనియర్ శాస్త్రవేత్తలచే సెమినార్లు, యువశాస్త్రవేత్తలు, సైన్సు విద్యార్థులకు పోటీలు, ఎక్జిబిషన్లు వంటివి ఏర్పాటుచేస్తారు. సైన్సురంగాల్లో విశేషంగా కృషిచేసిన శాస్త్రవేత్తలకు పురస్కారాలు ఇస్తారు.
ఈఏడు ఆపురస్కారాలకు ఎంపికచేసిన వారు-
  • @ డీడీఓఝా, ఈయన శాస్త్రసాంకేతిక రంగాలకు చెందిన అనేక అంశాలపై పుస్తకాలు రచించారు.
  • @ రామదురై, ఈయన తమిళ వార్తాపత్రికల్లో సైన్సు సంబంధించిన వ్యాసాలు రాస్తారు. కొన్నిపుస్తకాలను కూడా రచించారు
  • @ ఈశాన్యరాష్ట్రాల్లోని స్కూలుపిల్లల్లో సైన్సుపట్ల ఆసక్తిపెంచే కార్యక్రమాలు చేపట్టినందుకు తకేలంబం రబీంద్రోసింగ్ గారికి
  • @ పత్రికామాద్యమంలో సైన్సు ప్రగతికి చేసిన కృషికిగాను దినేష్‌చంద్ర శర్మగారికి
  • @ ఎలక్ట్రానిక్‌ మాద్యమంలోసైన్సువ్యాప్తికి చేసిన కృషికి మానస్‌ప్రతిమ్ దాస్ గారికి
సైన్సుదినోత్సవం సందర్భంగా ఇస్రో, డీఆర్డీఓ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈరోజు ప్రజలందరినీ ఎలాంటిముదస్తు అనుమతీలేకుండానే సందర్శించేందుకు అనుమతిస్తారు. అలాంటి సంస్థలకు మీరెవరైనా దగ్గర్లో ఉంటే మీస్నేహితులతోగానీ, పిల్లలతోగానీ వెళ్ళేందుకు ప్రయత్నించండి. కనీసం ఒకచిన్నక్విజ్ కార్యక్రమం వంటిదాన్ని నిర్వహిచండి.

శుభవార్త 2

మొదటిభాగం

ఆరోజు మద్యాహ్నం ఎందుకో అనుమానం వచ్చి ఆన్‌లైన్ ఫారం తెరిచాను. ఇప్పుడుకాదు రెండురోజులాగు అనింది. ఎందుకో బాగాఇంటెరెస్టింగ్ అనిపించి రెండురోజులాగాక తెరిచా.
వెబ్‌సైట్లో బాగాతరచి చూశాక ఇప్పటిదాకా అభ్యర్థులు ఎదుర్కొంటున్న అనేకసమస్యలకు పరిష్కారం దొరికింది. అవీ
  1. నోటిఫికేషన్ ఒకటాబులో పొందుపరిచారు. ఇది పాతవెబ్‌సైటులోకూడా ఉండేదే. అందులోనే మరొకవిభాగంలో నింపేందుకు సంబంధించిన సూచనలు, నియమాలు పెట్టారు. అభర్థి అవసరమైనంతమేర ముద్రించుకోవచ్చు. సాథారణంగా యూపీఎస్సీ నోటిఫికేషన్ నాటపాలాగా పూర్తిగా చదవాలంటే విసుగొచ్చేంత ఉంటుంది. బహుశా సిలబస్ కన్నా ముందుగా నోటిఫికేషన్ అర్థంచేసుకోవాలేమో. అందులో అభ్యర్థి తనఆప్షనల్‌కు సంబంధించినంత వరకుమాత్రమే ముద్రిమ్చుకోవచ్చు.
  2. మరొక టాబులో- రిజిస్ట్రేషన్ సంబంధించిన వివరాలున్నాయి. రిజిస్ట్రేషన్ రెండుస్థాయిల్లో ఉంటుంది.
    1. మొదటిది- ఇక్కద నొక్కగానే గడువుదాటని నోటిఫికేషన్లన్నీ కనిపిస్తాయి. అందులో మనకు కావల్సినదాన్ని చూసి అక్కడ క్లిక్ చెయ్యాలి. దీనవల్ల సాంప్రదాయక ఫారంలో ఘోషణనింపే పని పూర్తయినట్టె. క్లిక్ చేసినవెంటనే డేటాబేస్‌నుంచి ఆనోటిఫికేషన్ సంబంధించిన అంశాలను తీసుకుంటుంది.
    2. 'కంటిన్యూ' నొక్కాలి.
    3. ఆతర్వాత దరఖాస్తు నింపవలసిన పేజీ తెరుచుకుంటుంది.అక్కడ అభ్యర్థి తనవక్తిగత వివరాలు నింపాలి.
    4. అటుపై వయసుసంబంధించిన సడలింపులు, పరీక్షాకేంద్రం వివరాలు నింపాలి. ( యూపీఎస్సీ నిబంధనలనుసరించి అనేకవర్గాలకు వయసు సడలింపులు ఉన్నాయి. ఆవివరాలు నోటిఫికేషన్లో తెలియజేస్తారు.)
    5. తర్వాత ఆప్షనల్స్ ఎంచుకోవాలి.
    6. ఇప్పుడు, ఇప్పటిదాకా నింపిన వివరాలను చూపెడుతూ ఒకపేజీ ప్రత్యక్షం అవుతుంది. ఏవైనా మార్పులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కింద ఘోషణలో వివరాలు నింపినచోట ఒకవర్డ్ వెరిఫికేషన్ ఉంటుంది. దాన్ని నింఫి, షరతులకు ఒప్పుకుంటే మొదటిదశ పూర్తయ్యినట్లే.
    7. అప్పుడు లభించిన రిజిస్ట్రేషన్ ఐడీని నోట్‌చేసుకోవాలి.
  3. రెండవదశ- మొదటిదశలో లభించిన రిజిస్ట్రేషన్ ఐడీ, జన్మదినవివరాలు నింపితే రెండవదశలోకి వెళ్తాం.
    1. ఇక్కడ ఫీజుకు సంబంధించిన వివరాలు ఉంటాయి.మొదటిదశలో మీకు ఫీజుమినహాయింపు సూచించినట్లైతే ఇక్కడ ఈపేజీ బైపాస్ అవుతుంది. మొదటిదశలో ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు, స్త్రీలు వీటిలో ఏదినింపినా ఫీజుమినహాయింపు ఆటొమేటిగ్గా లభిస్తుంది.
    2. ఫీజు మూడురకాలుగా చెల్లించవచ్చు.
      1. మొదటిది-ఇక్కడ వచ్చే పీడీఎఫ్ పేస్లిప్‌ను బాంకులో జమచేసి, వివరాలునింపి దాన్ని పోస్టుద్వారా పంపడం.
      2. రెండవది- వీసాలేదా మాస్టర్‌కార్డు ద్వారా నింపడం
      3. ఆన్‌లైన్ అకౌంట్ ఉన్న అభ్యర్థులు ఎస్బీఐ ఆన్‌లైన్ ద్వారా నింపడం. ప్రస్తుతానికి మూడు విథానాల్లోనూ కేవలం ఎస్బీఐ ఖాతాదారులకే అవకాశం కల్పించారు. సింహభాగం వాళ్ళే ఉన్నందువల్ల అనుకుంటా. భవిష్యత్తులో మరిన్ని కలిపే అవకాశం ఉంది.
    3. అటుపై, అభ్యర్థి తన పాస్‌పోరర్ట్ సైజు ఫోటోను, సంతకాన్ని స్కాన్ చేసి .png ఫార్మాట్లో 140X110 pixel (not exceeding 40kB) తమవద్ద ఉంచుకుని, వాటిని అప్‌లోడ్ చెయ్యాలి.
  4. అంతటితో మీదరఖాస్తు నింపినట్లే+పంపినట్లే. నిజమే.పంపడం కూడా అయిపోయింది. అటుపై దరఖాస్తు పూర్తిపేజీ ప్రత్యక్షం అవుతుంది. అక్కడి వివరాలు సరిచూసుకుని ఒకప్రింటుతీసి మీదగ్గర పెట్టుకుంటే చాలు. ప్రస్తుతానికి పంపాల్సిన అవసరంలేదు.
  5. అక్నాలెడ్జిమెంట్ మీరు వ్యక్తిగతవివరాలలో నింపిన మైల్‌ఐడీకి వస్తుంది.
ఒక్కసారి సాంప్రదాయకపద్దతిని పోల్చిచూస్తే ఎన్నోసమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
  1. అప్లికేషన్లు ఆన్‌లైన్లో ఉంటాయి. ఊరూరావాడవాడల్లో ఇంటర్నెట్‌కేఫ్‌లుంటున్న ఈరోజుల్లో మారుమూల గ్రామంలోని అభ్యర్థికి జిల్లాకేంద్రంలోని పోస్టాఫీసుకన్నా ఇదేదగ్గర.
  2. అప్లికేషన్లు అయిపోయాయి అన్నసమస్యలేదు. స్టాంపులకోసం ఝంఝాటంలేదు.
  3. నింపేప్పుడు ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకునే అవకాశం ఒక్కసారైనా ఉంది. 
  4. దరఖాస్తును పొస్టుచెయ్యడం, గడువుకుముందే చేరిందోలేదో అన్న భయం ఉండదు.
  5. అక్నాలెడ్జిమెంట్ కొన్నిక్షణాల్లో వస్తుంది.
  6. ఖర్చు చూద్దాం-
    1. సాంప్రదాయకపద్దతిలో-  జిల్లాకేంద్రానికి చార్జీలు 50/- నుంచి 100/- (RTC ఈమద్యలో కన్నెర్ర చెయ్యకుంటే) + అప్లికేషను మామూలుగా అయితే 20/- గిరాకీ ఎక్కువగా ఉంటే 200/-+ జనరల్ అభ్యర్థులకు స్టాంప్ 100/-+ పోస్టలు చార్జీలు 30/-= 100/- నుంచి 380/-
    2. ఆన్‌లైన్‌లో- ఇంటర్నెట్టు సెంటరుకి 20/- + ఫీజు జనరల్ అభ్యర్థులకు 50/- + స్కానింగ్ (ఫోటో+ సంతకం) 15/- (కావాలంటే సెల్‌ఫోన్లోంచే తీసుకోవచ్చు) +  ప్రింటు (మనకోసమే) 3/- = 23/- నుంచి 88/-
ఇంజనీరింగ్ సర్వీసెస్ నోటిఫికేషన్‌లో మార్చి 3 వరకు సమయం ఉన్నప్పటికీ ఆన్‌లైన్ అప్లికేషన్ నింపేందుకు ఫిబ్రవరి22 11:59 pm వరకే అనుమతించారు.